Text view
tel-25
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
పొద్దుగాల లేవనంటది , దస్సు గారహ్ బారహ్ దాక పండ్తాది కూర బువ్వ వండనంటది , పక్కింటి రంగు టివి కాడ ఉంటది
( ధన్యవాదాలు దేవుడా ఈరోజు శుక్రవారం ) " నీ జీవితం లో అత్యంత సంతోషకరమైన రోజు ఇదే . జీవితాంతం ఈ రోజునుగుర్తు చేసుకుంటూనే వుంటావు " పెళ్ళికి పిలవడానికి వచ్చిన ఉద్యోగి తో అన్నాడు పై అధికారి . " కానీ నా పెళ్ళి రేపు సార్ " చెప్పాడు ఆ ఉద్యోగి . " ఆ విషయం నాకు తెలుసు అందుకే చెబుతున్నాను " . బోనస్ జోకులు : సిమెంట్ పరిశ్రమ ప్రభుత్వమిచ్చిన 487 ఎకరాల భూమి నాకు అవసరం లేదు - - వై . యెస్ . జగన్ . పెద్దల ( ? ? ? ) సభ శాసన మండలిలో మొదటి రోజే సభ్యుల సస్పెన్షన్ . అలోచించాల్సిన వార్త : కాలిఫోర్నియా లోని గూగుల్ ఆఫీసులో దారి తప్పిన పెంపుడు కొండ చిలువ . :
పెట్టుకున్నారండి , actual గా ఆ పేరుకర్థం గుర్రాలు తోలే అతనని .
ఎవరినీ ప్రాధేయపడకుండా కేవలం నాటకానుభవంవల్ల కొండలరావు , రాధాకుమారి గార్లకు సినిమాల్లో వేషాలు దొరుకుతూ ఉండేవి . తరవాతి కాలంలో ఆయన చందమామ - విజయావారి భైరవద్వీపం సినిమాకు కథారచన , నిర్మాణనిర్వహణ చేశారు . సినిమా రంగం చరిత్ర గురించి ఇప్పటికీ ఎన్నో మంచి వ్యాసాలు రాస్తున్నారు . టీవీలో గొల్లపూడి మారుతీరావు గిరీశంగా కన్యాశుల్కం నాటకానికి దర్శకత్వం వహించారు . ఈ రోజుల్లో సినిమా పద్ధతులు తనకు సరిపడవనీ , కథ , స్క్రిప్టు , పాత్రపోషణ వగైరాలమీద ఎవరికీ శ్రద్ధలేదనీ అన్నారు . నాటకాల్లో ఆసక్తి ఉన్న మిత్రులతో కలిసి ఇప్పటికీ క్రియాశీలంగా ఉన్న కొండలరావు , రాధాకుమారిగార్ల ఉత్సాహం ఆదర్శప్రాయం అనిపిస్తుంది .
చాలా మంచి పోస్ట్ . ఇది చదువుతున్నంత సేపూ ఒకలాంటి ఉత్తేజం కలిగింది . రోమాలు నిక్కబొడుచుకున్నాయి . అలాగే మనసుని కదిలించింది .
సమాజంలో ఏ మనిషైనా సుఖంగా బ్రతకాలన్నా , ప్రశాంతంగా చావాలన్నా నలుగురి తోడు చాలా అవసరం . నలుగురు కూడి ఒకచోట కలిస్తే వార్త అవుతుంది . నలుగురు కూడి ఒకేమాట పలికితే సువార్త అవుతుంది . నలుగురు కూడి ఒక అడుగేస్తే ఉధ్యమం అవుతుంది . నలుగురూ వెనకడుగేస్తే పరాజయం మొదలవుతుంది . నలుగురూ నవ్వుతూ మోస్తే పల్లకీ అవుతుంది , ఏడుస్తూ మోస్తే పాడి అవుతుంది . సంఖ్యాశాస్త్రంలో నాలుగు సంఖ్య రాహువుది . నాలుగు సంఖ్యకున్న బలమే అది . . . ! నాలుగు ముఖాలు కలిస్తే బ్రహ్మంట . . . ! నాలుగు బుద్దులు కలిస్తే ఖర్మంట . . . ! నిజానికి . . . ఆ నలుగురూ నాలుగు దిక్కులోళ్ళు . మంచికీ చెడ్డకీ ముందుగా కదిలేటోళ్ళు . . . మంచిని నెత్తిన పెట్టుకుని మోసేటోళ్ళు . చెడ్డని పాతరేసి పూడ్చేటోళ్ళు . అసలు విషయానికొస్తే . . . ఓబుళాపురం గనుల పేరుతో ఐరన్ ఓర్ తవ్వకాన్ని మొదలెట్టిన గాలి జనార్ధనరెడ్డి వంచిన తల ఎత్తకుండా , కంచెను గమనించకుండా , పక్కవాడి కొండలను కూడా పిండి చేసుకుంటూ , ఆంధ్రా నుంచి కర్ణాటక దాకా పోతుంటే , సహించలేని కన్నడ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గాలి దూకుడికి కళ్ళెం వేయబోతే , గాలి బ్రదర్స్ యడ్యూరప్ప పదవికే ఎసరుపెట్టారు . గాలి తీవ్రతకు భీతిల్లిన ముఖ్యమంత్రి కళ్ళల్లో నీళ్ళను చూసి కన్నడ దేశమే ఉసూరుమంది . కర్ణాటకలో గాలిగారి గాలి బాగా వీస్తే , ఆంధ్రాలో గాలికే గాలాడకుండా చేసారు ఆ నలుగురు . . . ఇంతకీ ఎవరా నలుగురు ? వాళ్ళే . . . తేలుగుదేశానికే తేజమైన చంద్రబాబు , లోకానికి తన సత్తాని చాటిన జయప్రకాష్ నారాయణ , లోకంలోని బడుగుజనుల పక్షాన పోరాడే , వామపక్షాల ప్రతినిధులు బి . రాఘవులు & కె . నారాయణ . గాలి గనుల అక్రమాలపై ద్వజమెత్తిన ఆ నలుగురు ఘనులు . . . ఒక్కటిగా సంఘటితమై ఉద్యమానికి శ్రీకారం చుట్టారు . దానికి కారణం ఈ గనుల కుంభకోణంలో దివంగత నేత వైయస్సార్ కుటుంబసభ్యుల పాత్ర కూడా వుందనే గట్టి నమ్మకంతో కూడిన అనుమానం దాగివుండటం . " దేశంలోని అన్నిపార్టీల నాయకుల్ని కలుస్తాం . . . పార్లమెంటులో కాంగ్రేస్ - బి . జే . పి . లను నిలదీస్తాం . . . " అంటూ బుసలు కొట్టుకుంటూ , ముందుగా వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసారు . , హద్దూ - పద్దూ లేకుండా , సరిహద్దులు చెరిపేసి , రాష్ట్ర సంపదను గాలి బ్రదర్స్ ఏలా దోచుకుపోతున్నారో ఫైళ్ళను ఓపెన్ చేసి ముఖ్యమంత్రి కళ్ళను తెరిపించారు . గాలి దోపిడి లెక్కలను చూసిన రోశయ్య అవాక్కైపోయి , తక్షణ చర్యకి నడుంకట్టి , పంచె బిగించే లోపునే , కేంద్రం స్పందించి ఎన్ని రకాల కమిటీలను వేయాలో అన్నింటినీ వేసేసింది . ఒక్క హైదరాబాదులోనే యిలా హడావుడి చేస్తే జి . హెచ్ . ఎం . సి . ఎలక్షన్ల కోసమే ఈ హంగామా అని జనం అనుకునే ప్రమాదం వుందని , మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలక్టర్ల కార్యాలయాల ముందు దేశ సంపదను కాపాడమంటూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు . " ఇదేటిదీ . . ? ఓబుళాపురంలో గొడవైతే , సీకాకుళంలో అరుపులేటీ " ? అంటూ తూర్పు జిల్లాలకు చెందిన మంత్రి గారు విసుక్కోవటం వింతేమీ కాదు . ఏది ఏమనప్పటికీ . . . అన్యాయంపై ఆ నలుగురూ చేపట్టిన ఉధ్యమం జాతి గర్వించతగ్గదే . . . ! కానీ , రామోజీరావు పబ్లిక్ గా ప్రభుత్వం కళ్ళకు గంతలుకట్టి అక్షరాలా 2500 కోట్ల రూపాయల సొమ్మును జనాలనుంచి వసూలుచేసి , స్కాముల్లో సరికొత్త రికార్డును సృష్టించిన ఘనమైన నిజాన్ని . . . చేసిన ఘరానా మోసాన్ని . . . రాజమండ్రి కాంగ్రేస్ ఎం . పి . ఉండవల్లి అరుణ్ కుమార్ లోకం దృష్టికి తీసుకువస్తే . . . . . ఈ ' న లు గు రే ' . . . " ఉండవల్లి తీరు . . . అన్యాయం . . అక్రమం . . మహా ఘోరం . . జాతి విద్రోహం . . " అంటూ ఘోషించి రోదించటం ఉధ్యమ స్పూర్తి కొరవడా ? కులాభిమానం హెచ్చరిల్లా ? మోసం ఎవరు చేసినా మోసమే . . . ! నేరం ఎవరు చేసినా నేరమే . . . ! ! కానీ అది మీవారు చేస్తే లోక హితానికా ? పగవారు చేస్తే లోక హతానికా ? మీవారు కబ్జా చేసి కోటలు కడితే అది భూలోక స్వర్గమా ? పగవారు కడితే అది దేశద్రోహుల దుర్గమా ? మీ మాటలను విన్నా , మీ చేష్టలను చూసినా . . . పాపం మంచు మోహన్ బాబు మరొక్కమారు తీవ్ర ఆవేదనతో . . . నీచాతి నీచం . . . నీచాతి నీచం . . . అని ఘోషించక మానడు ! కుహనా రాజకీయ నాయకుల్లారా . . . ! జన జాగృతీ వైతాళికుల్లారా . . . ! ! ప్రజలందరూ గమనిస్తున్నారు . . . ! మీ కులకూటమిని చూసి నవ్వుకుంటున్నారు . . . ! మీ భాష వేరైనా భావమొక్కటే . . . ! మీ రూపాలు వేరైనా మనసొక్కటే . . . ! మీ మార్గాలు వేరైనా గమ్యమొక్కటే ? మీ ఎత్తులు వేరైనా పొత్తొక్కటే ? మీ పార్టీలు వేరైనా పరమార్ధమొక్కటే . . . ! ' చతుర్గతి ' అంటే మీరు చెప్పే అర్ధం . . . చతురాశ్రమముల వారికి గతియగు వాడు విష్ణువని . మీరు లోక రక్షకుడైన విష్ణువు వంటివారని జనాలను నమ్మించాలని చూస్తారు . . . కానీ , మీ గురించి లోకానికి తెలిసిన నిజమైన , అసలు అర్ధం ఏమిటో తెలుసా ? ' నడక . . ప్రాకు . . దొర్లిక . . ఈత ' అను నాలుగు విథములయిన గతి కలదైన . . . " తాబేలు " అని . . . . ! మీరు ఏలాగైనా బతికేస్తారు . . . ! అందుకే మీ చెలిమి . . . ' దుష్ట చతుర్గతీ చతుష్టయం ' అంటోందీ లోకం . . . ! !
లక్ష్మి . . బాగానేఉంది మీ వితండవాదం . సరే . మనదగ్గరుండటం మంచిదే అనుకున్నా , మనమెవరిమీదైనా దాన్ని ఉపయోగించగలమా , పాడా ?
అద్భుతమైన లింకు ఇచ్చారు ఫణి బాబుగారూ . ధన్యవాదాలు . ఈ విధంగా పాత రికార్డింగులను బి బి సి వారు చక్కగా భద్రపరచి శ్రోతలకు అందిస్తున్నారు . మన ఆకాశవాణి వారు కూడ ఈ పధ్ధతి అనుసరిస్తే ఎంత బాగుండును . మీ పుణ్యమా అని అప్పటి కామెంటరీలు వినగలిగాను . థాంక్యూ
చాలా మంది పేర్లు నాకు గుర్తుకు రావటం లేదు , కావున మీరు నాకు గుర్తులేరనుకోవద్దు , ఒక్క సారి స్పందించ గలరు . మీ ముఖ చిత్రం చూస్తే తప్పక గుర్తు పడతాను . కావున నన్ను క్షమించి , ఇక్కడ ఒక్కసారి స్పందించండి .
మనసు అనేదానికి మెదడుతో సంబంధం లేదనీ , అది పరిణామదశలకు అతీతమైనదనీ కొందరు అనుకుంటారు . దీనికి రుజువులేవీ కనబడవు . విశ్వాంతరాళాన్నీ , అందులో జరిగిన , జరుగుతున్న సంఘటనలనీ అంతటినీ చూసినప్పుడు తెలివీ , స్పృహా , అవగాహనా మొదలైన చేతనత్వానికి సంబంధించిన గుణాలు ప్రాణులకు మాత్రమే పరిమితమైనవని తెలుస్తోంది . భూమి మీద తప్ప విశ్వంలో జీవరాశి పెరిగిన దాఖలాలేవీ ఇంతవరకూ లభించలేదు కాని తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎక్కడైనా ప్రాణులు ఉద్భవించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు నమ్ముతారు . అలా జరిగినా కూడా ప్రాణులకి ఉండగలిగిన కొద్దో గొప్పో చైతన్యం వాటి మనుగడకు పనికొచ్చే విధంగానే రూపొందుతుంది . అంతేకాని విశ్వానికి సంబంధించినంత వరకూ అటువంటి చైతన్యం గాని అవగాహన కాని ఎందుకూ " పనికిరావు " . విశ్వమంతా యదార్థమే కావచ్చు గాని అందులో అవగాహన అనేదానికి ఒక స్థానం గాని , అవసరం కాని ఉందనడానికి ఎటువంటి ఆధారాలూ కనబడవు . ఒక్క భూమినే తీసుకున్నా మనిషివంటి ప్రాణులకు గల సంక్లిష్టమైన నాడీ వ్యవస్థా , మెదడూ , వివేచనా , వివేకమూ తక్కిన జీవాలకు ఉండవు . అందువల్ల వాటికి పెద్ద నష్టం కూడా కలగటం లేదు . మనుషుల కన్నా బాక్టీరియా వంటి సూక్ష్మ జీవులు ఎంతో అభివృద్ధి చెంది , హాయిగా బతుకుతున్నాయి . తక్కిన ప్రాణుల్లాగే వాటిలో అవసరమైనంత వరకూ జీవపరిణామం విజయవంతంగానే జరిగింది . మనలాగా అవి ఏది సత్యం ఏదసత్యం అని మథనపడుతున్న సూచనలేవీ లేవు !
అరుణాంక్ ద్వారా పోస్ట్ చెయ్యబడింది 1 : 15 సా వద్ద | 0 వ్యాఖ్యలు ఈ పోస్ట్కు లింక్ చేస్తుంది
భద్రం బీ కేర్ ఫుల్ సిస్టర్ , భార్యగ మారకు ఓ సిస్టర్ షాదీ మాటే ఒద్దు చెల్లీ , సోలో బతుకే సో హ్యాపీ మెడలో తాడుని కట్టాడు అని ఆనందించే ఆడోళ్ళు ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు భార్యయ్యే ముహూర్తమే ఆడోళ్ళ సుఖాల ముగింపు చాప్టరు | | భద్రం | | రక్షణకి భర్తెందుకులే లేడీ హాస్టళ్ళే చాలు పిల్లలకై ఒకటా రెండా క్లోనింగ్ సెంటర్లు కోతికి ఉందా కోడికి ఉందా ఈ పెళ్ళాచారం జంటలు కట్టే జంతువులెరుగవు వెడ్డింగ్ విడ్డూరం ఎందుకు మనకీ గ్రహచారం | | భద్రం | | చచ్చి చెడీ డే అండ్ నైట్ చాకిరి చేస్తావు చేసినది మావారంటూ నోట్లో ముద్దలు పెడతావు రూపాయి కోసం పాపాయి లాగా దేహీ అంటావు అన్నీ తెలిసీ అమాయకంగా బ్రతుకీడుస్తావు కుక్కిన పేనై ఉంటావూ | | భద్రం | | ఇల్లు అనీ వాకిలనీ తెగ ఫీలైపోతావు పండగలొస్తే వంటలు చేసి మూలన పడతావు మొగుడుకి ఉందా మొగాడి కుందా ఈ ప్రేమావేశం రోగం వస్తే విరామముందా ఏమీ విడ్డూరం ఎందుకు నీకీ ఆరాటం | | భద్రం | |
ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8 : 30 గంటలకు తోటి విద్యార్థులంతా ప్రార్థనలో నిమ గ్నమై ఉండగా , వంశీ పాఠశాల భవనంపై నుంచి దూకాడు . బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా , మార్గమధ్యంలోనే వంశీ మృతిచెందాడు . వంశీ మృతి విషయం తెలియగానే విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి . బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ , ఎబివిపి నాయకులు పాఠశాలలో బైఠాయించారు . ఘటన వివరాలపై , ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని తహశీల్దార్ ఇబ్రహీం స్పష్టంచేయడంతో వారు ఆందోళన విరమించారు
నల్లగా వున్న బాబూమోహన్ మీద లెక్క లేనన్ని జోకులు . ఆతన్ని ఎంత నీచాతినీచంగా అసహ్యంచుకుంటే మనకు అంత తృప్తి , నవ్వు ! కాకిలా వున్నావనడం , బర్రెలా కుడితి తాగుతున్నావనడం , కోటతో తన్నించడం . . ఇదీ మన తెలుగు సినిమా నవ్వులాట ! బాబూమోహన్ అనాకారి తనం , కళ్ళ చిదంబరం కళ్ళూ , ఎవీయస్ నత్తీ మనకు నవ్వుకొనే విశయాలు . - ప్రసాద్
అలా మొదలైంది మా స్నేహం . అప్పుడప్పుడు చదరంగం ఆడ్డానికి వచ్చేవాడు . వచ్చే ముందర ఫోన్ చేసేవాడు . ఏ కారప్పూసో , జంతికలో , ఏవో ఇంట్లో వున్నవి పెట్టి , టీ ఇచ్చేదాన్ని . ఆటలో అప్పుడప్పుడు నేను కూడా నెగ్గేదాన్ని . ఏదో పెద్దదాన్ని కదా అని కావాలని ఓడిపోతున్నాడేమోనని , నాకో అనుమానం . అయినా నా ఆట మీద నమ్మకం ఎక్కువ కావటం వల్ల , అలా ఆడుతూనే వున్నాము .
ఆనకట్టల నిర్మాణం వల్ల జరిగే సాధక బాధకాలను ఒక గ్రామం ప్రాతిపదికగా పరిసరాలు , కాలుష్యం , నీటి సమస్య వంటి పర్యావరణ సమస్యలతో చర్చించింది ' ' దృశ్యాదృశ్యం ' ' ( చంద్రలత ) నవల .
యౌగంధరాయణుడు మన పుష్పకభద్రుడి జ్యోతిష్కులు మీకూ పద్మావతీదేవికీ పెళ్ళవుతుందని జోస్యం చెప్పారు .
కొందరి రచనల్లో మరికొందరి ప్రభావాలు గోచరిస్తాయి . ఆ విధంగా గోచరించటంలో ఏమీ అసహజత్వం లేదు . దాని అర్ధం ఒకరి భావాలను మరొకరు అనుకరించారని కాని అనుసరించారని కాని కాదు . అందువల్ల మౌలికతకు కూడ భంగం రాదు . ఒకరి ప్రభావం మరొకరి మీద పడటం అంటే రచయితకు కాని రచయిత్రికి కాని తెలియకుండానే కొందరి భావాలు వారి మీద ప్రభావం వేస్తాయి .
భరించరాని బాధను పళ్ళబిగువున భరిస్తూ అస్పష్టమైన శబ్ధాలు చేస్తున్న సుక్కూర్ వదనంలో వెంటనే కనిపించింది . ఒక రకమైన మార్పు .
ఆ మధ్య బయట పడ్డ గోల్డ్ క్వెస్ట్ కూడా ఇలాంటిదే కదండీ ! అందులో చంద్రమోహన్ తనకేం సంబంధం లేదన్నాడు కానీ మా ఇంటెదురుగా ఉండే ఆయన మేనకోడలు ఎంతోమందిని అందులో చేర్పించిన సంగతి అందరికీ తెలుసు . " ఉచితం " గా వచ్చేదానికై జనం ఆశపడినంత కాలం ఎవరమూ ఏమీ చేయలేమనుకుంటాను ! మరి నిద్ర నటించే వాళ్ళను లేపాలంటే ఏదన్నా షాక్ లాంటిది ఇవ్వాలేమో ! చచ్చినట్లు లేచి కూచుంటారు .
శ్రామిక వర్గం ఎంతో రక్తాన్ని చిందిస్తోంది . కాని దాని పాక్షికమైన ఓటములూ , విజయాలూ దాని బ్రహ్మాండమైన పెరుగుదలని యింకాస్పష్టంగా సూచిస్తున్నాయి ; దాన్ని ప్రపంచ పోరాటం కోసమూ , సతృవుమీద యీ మహత్తర , విషాదకర దినాల్లో అధికారaంకోసం , నియంతృత్వం కోసం శ్రామికవర్గపు పోరాటంలో నిజాయితీ గల విప్లవ రచయితల కృషి విప్లవాత్మక వర్గ చైతన్యపు అభివృద్ధి మార్గం కోసమే సంపూర్తిగaాఅంకితం కావాలి ; ప్రపంచ పెట్టుబడిదారులకి వ్యతిరేకంgగాప్రపంచ శ్రామికులని వ్యవస్థీకరించి , సంఘటితపరచడానికే అంకితం కావాలి ; విప్లవకర శ్రామికవర్గపు నిర్మూలనే అప్రకటిత లక్షYaMga aగల యుధ్ధానికి వ్యతిరేకంగా పోరాడే్దాని కోసమే అంకితం కావాలి ; బూర్జువావర్గపు నైచ్యాన్నీ , నీతిబాహ్యతని , నేర స్వభావాన్నీ వెల్లడి చేసే , సిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేసేదాని కోసమే అంకితం కావాలి . బూర్జువా వర్గం శ్రామికుల్ని క్రూరంgగానాశనం చేస్తోంది - బూర్జువాలపట్ల శ్రామికుల ఆలోచనకీ , దిశకీ గలక్ రూరత్వం యింకా యెన్నో రెట్లు పటుతరంగా వుండాలి .
ఓంభూలు చేసికొంచును జంభంబులు కొట్టుకొనుచు జడమతి నశుభా రంభము లరయుచు తిరిగెడి దంభపు విప్రునకు నీకు తగదిది చనుమా
నాకు University లు చూడాలంటే చాలా ఇష్టం . మన జీవన విధానాల్లో మార్పులకు అంకురార్పణ చేసిన ప్రదేశాలు చాలా వరకూ విశ్వ విద్యాలయలే . దానికి తోడు మాలో ఒకరికి మరువలేని మలుపులు University లు . కాలుగాలిన పిల్లిలా ఫోటోలలో తిరుగుతున్న వారు వీరే . వాటి గురించి , ఉద్వేగంతో చెప్పిన కధ వారి మాటల్లోనే వ్రాస్తున్నాను .
భ్రాన్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కిఞ్చిత్ఫలం త్యక్త్వా జాతికులాభిమానముచితం సేవా కృతా నిష్ఫలా । భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశఙ్కయా కాకవత్ తృష్ణే జృమ్భసి పాపకర్మనిరతే నాద్యాపి సంతుష్యసి ॥ ౨ భ్రాన్తమ్ పర్యాటితమ్ । దేశమ్ । అనేకదుర్గవిషమమ్ బహుభిః గన్తుం దుర్గమైః స్థానైః వికటమ్ । ప్రాప్తమ్ లబ్ధమ్ । న కిఞ్చిత్ న స్వల్పమపి । ఫలమ్ సంతోషధనాదిరూపం ఫలితమ్ ॥ త్యక్త్వా విసృజ్య । జాతికులాభిమానమ్ బ్రాహ్మణాదిజాత్యభిమానం వంశాదికులాభిమానం చ । ఉచితమ్ హితమ్ । సేవా పరిచర్యా । కృతా ఆచరితా । నిష్ఫలా యస్యాః ఫలం నాస్తి సా ॥ భుక్తమ్ ప్రాశితమ్ । మానవివర్జితమ్ మానేన అభిమానేన విశేషతః వర్జితమ్ । పరగృహేషు పరాణాం గేహేషు । ఆశఙ్కయా భీతినా వా సందేహేన । కాకవత్ కాకేవ ॥ తృష్ణే విషయేషు ఆసక్తిః । జృమ్భసి వృద్ధిం యాసి ॥ పాపకర్మనిరతే పాపిష్ఠే । న అద్య అపి ఇదానీమపి । సంతుష్యసి సంతుష్టా న భవసి ॥ వైరాగ్యార్థం తృష్ణాదూషణమత్ర ద్రక్ష్యతే । కైషా తృష్ణా । యయా తృష్ణయా ఫలాపేక్షయా కృతమ్ దుర్గమం దేశపర్యటనం ఫలరహితం బభూవ । యయా తృష్ణయా జాతికులాభిమానత్యాగేన కృతా యత్సేవా నిష్ఫలా బభూవ । యయా తృష్ణయా చోదితః మానరహితేషు పరగృహేష్వపి కాకవత్ ఆశఙ్కయా భుక్తం చ । యా పాపిష్ఠా । యేదానీమపి జృమ్భతి న తుష్యతి । తాం ప్రతి దూషణమ్ ॥ తా . దుస్సంచారములైన ప్రదేశాలలో దేశాటన చేసాను కానీ ఫలితం శూన్యం . జాత్యభిమానం కులాభిమానం వదిలి నిరుపయోగంగా ( ధనికులు మొదలైనవారికి ) సేవ చేసాను . ( ఆపదలో ) బెదురుతూనే ఇతరుల ఇళ్ళలో గౌరవంలేకున్నా కాకిలా భోజనం చేసాను . ఇన్ని కష్టాలు పడినా ఓ పాపిష్ఠపు తృష్ణా , ఇప్పటికీ తృప్తి కలగడం లేదు . నీవు ఇంకా ఇంకా పెరుగుతూనే విజృంభిస్తూనే ఉన్నావు . విసికితి దుర్గదుర్విషయవిభ్రమయుక్తిఁ గులాభిమానమున్ బసచెడ సేవ చేసితి విపన్నుఁడనై పరగేహసీమ వా । యసము వలెన్ భుజించితిఁ బ్రయత్నము నిష్ఫలమై నశించె సం తసపడ వుగ్రకర్మపిశునత్వము చూపెద వాశ యేటికిన్ ॥
డియర్ durgeswara ! అయ్ బాబోయ్ ! నా చెయ్యి బాగానేవుందండి . యే " టైము " కి యెలా " తిరుగుతుందో " అని వాచీ కూడా పెట్టుకోడం మానేశాను . చాలా సంతోషం .
బొమ్మల పైన్నే నోటు పుస్తకాల దొంతర … . జింక చర్మం అట్టలుగా కుట్టిన రాతకాగితాల దొంతర . . ద్విపద రూపంలోని బొమ్మలాట కథల్ని మోసి మోసి పెళుసెక్కి రంగుమారిన కాగితాలున్న రాతపుస్తకాల్ని ఎదలమీదుంచుకొని … . వాళ్ళ ఊపిరుల్లాంటి శబ్ద సంచయం కలిగిన పుస్తకాల్ని నిశ్శబ్దంగా మోస్తూ … .
మన రాజకీయాల్లో ఉన్న కుళ్ళును తలనొప్పిగా మాత్రమే చిత్రించటం కూడా నాకు నచ్చలేదు .
ఏమి చెయ్యాలి ? దేనికంటే - ( మూలం : ఈనాడు ) ౧ . ఐతే ఇంతవరకూ ఎంత ఆస్తి నష్టం జరిగింది ? ఆ డబ్బుతో మనం ఒక " గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా " కట్టుకుని ఉండేవాళ్లం . ౨ . ఒకానొక నాడు ఇందిరాగాంధీని చంపేస్తే సిక్కు ప్రజల్ని ఊచకోత కోసారు . అలాచెయ్యటానికి వచ్చిన చైతన్యం మన జాతిని నిలువునా నిలబెట్టిమరీ ఛీరేస్తోంటే రాదేం ? ౩ . ఒకానొక రోజున రంగాని చంపితే జనం రగిలిపోయి మారణకాండ చేసారే , యం . టీ . ఆర్ పోయినప్పుడూ , చివరకి పరిటాల రవి పోయినప్పుడుకూడా . మరీ ఈరోజున ఇంతమందిపోతే కనీసం చైతన్యం కూడాలేకపోతే ! ! సిగ్గు సిగ్గు . ౪ . హిందు టెర్రరిష్టులు బొంగు అని రాసినోళ్లు ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు ? ౫ . ౬ . ఎవ్వని సహాయం లేకుండా కరాచీ నుండి ముంబైకి రాగలిగారు అంటే మా సూరిగాడు కూడా నమ్మడు . ౭ . శోభాడే అన్నట్టు -
ఆవిడ కౌగిల్నీ పిల్లల నవ్వుల పూరేకుల్నీ సిగరెట్లనీ , విస్కీ సీసాల్నీ , పేకముక్కల్నీ రహస్య సుఖాల జిలుగు దారిలో మంచి కవిత్వాల కాయితాలనీ స్నేహితుల ఆప్యాయపు వేళ్ళ కొసల్నీ అభాగ్యుల జాలి చూపుల చూరు చివర్లనీ పట్టుకుని మూడొందల అరవై అయిదు కల్లోల సముద్రాల్ని ఈదాలి మళ్ళా నేను .
గమనిక : ఈ రోజు సాయంత్రం నుంచి నేను సెలవులో వెళుతున్నందున ఈ బ్లాగుకు ఓ నెలరోజుల పాటు విరామం . మళ్ళీ కలుసుకుందాం .
తెలుగు సినిమా దశ దిశ గురించి శనివారం నాడు హెచ్చెమ్ టీవీ ఒక చర్చా కార్యక్రమం చేసింది . అనేకమంది నిర్మాతలు , దర్శకులు ఇతర సాంకేతికులూ ఈ అమావేశంలో పాల్గొని తమ గోడు వెళ్ళబోసుకున్నారు . పరిశ్రమ గురించి చర్చ పెడితే , పెద్ద నటులెవరూ రాలేదు . పెద్ద నిర్మాతలు , దర్శకులూ కూడా ఎవరూ రాలేదు . - వాళ్ళను పిలవలేదో , పిలిచినా రాలేదో , వాళ్ళకు లాభం కలిగే సంగతులు ఇక్కడ లేవో , మరింకేంటో ! రామచంద్రమూర్తి మన ఉద్దేశం ఫాల్ట్ ఫైండింగు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్ ! అని చెప్పాడు . పాల్గొన్నవాళ్లలో కొందరు : ప్రసన్న కుమార్ , సాగర్ , విజయచందర్ , విజేందర్ రెడ్డి , ఏవీయెస్ .
మీరు చాలా Correct రమణ గారు . , ప్రసాద్ గారు మీరు ఒక్కసారి రమణ గారు చెప్పినట్లు చేసి చూడండి . అలా చెస్తే ఊళ్ళో వాళ్ళు ఏమైనా అనుకుంటారని ఆలొచించొద్దని నామనవి . ఎందుకంటే ఒకల్ని ఆదరించే ఆలోచన లేనివాల్లకి , ఒకల్ని నిందించే హక్కు లేదు . దయచేసి ఆమె కు దారి చూపించండి . - can u post your village address ( or ) your Phone No Pls
ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధికి ఎల్లప్పుడూ యూరోపియన్లే నేతృత్వం వహించే ' ' పాత విధానాన్ని ' ' మార్చే అవకాశాన్ని ప్రవర్థిత దేశాలు జారవిడుచుకున్నాయని వాషింగ్టన్లోని మేథో సంస్థల ఆర్థికవేత్తలంటున్నారు . పీటర్సన్ సంస్థలో పనిచేసే సీనియర్ ఫెలో అరవింద్ సుబ్రహ్మణియన్ మాట్లాడుతూ చైనా , బ్రెజిల్ , భారత్లు , మరికొందరు తమ పలుకుబడిని కార్స్టెన్స్ వెనుక మొహరించి ఉన్నట్లైతే అమెరికాకు లాగార్డేను సమర్థించేందుకు ఇబ్బందికరమైన పరిస్థితినెదుర్కోవలసి వచ్చి
59 . 90 . 160 . 86తో సహా చాలా ఐ . పి . అడ్రెస్ లు బ్లాక్ చేశారు . నేను నాకు తెలిసిన సాంకేతికాలు ఉపయోగించి ఐ . పి . అడ్రెస్ లు మార్చినా అవన్నీ బ్లాక్ చేసారు . - - - మార్తాండ
తల్లి , తండ్రులని అంటున్నాని మీరు కోప్పడవచ్చు … కానీ … వాళ్ల తీరుని మీరు ఓ సారి ప్రశ్నించుకోండి …
సరేనమ్మా ! మీ మాట ప్రకారమే , ఇప్పుడు ఈ విషయంలో జనం Nature కి chance ఇవ్వడం లేదు గదా ! మగవాడి పైచేయి సంగతలా ఉంచి అసలు ఆడదే లేకుండా పోయే పరిస్థితి వస్తోంది గదా ! Nature కి chance ఇవ్వని పాపానికి అందఱమూ కలిసి తీఱిగ్గా అనుభవిద్దామా ?
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుందో ఏమోగానీ ఆరోపణ చేయబడ్డవారికే పదవీ విరమణ అయినా పిలిచి పిలిచి మళ్ళీ పదవులిచ్చి గౌరవిస్తూ ఉంటారు . హేమిటో ఈ కృష్ణమాయ . . .
ఏదో కొంచం కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నందున నేనున్నా అంటూ నేను ఓ దూకు దూకా ! ! దూకే ముందు ప్రక్కనున్న అమ్మాయికి నా ఐ ఫోన్ ఇచ్చి నన్ను ఫొటో తియ్యమంటే , అలాగే కూర్చున్న అమ్మాయిలని ఓ పది తీసింది . . ఇదిగో ఇలా
కొన్ని రచనలు వడియాలు పెట్టినట్టుంటాయి . కొన్ని జంతికలు పోసినట్టుంటాయి . కొన్ని మాత్రం ముగ్గులు వేసినట్టుంటాయి . పై రెండూ తింటే కరుసైపోయినట్టే - " నిన్న " కన్న బిడ్ద " ఇవాళ " " ఇవాళ " లు రేపటికి పేరెంట్సూ , ఎల్లుండికి తాతలూ అవ్వలూనూ . . . . . దాలిగుంట మీద పాలదాకలో పాలి నిదానంగా కాది , మరిగి , పొంగి పొంగి , కుంగి స్థిరపడి ఎర్రడాలు మీగడ తేలడం దాంపత్య సౌభాగ్యం ! ఏవిటలా చదవడం ఆపి , కళ్ళు తేలేస్తున్నారు ? సరదానంద వాక్యాలు గంభీరానంద సన్యాసానంద ప్రసంగ పాఠాల్లా కనపడుచున్నాయా ? పైవన్నీ నా మాటలు కాదండోయ్ ! సీతారాముళ్లనే బావామరదళ్ల . . ధరిమిలా ఆలూ మగళ్ల . . ఆ పైన తల్లీతండ్రుళ్ల . . ఆ పిమ్మట అవ్వాతాతళ్ల కథకి మన వెంకటరమణ వ్రాసిన రమణీయమయిన ముందుమాట . .
మనకిప్పటికీ నాటకమనగానే గురజాడ , కవిత్వమనగానే శ్రీశ్రీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది . వీళ్ళిద్దరూ అంతగా ఎంతోమందిని ప్రభావితం చేసారు . * * * శ్రీశ్రీ రచనలపై , ఎందరో పరిశోధనలు చేసారు . శ్రీశ్రీ రచనలను బాగా అర్ధం చేసుకోవటానికి అవి ఉపయోగపడుతూనే ఉన్నాయి . శ్రీశ్రీ విమర్శకులు వాటిని కూడా ఒకసారి తిరగేస్తే బావుంటుంది .
ఓ సారి వాలీ బాల్ ఆడుతూ వుంటే అనుకోకుండా కిందపడిపోతాడు కళ్యాణ్ . కాలికి దెబ్బ తగిలి నడవలేక పోయాడు . ఇంకా కొద్దిరోజుల్లో మ్యాచ్ వుంది , ఎలా ? ఎంతో ఏడుస్తాడు కళ్యాణ్ .
మనసుకి ఏదయినా కష్టం కలిగితే ఒక చీమ పాకే దారినీ అది తన గతిని చీటికీ మాటికీ మార్చుకుంటాం చూస్తె మన మొహాన చిరునవ్వొకటి వెలుస్తుంది . అది చాలు ఎంతటి విసుగైనా తగ్గటానికి .
నలుగురు సినీ ప్రముఖులతో ముడిపెట్టి హీరోయిన్ అనుష్క లవ్ అఫైర్స్పై తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి . తెలుగు హీరో , నాగార్జున కుమారుడు నాగ చైతన్యతో అనుష్కకు నిశ్చితార్థం జరిగిందంటూ పెద్ద యెత్తున వార్తాకథనాలు ప్రచురితమయ్యాయి . అయితే , నాగచైతన్యతో నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ తన భాయ్ ఫ్రెండ్ పేరు చెప్తే ఆశ్చర్యపోతారని అనుష్క చెప్పడంతో ఆ బాయ్ ఫ్రెండ్కు సంబంధించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి . నాగచైతన్యతో అనుష్క నిశ్చితార్థం జరిగినట్లు వచ్చిన వార్తలను హీరో అక్కినేని నాగార్జున మేనేజర్ కూడా ఖండించారు . ఈ విషయంపై మాట్లాడడానికి నాగార్జున అందుబాటులో లేరని అంటున్నారు . అక్కినేని కుటుంబం మాత్రం ఆ వార్తలను ఖండిస్తోంది . కాగా , నాగచైతన్యతోనే కాకుండా తెలుగు హీరో గోపీచంద్ , దర్శకుడు క్రిష్ , తమిళ మాస్ హీరో విజయ్లతో అనుష్క పేరును జోడించి వార్తాకథనాలు జోరందుకున్నాయి . లక్ష్యం సినిమా షూటింగ్ సందర్బంగా అనుష్కకు , గోపీచంద్కు మధ్య సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు . వారిద్దరు కలిసి తిరిగారని ఊహాగానాలు చెలరేగాయి . అలాగే , వేదం సినిమా షూటింగ్ సందర్భంగా అనుష్కకు దర్శకుడు క్రిష్తో సంబంధాలు ఏర్పడ్డాయని కూడా ప్రచారం జరిగింది . అలాగే తమిళ హీరో విజయ్తో అనుష్క చెట్టాపట్టాల్ వేసుకుని తిరిగినట్లు వార్తలు వచ్చాయి . మొత్తం మీద , అనుష్క ప్రేమాయణాలకు సంబంధించి ఒకదానికొకటి సంబంధం లేకుండా వార్తకథనాలు వస్తున్నాయి .
సుధామ గారూ , చాలా సంతోషం బ్లాగు ల్లోకి అడుగిడినందుకు ! ఒక్కొక్కటిగా మీ సమీక్షలన్నీ కూడా ఇక్కడ పెడితే చదువుకుని ఆనందిస్తాం !
కొత్తపల్లి కి జన్మ దిన శుభాకాంక్షలు . పత్రిక దినదినాభివృద్ధి చెందుతూ అందరికీ ఆనందాన్ని కలుగచేయాలని మనసారా కోరుకుంటున్నాం .
" Postmodernism is not an ideology . Its an ' idea ' of demystifying all ideologies at the strength of independent thinking " అని మా ఆంగ్లసాహిత్యం ఫ్రొఫెసర్ చెప్పేవారు . అప్పట్లో కొంత అర్థమయ్యిందనిపించినా , ఇప్పటికీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను . మీరు చెప్పినట్లు " ఒక సిద్ధాంతానికి కాని , ఒక నియమానికి కాని , ఒక వాదానికి గాని , ఒక సంప్రదాయానికి కాని కట్టుబడి ఉండకుండా , స్వతంత్రంగా ఆలోచించి , సందర్భశుద్ధి తో తమ తమ భావాలని నిర్భయంగా వ్యక్త పరచటమే ఉత్తర అధునాతన తత్వం " ఇలా ఉంటే ' మీ మాటల్లో పొంతనలేదు ' అన్న వ్యాఖ్యలు వినాల్సివస్తోంది . బహుశా మనలో చాలా మంది conformists కావడం వలన పోస్టుమాడ్రన్ పోకడల్ని విచ్చలవిడితనంగా వర్గీకరించి తృప్తిపడటమే జరుగుతోంది .
తాపసి చిరంజీవ ! లోపలికి రామ్మా ! ఈ తపోవనాలు అందరికీ సొంతయిళ్ళే .
రైతు కథ కు ఆహ్వానం రైతు జీవితాల్ని ప్రతిబింబించే సాహిత్యం అసంఖ్యాకం గా వస్తున్నది . గతంలో రైతు జీవితాల్ని వ్యక్తీకరించిన కవితల్ని ఏర్చి కూర్చి " రైతు కవిత " సంకలనాన్ని వెలువరించాము . సాహిత్యాభిమానులు ఈ సంపుటిని ఎంతగానో ఆదరించారు . ఆ స్ఫూర్తి తో ఇప్పుడు " రైతు కథ " ను సంకలించదలిచాం . తొలినాటి నుండి రైతుల జీవితాల్ని స్పర్శించిన కథల్ని పంపిచవలసింది గా కథకుల్ని , సాహిత్యాభిమానుల్ని అభ్యర్ధిస్తున్నాం . వివిధ పత్రికల్లొ , కథా సంపుటుల్లో ప్రచురితమైన కథల ఫొటొస్టాట్ కాపీలను కాని లేదా ఒరిజనల్స్ కాని పంపించాలి . ఈ సంపుటి కోసం ప్రత్యేకించి రాసిన కథలు అంగీకరించబడవు . గతంలో ప్రచురితమైన కథలు మాత్రమే పంపగలరు . డా . పాపినేని శివశంకర్ , బండ్ల మాధవ రావు , ఎం . వి . రామిరెడ్డి లు సంపాదకులుగా ఉన్న ఏ సంకలనానికి కథలు పంపవలసిని చిరునామా డా . పాపినేని శివసంకర్ , 3వ లైన్ , విద్యానగర్ , గుంటూరు - 522 006 . లేదా బండ్ల మాధవ రావు , 306 , రాచకొంద టవర్స్ , అల్వాల్ , సికింద్రాబాద్ - 500 010 . లేదా ఎం . వి రామిరెడ్డి , కోట రెసిడెన్సి , పోలీస్ స్టేషన్ దగ్గర , మియాపూర్ , హైదరాబాద్ .
" ఇప్పుడు ఆ తాతా బొయ్యాడు , ఇల్లూ బోయింది , జ్ఞాపకాలు మాత్రం మిగిల్నై . " మనం భద్రంగా దాచుకోగలిగే ఆస్తులు ఈ జ్ఞాపకాలే . .
తెలుగు సినిమా రీమేక్ లకు బాలీవుడ్ లో డిమాండ్ పెరగటంతో వాటితో పాటే ఇక్కడ డైరక్టర్స్ కి , రైటర్స్ కూ కూడా గుర్తింపు లభిస్తోంది . అందులో భాగంగానే ప్రముఖ రచయిత కోన వెంకట్ , ఇప్పుడు బాలీవుడ్లో
ఏమిటో రిటైరయిన తరువాత బిజీబిజీ అయిపోయాను . ఉద్యోగంలో ఉండేటప్పుడు అదో రకమైన బాధ్యతా . కానీ it was systematic . ఏదో ఆఫీసులో పనీ , అది పూర్తిచేయడం , తిండం , నిద్రపోవడం , మళ్ళీ ఆఫీసూ . రిటైరైన తరువాత ఎలాగరా బాబూ , అనుకున్నంత సేపు పట్టలేదు , ఓ ఉద్యోగం లేదూ , సద్యోగం లేదూ అయినా సరే టైమనేది ఉండడంలేదు చేతిలో . మా అమ్మాయైతే ఫోను చేసినప్పుడల్లా , కోప్పడుతూంటుంది , ఊరికే తిరక్కూ , రెస్ట్ తీసికుంటూండూ అని . ఏది ఏమైనా , I am enjoying every moment of it . ఉన్నవాటికి సాయం , నా మిస్టరీ షాపింగైతే ఉండనే ఉంది . క్రిందటి వారంలో క్రోమా కి వెళ్ళి , నా కెమేరాలొకి సెల్స్ కొనుక్కున్నాను . పాపం కెమెరాతో ఇచ్చిన బ్యాటరీలు , రీచార్జ్ చేసి చేసి , ఒట్టిపొయాయి ! ఒట్టిపోవడం అంటే తెలుసుగా , ఆవులూ , గేదెలూ పాలివ్వడం మానేసినట్లన్నమాట !
ఘన తపః ఫలముగా - సప్తాద్రులు పొందె అవనిజాపతి సన్నిధిన్అవధి లేని మోద జగతిగా తామెల్ల - వేళలన్ విరబూయుచూ ఉన్నవి ఏడుకొండలు విరబూయుచూ ఉన్నవి | | దశ దిశలకూ దొరికె - నీ కేంద్ర బిందువు ; ద్వాదశాదిత్యుల అర చేతి కమలముగఏడు కొండల శ్రేణి భాసిల్లుచున్నదమ్మా ! ఎల్ల వేళల భాసిల్లుచున్నదమ్మా ! | | సౌభాగ్య సీమగా వెలుగొందు ఘన [ . . . ]
ప్రాంతాల వారీగా , అస్తిత్వాల వారీగా స్త్రీల సాహిత్య విమర్శను సమగ్రం చేసుకోవడంలోబాగంగా మనలో మనం రచయిత్రుల ఉమ్మడి వేదిక జూన్ 27 , 28 తేదీలలో రాయలసీమ సాహిత్య సదస్సును నిర్వహించింది . విశాఖ పట్నం , వరంగల్ సదస్సుల అనంతరం మరింత స్పష్టమయిన అవగాహనతో మనలో మనం ముందడుగు వేసింది . మొత్తం చదవండి »
The Treeth about the Gita నార్ల వెంటేశ్వరరావు రచనకు సంక్షిప్త తెలుగు సేత ఎన్ . ఇన్నయ్య భారత శాస్త్రీయ పరిశీలనా కేంద్రం ఇ - బుక్ ప్రచురణ గీతా రహస్యం పీఠిక దేశ విదేశాలలో కొందరు గొప్పవారు భగవద్గీతను గొప్పమత గ్రంథంగానూ , తత్వం నీతి రంగాలలో తిరుగులేని మార్గ దర్శిగానూ , సామాజిక విజ్ఞాన రంగాలకు సైతం ఆదర్శవంతమైనది గానూ భావించారు . వారిపై నేను తీవ్ర విమర్శచేశాను . అందుకు క్షమాపణ కోరడం లేదు . వారెంత గొప్ప వారైనా ఒక్క విషయంలో లోపభూయిష్టులే . వారికి ఆధునిక మనస్తత్వం లేదు . ఆధునిక మనస్సు అంటే ఏమిటి ? అంధ విశ్వాసాన్ని యీసడించడం , మూఢ నమ్మకాన్ని త్రోసిపుచ్చడం , పిడివాదాన్ని గర్హించడం , మాయ మాటల్ని కాదనడమే ఆధునిక మనస్సు . వివేచనాత్మకంగా , విజ్ఞాన పూరితంగా ఆలోచించడమే ఆధునిక మనస్సు పని . హేతుబద్ద కొలతకు నిలవలేని దానిని నిరాకరించడమే ఆధునిక మనస్సు . స్వేచ్ఛగా , సాహసోపేతంగా , కొత్త పరికల్పనలతో , తెలియనిది తెలుసుకుంటూ పోవడమే . భూమి విశ్వంలో ఒక అణువు మాత్రమే . దానిని గురించి , జీవితాన్ని గురించి , విశాల విశ్వం గురించి తెలుసుకుంటూ పోవడమే ఆధునిక మనస్సు . ఆధునిక మనస్సుకు కేంద్రం దేవుడుకాదు , మానవుడు . ఆ మనస్సుకు జాతి , మతం , దేశం , వర్గం , కులం అడ్డం రావు . సంకుచితం , తలబిరుసుతనం , అల్పత్వం , స్వార్థం ఆధునిక మనస్సుకు దూరం . ఆధునికుడు యీ ప్రపంచాన్ని పట్టించుకుంటాడు , మరో లోకాన్ని కాదు . నేను నీ సృష్టికర్తను అని ఎవరైనా అంటే , పోవోయ్ , నాకునేనే సృష్టికర్తను . నేను పరిణితి చెందుతున్నాను . నా బాల్యదశలో భయం , అజ్ఞానం వలన ఎందరో దేవుళ్ళను దేవతలను సృష్టించాను . అలాగే స్వర్గాలను నరకాలను పుట్టించాను . వాటన్నిటినీ కూలగొడుతున్నాను అంటాడు . అలాంటి ఆధునిక మనిషికి గీత చాలా మొరటుగానూ , ఆదిమదశగానూ , అర్థ సత్యంగానూ , పరస్పర విరుద్ధాలుగానూ , ఆధారాలు లేని మాటలతోనూ , ఘోరమైన విషయాలతోనూ , కనిపించడం సహజం . డి . డి . కోశాంచి దృష్టిలో గీత పరస్పర విరుద్ధాలను సమన్వయించే సంస్కృత రచన మాత్రమే . , వ్యతిరేక విరుద్దాలను దిగమింగే ప్రయత్నం జరిగింది . నా రచనలన్నింటిలో యీ రచన నాకు సంతృప్తినిచ్చింది . స్వాతంత్ర్యం రావడంతో కొత్త జీవితంలోకి ప్రవేశిస్తామని ఒకప్పుడు అనుకునేవాడిని . కాని తిరోగమన వాదం ఉప్పెన వలె వచ్చిపడడం చూస్తుంటే విచారంగా వుంది . 1947కు ముందు కంటె , నేడు మనం మూఢనమ్మకాలతో , ఛాందసంతో , మాయ మాటల గారడీలతో వున్నాం . మన స్వాతంత్ర్యం భ్రమగా తయారైంది . మనస్సుకు బంధాలుంటే , స్వేచ్ఛ ఎలా వస్తుంది ? ప్రజాస్వామిక సంస్థలున్నప్పటికీ , రాజకీయ స్వేచ్ఛా వ్యవస్తలు కనిపిస్తున్నా , సరైన అర్ధంలో మనకు స్వేచ్ఛ లేదు . ఈ స్థితిని వివరించడం ఎలా ? జాతీయోద్యమం తిరోగమనంలో ప్రారంభించి కొనసాగిందని , వెనక్కు తిరిగి పరిశీలిస్తే అవగాహన అవుతుంది . బంకించంద్ర ఛటర్జీ , వివేకానంద , బిపిన్ చంద్రపాల్ , లజపతిరాయ్ , అరవింద ఘోష్ , బాలగంగాధర్ తిలక్ , అనిబిసెంట్ , గాంధీ వంటి విభిన్న జాతీయ నాయకులకు ఉత్తేజాన్ని కలిగించింది భగవద్గీత . గాంధీని హత్య చేసిన నాధూరాం గాడ్సెకు సైతం అదే పవిత్ర గ్రంథం ! మన స్వాతంత్ర్యానంతరం అందకారంలోకి ఎలా ప్రవేశించామో దీన్ని బట్టి ఆశ్చర్య పడనక్కరలేదు . జ్యోతిష్యం ప్రకారం స్వాతంత్ర్య మూహూర్తం నిర్ణయించారు . అదంతా చూస్తుంటే గుండె బరువెక్కుతుంది . ఈ తిరోగమన ఉపద్రవాన్ని 76 ఏళ్ళ వయస్సులో తిప్పి గొట్టగలనా ? చేయగలననే నా విశ్వాసానికి యీ పుస్తకమే నిదర్శనం . అదే నాకు సంతృప్తినిస్తున్నది . ఈ పుస్తకరచనకు తోడ్పడిన వారందరికీ ధన్యవాదాలు చెప్పాలి . డా . వై . వెంకటేశ్వరరావు , డా . డి . ఆంజనేయులు , డా . పి . ఎస్ . ఎన్ . మూర్తి యీ రచన చదివి అనేక సూచనలు చేశారు . అయితే యీ రచనలోని అభిప్రాయాలకు వారెవరూ బాధ్యులుకారు . అవి కేవలం నావే . యువతరానికి ఒక విజ్ఞప్తి . ప్రపంచం అత్యంత వేగంగా మారుతున్నది . ప్రతి పదేళ్ళకు యీ వేగం చాలా ఎక్కువగా వుంటున్నది . గత 80 ఏళ్ళలో చాలా మార్పువచ్చింది . చాలా మంచి జరిగింది . ఇంచుమించు అంతే చెడుకూడా వుంది . ప్రపంచ ప్రళయం జరగకుండా ఆపే ప్రయత్నాలు జరిగాయి . మార్పుకు అనుగుణంగా , ఉపద్రవాలను అడ్డుకొంటూ , మనం సాగిపోవాలి . ఇందులో యువత బాధ్యత చాలా వుంది . గీత తెచ్చిపెట్టిన పాత అలవాట్లనుండి బయటపడాలి . అలాగే ప్రపంచంలో పవిత్రగ్రంథాల పాత బంధాలు కూడా తెంచాలి . కొత్త భావనలు , కొత్త విలువలు రాకుంటే ప్రపంచంలో జీవన రంగం అదృశ్యమౌతుంది . మన ఆశలు , భవిష్యత్తు అన్నీ పోతాయి . - నార్ల వెంకటేశ్వర రావు పరిచయం ఈ పుస్తకాన్ని గీతామిధ్య అంటే సరిగ్గా ఉంటుంది . గీతను గురించి చెప్పేదంతా సందేహాస్పదమే . కురుక్షేత్రంలో నిజంగా పోరాటం సాగిందా . ఒకవేళ అది జరిగి ఉంటే దేశవిదేశాలలోని తెగలన్నీ ఏదొక వైపు కోపు వేసుకున్నాయా ? యుద్ధం ఎప్పుడు జరిగింది ? అర్జునుడు , రథసారధిగా కృష్ణుడు ఉన్నాడా . అనేక యుద్ధాలు గెలిచిన అర్జునుడు దుర్యోధనుడి అపార బలగాన్ని జూచి కలవరపడ్డాడా ? బంధు మిత్రులనందరినీ చంపాలనే ఆలోచనతో చలించి పోయిన అర్జునుడు కృష్ణుడి ప్రోత్సాహం వలన భీభత్సకాండ జరిపాడా ? కృష్ణార్జునుల సంవాదం సాగుతుండగా ఇరువైపులా సైన్యాలు చూస్తూ నిలబడి పోయాయా ? కురు క్షేత్రంలో కృష్ణుడు చెప్పిన భగవద్గీత మనకెలా వచ్చింది ? మహాభారతం ప్రకారం హస్తినాపురంలో ఉన్న ధృతరాష్ణుడికి ఏ రోజు కారోజు సంజయుడు నివేదించటంతో గీతకూడా వచ్చింది . కృష్ణుడి నోటి నుండి ఊడిపడిన ప్రతిమాటనూ పొల్లు పోకుండా సంజయుడు వృధ్ధుడైన , గుడ్డి అయిన ధృతరాష్ర్టుడికి అందించాడు . యుద్ధరంగంలో ఎవరికీ కనిపించకుండా , ఆయుధాల తాకిడికి దెబ్బతినకుండా యధేచ్ఛగా సంజయుడు సంచరించాడు . అతనికి పగటికి - రాత్రికి తేడా లేదు . అలసట లేదు . నిర్విరామ కృషి చేశాడు . అందరి మనస్సుల్లోని ఆలోచనలు గూడా చెప్పగలిగేవాడు . సంజయుడు ఇదంతా ఎలా చేశాడు ? నేటి శాస్ర్తీయ సాంకేతిక పరమైన రెడియో , టెలివిజన్ , వీడియోలు సహితం తలవంచుకునేటట్లు సంజయుడు ఎలా చేశాడు ? అది చొప్పదంటు ప్రశ్న అని సాంప్రదాయ వాదులు అంటారు . పూర్వం రుషులకు దివ్యశక్తులుండేవట . వరాలివ్వటంలో వ్యాసుడు అత్యున్నత స్థాయిలో ఉండేవాడు . కురురాజు ధృతరాష్ర్టుడు యుద్ధ విశేషాలను సంజయుడి ద్వారానే తెలుసుకోటానికి వీలుగా అన్నిటినీ వివరించేవరాన్ని యివ్వమని కోరగా వ్యాసుడు ప్రసాదించాడు . అది కేవలం యుద్ధం చివరి రోజున సంజయుని పట్టుకొని చంపబోతున్న సాత్యకికి వ్యాసుడు అడ్డుపడ్డాడు . ( Sorensens : An Index to the names in the Mehabharata , 1963 : Delhi , Page 6 - 9 ) . ధృతరాష్ర్టుడు వ్యాసుని ధర్మసంతానంలో ఒకడు , వ్యాసుడు సహితం సత్యవతి - పరాశరులకు పెళ్ళికి ముందే పుట్టినవాడు . వ్యాసుడికి అక్రమ సంతానం నలుగురు పుత్రులున్నారు . మహాభారత కాలంలో తాగుడు , జూదం , పశువులను అపహరించటం , కన్యలను ఎత్తుకుపోవటం సాధారణంగా ఉండేవి . మూకుమ్మడి హత్యలు సాగేవి . సింహాసనాధి పత్యం కోసం , నరక ప్రాప్తి తప్పించుకోటానికి వేరేవారితో నైనా కొడుకుల్ని కనటం ఆమోదించారు . ఆవిధంగానే తల్లిమాటల్ని పాటించి అంబికా , అంబాలికలను వ్యాసుడు గర్భవతుల్ని చేశాడు . వారి భర్త చనిపోయినందున భరత వంశం కొనసాగే అవకాశం లేకుండా పోయింది . ఇలాంటి విధానాలు ఆనాడు చాలా జరిగాయి . వ్యాసుడు దైవ సమానుడు . అలా భావించిన సంప్రదాయవాదులు అతన్ని పైకెత్తారు . అంబికకు పుట్టిన ధృతరాష్ర్టుడు వ్యాసుని గుడ్డి సంతానం . అంబాలికకు వ్యాసునిద్వారా పుట్టిన పాండు రాజు రోగిష్ఠి , మరొక కుమారుడు విదురుడు వివేకి , ఆరోగ్య వంతుడు కాని , అతడి తల్లి శూద్ర యువతి కావటం వలన విదురుడికి సింహాసన హక్కు దక్కలేదు . వ్యాసుణ్ణి ఈసడించుకున్న అంబిక తన సేవకురాలిని అతనికి అప్పగించింది . వ్యాసుడి నాల్గవ సంతానం శుకుడు . వ్యాసుడి రేతస్సు నుండి క్షణికంగా శుకుడు పుట్టాడు . ఇంద్రుని కొలువులో ఒక అప్సరను చూచి రేతస్సు చిందించగా శుకుడి జన్మ జరిగింది . పాండవులందరూ అక్రమ సంతానమే . కుంతికి పుట్టిన ముగ్గురికీ తండ్రులు ముగ్గురు . మాద్రికి పుట్టిన కవలలకూ అంతే . పెళ్ళికాక ముందు కుంతి కర్ణుడిని కన్నది . సత్యవతి వలెకాక , కనగానే కుంతి కర్ణుడిని వదిలేసింది . ఇలాంటి చర్యలన్నింటికీ అతిలోక ముసుగు కప్పి మహాభారతం నింపారు . భరత వంశానికే కాక ఇతర రాచరికాలలోనూ లైంగిక స్వేచ్ఛ బాగా ఉండేది . కంసుడు మధుర రాజు ఉగ్రసేనుడి కొడుకు , కృష్ణుడి మేనమామ . దానవుడు రాణిని చెరచగా కంసుడు పుట్టాడు . పాంచాల రాజు దృపదుడి పుట్టుక అంతే . అతడి సంతానం ద్రౌపది , దృష్టద్యుమ్నుడు . రాజు యజ్ఞం చేస్తూ రాణిని తనతో సంభోగించమంటాడు . ఆమె రుతువులో ఉన్నందున ఆగమంటుంది . కాని , యజ్ఞ సమయం ఆగకూడదు . గనుక , యజ్ఞ గుండంలో నుంచి ద్రౌపది , దృష్టద్యుమ్నుడు పెద్దవారు గానే పుడతారు . ద్రౌపది కారు నలుపు . అందువలన ఆమెను కృష్ణ అని పిలిచేవారు . కాని , ఆమె అందగత్తె , పాండవులు ఐదుగురికీ భార్య అయింది . సంప్రదాయవాదుల ప్రకారం ఇదంతా యజ్ఞ ఫలం కావచ్చుగాని , ఆనాడు రుషులు యధేచ్ఛగా సెక్స్ ఆచరించిన ఫలితమని చెప్పవచ్చు . అక్రమ సంతానం నాడు విచ్చలవిడిగా ఉండేదో , అందుకు ద్రోణకృపాచార్యుల ఉదాహరణ చూపవచ్చు . వైదిక కర్మకాండలో అదొక భాగం . ( Maxmuller : A History of Ancient Sanskrit Literature 1968 , Varanasi , Page : 40 ) . మహాభారతాన్ని పంచమ వేదంగా సంప్రదాయవాదులు స్తుతిస్తారు . అది విజ్ఞాన సర్వస్వం అంటారు . అందులో లేనిది ఎందులోనూ లేదంటారు . మహాభారతం వ్యాసుడి విషమ పుత్రిక . కృష్ణుడు గీత పేరిట అర్జునుడికి ఉపదేశించిన దేమిటో చూద్దాం . సంజయుడు యుద్ధ విలేఖరి . ధృతరాష్ర్టుడికి సాయంత్రానికల్లా పూర్తి చిత్రణ యిచ్చేవాడు . వ్యాసుడు అలాంటి అద్భుతాన్ని ప్రసాదించాడు . నాలుగు వేదాలను పరిష్కరించిన వ్యాసుడు మహాభారతాన్నీ , అష్టా దశ పురాణాలను , బ్రహ్మ సూత్రాల్ని , మరెన్నింటినో రాశాడు . ఈ ఉద్ర్గంధాలలో గీత వంటిది అతనికి మంచి నీళ్ల ప్రాయం . కురుక్షేత్రయుద్ధా నంతరం ఎన్నో సంవత్సరాలకు గాని అది రాయలేదు . మహాభారతంతో పాటు గీతను తన కుమారుడికీ , నలుగురు శిష్యులకూ చెప్పాడు . అందులో ఒకరు వైశం పాయనుడు . గురువువలె అతడిదీ బహుముఖ మేధస్సు . అర్జునుడి ముదిమనుమడు జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టడానికి యజ్ఞం తలపెట్టాడు . ( ప్రతి యజ్ఞానికీ పురోహితులకు బంగారం , ఆవులూ , ఆడపిల్లలూ దక్కేవారు ) యజ్ఞ సమయంలో గీతతో కూడిన మహాభారతాన్ని వైశంపాయనుడు పారాయణం చేశాడు . అది విన్న సౌతి , ఉగ్రశ్రవుడు మహాభారత గీతను శౌనకాదిమునుల నిమిత్తం నైమిశారణ్యంలో పన్నెండు సంవత్సరాల యజ్ఞకాలంలో చెప్పాడు . ఆ తరువాత ఎవరు పారాయణ చేశారో తెలియదు . గీత చెప్పిన కృష్ణుడికీ , అది పారాయణం చేసిన సౌతుడికీ వందేళ్ళ తేడా ఉన్నది . కురుక్షేత్ర యుద్ధానంతరం యుధిష్టిరుడు 36 ఏళ్ళు పరిపాలించాడు . జనమేజయుడు నాగవంశాన్ని మట్టుపెట్టాలని తలపెట్టటానికి కారణం తన తండ్రి పరీక్షిత్తును వారు చంపటమే . నైమిశారణ్యంలో శౌనకుడు నాగయజ్ఞం ఎప్పుడు తలపెట్టాడో కచ్చితంగా తెలియదు . ( Sitanath Pradhan : Chronology of Ancient India , Calcutta , 1972 , Page : 71 ) కృష్ణుడి గీతాబోధనకూ , సౌతుడి పారాయణానికి , ఒక శతాబ్దం తేడా ఉంటే , ఆ తరువాత గీత వ్రాత పూర్వకంగా రావటానికి కొన్ని శతాబ్దాలు గడిచింది . సంప్రదాయవాదుల ప్రకారం అయితే ఇది వేలలో ఉంటుంది . అన్నాళ్ళు కృష్ణుడు చెప్పిన గీత యధాతథంగా ఉందనటానికి వీలులేదు . గీత కంటె ఇంకా ఎక్కువ కాలానికి గాని వేదాలు రాతకు నోచుకోలేదనీ , అయినా , ఉచ్చారణతో సహా యధాతథంగా దిగుబడి అయ్యాయనీ సంప్రదాయ వాదులంటారు . గీత వేదంకాదు . దీని ప్రమాణాన్ని అందరూ అంగీకరించటం లేదు . 8వ శతాబ్దంలో ఉన్న ఆదిశంకరాచార్యుడు గూడా . గీతను ఎవరూ పట్టించుకోలేదు . బౌద్ధాన్ని ధ్వంసం చేయటానికి సాధనంగా గీతపై శంకరుడు వ్యాఖ్యానం రాశాడు . ఆర్య సమాజవాదులూ , బ్రహ్మ సమాజ వాదులూ , గీతకు అట్టే విలువ యివ్వరు . కనుక వేదాలకూ , గీతకూ సామ్యం చూపటం సబబు కాదు . గీత రూపొందిన తీరూ , అది అందించిన వక్రమార్గం గమనిస్తే అదొక మిధ్యగా పేర్కొనవచ్చు . అలెగ్జాండర్ పోప్ వదంతులను గురించి చెప్పిన మాటల్ని గీతకు అన్వయించవచ్చు . నేను కాలేజి రోజుల్లో తొలుత గీతను చదివాను . ఆ తరువాత దానిపై భాష్యాలెన్నో చూచాను . గీతరచనల , కాలం , ప్రదేశం తరతరాలుగా అందించిన తీరు అన్ని కాలాలకు , అందరికీ సరిపడే తత్త్వం అని ప్రచారం చేయటం అంతా బూటకమే . ఆ మాట పుస్తక శీర్షికకు పెట్టవలసింది . గీతభక్తులు చదవకుండానే పుస్తకం మూసివేస్తారని ఆ పని చేయలేదు . వారిని నా వైపు తిప్పుకోవాలనే భ్రమ నాకు లేదు . కొద్ది మందైనా గీత అల్పత్వాన్ని గ్రహిస్తే నా కృషి వృధా కాబోదు . అధ్యాయం ఒకటి సందేహాస్పద సమరం మహాభారతం అనే పదాన్ని పాణిని వాడాడు . ఏదైనా భరతుడికి సంబంధించిన గొప్పతనానికి విశేషంగా ఈ ప్రయోగం జరిగింది అని హాప్ కిన్స్ రాశాడు . ( Edward Washburn Hopkins : A Cambridge History of India , Vol . I . Ancient India , ed . by E . J . Rapson , 1935 , Page : 252 , 253 ) భరతునికి సంబంధించిన గొప్ప కావ్యంగా మహాభారతాన్ని నిస్సందేహంగా చెప్పవచ్చు . ఇలియడ్ , ఒడెస్సెలకు ఎనిమిదిరెట్లు నేడు భారతం ఉన్నది . ( V . S . Suktankar , on the Meaning of Mahabharata , Bombay , 1957 , Page . 8 ) భరతుల మధ్య , అంటే కౌరవ - పాండవుల మధ్య కురుక్షేత్రంలో జరిపిన గొప్ప యుద్ధం కూడా ఇందులో ఉందా ? అలాంటి యుద్ధం జరిగిందనటానికి ఆధారాలు లేవు . 1 . వేద సాహిత్యంలో కౌరవుల ప్రస్తావన ఉన్నది . పాండవుల ప్రసక్తి లేదు . మహాభారతాన్ని ప్రత్యేకంగా పరిశీలించిన హాప్ కిన్స్ ప్రకారం బ్రాహ్మణాలు , సూత్రాలు కూడా పాండవుల ప్రస్తావన తేలేదు . మాక్స్ ముల్లర్ ప్రకారం కౌరవులు , భరతులూ వేద సాహిత్యంలో వున్నారు . పాండవులు లేరు . పాణిని వ్యాకరణంలోనూ , కౌరవ , భరతుల ప్రస్తావన ఉన్నది గాని , పాండవుల పేరు ఎత్తలేదు . ( Maxmuller : A History of Ancient Sanskrit Literature , 1968 Varanasi Page 40 ) క్రీ . పూ . 5వ శతాబ్దం మధ్యలో పాణిని జీవితకాలంలో పాండవులెవరో తెలియదు . ( V . S . Agravala : India As known to Panini , Luknow , 1953 , Page : 455 - 475 ) . 2 . రుగ్వేదంలో భరతరాజు సూదుడికీ , ఇతర తెగలకూ జరిగిన పోరాటాన్ని నేటి రావి నదీ తీరాన ( నాటి పరుషణి ఒడ్డున ) జరిగినట్లు ప్రస్తావన ఉన్నది . మహాభారత యుద్ధం జరిగి ఉంటే వేద సాహిత్యంలో తప్పని సరిగా పేర్కొనే వారే . వేదాలలో కౌరవ పాండవ యుద్ధం లేదని మాక్స్ ముల్లర్ స్పష్టీకరించాడు . 3 . వేద సాహిత్యంలో కురుక్షేత్రాన్ని పవిత్రస్థలంగా పేర్కొన్నారే తప్ప యుద్ధభూమిగా కాదు . ( D . C . Sirkar : Mahabharata Myth And Reality , ed . by S . P . Gupta and K . G . Rama Chandra , Delhi , Page . 5 ) 4 . వ్యాస , వైశంపాయనులు తైత్తీరీయ , ఆరణ్యకాలలో ప్రస్తావించిన మహాభారత కర్తలు మాత్రం కాదు . 5 . కధక సంహితలో కురురాజు ధృతరాఘ్ర్టడి ప్రస్తావన ఉన్నది . అతడికీ , పురోహితుడికీ మధ్య ఒక క్రతువుకు సంబంధించిన వివాదానికి సంబంధించిన విషయం గానే వచ్చింది గాని , కురుక్షేత్ర యుద్ధ ప్రస్తావన లేదు . ( A . B . Keith : Cambridge History of India , Vol . I . Page . 119 ) . 6 . అధర్వణ వేదంలో సంపన్నరాజుగా పరీక్షిత్ పొగడ్త ఉన్నది . శతపధ బ్రాహ్మణాలలో జనమేజయుడు గొప్ప యాగకర్తగానూ , పురోహితులకు దానం చేసిన వాడు గానూ పేర్కొన్నారు . అర్జునుడి వంశంలోని వాడుగా చెప్పలేదు . 7 . మహాభారతంలో అర్జునుడు ఇంద్రుని కొడుకు . శతఫత బ్రాహ్మణంలో అర్జునుడే ఇంద్రుడు . ( H . C . Ray Chandhury : An Advanced History of India , London , 1953 , Page . 94 ) . 8 . ఆక్షౌహిణిలో 21 , 870 రధాలు , 21870 ఏనుగులూ , 65 , 610 గుర్రాలు , 109 , 350 కాల్బలం ఉన్నది . ( Dikshintar , V . R . Ramachandra : Wat in Ancient India , Madras , 1944 , Page . 198 ) . కురుక్షేత్రంలో కౌరవులకు 11 , పాండవులకు 7 అక్షౌహిణులు ఉన్నాయన్నారు . నేడు అంతమంది ఒక చోట కూడటం సులభం కాదు . ప్రాచీన కాలంలో అది అసంభవం . యుద్ధ రంగంలో అంతమందిని ఒక చోట చేర్చటం సాధ్యమయ్యే పని కాదు . 9 . కురుక్షేత్రంలో 11 , 80 , 980 గుర్రాలున్నాయన్నారు . పదాతిదళం 20 లక్షలన్నారు . కాని యుద్ధ ప్రస్తావనలో ముఖాముఖి పోరాటాలే ఆనాటి సంప్రదాయంగా ఉదహరించారు . ( H . D . Sankalia : Mahabharata , Myth and Reality , Delhi , 1976 , Page . 145 ) . 10 . ఎంత ఉదారంగా లెక్క వేసినా 40 లక్షలకు మించి యుద్ధంలో పాల్గొన్నట్లులేదు . కాని మృతుల సంఖ్య 1660 మిలియన్లని చూపారు . అంటే ఒక్కొక్కరూ 4 వందల సార్లు చనిపోయారన్న మాట . ( Pratapchandra Roy : The Mahabharatha Calcutta , Vol 7 , Streepartha , Page . 42 - 43 ) . 11 . కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధాలు నాటికాలాన్ని బట్టి మోటైనవి . అంతకంటే ఉన్నత నాగరికతలో పెంపొందిన హరప్పా వాసులు రాతి , ఇత్తడి , రాగి పనిముట్లే వాడారు . 12 . భారీ యుద్ధానికి కావలసిన ఇనుప ఆయుధాలు కురుక్షేత్ర యుద్ధంలో ప్రధానపాత్ర వహించలేదు . క్రీ . పూ . 6వ శతాబ్దంలో గాని ఇండియాలో ఇనుము వాడకంలోకి రాలేదు . 13 . మగధ ఆర్యేతర రాజ్యంగా పేర్కొన్నారు . వింధ్యకు దక్షిణాన ఉన్న ప్రాంతమూ అంతే . కురుక్షేత్రంలో వీరెవరూ పాల్గొనిఉండరు . 14 . రవాణా రాకపోకలు ఆదిమ దశలో ఉన్నప్పుడు దూర ప్రాంతాలలో ఉన్న భారీ సైన్యాన్ని రప్పించటం చాలా కష్టంతో కూడిన పని . 15 . మహాభారతంలో ప్రాగ్ జ్యోతిష ( నేటి అస్సాం ) రాజు భగదత్తుడు ప్రధానపాత్ర వహించినట్లున్నది . వేద సాహిత్యంలో ఎక్కడా అతడి పేరు లేదు . పాణినికి కూడా అతడు తెలియదు . 16 . యవనులు , శకులు , పల్లవులు యుద్ధంలో కౌరవుల పక్షాన పోరాడారని చెప్పటం అసందర్భం . భారత చరిత్రలో క్రీ . పూ . 5వ శతాబ్దం ముందు వీరి పాత్ర లేదు . కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్ష్కహిణులున్నాయన్నారు . సమరం 18 రోజులు సాగిందన్నారు . పాండవులలో మిగిలిన వారు ఆరుగురు , కౌరవులలో ముగ్గురు . యుధిష్టిరుడు రెండు 18 సంవత్సరాలు పరిపాలించాడు . ఈ యుద్ధానంతరం 36 ఏళ్ళకు కృష్ణుడు చనిపోయాడు . 18 పర్వాలలో మహాభారతం చెప్పారు . గీత కూడా 18 అధ్యాయాలలో ఉన్నది . ఇదంతా అనుకోకుండా జరిగింది కాదు . సంఖ్యాశాస్రంలో నమ్మకం ఉన్నవారు అల్లిన పన్నాగ మే ఇది . ఆధునిక భారత చరిత్ర కారులలో గౌరవించదగిన ఆర్ . జి . భండార్కర్ నిస్సందేహంగా భారత , రామాయణ పురాణాలు చారిత్రకాలు కావన్నాడు . ( Collected works , Poona , Vol . I , Page : 365 ) ఆధునిక విద్య వివేచనతో , ప్రశ్నించే తత్త్వంతో మనకు ఎందుకు రావటం లేదని అతను బాధపడ్డాడు . ఆర్ . సి . దత్ . మరొక అడుగు ముందుగు వేసి మహాభారత యుద్ధం కట్టుకథ అన్నాడు . పంచ పాండవులు , ద్రౌపది గూడా అల్లినగాధే అన్నాడు . అతడు రుగ్వేదాన్ని బెంగాలీలోకి అనువదించాడు . శూద్రుడు వేదాల జోలికి ఎలా పోతాడని అతడి పట్ల సనాతనులు గొడవ చేశారు . మహాభారతం , రామాయణాన్ని కూడా ఇంగ్లీషులో సంక్లిప్తంగా అనువదించి అందించాడు . ( R . C . Dutt : Civilization of Ancient India , Vol . I , London , 1893 , Page : 122 ) . రామ్ మోహన్ రాయ్ మహాభారతంలో వ్యాసుడు ఆగాధంతా ఊహాజనితంగా పేర్కొన్న విషయం చూపారు . ప్రపంచంలోని ప్రధాన మతాల పవిత్ర గ్రంథాలను పరిశీలించిన రామమోహన్ రాయ్ గీతకు విలువ ఇవ్వలేదు . మతాలపై అతని రచనలలో గీతను పట్టించుకోనేలేదు . గీత తనకు తల్లివంటిదని , 1889లో తొలుత గీతా పరిచయం ఐనప్పటి నుండీ అలాగే భావించానని గాంధీ అన్నాడు . ( M . K . Gandhi , Geetha My Mother ) ఐనప్పటికీ మహాభారత చారిత్రకత పట్ల అతనికి సందేహాలున్నాయి . గీత ప్రస్తావించిన సంఘర్షణ మంచి చెడుల మధ్య ప్రతి వ్యక్తిలో జరిగే పోరాటంగా పేర్కొన్నాడు . వివేకానందుడు చారిత్రకత విషయమై అర్జునుడు , తదితరుల సంగతి సందేహాస్పదమే అన్నాడు . శతపధ బ్రాహ్మణంలో అశ్వమేధ యజ్ఞం సందర్భంగా అందరి పేర్లూ ప్రస్తావించినా , అర్జునుడు తదితరుల పేర్లు లేవన్నాడు . ఐనా , మహాభారతంలో యుధిష్టిరుడూ , అర్జునుడూ , ఇతరులూ అశ్వమేధ యజ్జం చేసినట్లున్నది . ( Swami Vivekananda : Thoughts on the Geetha ) ఐనప్పటికీ మహాభారతం ఇతి హాసంగా విలువను కాపాడుకుంటున్నదనీ , అందులో గీతకు ప్రాధాన్యత ఉన్నదనీ అన్నాడు . అర్జునుడు కల్పితమైతే , కృష్ణుడు చారిత్రక పురుషుడు కావటానికి వీలులేదు . ఇరువురూ కల్పితమైతే పరస్పరం సంభాషించుకున్నారనటంలో అర్ధంలేదు . గీతను ఎవరో అల్లి మహాభారతంలో చొప్పిస్తే , అది దివ్యవాణి ఎలా అవుతుంది ? మన సంప్రదాయవాదులు భండార్కర్ నూ , దత్ నూ పాత కాలపు చరిత్ర కారులుగా తీసి పుచ్చవచ్చు . రామమోహన్ రాయ్ , వివేకానంద , గాంధీలను చరిత్ర కారులు కాదనవచ్చు . కాని డి . డి . కోశాంబిని కాదనగలరా ? శాస్ర్తీయ పద్ధతిలో భారతీయ నాణాలను అతడు పరిశీలించాడు . భారత చరిత్రకు మార్క్సిస్ట్ దృక్పధాన్ని అన్వయించాడు . అతడిని ఎంత తోసిపుచ్చినా , చివరకు మార్గగామిగా గుర్తించక తప్పలేదు . అతడి చిత్తశుద్ధిని కాదనలేకపోయారు . రామాయణ , భారతాలలో పేర్కొన్న యుద్ధాలు ఎప్పుడు , ఎక్కడ జరిగాయో మనకున్న చారిత్రకాధారాల ప్రకారం చెప్పటం అసంభవం అన్నాడు . ( D . D . Kosambi : An Introduction to the Study of Indian History ) కురుక్షేత్ర యుద్ధం గొప్ప కల్పితగాధ అని నిస్సందేహంగా పేర్కొన్నారు . డి . సి . సర్కార్ , హెచ్ . డి . సంకాలియా కూడా కురుక్షేత్ర యుద్ధం జరగలేదని , కేవలం కుటుంబాల మధ్య , తెగల మధ్య కలహాలు మాత్రమేనని రాశారు . ఈ అధ్యయనం వలన నాకు మనస్తాపం కలిగింది . హిందువులపై సంప్రదాయ బరువు ఎంత భారంగా పరిణమించిందో అర్థం అవుతున్నది . 41 మంది అధ్యయనం చేసిన వారిలో కనీసం ధైర్యంగా , వివేచనాత్మకంగా , సొంతంగా ఆలోచించిన వారు 6 గురన్నా లేరు . కోట్లాది ప్రజలు వేలాది సంవత్సరాలుగా నమ్ముతున్నదంతా గాధ ఎలా అవుతుందని భావించారు . ఇదే వాదనతో సూర్యచంద్రులకు , రాహుకేతువుల గ్రహణాలు పడుతున్నాయని వీరు నమ్మారు . మనజాతీయ మనస్తత్వంలో మౌలికంగా దోషం ఉన్నదా . గ్రహణంలో ఉపవాసం ఉండి , తరువాత స్నానం చేసి , తద్వారా సూర్య చంద్రులను కాపాడా మనేవారే వీరంతా . వారు నమ్మకంలో పుట్టారు , నమ్మకాలతోనే పెరిగారు , అలాగే చనిపోతారు . సందేహించే శక్తి వారికి లేదు . ప్రశ్నించే స్వభావం లేదు . వివేచనా పరిశీలనకు దేనినీ గురి చేయలేదు . పాత నమ్మకాన్ని కాదనటం పాపం . ప్రశ్నిస్తే పాతకం , పరిశీలనకు పెడితే నరక ప్రాప్తే అలాంటి వారే మన విశ్వవిద్యాలయాలలో , జాతీయ పరిశోధనాలయాలలో , సాంకేతిక సంస్థలలో వివిధ ప్రభుత్వస్థాయిలలో ఉన్నారు . మన జాతీయ జీవనంలో కనిపిస్తున్న ఉన్మాద ప్రవృత్తిని బట్టి ఘాటైన విమర్శలు చేయక తప్పటం లేదు . అధ్యాయం రెండు తప్పుడు సంకేతాలు భారతదేశ ప్రాచీన చరిత్రలో ఒకే ఒక తేదీ నిర్దుష్టంగా చెప్పవచ్చు . క్రీ . పూ . 327 - 326లో అలెగ్జాండర్ దండెత్తి వచ్చాడు . మిగిలిన తేదీలు ఖచ్చితంగా చెప్పలేక పోటానికి మనకాలచక్రమే కారణం . ప్రభవ , విభవ అంటూ 60 సంవత్సరాల కొకసారి తిరిగి వచ్చే కాలాన్ని ఏర్పాటు చేసుకోటంలో నిర్దిష్టత పోయింది . విక్రమయుగం , శాలివాహన లేదా శాకయుగాలు ఉన్నాయి . వాటికి కూడా ప్రారంభం ఎప్పుడో తెలియదు . క్రీ . పూ . 58 - 58 మధ్య విక్రమ యుగం మొదలయిం దంటారు . ఎవరీ విక్రముడు ? ఏ చారిత్రక సంఘటన , గొప్ప చర్య ఆధారంగా ఈ యుగం ఆరంభమయింది , స్పష్టమైన సమాధానం లేదు . క్రీ . త . 5వ శతాబ్దంలో హూణులపై జయం సాధించిన విక్రమాదిత్యుడు కావటానికి వీలు లేదు . అంతకు ముందు 600 ఏళ్ళ క్రితమే ఈ యుగం ఆరంభమయింది . చివరి మౌర్య చక్రవర్తిని చంపి సుంగరాజ్యాన్ని స్థాపించిన పుష్యమిత్రుడూ కాదు . క్రీ . పూ . రెండవ శతాబ్దం అనంతరం గాని కుషాణ సామ్రాజ్యం స్థాపన కాలేదు . శాతవాహన సామ్రాజ్యానికి చెందిన గౌతమీపుత్ర శాతకర్ణి కాదు . క్రీ . త . 124 - 125 ప్రాంతాలలో అతడు శకులను అణచి వేశాడు . విక్రమాదిత్య అనేది బిరుదుగానూ పేర్కొనడం లేదు . విక్రమయుగం ఎలా ప్రారంభం అయిందీ చరిత్రకారులకే ఏకాభిప్రాయం లేదు . క్రీ . పూ . 60లో పంజాబ్ - సింధు సామ్రాజ్యాలను స్థాపించిన అజస్ తన పేరే ఆ యుగానికి పెట్టుకున్నాడు . ప్రాకృతంలో యుగం అంటే ఆయం అనిపిలుస్తున్నారు . విక్రమ యుగం ఎక్కడా ప్రస్తావనలో లేదు . విక్రమ యుగానికి చెందిన చిక్కును తొలగించటానికి చరిత్రకారులు కొందరు కృతయుగం అనీ , మాళవ యుగమనీ తొలుత ఉండేదంటున్నారు . విక్రమ యుగం పూర్తి అయిన సందర్భంగా ప్రచురించిన సంపుటిలో డి . డి . కోశాంబి యిలా రాశాడు . 1943లో విక్రమయుగం 2 వేల ఏళ్ళు గడిచిన సందర్భంగా , దీనికి సంబంధించిన చిక్కును విడదీయలేకపోయారు . పరస్పర విరుద్ధ వ్యాసాలు కేవలం నమ్మకాన్ని సూచించాయి . ( An Introduction to the Study of Indian History , Bombay , 1975 , Page : 293 ) శాలివాహన లేదా శాకయుగం క్రీ . త . 78లో మొదలయింది . ఇందులోనూ విడదీయరాని చిక్కులున్నాయి . ప్రాచీన భారత తేదీలన్నీ అస్పష్టం అయినప్పుడు రామాయణ , మహాభారతాలలో , పురాణాలలో తేదీలు నిర్ధారించటం వృధా రామాయణ , మహాభారతాలు కూడా ఒక విధంగా పురాణాలే . వాటికి తేదీలు నిర్ణయించటం అవివేకమే . కలకత్తా హైకోర్టులో జడ్జీగా పనిచేసిన బ్రిటీష్ ఐ . సి . యస్ . ఆఫీసర్ ఎఫ్ . ఇ . పర్గీటర్ ఈ తేదీల నిర్ధారణలో తిప్పలు పడ్డాడు . సంస్కృతం చదువుకొని మార్కండేయ పురాణాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు . పురాణాలలో ప్రస్తావించిన రాజ్యాల జాబితా సేకరించి ఇంగ్లీషులోకి అనువదించి పెద్ద పీఠిక రాశాడు . ( F . E . Pargiter : The Purana Text of the Dynasties of the Kaliage : 1962 , Varanasi ) వీటినే తరువాత మరో పుస్తకంలో పేర్కొన్నారు . ( Ancient Indian Historical Tradition ) పురాణాల నుండి అతను సేకరించిన చరిత్ర అనేది ఊహ మాత్రమే . చరిత్రకు భిన్నంగా పురాణాలన్నీ గాధలతోనూ , కట్టుకధలతోనూ నిండాయి . విశ్వసృష్టి , ప్రళయం , మళ్ళీ పుట్టటం , మనువు , అతని భార్యలు , సంతతి యిత్యాదుల ప్రస్తావనలున్నాయి . వివిధ రాజుల కాలాలు పేర్కొన్నారు . మధ్యలో మానవుల అసమానతల గొప్పతనాన్నీ , కులాన్నీ సంస్థాగతం చేయడాన్ని యీ గ్రంథాలలో రాశారు . పురోహితులను రాజు కాపాడకపోతే ప్రపంచం నాశనమవుతుందన్నారు . పుట్టుకనుండి చనిపోయే వరకూ , ఆ తరువాత కూడా ఎలా ఉండాలో నియమాలు రాశారు . స్వర్గానికి ఎలా వెళ్ళాలి , అక్కడకు చేరిన తరువాత రంభ , ఊర్వశి , తిలోత్తమ , వరూధినులలో ఎలా అనుభవించాలి అనేవి చిత్రించారు . అలాంటివాటి నుండి చరిత్రను ఏమేరకు రాబట్టవచ్చు . ఇంచుమించు ఏమీలేదు . పైగా మన నైతిక ప్రవర్తనపై ఆ రచనలు దెబ్బతీశాయి . అదంతా బాధ్యతా రహితమని భావించినా , ఇప్పటికే 2 , 500 సం . రాలు ఆలశ్యమయింది . మనకు వాల్మీకి , వ్యాసుడు ఎలాగో గ్రీకులకు హూమర్ , హీసియాడ్ అలాగ , సోక్రటీస్ నోటితో వారిపై ప్లేటో ధ్వజమెత్తాడు . దేవుళ్ళూ , నాయకులూ తాగుబోతులైతే , జూదరులైతే అబద్ధాలాడితే , భట్రాజులైతే , శృంగారకేళిలో తేలిపోతే , ద్వేషం , అసూయలతో నిండిపోతే , అలాంటి వారిని ఆదర్శంగా చూపి జనం కూడా తమ బలహీనతల్ని కప్పి పుచ్చుకోరా , అని ప్లేటో అడిగాడు . హోమర్ , హీసియాడ్లను చదివితే , ప్లేటో ఖండించిందంతా అభినందిస్తాం . ఫ్లేటో రిపబ్లిక్ మూడవ సంపుటిలో యిది చూడవచ్చు . ( Translation by Benfaminjo - Wette , 1946 ) హోమర్ , హీసియాడ్ లను ఖండించటంలో ప్లేటో కంటే జెనోఫేన్స్ మరొక అడుగు ముందుకు వేశాడు . నాటక రచయిత యూరిపిడస్ కూడా పుక్కిటి పురాణాలను ఖండించాడు . మన దేశంలో కవులూ , నాటక కర్తలూ , తాత్వికులూ , రామాయణ , మహాభారత పురాణాలపట్ల పరవశం చెందుతున్నారు . వీటి వెనుక ఒక పథకం ఉన్నది . స్వేచ్ఛ , ప్రజాస్వామ్యం , సమానత్వం అనే శక్తులను అడ్డుకోవాలనీ , కులతత్వాన్ని కొనసాగించాలనీ ప్రయత్నిస్తున్నారు . సి . రాజగోపాలచారి , కె . ఎం . మున్షీ మొదలైన రాజకీయ వాదులు స్వతంత్ర భారతదేశంలో హిందూ పురాణాల కోపు వేసుకున్నారు . నైతిక రంగంలో పురాణాలూ , ఇతిహాసాలు నికృష్టమైనవి . చరిత్రకోసం వాటిపై ఆధారపడకూడదు . ఎ . ఎల్ . భాషం యీలా అంటాడు . మహాభారత నాయకులు సమకాలీన ముఠా ప్రభువులు కావచ్చు . కాని చరిత్రకారుడి కవి పనికిరావు . క్రీ . పూ . 10వ శతాబ్దంలో చరిత్రను మహాభారతం ఆధారంగా నిర్మించటానికి పూనుకోవటం వృధా ( A . L . Bashgam : The Wonder That was India ) . పురాణాలలో చరిత్రకారులకు ఎలాంటి చిక్కులు వస్తాయో శీతానాధ్ ప్రధాన్ గుర్తించాడు . పురాణాలలో ప్రాచీన ఆర్య చరిత్ర లభిస్తుందనుకొంటారు . కాని యిందులో చాలా విరుద్ధ విషయాలున్నాయి . అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి . విరుద్ధ విషయాలున్నాయి . అనేక చోట్ల పురాణాలు భిన్న రీతులుగా చూపుతున్నాయి . ఒక సామ్రాజ్యాన్ని మరొక దానిలో కలిపేశారు . రాజుల జాబితా పెరిగిపోయింది . రాజ్యాల సంక్రమణ మారిపోయింది . సామ్రాజ్యాలకు కాలం పొడిగించేశారు . ఒకొకసారి ఒకే పేరు వలన అనేక చిక్కులు చోటు చేసుకున్నాయి . ( Chronology of Ancient India ) అయినప్పటికీ ఈ పురాణాల ఆధారంగానే ప్రాచీన భారత చరిత్ర తేదీలను ప్రధాన్ ప్రస్తావించాడు . పర్గీటర్ కూడా చరిత్రకారుడుగా పురాణాల్లో అనేక చిక్కులను ఎదుర్కొన్నారు . 80 మంది జనమేజయులూ , 100 మంది నాగులూ , హైహయులూ , ధృతరాష్ర్టులూ , బ్రహ్మదత్తులూ , 200 పైగా భీములూ , భీష్ములూ , 1000కి పైగా శశబిందువులూ అతనికి ఎదురయ్యారు . ఈ జాబితా పూర్తి కాలేదు . వాటితో పర్గీటర్ వంటి వారు విసుగుచెంది పురాణాలు రాసిన బ్రాహ్మణులకు చరిత్రకు , కట్టుకధకు తేడా తెలియాదన్నాడు . చరిత్రకు పురాణాన్నీ , ఇతిహాసాలకు చారిత్రక ముసుగుల్నీ వేశారన్నాడు . బ్రాహ్మణ సాహిత్యంలో చారిత్రక దృక్పధం లేదన్నాడు . పురాణాలు ప్రాచీన భారత చరిత్రకు తప్పుడు సంకేతాలు . వాటి ఆధారంగా కురుక్షేత్ర యుద్ధ తేదీలను నిర్ణియించ బూనారు . అధ్యాయం మూడు తేదీల ఒడిదుడుకులు కలియుగం అనేది చాలా మోటుభావన . పురావస్తుశాఖ పరిశోధనలకు విరుద్ధమైనది . ఆటవిక , బర్బర , నాగరిక యుగాలు చరిత్రలో సుప్రసిద్ధమైనవి . వీటిలో వివిధ దశలున్నాయి . ఒక దశ కొత్త దశకు స్థానం కల్పిస్తూ మిళితమౌతూ పోతుంది . పక్క పక్కనే వివిధ దశలూ వుండవచ్చు . కృత , త్రేత , ద్వాపర , కలియుగాల్లో క్రమేణ ధర్మం క్షీణిస్తూ , శాంతి సంపదలు కోల్పోతూ ఉంటాయనే భావన ఛాందసమైనది . అయినప్పటికీ కలియుగం ఎప్పుడు ప్రారంభమయిందా అనే చర్చ చేస్తూ ఉంటారు . కలియుగం నిర్ధారితమైతే కురుక్షేత్ర యుద్ధం తేదీలు చెప్పవచ్చునని సనాతనుల ఉద్దేశం . వీరి అభిప్రాయంలో 3101 క్రీ . పూ . కలియుగం ప్రారంభమైనప్పటి నుండి 5 వేల సం . రాలు గడిచేసరికి క్రీ . త . 1899 వచ్చిందని అన్నారు . దీనితో అంగీకరిస్తున్నట్లు వైద్య చెప్పాడు . ( Mahabharatha - A Criticism , 1929 : Page 55 , 56 ) సనాతనులు ఎంత ఎలుగెత్తి చాటితే అంత ఖచ్చితంగా నమ్మినట్లు భావిస్తారు . భారతదేశానికి అదొక విషాద పరిణామం . మూఢ నమ్మకాలకూ , వివేచనా రాహిత్యానికీ భారత దేశం చాలా సారవంతమయింది . కృత , కలియుగాలనేవి హిందువుల నిమిత్తం ప్రత్యేకంగా రూపొందించిన దైవ నిర్ణయమని నమ్మారు . ఇవి మిగిలిన ప్రపంచానికి చెందవు . ఇతర ప్రజలకూ , లోకానికీ ఎలాంటి పెత్తూలేదు . విదేశాలకు పోకుండా హిందువులను వేలాది సంవత్సరాలు ఆపారు అది నత్త జీవితం వంటిది . కలియుగారంభంలో ఆర్యులు సంచారజాతులు . 1500 సం . రాలు పాటు తిరిగి సింధులోయకు చేరారు . మరో 500 ఏళ్ళకు గంగా యమున ప్రాంతాలకు చేరారు . అలా స్థిరపడిన ఆర్య తెగల మధ్య నేటి ఢిల్లీగా పేర్కొంటున్న ప్రాంతంలో క్రీస్తు పూర్వం 3102 - 3101 ప్రాంతాలలో పోరాటాలు జరగటం సంభవమా ? సప్త సింధు ప్రాంతం ఆర్యుల అసలు ప్రాంతమని అభినాష్ చంద్రదాస్ పేర్కొన్నాడు . అక్కడి నుండి నలువైపులా వెళ్ళి తమ దివ్య సంస్కృతిని ఆర్యులు వెదజల్లారన్నారు . ఈ సిద్ధాంతాలను వివరించటానికి దాస్ రెండు పెద్ద గ్రంధాలు రాశారు . వీటిని నవ్వులాటకైనా చదవాలనిపించదు . ( Rigvedic India , Rigvedic Culture ) . కలియుగం క్రీ . పూ . 3102లో ఆరంభమైందనటానికి శాసనాలు ఆధారం ఉండదన్నారు . అయిహోలా శాసనం రెండవ పులకేసికి చెందినది . పశ్చిమ చాళుక్య రాజ్యంలోని ఈ శాసనం చాలా ప్రాచీనమైనది . ( A . D . Pusalker , History and Culture of the Indian People Vol . I . The Vedic Age ) అయితే యిది క్రీ . త . 634కు చెందినది . అలాంటప్పుడు 3736 సం . రాల తరువాత వచ్చిన శాసనాన్ని కలియుగానికి సాక్ష్యంగా సనాతనులు మాత్రమే స్వీకరించగలరు ఆర్యభట్ట అంచనాల ప్రకారం కలియుగం క్రీ . పూ . 3102లో ప్రారంభమైంది . కాని , ఆర్యభట్ట క్రీస్తు తరువాతవాడు . 3600 సం . రాల తరువాత ఉన్న ఆర్యభట్టు ఖగోళ అంచనాల ఆధారంగా చెపుతున్నాననటం సనాతనులకు నచ్చవచ్చు . కలియుగారంభాన్ని , రాజరికాల తేదీలను భవిష్యపురాణం అందించగా మత్స్య , వాయు , బ్రహ్మాండ పురాణాలు అనుకరించాయి . ఈ భవిష్య పురాణం నటనకు మారుపేరు . భవిష్యత్తులోకి తొంగిచూచి రాజ్యాలు రావటం , పోవటాన్ని చెప్పగలమన్నారు . వాటి ఆధారంగా కలియుగం ఎప్పుడు మొదలయిందో అంచనాలు వేస్తామన్నారు . పురాణాలలో రాజ్యాలూ , రాజులు పట్టీల తేడా ఉన్నది . ప్రతి పురాణంలోనూ వివిధ రాజ్యాల కాలాలు అనేక విరుద్ధాలతో కూడి ఉన్నది . 14 నుండి 25 సం . రాల వరకూ ఈ తేడాలు కనిపిస్తున్నవి . పర్గీటర్ అంచనాలలో 18 సం . రాల కాలపరిమితి ఒక్కొక్క రాజ్య పాలనకు ఉన్నది . వైద్య ఈ పరిమితిని 20 సం . రాలన్నారు . బాషమ్ 19 సం . రాలకు కుదించాడు . టి . టి . శ్రీనివాసయ్యంగార్ 25 సం . రాల వరకూ పెంచాడు . విన్ సెంట్ స్మిత్ 25 . 2 సం . రాలన్నారు . ఎ . డి . పుసాల్ కర్ 18 సం . రాలకు తగ్గించాడు . పి . ఎల్ . భార్గవ , 20 సం . రాలన్నాడు . పురాణంలోని రాజ్యాల కాలపరిమితిని ఫ్లిట్ , హార్నెల్ అనేవారు 15 సం . రాలకు పరిమితం చేశారు . ఎ . ఎస్ . ఐటేకర్ 16 . 5 సం . రాలన్నారు . బి . బి . లాల్ 14 . 5 సం . రాలన్నాడు . ఎస్ . యస్ . ప్రధాన్ 14 సం . రాలన్నాడు . విసుగు పుట్టించే ఈ విషయాన్ని ఇంతటితో ఆపేద్దాం . ఏ ఇరువురు చరిత్రకారులూ రాజ్యాల పరిమితిని గురించి ఏకాభిప్రాయానికి రాలేక పోయారంటే వారు స్వీకరించిన ఆధారాలు తప్పుడివి కావటమే కారణం . ఈ సామ్రాజ్యాల పట్టిక చాలా పెద్దదయినప్పుడు సగటు సంఖ్య 5కు మించి లెక్కల్లో పెద్ద తేడా వస్తుంది . ఏ రాజు తరువాత ఎవరు వచ్చారనేది తేలకుండా పోతుంది . చంద్రగుప్త మౌర్యుడు క్రీస్తు పూర్వం 332లో తన రాజ్యాన్ని ప్రారంభించాడు . అదే నందులరాజ్యానికి చివరి దశ . అప్పటి నుండి , అంటే మహాపద్మనంద కాలం నుండీ కురుక్షేత్ర యుద్ధం వరకూ వెనక్కు వెళ్ళాలంటే 24 యిక్ష్వాకులూ , 27 పాంచాలులూ , 24 కాశీలూ , 28 హైహయులూ , 32 కళింగులూ , 25 అశ్మకులూ , 26 కురులూ , 28 మైధిలులూ , 23 సూరసేనులూ , 20 వీత హోత్రులూ స్వీకరించాలి . 257 సమకాలీన రాజులను పరిగణనలోకి తీసుకుంటే , ఒక్కొక్కరికీ సగటున వంశానికి 26 రాజులను చూపవచ్చు . ఒక్కొక్క రాజుపాలన 18 సం . రాలుగా అంచనా వేస్తే 468 సం . రాలవుతుంది . నంద సామ్రాజ్యం క్రీ . పూ . 850 వరకూ వెనక్కు వెళ్ళ వలసి ఉంటుంది . కురుక్షేత్రయుద్ధానికీ , 10 సామ్రాజ్యాలకూ మధ్య మరికొందరు రాజులున్నారు . వారికొక 100 సం . రాలు కలిపితే కలియుగం క్రీ . పూ . 1132లో కలియుగం మొదలైనట్లు చెప్పాలి . ఈ అంచనాలలో విపరీతమైన ఊహలున్నాయి . రాజులపాలన కాలపరిమితికి నిర్ధారణ లేదు . పురాణాల ప్రకారం నందసామ్రాజ్యం 100 ఏళ్ళున్నది . జైన లెక్కల ప్రకారం 150 సం . రాలు . సిలోన్ అంచనాల ప్రకారం ఇది 22 ఏళ్ళు . మహాపద్మ పాలన 88 ఏళ్ళున్నదని కొందరు , 12 సం . రాలు మాత్రమేనని మరి కొందరు అన్నారు . వృద్ధగార్గ , వరాహమిహిర అనేవారు క్రీ . త . సుప్రసిద్ధ ఖగోళ శాస్ర్తజ్ఞులు . కలియుగ ప్రారంభమైన తరువాత 653 సం . రాలకు కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వీరన్నారు . అంటే క్రీ . పూ . 2449 - 48లో అన్నమాట . దీనికి కాశ్మీరు చరిత్రకారుడు బి . సి . కల్హణ పూర్తి మద్దుత్తునిచ్చారు . కె . పి . జైస్వాల్ అనే చరిత్రకారుడు క్రీ . పూ . 1424లో జరిగిందన్నారు . ఇలాంటి ఆధారాలను పురస్కరించుకొని కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్ణయించటం గీతా పారాణం చేయటం అర్థం లేనిది . అయినా 1500 సం . రాల పాటు యుద్ధ కాల నిర్ణానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి . అందులో కొన్ని తేదీలు ఉదహరిస్తాను . ఆర్యభట్ట , భాస్కరాచార్య క్రీ . పూ . 3102 అన్నారు . సి . వి . వైద్య క్రీ . పూ . 3101 , వృద్ధ గార్గ , వరాహమిహిర , కల్హణ , బి . సి . సేన్ క్రీ . పూ . 2444 - 48 , జె . ఎస్ . కరండికర్ క్రీ . పూ . 1922 , బంకిమ్ చంద్ర చటర్జీ , ధీరేంద్రనాధ్ పాల్ క్రీ . పూ . 15వ శతాబ్దం , ఎం . రంగారావు క్రీ . పూ . 1468 , పి . టి . శ్రీనివాసయ్యంగార్ క్రీ . పూ . 1450 , హెచ్ . టి . కోల్ బ్రూక్ , లార్డ్ ఎల్ఫిన్సన్ , హెచ్ . హెచ్ . విల్సన్ , బాలగంగాధరతిలక్ , శీతానాధ్ తత్వభూషణ్ , ఆర్ . సి . మజుందార్ , హెచ్ . సి . రాయ్ చౌదరి , పాల్ రేణు , ఎ . భాషమ్ క్రీ . పూ . 14వ శతాబ్దం , ఎ . జి . శంకర్ క్రీ . పూ . 1198 , విన్ సెంట్ స్మిత్ క్రీ . పూ . 1000 . ఇంకా ఎక్కువ చర్చ సాగిస్తే తేదీలతో పాటు గందరగోళం కూడా పెరుగుతుంది . ఈ చర్చలో పాల్గొన్న వారిలో వివేచనాపరులు కలియుగం కట్టుకథ అన్నారు . జె . ఎఫ్ . ప్లీట్ ఈ విషయంలో ఆర్యభట్లపై నెపం వేశారు . క్రీ . త . 498లో ఆంధ్రరాజ్యం అంతమైనప్పుడు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయని కె . పి . జైస్వాల్ అన్నాడు . కలియుగ ఆరంభాన్ని గురించిన అంచనాలు భారతీయ ఖగోళ శాస్ర్తజ్ఞుల కృత్రిమ లెక్కలపై ఆధారపడ్డాయన్నారు . దీని కౌరవ , పాండవ సంఘర్షణలు జోడించారు . మొత్తం మీద కలియుగ భావన నమ్మకంతో అల్లిన కథ మాత్రమే .
ప్రముఖ పాత్రికేయులు ఏ . బి . కె . ప్రసాద్ చేసిన కృషి ప్రశంసనీయం . కేంద్రంలో ఉన్న కమిటీకి నివేదికలు ఇవ్వడం , సచివాలయంలో సంప్రదింపులు జరపడం , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడితేవడంలో ఏ . బి . కె . ప్రసాద్ కీలక పాత్ర వహించారు . ప్రాచీన హోదాకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తూ , తెలుగు భాష ప్రాచుర్యానికి విస్తృతంగా ప్రచారం చేశారు . ఈ మధ్యనే తెలుగు భాషా పతాకాన్ని రూపకల్పన చేసి ఆవిష్కరింపజేశారు . వచ్చేఉగాది నుంచి ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తెలుగువారి ఇళ్ళ ముంగిట ఈ పతాకం రెపరెపలాడాలని ఆయన ఆకాంక్షించారు . సరిగ్గా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం పాచీనహోదా కల్పించడంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది . స్వంత భాషలకు తిలోదకాలిచ్చి నిజమైన అభ్యుదయాన్ని సాధించలేరన్న గాంధీజీ మాటలు తనకు స్పూర్తి అంటారు ఏబికే . ఇప్పుడు రాబోయే 100 కోట్ల నిధుల్ని ఆధునిక తెలుగు భాషా అవసరాలకు సద్వినియోగ పడేలా చూడాలి .
ఇక్కడ ప్రస్తావించిన రెండు సంగతులూ చాలా మటుకు ఒకే రకంగా ఉన్నా , వాటి వెనకాల ఉన్న కారణాలు ఒక్కసారి గమనిస్తే . . మొదటి తల్లి ఈ భవ సాగరంలో తన బిడ్డలను సాకలేక తన బిడ్డలకు మృత్యువుని ప్రసాదిస్తే , మరో తల్లి విషయం గురించి పురాణం తెలిసిన వారిని ఎవ్వరినైనా అడిగితె వివరం అర్దం అవుతుంది . తెలుసుకోవాలన్న కోరిక ఉన్న వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు . తెలిసిన తరువాత అర్దం చేసుకుంటారు . తెలుసుకో్వాలని అనుకోనివారు గంగమ్మ మీద నిందలేస్తూ ఇలాగే ఇక్కడే ఉండి పోతారు .
తన అక్షరాలు పదబంధాలు తేనెలా మంచులా వెన్నెలలా అవసరమైతే అగ్నిశూలాల్లా తన అక్షరాల పదబంధాలు "
తెలుగువారికీ , ముఖ్యంగా తెలుగు బ్లాగరు సోదరులకీ , నేను సంస్కృత / తెలుగు వ్యాకరణాలూ , ఇంగ్లీషు గ్రామరూ బోధిస్తున్నాను అనుకోక , నా చెప్పు ముక్కలు తమ చెవిని వేసుకొని , ఆలోచించమని ప్రార్థన .
ఈ నిజాల్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం కావాలి . గౌరవప్రదంగా కులవ్యవస్థని కొమ్ముకాస్తున్నవాళ్ళకు ఈ వార్తలు అంతగా రుచించవు . ఇందులోకూడా దళితుల రాజకీయ అజెండా , అగ్రకులాలకు వ్యతిరేకంగా ప్రాపగాండా ఉందనగలరు . ఆంధ్రప్రదేశ్ లోనూ ఈ స్థితి ఇలాగే ఉంది అంటే , హైదరాబాద్ దాటి ప్రపంచాన్ని చూడని చాలా మందికి నమ్మకం కలగదు . అలాంటివారు చెయ్యాల్సిందల్లా , తమ కార్లలో అటు లింగంపల్లి , ఇటు రాజేంద్రనగర్ , మరొ వైపు దిల్ షుక్ నగర్ దాటి ఈ కుల వివక్షని ప్రత్యక్షంగా చూడటమే . ఇక నిద్ర నటించేవారిని ఎవ్వరూ కాపాడలేరు . ఈ దేశాన్ని కులవ్యవస్థ / వివక్ష నుంచీ రక్షించడానికి బుద్దుడు , జ్యోతీబాఫూలే , అంబేద్కర్ ఖచ్చితంగా చాలలేదు , ఇక ఎవరొచ్చి దళితుల్ని కాపాడుతారో ! ? !
పద్యం రాతలో కనిపించడానికీ మాటల్లో వినిపించడానికీ మధ్య చాలా తేడా వుంది . ఆనందవర్ధనుడి కాలంలో పద్యం ప్రధానంగా మాటల్లో వినిపించేది . అచ్చుయంత్రం వచ్చేదాకా పద్యం రాతలో కనిపించలేదు . చప్పుడు వినకముందే మాటని కాగితం మీద చూడడం మనకి మాత్రమే సాధ్యపడింది . అచ్చుయంత్రం వచ్చిన తర్వాత వచ్చిన కవిత్వంలోనే శబ్దం అప్రధానమయ్యే పరిస్థితికి అవకాశం ఏర్పడింది . అవకాశం ఏర్పడింది కదా అని దాన్ని వెంటనే అందరూ అందిపుచ్చుకోలేదు . కావ్యంలో శబ్దాన్ని వదిలెయ్య వచ్చునని తెలిసి , అందులో ప్రయోజనం వుందని గమనించి , ఆ అవకాశాన్ని వినియోగించుకున్న కవి మనకి ఇస్మాయిల్ ఒక్కడే .
మరీ ఎంత అభిమాన పత్రికైనా ఈరోజు " ఈనాడు " లో సచిన్ డబుల్ సెంచరీ సందర్భంగా రాసిన వార్త చదవగానే భలే చిరాకేసింది . వార్త మెదటి పేరా చదివి నోరెళ్ళ బెట్టాను . ఆ మొదటి పేరా ఇలాఉంది . " అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ తో మానవాళి చరిత్రను మరో మలుపు తిప్పినప్పుడు , రైట్ బ్రదర్స్ విమానంతో మనిషి ఊహలకు రెక్కలు తొడిగినప్పుడు , నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామ పై తొలిసారిగా కాలుపెట్టినప్పుడు , జిం హిన్స్ వంద మీటర్ల పరుగుకు కళ్ళాలు వేసి తొలిసారిగా పది సెకన్లకంటే తక్కువకి లాక్కొని వచ్చినప్పుడు . . ప్రత్యక్షంగానో . . పరోక్షంగానో అక్షణాలను అనుభవించిన వారంతా పులకించారో లేదో తెలీదు గాని బుధవారం గ్వాలియర్లో సచిన్ సాధించిన వన్డే ద్వి శతకాన్ని కనులారా చూసిన క్రీడా ప్రేమికులు మాత్రం అంతటి మహదానందాన్ని అనుభవించారు " ఏమని పిస్తోంది ? సచిన్ డబల్ సెంచరీ కొట్టాడు . సరే . . సంతోషం . . దాంతో పెన్సిలిన్ , రైట్ బ్రదర్స్ విమానం , నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చందమామలకేం సంబంధం ? జరిగి నలభై యేళ్ళయినా , చందమామ మీద కాలూనడం శాస్త్ర సాంకేతిక రంగంలో ఇప్పటికీ ఒక మైలు రాయి . దానికీ దీనికీ పోలికా ? కనీసం పోలికలైనా అతికేట్టు రాయొద్దా ? జిం హిన్స్ పోలిక ఒక్కటే క్రీడలకి సంబంధించింది . నా దృష్టిలో అదికూడా అస్సలు అతకలేదు . ఎంతమందికి తెలుసు జిం హిన్స్ ? అసలా హెడ్డింగేమిటండీ బాబు , " నీవొక దుర్గం మాకొక స్వర్గం " . . హతవిధీ . . ఇంతకంటే మంచిదేమీ తట్టలేదా ? ప్చ్
చక్కటి కథ , అందరికీ ఎప్పుడో ఓసారి అనుభవమే ఇలాంటివి . కొందరు పార్టీలకి , విందులు వినోదాలకి మనతో కల్సినా , వారు చేయగలిగినా చిన్న సాయం కూడా చేయక పోవచ్చు . ఇంకొందరు సరదాలు పంచుకోటానికి ఆసక్తి చూపకున్నా , ఫార్మాలిటీస్ పాటించకున్నా అవసర మైన సహాయానికి రావచ్చు . ఎవరెలాంటి వారో అనుభవం తరువాతే మనకు తెలిసేది అందుకే మన వాడు పరాయి వాడు అనుకోకుండా మనకి వీలైన వారికి సాయం చేస్తూ పోవటమే .
తొలుత దైతాగోపాలం గారివద్ద , ఆ తర్వాత మల్లాది గారి వద్ద శిష్యరికం చేసి , సంగీత జ్ఞానాన్నీ పదరచనల బాణీల్నీ స్పష్టంగా వంటబట్టించుకొని ఆ బాణీలతో సినిమాపాటకు వోణీలు వేయించారు తీయించారు శ్రీ వేటూరి గారు .
ప్రజలు ప్రజా ఉద్యమాల పొడగిట్టని పాలకులకు కూడా ఇలాటి శక్తులతో వ్యక్తులతో వ్యవహరించడం సులువు . మూలాలను ముట్టుకోకుండా . . ఇంకా
అఘోరాల గురించి చాల బాగా ప్రాజెక్ట్ చేసాడు కాని , దేవత ( జేజమ్మ ) శక్తీ గురించి అసలు చెప్పనే లేదు . ఈ సినిమా వల్ల ఏమైనా సమాజానికీ ఉపయోగాముందా ? కీడు తప్ప . . .
ఇంతలో మూలా అబ్కారీ వ్యాపారం పూర్తిగా దెబ్బతిని పోయి , ఆర్ధికంగా గొప్ప చిక్కుల్లో పడటంతో వాహినీ స్టూడియో మూతబడే పరిస్థితి ఏర్పడింది . ఆ సమయంలో ఆర్ధిక సహాయం చేసిన బి . నాగిరెడ్డికి వాహినీని లీజుకు ఇచ్చారు . తన కలలకు ప్రతిరూపంగా నిర్మించు కున్నానని అనుకున్న స్టూడియో అనూహ్యంగా బి . నాగిరెడ్డి ఆధీనంలోకి జారిపోవడం , దానికి తోడు సినీ నిర్మాణంలో పెరుగుతున్న వేగం , పడిపోతున్న విలువలు , లాభార్జనే ప్రధాన ధ్యేయం కావడం మొదలైన కారణాలతో అయనలో నెమ్మదిగా నైరాశ్యత చోటు చేసుకుంది .
ఆకలి చావులు రచన : ' పద్య కళాప్రవీణ ' డా . ఆచార్య ఫణీంద్ర ప్రొద్దున నిద్ర లేవగనె , పొట్టను గూర . . .
" ఈ లెక్కలు చేసే ఆవిరి యంత్రమొకటి ఉంటే బాగుండు , " అని బాబేజ్ విసుక్కున్నాడు ; హెర్షల్ అది సాధ్యమేనన్నాడు . ఆరు నెలలలో బాబేజ్ ఒక యంత్ర నమూనాని తయారు చేశాడు ! గణించే యంత్రాల కలని సఫలం చెయ్యడం బాబేజ్ జీవితంలో పెద్ద భాగమయింది . యంత్రం తయారీకి ప్రభుత్వం సాయం చెయ్యడం మొదలెట్టింది .
భౌతికత ఆధారంగా వేసే అంచనాలకి , అభౌతికత ఆధారంగా వేసే అంచనాలతో పోలిక పెట్టడం ఏమిటి ? జ్యోతిష్యంలో భౌతిక వాస్తవికత లేదు . జ్యోతిష్యులు చెప్పే ఫలితాలు తప్పు కావడంలో విచిత్రం ఏమీ ఉండదు . టి . వి . చానెల్ సర్వీ తప్పైతే అది సర్వేలో లోపం అవుతుంది కానీ భౌతిక వాస్తవికతలో లోపం అవ్వదు . జ్యోతిష్యానికి భౌతిక వాస్తవిక పునాదులు ( materialistic realistic foundations ) ఉన్నాయని ఎవడూ నిరూపించలేడు . ఈ చాలెంజ్ లో నేను ఓడిపోతే సన్నాసుల ఆశ్రమంలో చేరిపోతాను .
గణితంలో రెండుకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రథాన సంఖ్యలలో ఇదొక్కటే సరి సంఖ్య ; మిగిలినవి అన్నీ బేసి సంఖ్యలే . రెండు ఫిబొనాచీ సంఖ్య . రెండు రెళ్ళని కలిపినా , గుణించినా నాలుగే వస్తుంది . ఇదే విధంగా ఏ అంకెని మూడు సార్లు వేసి కలిపినా , గుణించినా ఒకే సమాధానం వస్తుందో చెప్పుకోండి , చూద్దాం . కావలిస్తే కాగితం , కలం వాడండి .
విషయంలో స్పష్టత రావడానికి ముందే అధినాయకులు వస్తే అనవసరంగా ఫోకస్ అటు మళ్ళుతుందని ఇలాంటి సందర్భాల్లో ఒక స్పష్టత వచ్చేదాకా రారు . ఆ వార్త నిజమయ్యి నిజంగానే వస్తున్నదంటే ఏదో . . . అనిపిస్తోంది .
మన కొత్త తరం బ్యాంకులు విచ్చలవిడిగా " వ్యక్తిగత " , " వాహన " , " క్రెడిట్ కార్డు " ఋణాలిచ్చేసి , వాటి వసూలుకై " గూండాలని " రికవరీ యేజంట్లుగా వినియోగిస్తున్నాయి అని వార్తలు వచ్చినప్పుడే - - గత మూడు సంవత్సరాలుగా నేను టపాలు వ్రాస్తూనే వున్నాను - - ఇండియాలో " లోన్ షార్కింగ్ " మొదలవుతోందనీ , త్వరలో అమెరికా , లాటిన్ అమెరికా , మెక్సికో దేశాల లెవెల్లో కాకపోయినా - - ఇది " మాఫియా " లాంటి వాళ్ల చేతుల్లోకి వెళుతోందనీ !
" పీకల్లోతు కష్టాల్లో భారత్ " , " భారత్ ఘోర పరాజయం " వంటి వార్తలే ఐనా ఎంతో ఆసక్తిగా చదవడం అలవాటయ్యింది అలాగే . అదే అలవాటున ఈరోజు పత్రిక తిరగెయ్యగానే " చాలా వీజీగా … " అంటూ భారత్ - స్కాట్లేండుల మధ్య జరిగిన పోటీ గురించిన వార్త కనపడింది .
మహర్షి అనే రచయిత మరణించి భగవంతుని దగ్గరికి వెళ్తాడు . అక్కడ ఆల్రెడీ తన కన్నా ముందు వచ్చిన ఒక నలుగురిని భగవంతుడు చెడామడా తిడుతుంటాడు . ఆ నలుగురూ జనాల సొమ్ము ని విపరీతంగా దోచుకుని నాలుగైదు తరాలకి విచ్చలవిడి గా ఖర్చు చేయడానికి సరిపడా సంపాదించిన - ఒక రాజకీయ నాయకుడు , ఒక కాంట్రాక్టర్ , ఒక మాఫియా లీడర్ , ఒక ప్రభుత్వ అధికారి . భగవంతుడు వాళ్ళ తో " మీరు మీకు , మీ పిల్లలకి సంపాదిస్తే చాలు . కానీ మీ మనవళ్ళకి , ముని మనవళ్ళకి సంపాదించవలసిన అవసరం ఏంటి ? అది కూడా జనం ఉసురు పోసుకుని జనం సొమ్ము దోచిపెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏంటి ? మీరు సంపాదించి పెట్టిన సంపద ను ఇప్పుడు భూమి మీద మీ మూడో తరం ( మనవళ్ళ కొడుకులు / కూతుళ్ళు ) అనుభవిస్తున్నారు . మీరు సంపాదించిపెట్టిన భిక్ష ని అనుభవిస్తున్న వాళ్ళలో ఏ ఒక్కరి దగ్గరయినా కనీసం మీ ఫోటో వుంటే వెతికి పట్టుకుని తీసుకు రమ్మని అలా తీసుకు వస్తే శిక్ష తగ్గిస్తానని " సవాల్ చేస్తాడు . నెల రోజులు గడువిస్తాడు . నెల తర్వాత తాము సంపాదించినది అనుభవిస్తోన్న తమ వారసులకి ఎవరికీ తాము ఎవరో , ఎలా వుంటామో కూడా తెలీదని , ఒక్కరు కూడా కనీసం తమ ఫోటో దాచుకోలేదని తెల్సుకుని తీవ్ర నిరాశ తో భగవంతుని వద్దకి తిరిగి వచ్చి తాము గడిపినది నిరర్థకమయిన జీవితం అని అంగీకరిస్తారు . ఇక మహర్షి సంగతి . కీర్తి కండూతి లో పడి జీవితం లో ( భార్య తో సహా ) చాలా కోల్పోయిన ప్రతిభావంతుడైన రచయిత మహర్షి . భగవంతుడు అతనికి అప్పగించిన పని ప్రస్తుతం భూమి మీద వున్న భరద్వాజ అనే మరో ప్రతిభావంతుడైన రచయిత తో ముడిపడి వుంది .
ఉపసంహారం : - ఈ నా వ్యాసంలో చర్చించిన అంశాల్లో కులాలు గురించి మాట్లాడటం జరిగింది . ప్రతి కులంలోనూ వారు ఎక్కువ , వీరు తక్కువ అనే అంశం వుండనే వున్నది . ఇది నేను నా అనుభవపూర్వకంగా గమనించింది , తెలుసుకున్నది . ఈ విధంగా వున్నదని చెప్పటానికేతప్ప , ఏ కులంవారినీకూడా కించపరచాలనే ఉద్దేశంతో చేసినవికాదు నా వ్యాఖ్యలు . " కులరహిత సమసమాజం " ఏర్పడలాని కోరుకునే వారిలో నేనుకూడా ఒకడినని మాత్రం ఈ వ్యాసంద్వారా తెలియచేస్తున్నాను .
ఇన్ని పుస్తకాలొచ్చి ఒళ్ళో వాలితే అది అదృష్టం కాక మరేమిటవుతుందమ్మా , చోద్యం కాకపోతేనూ ! హాయిగా ఇష్టమైన పుస్తకం చదువుకోవడంలొ మునిగి ఉన్నపుడు ఇంద్రుడొచ్చి స్వర్గానికి బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి రమ్మన్నా " చేయి ఖాళీ లేదు , రేపు రా పో " అని పంపేస్తా ! మీ అదృష్టానికి అభినందనలు
గూగుల్ మొదలుపెట్టిన పథకం ఒక రకంగా మంచి పథకమే . కోట్లకొద్దీ జనానికి మరో ప్రచురణకి నోచుకోని లక్షల కొద్దీ పరిశోధన గ్రంథాలు అందుబాటులోకి వచ్చేవి . రచయితలకి డిజిటల్ పుస్తకాలు ' అమ్ముడు ' పోవడం మూలంగా డబ్బులొచ్చేవి . కొద్ది రుసుము కట్టుకుంటే గ్రంథాలయాలకి లక్షల గ్రంథాలు అందుబాటులో వుండేవి .
అష్టావధానంలో పద్యాలు చెప్పటంతో సంబంధం వున్న మిగిలిన అంశాలు నిషేధాక్షరి , న్యస్తాక్షరి , ఆశువు , వర్ణన . వీటిలో వర్ణన , ఆశువు గురించి ప్రత్యేకంగా మాట్టాడవలసిన విషయాలేం లేవు యిచ్చిన " వస్తువు " ( topic ) గురించి అడిగిన ఛందంలో ఓ పద్యం చెప్పటమే రెంటిలోనూ జరిగే పని . అవధాని మంచి మూడ్లో వుంటే ఆ పద్యాల్లో ఏవైనా మంచి పదాలు , భావాలు , చమత్కారాలు చొప్పించటానికి ప్రయత్నిస్తాడు . లేకుంటే ఏదో పని జరిగిందనిపిస్తాడు . అలాగే న్యస్తాక్షరి కూడ నూటికి తొంభై పాళ్ళు పెద్ద కష్టం కాదు పృఛ్ఛకుడు సామాన్యంగా నాలుగు అక్షరాలు ఇచ్చి , ఏ అక్షరం ఏ స్థానంలో ఉండాలో అడుగుతాడు ( నాలుగే అక్షరాలని నియమం లేదు , ఏడెనిమిది దాకా కూడా ఇవ్వొచ్చు ) . ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , అక్షరాల్ని ఎన్నుకోవటంలో పూర్తి స్వతంత్రం ఉన్నా ఎందుకనో చాలా మంది పృఛ్ఛకులు ఏమాత్రం కష్టం లేని వాటిని ఇస్తారు .
కన్యాశుల్కం , వరవిక్రయం , గణపతి నాటకాలు సి డి లరూపంలో ఆకాశవాణి విజయవాడ ప్రాంగణంలో ఉన్న చిన్న షాపులో అమ్ముతున్నారు .
పడుకోడానికి ఇంత నేల ఉండగా తల్పాలూ శయ్యలూ కావాలా ? తినడానికి దేవుడిచ్చిన చేతులుండగా బంగారూ , వెండీ పళ్ళాలు కావాలా ? నార చీరలూ , పట్టలూ ఉండగా పీతాంబరాలు అవసరమా ? ఉండటానికి గుహలుండగా ఆశ్రమాలూ ప్రాసాదాలూ అవసరమా ? తినేందుకు చెట్లు పండ్లిస్తుండె , తాగేందుకు నదులు నీరిస్తుండె . ఇంటింటా ఉండే పుణ్య గృహిణులు భిక్ష పెడతారాయె . తపసు చేసుకునే వారికి ఇంకేం కావాలి ? ధనమదంతో కళ్ళు కనిపించని వారిని ఎందుకు ఆశ్రయించాలి ? ఇదీ పద్య భావం .
సింప్లీ సుపర్బ్ . ఏం చెప్పాలండి బాబూ . . . తొందరగా ఇంకో బ్రేకింగ్ న్యూస్ తో రెడీ అయిపోండి సార్ . అదిగో , ఆ చానల్ వాళ్ళేదో చూపించేస్తున్నారు . ఒక న్యూస్ కి రెండు న్యూస్ లు ఫ్రీ . Common , get ready : )
మన దేశ జనాభాలో పట్టభద్రులు 0 . 5 % . వీరిలోనే సగం మంది ఏ విధమైన ఉద్యోగానికి పనికిరాని వారు . మిగిలిన 0 . 25 % మందిలో ఇంటర్నెట్టు ఉపయోగించడం తెలిసినవారు కేవలం 5 % , అంటే మొత్తం జనాభాలో 0 . 01 % అన్నమాట . దేశంలో సాఫ్టువేరు పరిశ్రమ వెలుగు జిలుగులు చూసి సంబరపడిపోయేముందు తెలుసుకోవలసింది ఏమిటంటే ఇది ఉపాధి కల్పించేది కేవలం 0 . 01 % జనాభాకి అని . రాబోయే పదేళ్ళలో కంప్యూటరు పరిశ్రమకి సరిపడే మనుషులు దొరక్క కంపెనీలన్నీ ఫిలిప్పీన్సు , చైనా లాంటి దేశాలు తరలిపోగలవని నాస్కాం ఇప్పటికే హెచ్చరికలు మోగిస్తోంది . మనుషుల కొరత వలననే సాఫ్టువేరు కంపెనీ ఉద్యోగుల జీతాలు కూడా అసాధారణంగా 20 % పెరుగుతున్నాయి .
యుద్ధమొచ్చింది . చాలా మంది డబ్బు చేసుకునే దార్లు చూసుకుంటుంటే మా వాళ్ళు మాత్రం తాకట్లు వాకట్లవుతున్నా , ఆస్థులు హరిస్తున్నా పద్ధతులు మార్చుకోకుండా ఎప్పుడూ ఒకలాగే ఉండాలనే భ్రమల్లో ఉండే వారు .
కారల్ మార్క్స్ సింద్ధాంతానికి పెద్దపీట వేసినవారిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ కథా రచయిత చాసో . చాసో కథల్లో ఆర్థిక అంశాలే ప్రధానం . ఆర్ధిక విషయాలు ఒక్కొక్కళ్ళతో ఎటువంటి పనులు చేయిస్తాయో . . . . వారిని ఎలా తయారు చేస్తాయో చాసో తన కథల్లో చక్కగా చూపెట్టారు . వ్యక్తి జీవితంలోని సమస్త విషయాలను నిర్దేశించే బలీయమైన శక్తిగా ఆర్ధికాంశాన్ని వివిధ కోణాల్లో శక్తివంతంగా తన కథల్లో వ్యక్తీకరించారు చాసో . వ్యక్తుల సామాజిక , నైతిక ప్రవర్తని ప్రభావితం చెయ్యడం మాత్రమే కాక , మనుషులలో ఉండవలసిన మానవత్వాన్ని కూడా నియంత్రించే ఆర్థిక సత్యాలను తన కథల్లో బలంగా చూపెట్టారు . జీవితానుభవం నుంచి సాహిత్యం పుట్టాలి అని బలంగా నమ్మిన వారిలో చాసో ఒకరు . వ్యాఖ్యానాల ద్వారా సిద్ధాంతాలు వల్లించకుండా , పాత్రల ద్వారా సందేశాన్ని అందించడంలో చాసో దిట్ట . చాసో కథల్లో పాత్రల స్థితి గతులు చదువరుల కళ్ళ ముందు కనబడతాయి . వాటి జ్ఞాపకాలు కదిలిస్తాయి . శ్రామికులు పేదరికాన్ని ఆసరా చేసుకుని జేబులు నింపుకునే దుర్మార్గం , రెక్కలు , ముక్కలు చేసుకుని గుక్కెడు మంచినీళ్ళకు సంతసించే అమాయకత్వం , పేదరికం కారణంగా ఎదురయ్యే ఆటంకాలను అధిగమించలేని ప్రతిభ , సామాజిక గౌరవానికి అడ్డు నిలవలేని అక్రమ సంపాదన చాసో కథల్లో చోటు చేసుకుని ఆలోచనలు రేకెత్తిస్తాయి . కుంకుడాకు , ఏలూరెళ్ళాలి , లేడీ కరుణాకరం , ఎంపు మొదలగు కథలన్నీ ఇందుకు నిదర్శనాలే . చాసో రాసిన కథలు చాలా తక్కువ . కానీ ఆయన రాసిన ప్రతీ కథా మాత్రం ఓ అధ్బుతం .
" ఏముంది , నా గురించి ? " నెమ్మదిగా శ్రావ్యమైన లోగొంతుకతో ప్రశ్నిస్తున్నట్లుగా సమాధానమిచ్చింది . ఆమె మాట్లాడటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించినట్టుగా తల తిప్పి ఆమె కేసి చూసాడు అతను .
2జీ కేసు విచారణలో భాగంగా సీబీఐ డైరక్టర్ ఏపీ సింగ్ గురువారం పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ( పీఏసీ ) ముందు హాజరయ్యారు . వివాదస్పద 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించిన ఆధారాలను కమీటీకీ సీబీఐకి ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు . కేంద్ర దర్యాప్తు సంస్థ 2009 అక్టోబర్ నుంచి జరిగిన 2జీ కేటాయింపుల గురించి దర్యాప్తు చేస్తోన్న సంగతి తెలిసిందే . గత కొన్ని నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో భాగంగా 2జీ స్పెక్ట్రమ్ స్కామ్లో మాజీ టెలికామ్ మంత్రి ఏ . రాజా అరెస్ట్తో పాటు నలుగురి పాత్ర కూడా ఉన్నట్లు బహిర్గతం చేసింది . సీనియర్ బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మురళీ మనోహర్ జోషి నేతృత్వంలోని దర్యాప్తు సంస్థ . . పీఏసీ మాజీ టెలికామ్ కార్యదర్శులు యస్ . యస్ బెహురా , డీయస్ మాధూర్ , మాజీ ట్రాయ్ ఛైర్మన్ ప్రదీప్ బైజాల్ , మాజీ టెలికామ్ కమీషన్ సభ్యుడు ( ఆర్ధిక ) మంజూ మాధవన్ , రిజర్వ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావ్ల నుండి ఆధారాలను సేకరించింది .
" వెనుక టైర్లో గాలి చాలా తక్కువగా వుంది . డబుల్స్ ఎక్కితే ఢామ్మని ట్యూబ్ పేలిపోతుంది … . " అంటూ తన నిస్సహాయతను వెల్లడించి అతని సమాధానం కోసం ఎదురుచూడకుండా వెళ్ళిపోయాడు . బడ్డీ యజమాని .
' ఆ చెక్కు మనకి సరస్వతీ వయోజనవిద్యా సహాయ సారణి పేర్న అందించారండి . దాంతో వారికి స్వచ్ఛందసేవా శిరోమణి , సహృదయదయనీయ స్వభావప్రవీణ అనే అదనపు బిరుదులు కూడా ఇవ్వాలని నిర్ణయించిందండి మా బోర్డు . '
అహా ఎన్నాళ్ళకెన్నాళకు మన స్టయిలిష్ బ్యాట్స్ మెన్ లక్ష్మణ్ కు జట్టు లో అవకాశం వచ్చింది . అన్నీ వుండి ఒక్క గాడ్ ఫాదర్ లేక పోవడం వల్ల జట్టు లో స్థానం ఎప్పుడూ కొల్పోవాల్సి వచ్చేది . తన కు స్థాన రావాలంటే తను చేసిన సెంచురీలూ ఏవీ తన సహాయం చేసేటివి కాదు . ఇక తప్పదనుకున్న పరిస్థితులలో జట్టు లోకి తీసుకునేవారు . ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ వా , రికీ పాంటింగ్ ఎప్పుడే అనేవాళ్ళు " అదేంటో గానీ ఇక్కడ ఆస్ట్రేలియా కొచ్చి బాగ ఆడి ఇండియా వెళతాడు . అక్కడి కెళ్ళిన తరువాత ఎందుకు తీసేస్తారో అర్థమయ్యేది కాదు " అని . ఇది ముమ్మాటికి నిజం . తను జట్టు లోకి రావాలంటే కౌంటీ మ్యాచుల్లో ఎప్పుడూ సెంచురీలు కొడుతూనే వుండాలి . లేక పోతే సీటు గోవిందా . ప్రపంచంలో అగ్రగణ్యులైన బ్యాట్స్ మెన్ బ్రాడ్ మెన్ , వివియన్ రిచర్డ్స్ మరియూ సునిల్ గవాస్కర్ లాంటి వాళ్ళచే టెక్నికల్ బ్యాట్స్ మెన్ గా కొనియాడబడిన మన తెలుగు క్రికెటరుడిని జట్టు లోకి తీసుకోక పోవడం సర్వాదా శోచనీయం . మనకున్న కొద్ది మంది టెక్నికల్ బ్యాట్స్ మెన్ లలో ఒకడైన దిలిప్ వెంగసర్కార్ ( ప్రస్తుతం సెలక్షణ్ బోర్డ్ చైర్మన్ ) కూడ లక్ష్మణ్ ను పక్కన పెట్టడం విచారకరం . మన తెలుగు పత్రికలు కూడా మన సొగసరి బ్యాట్స్ మెన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు . ఈ విషయంలో బెంగాలీలు , ముంబయ్యీలు కన్నా మనం చాలా వెనకబడి వున్నాం . ఆ ప్రదేశం నుండి వచ్చిన వాళ్ళు ఎన్ని సున్నాలు కొట్టినా గింగిరాలు తిరుగుతు మళ్ళీ జట్టు లోకి వచ్చేస్తారు . మనవాడు ఒక్క సారి సున్నా కొడితే చాలు భవిష్యత్తు శూన్యం చేసేస్తారు . ఎదయితేనేం మన తెలుగు బిడ్డడికి మొదటి సారిగా వైస్ కేప్టన్ గా కూడ అవకాశం వచ్చింది . ఎప్పుడో రావాల్సిన అవకాశం ఇప్పటికైనా వచ్చింది . ఈ వచ్చిన సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టు లో స్థానాన్ని పది కాలాల పాటు కాపాడుకుంటాడని అందరం ఆకాక్షింద్దాం . తెలుగు ( దిన ) పత్రికలూ ! మన వెరీ వెరీ స్టయిలిష్ లక్ష్మణ్ కు ఇవ్వాల్సిన స్థానాన్ని మరిచిపోకండి . లక్ష్మణ్ ! గుడ్ లక్ . మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు . నీ లెగ్ వర్క్ , ఫుట్ వర్క్ , మణి కట్టు మాయాజాలాన్ని మరొక్క సారి ఆఫ్రికా గడ్డ మీద మాకు కనువిందు చెయ్ .
బాగా చెప్పారుయ్ . మన దైర్భాగ్యం . చేసేదేమీ లేదు . ఓటు జాగ్రత్తగా వెయ్యటం తప్ప .
" ఏమిటీ మీ ఇద్దరూ ఒకరికొకరు ముందే తెల్సా ? " అడిగేడు నవీన్ . వనజ కూడా క్యూరియాసిటి అణుచుకోలేనట్టు చూసింది .
బాసూ ఇది విను ఏంటి పళ్ళవైద్యుడికాడికి బొయ్యా ఓహో ! ! ఏంఇటంటాడు వాడు అదోపెద్ద గాధ నాయనా ఇవరంగా సెప్పు - తలుపులు తీపించినా ఆశుపత్రి ఊడ్చేవాళ్ళు లైటు పంఖా ఏసిపొయ్యారు ఇక డకటేరు కోసం కూకొని కూకోని కాళ్ళు లాగేసినై అయ్యిందా , ఉండు ఉండూ ఇంకా కాలా ! ! అప్పుడొచ్చాడు డాకటేరు . లోనకి బైటికి లోనకీ బైటికీ తొంగి సూట్టం తలుపులేస్కోటం . మొత్తానికి పిలిసాడు లోనకి ఎళ్ళా , కూకున్నా నోరు తెరు అన్నాడు తెరిసా నరుసుని పిలిసాడు ఏదో సూపించమన్నాడు సేయిపెట్టిసూపించబోయింది నీఎంకమ్మ , గ్లౌజులేస్కురా అని అర్చాడు సరే అయ్యింది , లేచాను , ఇంతలో నెక్స్ట్ పేషంటు , వచ్చి కూకుంది , డాక్టరు , నే పారిపొయ్యి వచ్చా . అదీకధ . . . . .
ఒకసారి ఎవర్తోనో గుర్తు లేదు కాని మరీ లోన్లీ గా వుంది అంటే ఇలా బ్లాగుల గురించి చెప్పాను . . నీకు తోచింది . . నీవనుకొన్నది . . . . చక్కగా రాసుకొని నలుగురితో షేర్ చేసుకో అని . . అమ్మో ! ! . . అలా డైరెక్ట్ గా ఎలా రాస్తున్నావే బాబు . . . నువ్వు . . ముందు అలోచించాలి . . తరువాత ఒక పేపర్ మీద ఆ తరువాత ఎడిట్ చెయ్యలి అప్పుడు కదా . . బ్లాగ్స్ అవీ అంటూ చెప్తే అవునా ! ! నిజమా అనిపించింది . . . అంత శ్రమ ఎప్పుడూ పడలేదు నేను . . . ఇలా అనుకొవడం అలా టైప్ చెయ్యడం . . కాని ఇప్పుడు ఈ స్నేహంగురించి రాయడానికి ఎంత ఆలోచించాల్సివస్తోందో . . . ఎవరు ఎలా అ ( పా ) ర్దం చేసుకొని నా మీదకి దండయాత్ర చేస్తారో అన్న భయం వుంది కూడా . . ముఖ్యంగా అజ్ఞాత వ్యక్తుల దాడి ఎదుర్కోవడం కొంచం కష్టమే . . . . అయినా ఎవరిని నొప్పించకుండా . . . ఇష్టంగా . . . నా అభిప్రాయాలు వెల్లడించడానికి సిద్దమవుతున్నాను . . మరి మీరు ? ? ఈ మధ్య ఈ స్నేహం గురించి బాగా వింటున్నాను . అసలు దీని అర్ధం ఏంటో కాని . , నాకొక్కటి అనిపిస్తుంది . నా కుటుంబం , నా పిల్లలు , నా బంధువులు , అన్నీ " నా " అనుకొనే వ్యక్తులకి ( స్త్రీ / పురుషుడు ) స్నేహం ఎంతవరకు అవసరము ? ? ఎంతో మంచి నడవడిక , మంచి ప్రవర్తన , అమ్మాయిలంటే గౌరవం , మంచి హొదా కలిగిన ఒక పై అధికారి " నేను చాల అలిసి ( విసిగి ) పోతున్నాను , నాతో ఎవరు మాట్లాడినా వ్యాపారాత్మక దృష్టితోనో లేక ఇంకా ఏదన్నా అవసరంతోనో మాట్లాడుతున్నారు . నాకో స్నేహహస్తం కావాలి " అని తనదగ్గర పని చేసె అమ్మాయితో అంటే . ఆమె ఎలా ప్రతిస్పందిచాలి ? ? అతని వ్యక్తిత్వం తెలుసు , మంచి హొదా కలిగిన వ్యక్తి . , మంచివాడు . , " నేనున్నాను " అని చెప్పి అతనితో స్నేహం పంచుకొగలదా ? ? ఇది నిజమయిన స్నేహం అన్న నమ్మకం ఎంతవరకు ? ? వద్దు అంటే . . తనేమన్నా మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ వుంటుందా ? ? ఎటూ తేల్చుకొలేని ఈ సందిద్గావస్థ కన్నా పెద్ద జంజాటం ఇంకోటి వుండదనిపిస్తుంది . ఒక పక్క ఉద్యోగం . . ఇంకో పక్క స్నేహం అంటూ తన పై అధికారి . . ఈ సమస్య నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆలోచించేది ఒక ఆడదానిగా కాబట్టి సలహా కూడా ఒక ఆడదనిగానే ఇవ్వగలను . . అంతే సున్నితంగా పరిష్కారం ఆలోచించగలగాలి కూడా . . పైగా అవతలి వ్యక్తి గురించి నాకు అసలు తెలీదు మరి అలాంటప్పుడు సలహా అనేది నేను ఈ ఒక్కరివైపో ఎలా ఇవ్వగలను ? ? అయినా వీళ్ళకి ( పై అధికారులకి . . అసలు మగవారికి ) ఈ ఆలోచనలెందుకసలు ? ఈ స్నేహాలు అవసరమా ? ? మనసు ప్రశాంతత కావాలి అంటే మార్గాలు అనేకం . . . కుటుంబం తో గడపొచ్చు . పోని ఒక ఫామిలి ఫ్రండ్ గా ఈ అమ్మాయిని తన ఫామిలి కి పరిచయం చేస్తాడా . ? లేదు . . ఒక రహస్య స్నేహుతురాలిగా వుండాలి . . . తన కింద పని చేసే అమ్మాయి గానే గా ఈమెకి గుర్తింపు మరి . . . . ఇది ఎంతవరకు సమంజసం ? ? ఇందులో ఏదో స్వార్ధం కనపడ్తోంది . . . . అలా చెప్తే నాణేనికి ఇంకోవైపు . . చూడలేదు నేను . . అన్న స్పందన వస్తోంది నాకు . . . మంచివాడు . . ఎప్పుడు మిస్ బిహేవ్ చెయ్యలేదు ( తరువాత చేస్తే ? ? ) ఇప్పుడీ మధ్యవయసులో ఉద్యోగం పెద్ద సమస్య . . నాకెప్పుడో టీనేజ్ క్రేజ్ లో ఉన్నప్పుడు జరగాల్సినవి ఇప్పుడేంటి నా మైండ్ ని డైవర్ట్ చేసుకోలేకపోతున్నాను అని ఆ అమ్మాయి ఆలోచనలు . . అవునంటే ఒక ప్రాబ్లం . . కాదంటే ఇంకో ప్రాబ్లం . . ఒ . కే అంటే అది ఒక కమిట్మెంట్ అన్న భయం . . వెరసి ఈ మధ్యవయసులో ఇవి అవసరమా అనే సంధిద్గావస్థ . . . నిజమే ! ! మధ్యవయసులో వున్నవారికి స్నేహం అనేది చాల అవసరం . . నా ఇంకో స్నేహుతురాలు నాలాగే ఆలోచిస్తుంది . . అంతే ఆడదానిలా లేదా సమ వయస్కురాలిగా . . . మన సమస్య గాని . . మన బాధ కాని లేక మన సంతోషం గాని ఒక స్త్రీ గా కొంచం అసూయతో అర్ధం చేసుకొంటుంది . . లేదా అపార్ధం చేసుకొంటే నాలుగు తిట్లు తప్పవు . . . అలాగే ఒక మగవాడికి ఇంకో మగ స్నేహుతుడు కూడా అలాగే స్పందించగలడు . . . కాని తన సున్నితత్వం తన బాధ తన సుఖం పంచుకోడానికి ఒక తోడు / స్నేహం కావాలి ఇద్దరికి . . . విజాతి దృవాలు ఆకర్షించుకొంటాయి అన్నట్లుగా . . . అందుకే పెళ్ళి అనే బంధం అని అనిపిస్తుంది నాకు . . . కాని పెళ్ళి తరువాత ప్రతివారికి తన పార్ట్ నర్స్ కి కూడా చెప్పుకోలేనివి . . . . పంచుకోలేనివి . . చెప్పడానికో . . ప్రశాంతత కోసమో స్నేహం కావాలి అని అంటూ ఉంటారు . . . ఎలా నమ్మడం . . ఇలాంటి వాటికి ముగింపు కూడ కష్టమే కదా . . అందుకే నాకనిపిస్తుంది . . . ఇలాంటి వాటి దరి చేరకుండా స్వార్ధం వుండాలి అని . . నా కుటుంబం . . నా పిల్లలు . . మొ ! ! నేను ఏమి చెయ్యను అంటూ నా చిన్ననాటి స్నేహుతురాలి 15 పేజీల ఉత్తరానికి ముగింపు లేని టపా ఇది . . నేనేమి సలహ ఇవ్వలేని పరిస్థితి నాది . . . నాకే అర్ధం కావడం లేదు . . ఇలాంటప్పుడు మంచి చెప్పినా ఇబ్బందే . . కీడెంచినా ఇబ్బందే . . . సలహా ? ? . . . హు ! ! . . ఒక స్నేహుతురాలిగా ఆలోచించలేకపొవడమే నా అసమర్ధత . . ఇక సలహా ఇవ్వగలిగేంత గొప్పతనం . . . ( అతని హొదా స్థాయి కి గాని ఈమె ఆలోచనల స్థాయికి గాని చేరుకొనే సామర్ధ్యం ) నాకుందా ? ? అనిపిస్తుంది . . మరి మీరేమంటారు ? ?
ఇక నాలుగవ రకం : మన అహానికి మనం బానిసలం . నేను ప్రతివానికన్నా భిన్నంగా కనపడాలి . నేను అందరికంటే అధికుణ్ణి . నేను అందరికంటే ముందుండాలి . నేను చెప్పినట్లు ఇతరులు వినాలి . నా ప్రత్యేకతను నేను కాపాడుకోవాలి . నేను సుఖంగా ఉండాలి . దానికోసం ఎందరు ఏమై పోయినా పరవాలేదు . నా పని నాకు ముఖ్యం . ఇలా " నా " , " నా " , " నా " అనుకుంటూ నా అహానికి నేను బానిసగా మిగులుతున్నాను . నా " అహం " తృప్తి పడటం కోసం నేను ఏపనైనా చేస్తున్నాను . జీవితమంతా దాస్యం చేయించుకున్న ఈ అహం మరణంలో ఏమౌతుంది . ఎక్కడికి పోతుంది . అన్న ఆలోచన మనకు రాదు . ఒక్కసారిగా పేలిపోయి అదృశ్యమై పోయే ఒక నీటి బుడగకోసం నా జీవితమంతా దానికి దాసోహం అంటూ ఊడిగం చేస్తున్నానా ? నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చిన ఈ జన్మను వృధాగా గడిపి పరీక్షలో ఓడిపోయినవానిగా నిష్క్రమిస్తున్నానా ? ఏమిటీ విచిత్రం ? ఏమిటీ బానిసత్వం ? అన్న ఆలోచన మనకు రాదు .
శంకరుడు లఘు స్తోత్రములనుండి బృహద్గ్రంథముల వరకు సుమారు నాలుగు వందల రచనలను సృష్టించెను . నేను అందులోని కొన్ని ప్రార్థనా స్తోత్రములను ఆధారము చేసికొని ఈ వ్యాసమును వ్రాయుచున్నాను .
జగన్ రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్వహిస్తారని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు . . .
సింధు లోయ నాగరికత లిపి ఇంతవరకు సరిగా చదువబడలేదు . వేదసూత్ర వాఙ్మయం కేవలం మౌఖికమో , లేక అక్షర బద్ధం కూడా అయిందో తెలియరావడంలేదు . కనుక అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది . అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినాయనిపిస్తుంది . [ 10 ] కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము , అశొకుని ఎఱ్ఱగుడిపాడు ( జొన్నగిరి ) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు . వాటిలోని భాష ప్రాకృతము , లిపి బ్రాహ్మీలిపి .
కేవలం ఉద్యోగధర్మం నెరవేర్చే వరకు ఒకలాగా , మిగతా సమయాల్లో మరోలాగా ఉండే వ్యక్తులు అక్కడక్కడా కనబడుతుంటారు . కొందరి వ్యక్తిగత ప్రవర్తన , నిర్ణయాలు సంస్థకు నష్టం చేకూర్చే విధంగానూ ఉంటుంటాయి . ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి . వ్యక్తిగతంగా మంచివారై ఉన్న వ్యక్తులే వృత్తిపరంగా కూడా మంచిదారిలోనే నడుస్తుంటారు . కాబట్టి ప్రతిఒక్కరూ ఎవరికి వారు తమతమ బిహేవియర్ ఎలా ఉండాలో ? ఎలా ఉంటే ఉపయోగమో తెలిసి మసలుకోవాలి .
ఆదాయం లేని పరాయి చోట వుండి ఏం చేస్తాం ? ఇక్కడికి తిరిగొచ్చేశాం . పట్టుకున్న కొత్త అలవాట్లు
వాతావరణం లేని కథ నీలోని కల్పనాశక్తిని తట్టిలేపదు . నానా వాదాలు ( కమ్యూనిజం , ఫెమినిజం , వల్లకాడిజం ) తాకేది బుద్ధిని . కథలో ఏ పాత్రకైనా పూనకం వచ్చినట్టు నానా వాదాలను ఏకరువు పెడితే రసాభాసయిపోతుంది . గొప్ప కథను , మామూలు కథను విడదీసేది , ఈ వాతావరణ కల్పనే . పా . ప , కొ . కు ల కథలను విడదీసేది ఈ లక్షణమే . పా . ప కథలు మనలోతులని తడుముతాయి . కొ . కు కథలు పైపైనే తారాట్లాడుతాయి . ఇద్దరు వారి వారి ఫాయాలో గొప్ప రచయితలే . కొ . కు మంచినీళ్ళ ప్రాయంగా కథారచన చేసినా , ఒక గొప్ప పాత్రను మన కళ్ళముందు నిలపలేక పోయాడు . వేలాది పుటల్లో విస్తరించిన ఆయన కథలు చదివి , పుస్తకం మూసి , కనులు మూసుకుంటే బలంగా మనసు పొరల్లో చొచ్చుకుపోయే పాత్రలు తక్కువ .
తల్లి ఎవరికైనా ఒక ఎటర్నల్ ఫాసినేషన్ . బహుసా అందుకే తల్లులపై ఎక్కువ కవిత్వం ఉంటుంది . తండ్రులపై అంతటి ప్రభావవంతమైన సాహిత్యం తక్కువే . దీనికి మరో కారణం మెజారిటీ సాహిత్యం పురుషులే సృష్టించటం జరిగింది కనుక . తనగురించి తాను వ్రాసుకోవటం మోడెస్టీ కాదుకనక ఉండకపోవచ్చు . స్త్రీలు సృష్టించిన స్త్రీవాద సాహిత్యాన్ని కొద్దిమంది విమర్శకులు తప్ప మెజారిటీ పాఠకులు ఆదరించారు , అభినందించారు . దీనిలో అక్కడక్కడా తండ్రి పాత్రపై కొన్ని కవితలను ఉన్నాయి . చాలా మంచి సాహిత్యంతో ఉన్నవి . ఇక మీ వ్యాసంలో కనిపించిన మరో ప్రధాన అభియోగం మాతృత్వాన్ని గ్లోరిఫై చేయటం . అవును ఇది జరిగింది జరుగుతుంది . ఫిసికల్ గా తల్లి బిడ్డలనుంచి ఆశించేది తక్కువే , కానీ ఇచ్చింది మాత్రం చాలా చాలా ఎక్కువ . ఆ ఋణాన్ని ఇలా గ్లోరిఫై చేయటం ద్వారా తీర్చుకొంటున్నారేమో . మరొక వాదన ఇప్పుడు గ్లోరిఫై కానివేమున్నాయి ? ప్రేమ ను గ్లోరిఫై చేసి , వాలెంటైన్ పేరుతోనో , గ్రీటింగ్ కార్డులపేరుతోనో కోట్ల వ్యాపారం జరగటం లేదా . పది సినిమాలలో 8 సినిమాలకు ప్రేమ ఆధారం కాదా ? ఎంత వ్యాపారం దాని వెనుక . రాఖీ పండుగలు , అక్షర తృతీయలు వంటివన్నీ గ్లోరిఫైడ్ మార్కేట్ టెక్నిక్స్ కాదా ? కత్తి గారు అన్నట్లు బహుసా నాకామెంటు కూడా అర్ధం కాకుండా తయా్రయిందేమో ! బొల్లోజు బాబా
మీ పాప అల్లరి పాప ఎవరు చెప్పింది ఎవరు . . . : )
మెగాస్టార్ చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు సోమవారం తెల్లవారుజామున హృదయసంబంధిత వ్యాధితో కన్నుమూశారు . క్రమశిక్షణకు మారుపేరైన వెంకట్రావు మృతి చిరజీవి కుటుంబాన్ని తీవ్ర దుఖఃసాగరంలో ముంచెత్తింది . రాష్ట్ర ఎక్సైజ్ విభాగంలో ఎస్ఐగా పనిచేసిన వెంకట్రావు ప్రతి చిన్న విషయాన్ని నిశితంగా విశ్లేషించి , చక్కని నిర్ణయాలు తీసుకునేవారు . గత రెండుమూడు నెలలుగా అస్వస్థకు లోనైన వెంకట్రావును స్థానికంగా ఉన్న ఒక కార్పోరేట్ ఆస్పత్రిలో చేర్చారు . ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు . చిరంజీవి తండ్రి కన్నుమూశారని వార్త తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , చిరంజీవి అభిమానులు జూబ్లీ హిల్స్లోని చిరంజీవి నివాసానికి చేరుకుని తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ చిరు కుటుంబసభ్యులను ఓదార్చారు . కాగా వెంకట్రావుకు భార్య అంజనీదేవీ , కుమారులు చిరంజీవి , నాగేంద్రబాబు , పవన్ కళ్యాణ్ , కుమార్తెలు విజయదుర్గ , మాధవిలు ఉన్నారు . పశ్చిమగోదావరి జిల్లా పెనుకొండలో జన్మించిన వెంకట్రావు అదే జిల్లాలో ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్గా చేసి , నెల్లూరు జిల్లాలో ఎస్ఐగా పదవీ విరమణ చేశరు . ప్రతి ఒక్కరితో కలుపుగోలుతనంగా ఉండే వెంకట్రావు మృతి సినీ రంగానికి చెందిన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేసింది .
రెండ్రోజుల తరువాత కానీ రామేశ్వరం వెళ్ళే పడవలో చోటు దొరకలేదు నాకు . ఆ పడవలో ఏ క్షణంలో ఏమవుతుందోనని బిక్కు బిక్కు మంటూ రామేశ్వరం చేరుకున్నాం . భారత నౌకా దళం మమ్మల్ని వెంటబెట్టుకుని భారతీయ ఇంటెలిజెన్స్ విభాగాని కప్పగించారు . ఆ తరువాత ధనుష్కోటి పోలిస్ స్టేషంలో రిజిస్ట్రేషన్ చేసి మండపం కేంప్ కి తీసుకొచ్చారు .
అలాగే హంసరాజ్ అనేవాడు చాలా కాలం గా ఉబ్బశవ్యాధితో బాధపడుతుండేవాడు . ఎన్ని వైద్యాలు చేసినా తగ్గకపోయేసరికి బాబా దగ్గరకు వచ్చి శిరిడి లోనే కొంతకాలమున్నాడు . అతనిని బాబా పుల్లపెరుగు తినవద్దన్నారు . కానీ అతడికి పుల్ల పెరుగంటే చాలా ఇష్టం . అందుకని బాబా తినవద్దన్నా కూడా భార్య చేత బలవంతాన తోడు పెట్టించుకొని తినేవాడు . కానీ సర్వజ్నుడైన బాబా కు తెలియనిదేమున్నది ? బాబా చిత్రమైన లీల చేశారు . ప్రతి రోజూ ఆ దంపతులు మసీదులో మధ్యాహ్న హారతి కి హాజరయ్యేవారు . వారు అక్కడికి వచ్చిన సమయం లో ప్రతి రోజూ వీళ్ళ రూమ్ లోకి ఒక పిల్లి వచ్చి పెరుగు తినిపోయేది . మొదటి రోజలా జరిగేసరికి పొరపాటు అనుకొని అన్నీ జాగ్రత్తలు తీసుకున్నారు . కానీ అదేమీ చిత్రమో వీరెన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ పిల్లి రావటం , పెరుగు తినిపోవడం ప్రతి రోజూ జరుగుతూనే వుంది . చివరకు అతనికి విసుగు పుట్టి కోపం వచ్చి హారతి కి గూడ పోకుండా దాన్నెలాగైనా రాకుండా చూడాలని , వస్తే కొట్టాలని నిర్ణయించుకొని ఒక కర్ర చేత్తో పట్టుకొని కాపలా కూర్చున్నాడు . సరిగా సమయానికి ఆ పిల్లి రానే వచ్చింది . " రోజూ పెరుగు తిని పోతావా ? " అని అతడు దానిని కర్రతో కొట్టాడు . తర్వాత అతడు మసీదు కి రాగానే బాబా అన్నారు : " ఇక్కడొక పనికిమాలిన వాడు ఉబ్బసం తో బాధపడుతున్నాడు . వాడిని పుల్లపెరుగు తినవద్దని చెప్పాను . ఎంత చెప్పినా వినకుండా అతడు తింటూనే వుంటే నేనే పిల్లి రూపం లో వెళ్ళి తిని అతడా పెరుగు తినకుండా చూస్తున్నాను . చివరకు వాడు నన్నీరోజు కర్రతో కొట్టాడు " అన్నారు . అలాగే బల్వంత్ నాచ్నే అన్నగారు బొంబాయి లో శస్త్ర చికిత్స కానీ ఆస్పత్రి లో వున్న సమయం లో వాళ్ళింటికి ఒక సాధువు వచ్చి భిక్ష అడిగాడు . అతని వాడిన గారు అన్నం పెట్టింది . ఇంట్లో బెండకాయ కూర వుంది గానీ అది అందరూ టీనాగా మిగిలినది కదా ! అని ఆయనకు వెయ్యలేదు . వేరే కూర వేసింది . కానీ ఆ సాధువు ఆ కూరే అడిగి వేయించుకొని మరీ తిన్నాడు . ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత అతడు శిరిడీ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు బాబా ఆ సాధువు తామేనని అతనికి తెలిపారు . ఇలాంటి ఎన్నో సంఘటనల ద్వారా ఏ సాధువు కి పెట్టినా తనకే చెందుతుందని , ఏ ప్రాణీని ఆదరించినా , హింసించినా తనకే చెందుతుందనీ నిరూపించారు బాబా . ఏ దైవానికైనా మొక్కుకొని ఆ మ్రొక్కు ఎగ్గొడితే వాళ్ళు రాగానే వాళ్ళు మ్రొక్కుకున్నంత డబ్బూ అడిగి పుచ్చుకునేవారు . అలాగని ప్రక్కవాడు డబ్బులిస్తే తీసుకునేవారు కాదు . " ఏమయ్యా ! వాడిస్తే తీసుకొంటివి , వీడిస్తే తీసుకోలేదేమని అడిగితే " వాడు మ్రొక్కుకొని ఎగ్గొడితే అడిగి తీసుకున్నాను . వీడు మ్రొక్కుకోలేదు గనుక వీడి దగ్గర తీసుకోలేదు . " అనేవారు . కాబట్టి ఏ దేవతకార్పించినా తనకే చెందిందని , చివరకు మానవమాతృణ్ణి గూడ ఏ విధంగా చూచుకున్నా గూడ అది ఆయనకే చెందిందని భక్తులకు అసంఖ్యాకంగా అటువంటి అనుభూతులను ఇస్తూనే వచ్చారు . అంతటా అన్నీ రూపాలలో వ్యాపించి వుంటాయి . కారణం అన్నీ రూపాలలో ఆయనే వున్నారు గనుక . ఉదాహరణకు చంద్రాబాయి బొర్కర్ అను భక్తురాలు శిరిడీ కొంతకాలమున్నారు . అప్పుడామే భర్త పండరిపురం లో వున్నాడు . ఒకరోజు బాబా ఆమెతో పండరిపురం లోని ఆమె భర్త వద్దకు వెళ్ళమని చెప్పారు . ఆమె వెంబడే తానుంటానని గూడ చెప్పారు . కానీ ఆమె అక్కడకు వెళ్ళేసరికి ఆయనక్కడ లేరు . ఎక్కడికి వెళ్ళారో గూడ తెలియలేదు . ఏమీ చేయాలో తోచని పరిస్థితులలో ఆమె వుండగా , ఒక ఫకీర్ ఆమె వద్దకు వచ్చి మీ వారు ధోండ్ స్టేషన్ లో వున్నారు . వెంటనే వెళ్ళమని చెప్పి టికెట్టు గూడ ఇచ్చారు . అంతేగాక ఆమె భర్తకు గూడ కలలో ఒక ఫకీర్ కనిపించి నీ భార్య ఫలానా రైలు లో వస్తున్నదని చెప్పారు . తర్వాత ఆ ఫకీర్ సాయిబాబానేనని వాళ్ళు తెలుసుకున్నారు . బాబా ఆదేశం ప్రకారం ఖాండోబా ఆలయం లో వున్న ఉపాసనీ బాబా , బాబా కు నైవేద్యమిచ్చిన తరువాత తను భోజనం చేసేవారు . ఒకరోజు ఉపాసనీ ఆ నైవేద్యాన్ని తీసుకొని పోతూ వున్నప్పుడు ఒక నల్ల కుక్క తోకాడిస్తూ వెంటబడింది . దీనికి పెట్టిన తర్వాత బాబాకు నైవేద్యం పెట్టడం ఎట్లాగా అని దానిని ఛీ కొడుతూ , కసిరి కొడుతూ మసీదు కి వెళ్లారు . వీరు మసీదు కి వెళ్ళి బాబాకు నైవేద్యం ఇవ్వబోతే , " ఇక్కడికెందుకు తీసుకు వచ్చావు ? నేనక్కడ నల్ల కుక్క రూపం లో వున్నాను గదా ! " అన్నారు బాబా . కాబట్టి ఇక నుంది గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నిద్దామని అనుకొన్నాడు . అంతగా ప్రయత్నించినప్పటికీ , అంత జాగ్రత్తగావుంటున్నప్పటికీ మరలా ఏమారడతను . ఒక రోజు ఇతను వంట చేసుకుంటుంటే బిచ్చమెత్తుకునే వాడొకడు ఆశగానిలబడి దాని వైపు చూస్తున్నాడు . కాబట్టి అది అపవిత్రమౌతుందని తలచి అతనిని కసిరి కొట్టాడు . నైవేద్యం మసీదు కి తీసుకెళ్ళగానే మరలా బాబా కోప్పడ్డారు . " ఇప్పటి నుండి గుర్తు పెట్టుకో . ఎక్కడ నీ దృష్టి పడుతుందో , అక్కడ నేనున్నా " నని చెప్పారు బాబా . ఈ విధంగా సకల చరాచర విశ్వమంతా తమ రూపమేనని నిరూపించిన శ్రీ సాయిబాబా సమర్థ సద్గురువు .
షారూక్ ఖాన్ " రబ్ దే బనాది జోడీ " చిత్రం తో తెరకి పరిచయమయ్యింది . యాష్ రాజ్ బ్యానర్ అనుష్క తో కుదుర్చుకున్న
ఏ పండుగ జరిగినా సామూహిక నృత్యాలతో మా ఆనందాన్ని వ్యక్తం చేస్తాం . కానీ ఆ నృత్యం ఇవాళ మసక బారి పోయింది . గిరిజనేతరులు వస్తూ వస్తూ రికార్డింగ్ డాన్సుల్ని వెంట తెచ్చారు . వాటి ముందు సామూహిక నృత్యం సమూహంలో ఏకాకిలా మారిపోయింది . ఇవాళ పాట మాకు మోటైపోయింది . మా ఆట మాకు పరాయిదైపోయింది . భూతు పాటల బాకాల ముందు రేల పాటలు నోళ్లు వెళ్ళబడుతున్నాయి . హోం ధియేటర్ల శబ్దానికి తుడుం , డప్పు , పన్నర గర్ర , కిన్నెర మూగబోయినాయి . ఇకపోతే … ఒకప్పుడు సంతలు నిత్యావసర వస్తువులకు కేంద్రంగా ఉండేది . ఇవ్వాళ ఆ సంతలే వస్తు వ్యామోహ పంపిణీ కేంద్రాలుగా మారాయి .
సా : కేవలం తేజస్సే కనిపిస్తోంది . తర్వాత పొంతనలేకుండా మాటలు వినిపిస్తున్నాయి .
> > ఒకందుకు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది . . ఈ రకంగా అన్నా పాత దాన్ని మరలా మనకు స్ఫురణకి తెచ్చి దాని గొప్పతనాన్ని మరోమారు మన కళ్లముందు నిలిపారు . నిజం ! ! నేను కూడా క్రొత్త పాట విని ఆ చిరాకు నుండి బయటపడడానికి , పాత పాటని డౌన్లోడ్ చేసుకుని విన్నా . . . పాత దానితో కనీసం 1 % కూడా పోటీ పడలేదు . . . కేవలం భారతదేశం అంటే బాలీవుడ్ , మిగిలిన క్రొద్దిమంది సినిమా నటులు తప్ప ఎవరూ కాదనుకుంటా . . ! ! !
అబ్బే నా బాధ అది కాదండీ ( vademataram ) , జీవితానుభవం . . చేతుల్లో పడి , పుటుక్కున జారిపోయిన అనుభవాలు చాలా ఉండి , తొందరపడి ముందే కూసింది కోయిల కాకూడదని .
నిజాయితీగా ఉండిపోతే ఈ వ్యాపారాలాగిపోతాయి ఈ లావాదేవీలాగిపోతాయి ఈ వ్యూహాలాగిపోతాయి ఈ యుద్ధాలాగిపోతాయి ఈ చదువులాగిపోతాయి ఈ ఉద్యోగాలాగిపోతాయి ఈ మమతలాగిపోతాయి ఈ అనుబంధాలాగిపోతాయి ఈ సంసారాలాగిపోతాయి ఈ కాపరాలాగిపోతాయి
నేను ఈమాట ను చూడటం మొదలు పెట్టింది ఇటీవలే . ముందు చదవటం చేసాను . ఎందుకంటే mainstream పేపర్ల సాహిత్యప్పేజీలు విసుగొచ్చి వాటిని చదవటం మానేసాను . వాటిలో సాహిత్యం కన్నా మిగితావి ఎక్కువ అయిపోతుండటం విషాదం .
ఆలోచన మంచిదే అందరు అన్నట్టు , కని ఆగస్ట్ 15 తర్వాత మనం ( ప్రజలు ) మల్ల దేశం గురించో / స్వతంత్రం కు ఉన్న విలువ గురించో అలోచించం , ఇదిగూడ అట్లనే అయ్యే ప్రమాదం ఉన్నది .
వాలి , సుగ్రీవుల కధ లాగా ఉన్నట్లు౦ది : ) మొదటిసారి ముద్దు పెట్టుకోబడిన మహిళ మర్యాద కాపాడ్డ౦ కోస౦ ఇ౦కో ఆవిడని ముద్దు పెట్టుకొన్నాడు : )
ఎండావానలకు చలించని బండరాళ్ళను తలపించే మన మనుగడకు అర్థం మనమే వెతుక్కోవడానికి …
నేను కాలానుగుణంగా మారుతూ ఉన్నాను అనేందుకు సాక్షమే ఈ పుట . నా ప్రవర్తనకి నేను ఎవ్వరికీ జవాబుదారీ కాక పోయినా , నా మటుకూ నేను ఎంత నిస్పక్షపాతంగా ఉన్నానో అని నేను తెలుసుకునే క్రమంలో వెలువడినదే ఈ ప్రచురణ . ఈ పుటకి ఉన్న శీర్షిక ఏమాత్రం సరిపోక పోయినా , రెండవ పుటకి ఇది ఉపోద్ఘాతం .
కొన్నాళ్లకు లోగుట్టు బయట పడింది . చంద్రబాబు కు దగ్గరి మనిషి గా చెప్పుకునే అహోబిల రావు ఉరఫ్ బిల్లీ రావు నెలకొల్పాడీ IMGB ని . దీనికీ అమెరికా లోని IMG కీ ఏ సంబంధమూ లేదని . అన్నిటికన్న మిన్నగా ప్రభుత్వం ఎం . వో . యూ కుదుర్చుకునే నాటికి సదరు IMGB అసలు ఉనికిలోనే లేదని . వందల కోట్లతో క్రీడా సౌకర్యాలు అభివృద్ధి చేయబోయే కంపెనీకి హైదరాబాదు లోని ఒకనొక అపార్ట్మెంట్ ఫ్లాటు లో ఒక బోర్డు మినహా మరే " మౌలిక సౌకర్యాలూ " లేవని తెలుసుకున్న ప్రజలు ముక్కున వేలేసుకున్నారు .
ముద్దమందారం సినిమాలో అనుకుంటాను , " అలివేణీ ఆణిముత్యమా " అనే పాటను రమేష్ నాయుడు గారు స్వర పరచినట్టు గుర్తు . వాయిద్యాల మోత ఏ మాత్రమూ పాటని dominate చెయ్యకుండా అద్భుతంగా ఉంటుంది ఈ పాట .
వారి ఆరోగ్యం మీద శ్రద్ద లేదు . . . . . కనీసం పిల్లవాడి గురించి అయిన ఆలోచించడం లేదు .
ఈ తెరల్ని చీల్చి నిజాల్ని బయటపెట్టి భండారు అచ్చమాంబను రంగం మీదికి తీసుకు వచ్చినది కె . లలిత . వుమెన్ రైటింగ్ ఇన్ ఇండియా పుస్తకాన్ని ఎడిట్ చేస్తున్న సందర్భంలో మొట్ట మొదటగా లలిత ఈ అంశాన్ని పేర్కొన్నది . అచ్చమాంబను తొలి తెలుగు కథకురాలుగానే కాక ' ప్రధమ స్త్రీవాద చరిత్ర కారణి ' గా ప్రకటించినది కూడా ఆమెనే . ఫిబ్రవరి 27 - మార్చి 1 వరకు 1998 లో భూమిక , అన్వేషి ఆధ్వర్యంలో " తెలుగు కథ , నిర్మాణం , పరిధి , వైవిధ్యం " పేరుతో నడిచిన మూడు రోజుల కథా వర్క్ షాప్లో లలిత తన ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు . " సంఘ సంస్కరణోద్యమం - స్త్రీల కథలు " అంశం మీద ప్రసంగిస్తూ లలిత , 1910లో వచ్చిన గురజాడ కథ మొదటి ఆధునిక కథ అంటున్నారు విమర్శకులు . కానీ 1902లో అచ్చమాంబ రాసిన " ధనత్రయోదశి " ఎందుకు మొదటి కథగా పరిగణించడం లేదు అని ప్రశ్నించారు . ఆ తర్వాత డా . భార్గవీరావు సంకలనం చేసిన ' నూరేళ్ళ పంట ' కథల సంకలనంలో ప్రచురించిన ' స్త్రీవిద్య ' మొదటి కథ కాదు . " ధనత్రయోదశి నే మొదటి కథగా చెప్పుకోవాలి " .
368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్సభకు ఉంది . రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయ సభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి . ఒకవేళ అలా ఆమోదించకపోతే ఆ బిల్లు వీగిపోతుంది . రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు .
శ్రీనివాసుగారూ , మీ ' పూల పల్లకి ' చదివాక మా ఊర్లో పండువెన్నెల్లో రాంపాదాల రేవులో రావిచెట్టు క్రింద మెట్లు మీద కూర్చుని , రెండు కాళ్ళూ గోదాట్లో పడేసి ఆదరికి కళ్ళొదిలేయడం గుర్తొచ్చింది మాస్టారూ . Thanks a lot .
సంవత్సరం నుంచి పదో తరగతి బడిపిల్లల అంకపత్రాల ( Marks memoranda ) లో ఇష్టమైతే తల్లిపేరు కూడా వ్రాయడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అనుమతించింది . అందునిమిత్తం సిద్ధం చేసిన సరికొత్త దరఖాస్తు పత్రాల్ని ఈ విధమైన వికల్పానికి ( option ) స్థానం కల్పిస్తూ ముద్రించారు . రాష్ట్రంలో నూటికి నూఱుశాతం మంది విద్యార్థులు తల్లిపేరు కూడా వ్రాశారనీ , విద్యార్థులకు తమ తల్లుల యెడల ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమనీ విద్యాశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది . క్షేత్రస్థాయిలో అభిమానాల కంటే ఆచరణాత్మక వాస్తవాలు ఎక్కువ పాత్ర పోషిస్తాయి . మొదటిది - ఆ దరఖాస్తు ఫారాలు ఇంగ్లీషులో ఉన్నాయి . రాష్ట్రంలో And కీ OR కీ తేడా తెలియనివాళ్ళే ఎక్కువ . అందుచేత " ఎందుకొచ్చిన గొడవలే " అని తెనాలి రామలింగడిలా రెండూ నింపేస్తారు . రెండోది - మన బళ్ళల్లో ఇలాంటి ఫారాల్ని నింపేది స్వయంగా విద్యార్థులు కారు , ఉపాధ్యాయులే . అందుచేత నూటికి నూఱుశాతం ఫారాల్లో తల్లిపేరు కూడా కనిపిస్తున్నప్పటికీ అది వ్రాసినది స్వయంగా పిల్లలు కాకపోవచ్చు . మూడోది - బడిస్థాయిలో ఉపాధ్యాయుల కంటే ఉపాధ్యాయురాళ్ళ సంఖ్య ఎన్నోరెట్లు ఎక్కువ . వాళ్ళలో స్త్రీత్వ అభిమానినులు కూడా చాలా ఎక్కువ . తల్లిపేరు అనే కాలమ్ నిబంధనల ప్రకారం ఐచ్ఛికమే అయినా " అది తప్పనిసరి " అని పిల్లలకు చెప్పి నింపే అవకాశం జాస్తి . దేశంలో ఈ చర్య మొట్టమొదట తీసుకున్న రాష్ట్రం నాకు తెలిసి తమిళనాడు . అక్కడ కుమారి జె . జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి ఎవఱో తెలియని పిల్లల ఆధికారిక పత్రాల కోసం ఈ విధమైన అనుమతి ఇచ్చారు . నిజానికి మన రాష్ట్రంలో ఈ చర్య తీసుకోవడానికి కారణం కూడా జోగినులూ , దేవదాసీల పిల్లల కోసమే . తొలుత ఉద్దేశించిన " తల్లి గానీ తండ్రి గానీ " అనే వికల్పం ఆచరణలో " తల్లీ , తండ్రీ ఇద్దఱూ " అని మారింది .
8 . తరువాత చపాతి పీటపై ఒక్కో ఉంటను పెట్టి చపాతీలా చేసుకోవాలి .
చిన్న పిల్లలకోసం రంగనాయకమ్మ రాసిన ఆర్థిక శాస్త్రంలో ఉన్న తప్పులు చాలు ఆవిడ రాతలేపాటివో చెప్పటానికి . ఇది నేను కాదు ఆర్థిక శాస్త్రం చదివినవాళ్ళే అనే మాట .
న్యూయార్క్ లో నా ఫ్లైట్ మూడు గంటలకు తీరా చూద్దును కదా అప్పటికే రెండయ్యింది . ఇంకే మరొసారి సాహసం . గబగబా దగ్గర్లోని సబ్స్టేషన్ పట్టుకుని , అక్కడి నుంచి విమానాశ్రయానికి తిరుగు ప్రయాణం . ఇది దాదాపు ఓ నలబై నిమిషాలు . తీరా అక్కడికి చేరుకున్న తరువాత తెలిసిన విషయమేమిటంటే సెక్యూరిటీ చెకిన్ మూసేశారని . అక్కడి కౌంటర్ క్లర్క్ ఆ రోజున ఎవ్వరితోనో గొడవ పడ్డట్టున్నాడు అందువల్ల ఏ మాత్రం నాగోడు పట్టించుకోలేదు . ఇక లాభం లేదనుకుని , కొంచం టోన్ మార్చి గంభీరంగా అడిగా , ఎప్పుడైతే గొంతుకులో సౌండు మారిందో వెధవ దారికొచ్చాడు . బోర్డింగ్ టికెట్ ఇస్తా కానీ సెక్యూరిటీ వాళ్ళు ఆలశ్యం చేస్తే దానికి నాది కాదు పూచీ అన్నాడు . ఏదో ఒకటి ముందు చెయ్యిరా మగడా అని వాడినుంచి బోర్డింగ్ టికెట్ తీసుకుని సెక్యూరిటీ చెకిన్ చేసే క్యూలోకి దూరాను . అక్కడ మరో చాంతాడంత క్యూ ఉంది . ఎలాగరా అనుకుంటూ దిక్కులు చూస్తుంటే అక్కడి సెక్యూరిటీ వాళ్ళకు నాపైన అనుమానం కలిగింది .
బాగుంది . నేను కూడా గోంగూర పెంచడంలో ప్రయోగాలు చేసాను . మీ టపా స్ఫూర్తితో త్వరలో ఒక టపా వ్రాస్తాను .
రమాగారు ఏపీసిఎల్సీ వారి పోరాట పటిమను తక్కువ చేసి చూపొద్దు . మేధావి వర్గంగా వున్న కొంతమంది అలా స్టేట్ కు వ్యతిరేకంగా వచ్చి మాట్లాడటం వలన నేడు చట్టం కొంత మేరయినా బాధ్యతగా వ్యవహరిస్తోంది . లేదంటే ప్రశ్నించే వాళ్ళు లేక పది యేళ్ళ క్రితం పోలీసుల ప్రవర్తనకు నేటికీ ఇంత తేడా రాదు . వారి పిల్లల చదువులు , ఉద్యోగాలను గురించి వారికి స్వేచ్చ వుంటుంది . వారు ఉద్యమానికి బాసటగా మాటాడినంత మాత్రాన వారు దానికి రికౄటీలు కాదు . పౌరహక్కుల సంఘం ఏర్పడిందే ఎలైట్ వర్గం నుండి . మీ మిగతా చర్చ పట్ల నాకు అభ్యంతరం లేదు . కొనసాగనివ్వండి .
గత్యంతరం లేక . . ఇది కూడా మనకి ఏదో విధంగా పనికివ్స్తుందిలే అనుకుంటూ మగాడు అని పిలిపించు కునే ఆకారం వెనకాలే వెళ్ళాను . అక్కడ జరిగిన సంభాషణను మరో పుటలో వివరంగా . . అంత వరకు మా సంభాషణ ఎలా సాగి ఉంటుందో ఊహించి స్పందించ గలరు
. ఇక్కడ " ఆనంద్ అవుట్ డోర్ సినీ సర్వీస్ " లేనందున బ్లాగోళ జంభ టపా కోసం బేస్మెంట్ లోనే చిన్న సెట్టింగ్ వేసి షూటింగ్ చెయ్యడం జరిగింది . సమయం దొరికినప్పుడల్లా కిందకెళ్ళిపోయి దాని ప్రొడక్షన్ సీన్లు చూసే వాడిని . ఈ షూటింగ్ కి లైట్ బాయ్ నుండి తోట తరణి , పి . సి . శ్రీరాం , మణి రత్నం , రామా నాయుడు వరకు నేనే . అప్పుడప్పుడూ అడిగినప్పుడు మా ఆవిడ కాఫీ నో , టీనో తెచ్చి ఇచ్చేది . అలా వచ్చినప్పుడు అక్కడే హ్యంగర్స్ కు వేళాడుతున్న డ్రస్సులు చూసి " మొత్తానికి బేస్మెంట్ ను ఒక డ్రామా కంపెనీ లాగా మార్చేశావ్ " అంది . " మరి నువ్వు మాత్రం కాచి టీ పెట్టుకొని రమ్మంటే , మైక్రోవేవ్ లో పెట్టి బ్రూ కాఫీ తీసుకొచ్చేసి అదే టీ అన్నట్టు డ్రామా లెయ్యడం లేదా " అని సగటు మగవాడిలా అనబోయి తమాయించుకొని " అప్పుడే ఏమయింది ఇంకా చూస్తూ వుండు ఎన్ని చేస్తానో " అన్నా రాబోయే ఉపద్రవాన్ని పసి గట్టకుండా . " ఆ . . చాల్లే సంబడం . ఇంటి వెనకాల గడ్డి పీకడానికి టైము లేదు గానీ వీటికంతా వుంటుంది . తొందరగ ముగించుకోని రా " అంది . తను అలా వెళ్ళగానే బుడ్డోళ్ళిద్దరూ నా యూనిట్ లో నాన్ - వర్కింగ్ సభ్యులయిపోయి నన్ను నాట్ వర్కింగ్ ఆర్టిస్టును చేసేవాళ్ళు . " గుండయితే అయ్యింది కానీ లడ్డు మాత్రం దొరికింది " అన్నంత ఆనందం తో ' భ్లాగోళ జంభ " డబ్బా బ్లాగులోకి వెళ్ళింది . ఇక ట్రైపాడు ఇతర వస్త్రా లంకరణ సామాగ్రి అంతా పైకి తెచ్చే పని మా ఆవిడది . " హమ్మయ్యా , కాఫీలు మోసుకెళ్ళే బాధ తప్పింది " అని అన్నీ తీసుకొచ్చి పైన బడేసింది . ఆఫీసు నుండి రాగానే కూచుని టి . వి . చూస్తూ " నా తోడు గా నీవుండగా … . . చక్ర వాకం … . చక్ర వాకం " అని వింటుంటే ఎక్కడి నుండో " భ్లాగోళ జంభ … భ్లాగోళ జంభ … " అనే సౌండు టి . వి . కన్నా ఎక్కువ వస్తోంది . మా ఆవిడే లేచి వెళ్ళి లివింగ్ రూములో నుండి ఒక చేత్తో ట్రైపాడూ ఇంకో చేత్తో హ్యాటూ తీసుకొని వచ్చింది . ఆ వెనకనే మా పెద్ద బుడ్డోడు " అమ్మా ! నేను , తెలుగు బ్లాగు గేము ఆడుకుంటా . నా కివ్వు " అంటూ వెంట పడుతున్నాడు . వాడిని పిలిచి " ఈ గేమేంట్రా " అనడిగితే . " అదే , నువ్వూ . . బేస్మెంట్లో . . భ్లాగోళ జంభ చేస్తున్నావు కదా . . . అది " " నీకు ట్రైపాడ్ , హ్యాటు ఎందుకు ? " " నాకు కావాలి . నేను తెలుగు బ్లాగు ఆడుకుంటా " నేను నవ్వుకుంటా వాడిని దగ్గరకు తీసుకున్నానో లేదో అంత వరకు అక్కడే లివింగ్ రూములో ఆడుకుంటున్న సంవత్సరం కూడా నిండని చిన బుడ్డోడు బుడి బుడి అడుగులు వేసుకుంటూ చేతులతో చప్పట్లు కొట్టుకుంటూ " భ్లా . . . భ్లా . . . భ్లా . . . " అని వస్తున్నాడు . .
అస్సలు టైం ఉండటం లేదు . జీవితం అంతా ఆఫీసులోనే గడిచిపోతుంది .
నేను తెల్ల కాయితం కథా వస్తువుని ప్రకటించినప్పుడు ఒకరిద్దరు మిత్రులు అన్నారు , ఇంకా ఈ కాలంలో ఒక్క తెల్ల కాయితం కూడా దొరకని వాళ్లుంటారా అని . ఏం చెప్పాలో తెలీక మౌనంగా ఉండిపోయాను . ఐతే ఈ ఇతివృత్తాన్ని ఉపయోగించి మనవాళ్ళు చాలా మంది రాసిన కథల్లోని కొన్ని సంఘటనలు ఒక నిజజీవితంలో జరిగిన ఉదంతం ఇలా కళ్ళబడుతుందని అనుకోలేదు . సుంకోజి దేవేంద్ర మంచి భవిష్యత్తున్న యువ కథా రచయిత . తన సొంత అనుభవాల్ని నెమరు వేసుకుంటూ అవే తనకి కథకుడిగా ఎదగడానికి ఎలా ప్రేరణ అయినాయో ఇక్కడ చదవండి తన సొంత గొంతులో . కథ 2005 సంకలనంలో చోటు చేసుకున్న అతని కథ కొమ్మిపూలు గురించిన ప్రస్తావన ఈ సమీక్షలో చూడచ్చు . అతని కథల సంపుటి అన్నం గుడ్డ అనే పేరుతో 2007 లో విడుదలైంది . దేవేంద్ర గురించి , అన్నం గుడ్డ కథల సంపుటి గురించి మరి కొన్ని మాటలు . http : / / kadalitaraga . wordpress . com / 2007 / 02 / 23 / aksharala_daarushilpi_devendra / http : / / pustakam . wordpress . com / 2007 / 07 / 09 / annam / దేవేంద్రని ఈ సరి కొత్త గౌరవం సాధించిన సందర్భంగా మనసారా అభినందిస్తూ . .
ప్రస్తుత తెలుగు సినిమా దుస్థితిని తెరకెక్కించే ప్రయత్నం చేసిన అనీష్ సినిమా అనుకున్నట్టుగానే మామూలు సినిమాలలాగా థియేటర్లలో విడుదల కావటం లేదు . అంత మాత్రాన ఆ సినిమా చూసే అవకాశం మనకు లేదనుకోకండి . త్వరలో మీ ఇంటి కంప్యూటర్ స్క్రీన్ పై ఈ సినిమా ప్రత్యక్షమవబోతోంది . గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక తెలుగు సినిమా పూర్తిగా ఇంటర్నెట్ పై రిలీజ్ కావడం మొదటిసారి . తెలుగు సిని పరిశ్రమపై తన ఆవేశాన్ని వెల్లగక్కిన అనీష్ అసలా సినిమా తీయాల్సిన అవసరముందా ? అతను చేసిన ప్రయత్నం మంచిదా ? కాదా ? అనే విషయంలో వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ ఎవరో ఒకరు తప్పులు ఎత్తి చూపాలి అన్న ఉద్దేశంతో అనీష్ తీసిన సినిమా ఇంటెర్నెట్లో రిలీజ్ చేయడం మాత్రం విభిన్న ప్రయత్నమే !
డియర్ రాజేంద్ర కుమార్ దేవరపల్లి ! నా వుద్దేశ్యం కాంగీరేసు అంటే , ఇందిరాగాంధి స్థాపించిన Cong ( I ) పార్టీ . కామరాజ్ ఆ పార్టీకి చెందినవాడు కాదు - - అని . ధన్యవాదాలు !
బ్లాగులో టపా రాసారు . . పబ్లిష్ చేసారు . మళ్ళీ ఏదైనా మార్పులు , చేర్పులు చేయాలనుకుని ఆ టపా తెరిచి పని చేస్తుండగా అది డిలీట్ ఐంది . కష్టపడి రాసారు . మళ్ళీ రాయాలంటే కష్టం . అన్నీ పాయింట్లు గుర్తుండవు మళ్ళీ రాద్దామంటే . పెద్దగా కూడా ఉంది . వర్డ్ లో కూడా దాచుకోలేదు . ఎలా . బాధగా ఉంటుంది కదా . పోయిన టపాను వెనక్కి తిరిగి తెచ్చుకోగలమా ? అంటే . . . తెచ్చుకోగలం . . బ్రౌజర్ లో కొత్త ట్యాబ్ తెరవండి . అప్పుడు కంట్రోల్ హెచ్ ( Ctrl H ) క్లిక్ చేస్తే పైన చూపించినట్టుగా ఒక టేబిల్ తెరుచుకుంటుంది . అందులో మీరు ఆ రోజు , రెండు రోజులు , వారం రోజులు మీ కంప్యూటర్లో చేసిన పనులన్నీ ఉంటాయి . మీకు కావలసిన తేది , సమయం చూసుకుని అది ఓపెన్ చేస్తే మీరు డిలీట్ చేసిన టపా కూడా ఉంటుంది . అది కాపీ చేసి సేవ్ చేసుకోండి . ఇందులో బ్లాగు టపాలే కాదు . వేరే అంశాలు కూడా తిరిగి తెరుచుకోవచ్చు . తెచ్చుకోవచ్చు . ఐతే యిపుడు హ్యాపీనా . ఎప్పుడైనా బ్లాగు టపా ఎగిరిపోతే ఇలా తిరిగి పట్టుకోండి . .
నిడదవోలు మాలతి గారూ , మీ పుస్తకానికి మీరే ప్రూఫ్ రీడ్ చేస్తానన్నప్పుడూ , చేసినప్పుడూ కూడా పబ్లిషర్లు పట్టించుకోలేదా ? రచయితల అభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా పబ్లిషర్లు తమకిష్టం వచ్చినట్టు పుస్తకాలు అచ్చేయటం దారుణం . ఈ విషయంలో మీ ఆవేదనలో పాలు పంచుకుంటున్నాను .
ఆభేరి రాగం గురించిన వ్యాసం కాబట్టి ఈ రోజు నాకు జరిగిన ఒక అనుభవం మీతో పంచుకోవాలని ఈ అభిప్రాయం రాస్తున్నాను .
మాష్టారు గారి ఇంట్లో సందడి మొదలైంది . వారి అబ్బాయి , రామ్ ( కళ్యాణ రాముడు ) ఈరోజే అమెరికా నుంచి వస్తున్నాడు . మాష్టారు గారి భార్య గారు అప్పుడే నాలుగు సార్లు వీధిలోకి వచ్చి వెళ్ళారు . రెండున్నర ఏళ్ళు అయ్యింది రామ్ వచ్చి . ఇది వరకు వచ్చినప్పుడు నాది కిళ్ళీ కొట్టే , కాస్త లాభాలు పట్టి ఇప్పుడు కిరాణా కొట్టు అయ్యింది . ఎన్ని సార్లు వచ్చినా ఉండేది పది రోజులే కదా . హమ్ … అవి అన్నీ మనకి ఎందుకులే … . ఇలా ఆలోచిస్తుండగా ఇంతలో మూర్తిగారు వచ్చారు .
తెలుగుయాంకి , లోకేష్ . . నెనర్లు భాస్కర్ . . మామిడి ? కాకర ఎలా పండిందో చెప్పు . నేను ఈ సారి వేసిన ఒక కొత్త పంట సోంపు . కొత్తిమీర లాగానే తీగలు సాగుతుంది . కోసుకుని సాలడ్లో వేస్తే మాంచి సువాసన . ఈ ఏడాదికి ట్రయల్ మాత్రమే నా వ్యవసాయం . ఇది సక్సెస్ అనుకుంటే వచ్చే ఏడు ఇంకొంచెం పెద్ద మడిచెక్క చేస్తా . ప్రస్తుతానికి నూనె గోంగూర పెట్టేంత సీనులేదు . మీరేవన్నా ఇటొస్తే ( ఇంకో రెండు వారాల్లోపు ) , ఒక పూట పచ్చడేసి భోజనం మాత్రం పెడతా . : )
ప్రాచీనగ్రంథాల్లో ఊరగాయలను గురించి చెప్పబడిన విశేషాలు సేకరించిన వారు జెజ్జాల కృష్ణ మోహన రావు . ఈ గ్రంధాల్లో పేర్కొనబడిన కాయల ప్రస్తుత నామాలని గురించిన వివరాలు రిసెర్చిచేసి సేకరించిన వారు : ( పాలన ) పారనంది లక్ష్మీ నరసింహం .
" అది కూడా తెలియదా ? మాడలింగ్ రంగం నుంచి వచ్చారు . వీళ్ళుగాక ఇంకా ఇలాంటి వాళ్ళు కోకొల్లలు , " వచ్చిన అభ్యర్ధులని జాబితా వేస్తున్న వ్యక్తి చెప్పాడు .
రోహిణీప్రసాద్ గారి అభిప్రాయం వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఉద్దేశించిదని నేను అనుకోను . ఆ అభిప్రాయానికి ఎవరూ బాధ పడవలసిన అవసరం లేదు . ఆయన అభిప్రాయప్రకటన తీరు అది .
చేరా . సంఘటనల గురించి చెప్పటం మరీ కష్టం . నా ఉద్దేశంలో భావకవిత్వావిర్భావం ఒక గొప్ప సాహిత్య సంఘటన . కాని సాహిత్యంలో సంఘటనలుంటాయా ? అంటే అది తాత్విక ప్రశ్న అవుతుంది . లఘు కాల పరిమితిలో జరిగిన వాటిని సంఘటనలు అనవచ్చునా ? నాకు తెలీదు .
సిరిసిరిమువ్వ గారూ , తెల్లారి లేస్తూనే తొలికప్పుకాఫీతో చదివిన చాలా చాలా మంచి సమీక్ష . ఇందులో నేను చూడని బ్లాగులగురించి ఇప్పుడే తెలుసుకున్నాను . ఆడవారిని ఆడిపోసుకోడం 60వ దశకంలోనే మొదలయింది వాళ్లు చెప్పలేనంత బాగా రాస్తున్నారని తెల్లమయిన తరువాత . మంచి శీర్షిక పెట్టేరు . చక్కగా వ్యాఖ్యానించారు . అభినందనలూ ధన్యవాదాలు .
యాపిల్ కంపెనీ వాళ్ళు ఐఫోన్ విడుదల చేస్తున్నామని ప్రకటించినప్పటి నుంచీ , అదెప్పుడెప్పుడొస్తుందా అని , ఎదురు చూస్తున్న వాళ్ళలో నేనూ ఒకణ్ణి ! పరీక్షలు వ్రాసాక ఫలితాల కోసం కూడా ఎన్నడూ ఇంతలా ఎదురు చూసిన జ్ఞాపకం లేదు ! అంత ఎదురు చూపులెందుకంటే - 1 ) ఆ ఫోన్ చాలా నచ్చింది . బొత్తాలు ( buttons ) వుండవు . ఫోటోలు , వీడియోలు చూడొచ్చు . . . తీయొచ్చు . పాటలు వినొచ్చు , ఎవరైనా చక్కగా పాడుతుంటే రికార్డ్ చేసుకోవొచ్చు . 2 ) నా పాత మోడల్ నోకియా ఫోనుకు , ఐపోడ్ కు ఇక రిటైర్మెంట్ ఇచ్చేసెయ్యొచ్చు . 3 ) యాపిల్ వాళ్ళు ఏ ప్రోడక్టునైనా అందంగా , నాణ్యంగా చేస్తారన్న నమ్మికం . నమ్మకాన్ని నిలబెట్టే వాళ్ళ అమ్మకాలు పెంచాలి కదా ! 4 ) పెరుగుతున్న యాపిల్ కంపెనీ స్టాకులు . దాదాపు 200 , 000 ఫోనులు మొదటి రెండు రోజుల్లో అమ్ముడవుతాయని అంచనా అట ! కొన్ని చోట్ల ఇప్పటికే షాపుల ముందు ఔత్సాహికులు వరసల్లో నిలబడ్డారని వ్రాసింది ఒక పత్రిక ( http : / / www . businessweek . com / ap / financialnews / D8Q2527O1 . htm ) ! ఐఫోన్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు వచ్చేస్తోంది మార్కెట్ లోకి ! సాయంత్రం షాపు కెళితే , నాకొకటి దొరుకుతుందో లేదో ! !
సాధారణంగా ఇలాటి ధర్మ సందేహాల జోలికి నేను వెళ్ళను . మల్లాదివారు టీవీలో గంభీరమైన గాత్రంతో మధ్య మధ్య పద్యాలు పాడుతూ విషయ వివరణ చేస్తూ ఉంటే వినసొంపుగా ఉండి వింటానుకోండి . కాని రవిగారి ప్రశ్న చదివాక నాకు తోచింది చెప్పాలనిపించింది . మన పురాణాలలో ఉన్న విషయాలన్నిటినీ ఇప్పుడు మనం త్రాసులో తూచడం అవివేకం అని నేననుకొంటాను . అలానే వాటిలో విషయాలని మొత్తం నెత్తికెత్తుకోవడమూ , పూర్తిగా నిరసించడమూ రెండూ నిరుపయోగం ఒకోసారి హానికరం కూడానూ . రాముడు సీతకి అగ్నిపరీక్ష పెట్టడం కానీ అడవులకి పంపించడం కానీ ధర్మమేనా కాదా అన్న ప్రశ్న అనవసరం . రాముడు సీతని అనుమానించి అడవికి పంపించాడు కాబట్టి అతన్ని ఆదర్శంగా తీసుకొని నేనూ మా ఆవిడని అనుమానించి వదిలేస్తాననడం బుద్ధిలేనివాళ్ళు అనే మాటా , చేసే పని . అలాంటి వాళ్ళకి , " లేదు రాముడు ఫలానా పరిస్థితుల్లో అలా చేసా " డంటూ వివరించబూనడం అంతకన్నా బుఱ్ఱలేని పని . ఆ చెంపా ఈ చెంపా బాగా వాయించి ( సదరు భార్యే ) " ఓరేయ్ ! నువ్వంటున్నది బుఱ్ఱతక్కువ మాట . మరో సారి ఆలోచించుకో " అని వార్ణింగివ్వడమో , వినకపోతే చట్టాన్ని ఆశ్రయించడమో చెయ్యడం ఉత్తమం . అలానే రాముడలా చెయ్యడం దుర్మార్గం దాన్ని మనమిప్పుడు తీవ్రంగా ఖండించాలి , అతన్ని దేవుడని ఎలా అంటాం , అసలతను మనిషేనా ఇత్యాదిగా దండెత్తడం కూడా బుద్ధితక్కువ పనే . ఇప్పుడు మన కళ్ళముందు ఇన్ని అన్యాయాలు జరుగుతుంటే ఏవీ చెయ్యలేక ఎప్పుడో పురాణాల్లోని రాముణ్ణి నిందిస్తే ఏవిటి ఖండిస్తే ఏవిటి ? ఒక్క మంచి పని మాత్రం చెయ్యవచ్చు . రాముడు చేసిన పనికి వెనక అసలు కారణం ఒక రాజుగా తన కర్తవ్యానికి కట్టుబడడం అని భావించవచ్చు . అధికార నిర్వహణలో స్వలాభేక్షమాని కర్తవ్య దీక్ష వహించాలి అన్న మంచిని గ్రహించవచ్చు . దాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఆచరించవచ్చు . అలా ఆచరించక స్వార్థపరులైన వాళ్ళని నిలదీసే శక్తిని తెచ్చుకోవచ్చు . పురాణాల్లోనే కాదు , దేనిలోనైనా మంచిని గ్రహించగలగడం ఉత్తమం . అందులో చెడుని ( ఇప్పటి కాలం దృష్ట్యా ) ఆదర్శంగా తీసుకొని దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళని ఎండగట్టాలి . అంతేకాని పురాణాలని ఎండగట్టి ప్రయోజనం ఏముంది ? అందులో కనిపించే చెడుని ఏదో రకంగా సమర్ధించి ప్రయోజనం ఏముంది ? పైని అనానిమస్సు వ్యాఖ్య నాకు అభ్యంతరకరంగా అసభ్యంగా అనిపిస్తోంది . దాన్ని తొలగిస్తే మంచిది .
నెమలికన్ను మురళి రేడియో కధానిక చదువుతుంటే మధ్యలో ఈ క్రింది వాక్యాలు నన్ను ఆకర్షించాయి . డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాడు . ఇతర క్వాలిఫికేషన్లు బాగున్నాయి . ప్రయత్న లోపం లేకపోయినా ఉద్యోగం దొరకలేదు . సున్నితమైన మనస్తత్వం . తండ్రి మాటలు భరించలేక పోయాడు . మనోళ్ళు నిజంగనే అభిమానవంతులు . ఆ అభిమానానికి హద్దు ఉండదు . ఓ మాట అంటే అంతే . 1981 , April 24 , స్థలం దాచేపల్లి - దాదాపు మధ్యాహ్న సమయం . మా బాబాయి టైప్ హైయ్యర్ తప్పాడు అనే వార్త తెలుసుకుని మా తాతయ్య , చెడామడ తిట్టాడు . బాబాయి అప్పటికి డిగ్రీ పూర్తి చెసాడు . టైపు నేర్చుకుంటే మంచిదన్నట్టు బహుసా నేర్చుకుని ఉంటాడు . సాధారణంగా మా ఊళ్ళవైపు మాటపట్టం అంటే మహాకష్టం . తొందరగా మాటపడం . కన్న తండ్రి అరిస్తే , ఆవయసులో ఉన్న కుఱ్ఱాడు పుసుక్కున మందు తాగేస్తారు . ఇంతమందినిజూసా . మా ఇంటి దగ్గర్లోనే క్రాంతికుమార్ గారి ఆశుపత్రి . ఎన్నో కేసులు ఇలాంటివి . పురుగు మందులు ఎండోసఫాన్ , నువాక్రాన్ , ఎండ్రిన్ లాంటివి తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయటం . ఐతే , బాబాయి ఏంచేసాడో తెల్సా ? ఇంట్లోంచి పారిపొయ్యాడు . ఔను , ఇంట్లోంచి ఎవ్వరికీ చెప్పకుండా పారిపొయ్యాడూ ఆరోజే . మేము పిడుగురాళ్ళలో ఉండేవాళ్ళం ఆరోజుల్లో . మానాన్నకి కబురొచ్చింది . అయ్యా మీ తమ్ముడు పారిపొయ్యాడు మీనాన్నగారు కూలబడ్డారు అని . వెంటనే వెళ్ళాం దాచేపల్లికి . తాతయ్య పాపం అవాక్కయ్యాడు . అదిరిపొయ్యాడు . ఇటు బాబాయి చిన్నవాడె , ఎలా ఎటువెళ్ళాడో ఎంటో అనే ఆందోళన . జనాలు వెతకటం ప్రారంభించారు . అక్కడ ఇక్కడ నడికుడి స్టేషన్ మాచర్లలో తెల్సిన వాళ్ళకి చెప్పారు , గురజాలలో తెల్సినవాళ్ళకి వెప్పారు . గుంటూరులో తెలిసిన వాళ్ళకీ చెప్పం . దొరకలేదు . జాడలేదు . 1982 గడిచిపోయింది 1983 గడిచిపోయింది . తాతయ్యకి ఎటాక్ వచ్చింది . పక్షవాతం . లేవలేని స్థితికి వచ్చాడు . 1984 గడిచిపోయింది . వెతికే జనాలు వెతుకుతూనే ఉన్నారు 1985 లో తాతయ్య దిగులుతో వెళ్ళిపొయ్యాడు . పేపర్లో ప్రకటన ఇచ్చాం . బాబూ ఇకనైనా రారా నాన్నా అని . జాడలేదు . 1995 ఐపోయింది . 2005 మానాన్న పొయ్యారు . పేపర్లో ప్రకటన ఇచ్చాం . మా బాబాయు జాడ ఇంతవరకూ లేదు . నిజం . ఇప్పటికి దాదాపు ముఫై ఏళ్ళు కావస్తుందా ? ఇంతవరకూ ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు .
కవిత్వంలో యిప్పుడు పునర్నిర్వచనానికి లోనవుతున్న అనేక వాదాలు , మత కుల , లింగం మొదలయినవన్నీ వలసానంతర దృక్కోణం నుంచి , పునర్మూల్యాంకనం చేసుకోవాల్సిన అవసరం వుంది . కొత్తగా తలెత్తిన తెలంగాణ సాహిత్యం అనేక విమర్శ సంప్రదాయాలను ప్రశ్నించింది . అంతేకాదు . ఆధునికత మూలాల్ని తిరిగి వెతుక్కునేట్టు చేసింది . విమర్శ సంప్రదాయంలో అం చులకి నెట్టబడిన స్థానికతని ఒకకొత్త ప్రమాణంగాతీసుకొని తెలంగాణ సాహి త్య చరిత్రని పునర్లిఖించే ప్రయత్నం మొదలైంది .
దీనితో తన అజ్ఞానం క్షమార్హం కాదని తపిస్తుంటాడు వసిష్ఠుడు . పొరపాటు చెయ్యడం మానవ లక్షణమనీ దాన్ని సరిదిద్దుకోవడానికి పశ్చాత్తాపమే సరైన మార్గమని వివరిస్తాడు శివుడు . తన తప్పుని సరిదిద్దుకుంటానని వసిష్ఠుడు శివుడికి చెప్పి వెంటనే శివుణ్ణి వదిలేసి అరుంధతీదేవి దగ్గరకు వెళ్ళిపోతాడు . ధన్యుడవయ్యావంటూ శివుడు వసిష్ఠుణ్ణి దీవిస్తూ నిలబడతాడు .
' SIMI ' ఎటువంటి సంస్థనో అందరికి తెలుసు . కాంగ్రెస్ ఇంతవరకు ముస్లిములను బుజ్జగించేది , ఇప్పుడు ఒక మెట్టు ఎదిగి ఇస్లాం తీవ్రవాద సంస్థలను బుజ్జగిస్తోంది . దీనికి నిదర్శనమే ' SIMI ' పైన వున్న నిషేదం తొలిగింపు . సరైన సమయానికి వాదన నిరూపణకు కావలసిన పత్రాలు సమర్పించడం లో ప్రభుత్వం విఫలమవడం వలన ఢిల్లీ హైకోర్టు ఈ నిషేధం ఎత్తి వేసింది . ఏడేళ్ళ కింద , శత్రువులతో కలసి దేశ విచ్చిన్న కార్య కలాపాలు చేస్తున్నారని ' సిమి ' నిషేదించబడింది . ఈ అమర్ సింగ్ చాల కాలం క్రితం నుంచి సిమి పైన నిషేధం ఎత్తివేయమని చెబుతున్నాడు . హోం శాఖ నివేదిక వెనుకల ఈ అమర్ సింగ్ పాత్ర ఎంత వుందో ఇంకా తెలియాలి . ఇది ఏమన్నా సమాజ్ వాది పార్టీ - కాంగ్రెస్ - అణు ఒప్పందం అనే కోణం లోంచి కూడా చూడాలి . గత డెబ్భై యేండ్లు గా కాంగ్రెస్ పార్టీ యెక్క అవినీతి అధికారులు మన ప్రభుత్వ విధుల్లో , న్యాయ శాఖ లో , పోలీస్ శాఖ లో , గూఢచార శాఖ లో ఇప్పటికే నిండిపోయి వున్నారు . ఈ కాంగ్రెస్ ప్రభుత్వం , జిహాదిలకేమో పూలగుత్తులు హిందూ మతానికేమో సమాధి కి కావలసిన ఇటుకలను బహూకరిస్తున్నది . ఇక్కడివి కాని ఈ ఇస్లాం , క్రైస్తవం , కమ్మ్యునిజం ల నుంచి హిందువులను కాపాడుకొనుటకు ఒక హిందూ సంస్థ అవసరమేమో అని అనిపిస్తుంది . ఎనిమిదో శతాబ్దం లో జరిగిన అరబ్బుల దాడుల కంటే ఇప్పుడు ఈ మత తీవ్రవాదుల దాడి తీవ్రత ఎక్కువగా వుంది . ఇంకా మన ఆంధ్రప్రదేశ్ లో ముస్లిం రిజర్వేషన్ కూడా మొదలయ్యింది . మైనారిటీ హోదా మరియూ రిజర్వేషన్ హోదా , బాగు బాగు . ఒక తీవ్రవాది వేసుకునే రెండు గ్లౌసుల మాదిరి గా వున్నాయి ఈ యు . పి . ఏ మరియు ఈ సిమి . ' బాబూ సిమి మీరు మరి ముద్దోస్తున్నారు , మీ ఇష్టం వచ్చినట్లు ఈ దేశంలో కల్లోలం చేసుకోండి నాయనా ' అని అన్నట్లు వుంది ఈ కాంగ్రెస్ వ్యవహారం . మన డబ్బులు ఖర్చు చేయడమే రాజకీయ విధి . ఇది అందరికి తెలిసిన విషయమే , కాని తీవ్రవాద కుటుంబాలకు పరిహారమందించే ప్యాకేజి యోచన అనేది ఒక్క కాంగ్రెస్ మాత్రమే చెయ్యగల దుస్సాహసం . ఇలా అయితే దేశం కోసం అసువులు బాసిన వారికి దేశ వ్యతిరేక కార్యకలాపాలు సాగించిన వారికి తేడాఎమో ఆ కాంగ్రెస్ ప్రభుత్వమే తెలుపాలి . ఇక ఈ తీవ్రవాదుల దాడి లో పోయిన హిందువుల వారి కుటుంబ సభ్యుల సంగతి ఆ దేవుడే చూడాలి . తీవ్రవాద దాడి జరిగిన ప్రతిసారి మన ప్రధాన , హెం శాఖ మంత్రుల నుంచి వచ్చే వచ్చే రొటీన్ డైలాగ్స్ ' ఈ క్లిష్ట సమయం లో దేశ ప్రజలు సంయవనం పాటించాలి ' ' ఈ దేశాన్ని ఎవరు విచ్చిన్నం చెయ్యలేరు ' ' ఇక తీవ్రవాదుల ఆటలు సాగవు ' - మన ఉత్తర కుమార ప్రగల్భాలు .
తడబడ్డాడు గోపీ . " కాదు , కాదు . అదికాదు నా ఉద్దేశ్యం . మిమ్మల్ని ఇలా చూడలేను నేను . మీరు
" నను గనినంత నెఱ్ఱనయినట్టి మదీయమనోహరాంగనా హనుయుగముం గరాబ్జముల నంటుచు నంటి , " చెలీ ! వనంబులం గనుపడ వెందుఁజూచినను కన్నెగులాబులు నేడు , ఔనులే ! కనుపడు నెట్లు నీ మృదులగండము లందవి డాగియుండఁగన్ ! "
అదేమిటీ . . ప్రీతీ జింటా వయసు 21సంవత్సరాలా . . ? అని ఆశ్చర్యపోతున్నారా . . ? వాస్తవానికి ప్రీతీజింటా వయసు 36 . కానీ ఈ సొట్టబుగ్గల ముద్దుగుమ్మ 21 సంవత్సరాల అమ్మాయిలా కనిపించడానికి అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది . బొద్దుగా , ముద్దుగా ఉండే ప్రీతిజింతా త్వరలో అందుకు భిన్నంగా స్లిమ్గా హాలీవుడ్ నటిలా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుంది . 50 సంవత్సరాల వయసు దాటినా అలా కనిపించ కుండా ఉండే మడోన్నానే ప్రీతికి ఆదర్శం . . ఇంతకీ మడోన్నా అలా కనపించకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందా అని ఆరాతీసిన ప్రీతీజింటాకి అసలు విషయం తెలిసింది . . హాలీవుడ్ తారలు మడో న్నా , గ్వినెత్ పాల్త్రో , షకీరా , జెన్నిఫర్ అనిస్టాన్ , జెన్నిఫర్ లోపెజ్ తదితరులు హాలీవుడ్ సెలబ్రిటీ ట్రైనర్ ' ట్రేసీ ఆండర్సన్ ' దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటారు . ఆమె ఇచ్చిన ట్రైనింగ్ ద్వారానే వారు వయసు మీద పడుతున్నా . . ఆ ఛాయలు కనిపించకుండా . . నిగనిగలాడుతూ ఉంటారు . ఇప్పుడు ఈ సొట్టబుగ్గల సుందరి కూడా ట్రేసీ అండర్సన్ దగ్గన ఫిట్నెస్ ట్రైనీ తీసుకోవడానికి సిద్దపడింది . ట్రేసీ ట్రైనింగ్తో 15ఏళ్ల వయసు తగ్గుతుందని అంటున్నారు కాబట్టి జస్ట్ 20 , 21ఏళ్ల అమ్మాయిలా ఆమె అగుపిస్తారని ఊహించవచ్చు . సో … ఇక న్యూలుక్తో మళ్లీ బాలీవుడ్లో హీరోయిన్గా కదంతొక్కడానికి రెడీ అవుతోందన్నమాట . . !
అయితే రచయితలొక విషయం గుర్తుంచుకోవాలి . నాలాంటి పాఠకులు వృత్తిరీత్యా , కనీసం ప్రవృత్తి రీత్యా నయినా విమర్శకులు కారు . వాళ్ళ పరీక్షణ శక్తి చాలా పరిమితం అని గ్రహించాలి . ఆ పరిమిత శక్తితో వాళ్ళు చేసే విమర్శకు కించిత్ విలువన్నా ఉందో లేదో రచయితలే పరామర్శించుకోవాలి .
ఎట్టకేలకు భాగ్యనగరంలో ప్లాస్టిక్పై నిషేధం కార్యరూపం దాల్చింది . నిషేధం ప్రారంభమైన తొలిరోజున మేయర్ , మున్సిపల్ కమిషనర్ విడివిడిగా ఆకస్మిక తనిఖీలు చేసి ప్లాస్టిక్ తయారీదారులు , వ్యాపారులను హడలెత్తించారు .
శృంగార సైట్ కాదు . అందరికీ పనికొచ్చేదే . . కానీ ఆ సైట్ పేర్లు ఎవరికీ చెప్పవద్దని తార అన్నాడు అందుకే కొట్టేశా
కుమారుడు రామ్ చరణే తన సినీవారసుడు అని ప్రకటించారు . ' మగధీర ' రికార్డులను బ్రేక్ చేసే సినిమా ఏదీ ఇప్పట్లో రాదని , అసలు రాకపోవచ్చు అని చెప్పారు . ఈ క్రమంలోనే మీరు సినిమా చేస్తే ఆ రికార్డు బద్దలు కావచ్చు కదా అన్న ప్రశ్నకు … ' మనం ఫీల్డ్లోకి దిగితే ఆ రికార్డు చెరగటం ఖాయం . కానీ . . పోనీలే , రామ్ చరణ్ చిన్నవాడు కదా . . వదిలేద్దాం . వాడిని డామినేట్ చేయటం ఈజీ ' అని నవ్వేశారు . పోనీ 151వ సినిమా అనుకుందాం . . ఏదైనా సినిమాలో సీఎంగా అతిథి పాత్ర వస్తే చేస్తారా ? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ' ప్రజలు నన్ను ఆ పాత్రలో జీవించమని . . ఆ అవకాశం వస్తుందని . . అంటుంటే , ఇక నటించటం ఎందుకు ? ' అంటూ మనసులోని మాటను బయటకు చెప్పి ఊహాగానాలకు తెరలేపారు .
తెలంగాణ జిల్లాలు పలు సమస్యలను ఎదుర్కుంటున్నాయి . నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య , తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు , చేనేత కార్మికుల ఆత్మహత్యలు గిరిజన ప్రాంతాల్లో వైరల్ జ్వరాల వంటి వాటితో ఇబ్బందుల పాలవుతున్నారు . మహబూబ్ నగర్ వంటి జిల్లాల్లో వలసలు పెద్ద పెరుగుతున్నాయి .
* మొటిమల పోవాలంటే బాదంపపðను పాలతో కలిపి చిక్కటి పేస్టు చేసేఇ మొటిమలపై రాయండి . మొటిమలు మెత్తబడి త్వరగా తగ్గడమే కాకుండా మచ్చలు కూడా పడవు .
" మేం చదువుకోకూడదా ? మేం రోడ్లమీదకు రాకూడదా ? మాకు ' నో ' అనే హక్కు లేదా ? ఎవడంటే వాడు నిన్ను ప్రేమిస్తున్నాను . నా ప్రేమను ఒప్పుకుని తీరాలి అని బలవంతపెడితే , మృగంలా ప్రవర్తిస్తే మేము ఒప్పుకు తీరాలా ? మా ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేదా ? మేం ఒప్పుకోకపోతే కత్తులతో పొడవడం , ఆసిడ్ పోసి గాయపర్చడం . వీళ్ళంతా ఏ సంస్కృతికి వారసులు ? వీళ్ళకి ప్రేమంటే తెలుసా ? ప్రేమంటే ఇదేనా ? వీళ్ళని శిక్షించే చట్టమేదీ లేదా ? " ఈ ప్రశ్నలను మనం చాలాసార్లు విని వుంటాం . అగ్రికల్చర్ యూనివర్సిటీక్యాంపస్లో ఆసిడ్ దాడికి గురై మరణ యాతన అనుభవించిన అనూరాధ , బెంగుళూరులో అలాంటి దాడికే బలైన వందనా పాటిల్ . ఈప్రశ్నలను పదే పదే వేస్తూనే వున్నారు . ఒక అయేష , ఒక ప్రత్యూష , ఒక స్వప్నిక , ఒక ప్రణీత - నిండు జీవితాలను ' ప్రేమ ' అనే క్రూర క్రీడకి బలిపెడుతూనే వున్నారు . ' ప్రేమ ' ఈ రోజు క్యాన్సర్ కన్నా ప్రమాదకరంగాతయారై ఆడపిల్లల్ని కబళిస్తోంది . ముక్కూ ముఖం లేని స్వప్నిక రూపం , ఉబ్బిపోయి కళ్ళు మూసుకుపోయిన ప్రణీత ముఖాలు మనోఫలకంలోంచి చెదరకుండా పదే పదే కళ్ళముందు కదలాడి కన్నీరు పెట్టిస్తున్నాయి . ఆ కన్నీళ్ళు ఆరకముందే నిందితులు దొరికారన్న వార్త ఎంతో ఊరట కలిగించింది . ఆసిడ్ దాడికి పాల్పడ్డ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో ఘోషించిన వారంతా , వారి అరెస్టుతో ఎంతో ఊరట చెందారు . పోలీసులు చాలా వేగంగా , కేవలం 48 గంటల్లో పట్టుకోగలిగారని ప్రశంసించారు కూడా . అంబేద్కర్ విగ్రహం దగ్గర మహిళాసంఘాలు తలపెట్టిన ధర్నా మాత్రం కొనసాగాలని నిర్ణయమైంది . అయితే శనివారం ఉదయమే ఎవరో ఫోన్ చేసి ధర్నా కాన్సిల్ అయ్యిందని చెప్పినపుడు , ఏమైంది ? ఎందుకు కాన్సిల్ అయ్యింది అని అడిగితే ' వాళ్ళ ముగ్గురిని ఎన్కౌంటర్ చేసేసారు . మీకు తెలియదా ? ' అని చెప్పారు . వెంటనే టీవీ ఆన్ చేస్తే ఎన్కౌంటర్ దృశ్యాలు , ఛానళ్ళ హడావుడి . నిన్న రాత్రి పోలీస్ కస్టడీలో వున్న వాళ్ళు పొద్దున్నే ఎదురుకాల్పుల్లో చనిపోవడం , గుట్టల్లో శవాలు పడి వుండడం , శవాల చేతుల్లో తుపాకులు , కత్తులు వుండడం . నమ్మశక్యంగాని దృశ్యాలు . నిందితుల్ని శిక్షించడమంటే చంపి వేయడమా ? నిన్నటి ఆవేశం , కోపం స్థానంలో క్రమంగా ఆవేదన , భయం ప్రవేశించాయి . పోలీస్ కస్టడీలో వున్న వాళ్ళకి ఆయుధాలెలా వచ్చాయనే ప్రశ్న బుర్రలోంచి పోనంటూ వేధించసాగింది . చేతివేళ్ళు ఛానళ్ళను యా౦త్రికంగా నొక్కుతున్నాయి . టీవీలో దృశ్యాలు మారుతున్నాయి . ఎన్కౌంటర్లో నిందితులను చంపేయడాన్ని పండగలా జరుగుకుంటున్న క్యాంపస్ విద్యార్థులు . టపాకాయలు కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న మరి కొందరు . పోలీసులు చాలా మంచి పని చేసారని ఎస్ఎమ్ఎస్లు పంపిస్తున్న వాళ్ళు . తేనె పూసిన కత్తిలాంటి నవ్వుతో అభినందనల్ని స్వీకరిస్తున్న ఉన్నత పోలీసు అధికారి . ఆడపిల్లలు అందిస్తున్న పువ్వుల బొకేలని గర్వంగా అందుకుంటూ , టీవీలకు ఫోజులిస్తున్న ఆ అధికారిని చూస్తుంటే నా వొళ్ళంతా జలదరించింది . మూడు ప్రాణాల్ని తూటాలకు బలిచ్చిన అతని ముఖంలోని ఆ నవ్వుని నేను ఈ జన్మకి మర్చిపోలేననుకుంటాను . దృశ్యం మారింది . టీవీ యా౦కర్ల రిపోర్టర్ల వికృత చర్యలు . హాస్పిటల్లో చావు బతుకుల మధ్య పోరాటం చేస్తున్న వాళ్ళ ముఖాల దగ్గర , వాళ్ళ బంధువుల ముఖాల వద్ద మైక్లు పెట్టి మీరేమనుకుంటున్నారు ? ఎన్కౌంటర్ మీకు సంతోషాన్నిచ్చిందా ? తూటాలకు బలివ్వడం బావుందా ? లేదావాళ్ళని యాసిడ్ పోసి చంపి వుండాల్సిందని మీరు భావిస్తున్నారా ? ఈ అంశంపై ఎస్ . ఎమ్ . ఎస్లు చేయండి . మీ అభిప్రాయం చెప్పండి . నోరు విప్పి సరిగా మాట్లాడలేక పోతున్న ప్రణీత నోట్లో మైకు కుక్కి మాట్లాడించిన ఈ భయానక , బీభత్స , జుగుప్సాకర దృశ్యాలను చూడాల్సి రావడం ఎంత బాధాకరం . అతి తీవ్రంగా గాయపడి , వైద్యం పొందుతున్న ఆ పిల్లల దగ్గరికి ఈ టీివీ రిపోర్టర్లను ఎలా అనుమతిస్తున్నారో ఎంతకీ అర్ధం కాని ప్రశ్న . టీవీలలో నడుస్తున్న ఈ అమానవీయ దృశ్యాలు మనసును ఎంత బండ బారుస్తున్నాయె , సున్నితంగా స్పందించడం అంటే ఏమిటో మర్చిపోయేలా తయారు చేస్తున్నాయె చూస్తుంటే , మీడియా మహా విశ్వరూపం వెన్నులోంచి చలి పుట్టిస్తోంది . వరుసగా జరుగుతున్న సంఘటనలు మనసు మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి . అమ్మాయిల మీద జరిగిన పాశవిక దాడి , పదే పదే పునరావృతమౌతున్న సంఘటనలు , పువ్వుల్లాంటి పిల్లల ముఖాలు మాడి మసి బారిపోయిన దృశ్యాలు , దోషుల్ని శిక్షించమని కోరిన జనాగ్రహాన్ని తెలివిగా తమ వేపు మళ్ళించుకుని ఏకంగా ప్రాణాలే తీసేసిన పోలీసుల క్రూరత్వం . దీన్నంతా పంచరంగుల సినిమాలా జనం మెదళ్ళలోకి రీళ్ళు రీళ్ళుగా పంపిస్తున్న మీడియా . ఏం జరుగుతోందసలు ? మనం ఎటువెళుతున్నాం ? అసలు విషయలను గాలికొదిలేసి , వేరుకు పట్టిన చీడనొదిలేసి పైపైన పాకుతున్న పురుగుల్ని చీదరించుకుంటే ఏం లాభం ? ' మహిళా సాధికారత ' అంటే పావలా వడ్డీ అనుకునే చోట , మహిళల మీద పెరుగుతున్న నేరాలకు కారణాలను అన్వేషిించకుండా , ఆ నేరాలను అరికట్టే చర్యల్ని ఆదిలోనే తీసుకోకుండా , ఇంటా బయటా హోరుగాలిలో దీపంలా రెప రెపలాడుతున్న స్త్రీల జీవితాలను ఆసిడ్లకు , కిరోసిన్లకు , కిరాతకాలకు బలిస్తున్న చోట ఇలాగే , ఇంత బీభత్సంగానే వుంటుంది . స్త్రీ , పురుషుల సమానత్వం అనే మాట మచ్చుక్కూడా వినబడని , ఆలోచనల్లో , దృక్పధాల్లో మార్పుకోసం ఉద్యమ స్పూర్తిని నింపని రాజకీయ కలుషిత వాతావరణంలో ఇలాంటి దృశ్యాలనే చూడాల్సి వుంటుంది . మాకు హక్కుల్లేవా ? అంటూ ఆడపిల్లలు అరుస్తూ బలవుతూనే వుంటారు .
2 . ఇటీవల గ్రీన్ ఛానెల్ కౌంటర్ పేరుతో కొత్తగా ప్రయోజన సర్వీసును ప్రారంభించిన బ్యాంకు
మరి కంప్యూటర్లు ఇంత వృద్ధి చెందాయి గదా ! FORTRAN లాంటి పురాతన భాషలు కాక , Java , . Net ఇలా కొత్త కొత్త కంప్యూటర్ భాషలొచ్చాయి . " ఇంత వృద్ధి జరిగినా , ఇంతకుముందు ఏది అసాధ్యమో , కష్టమో అది ఇంకా అలానే ఉండిపోయిందా ? " అని అడగచ్చు . ఈ మార్పుల మూలంగా , మౌలికమైన సాధ్యాసాధ్యాల విషయాల్లో ఎలాంటి మార్పూ ఉండదు . దీని గురించి మరో సంఘటన చెప్తాను .
చదవాల్సినవి : ఇందులో చదవాల్సింది ఏమీలేదు . అలాగే ఈ బ్లాగులో ఇచ్చిన సినిమా లింకుల్ల్లో పెద్దగా చూడాలసిన సినిమాలు కూడా ఏమీ లేవు .
పాకలకాడున్న కుర్రోడిని కలిసి ఇవరం అడిగేరు . " దార్లో వత్తా వత్తా నీళ్ళకని చెరువులో దింపేడంటండే గేదినే . . ఆ చెరువులోనే నిద్రోతుందంటండే . . ఇక్కడ దగ్గర్లోనేనండే ఓ కిలోమీటరుంటాదండే . . ఒత్తారేంటి ఎల్దాం " , అన్నాడు కుర్రోడు .
నేను తిట్టుకోవడం లేదండీ . . కేవలం ఆశ్చర్య పోతున్నాను . మీరు చిన్నప్పుడు నాచురల్ సైన్స్ చదవలేదా ? అసలు మీరు డిగ్రీ చేసింది ఏ బ్రాంచిలో ? పోనీ కనీసం కంప్యూటర్ పరిఙ్ఞానం లేదా ? వాటిని ఇంగ్లీషులో ఏమంటారో తెలీదా ? పోనీ తెలుగులోనే వీటన్నింటినీ గూగుల్లో వెతుకుదామని పించలేదా ? బొమ్మలతో సహా వివరించే సైట్లు చాలానే ఉన్నాయి కదా ? రెడ్డి ఎవరు మీ భర్తేనా ? ( క్షమిచాలి ఇలా అడుగుతున్నందుకు ) , అయితే . . వాటి గురించి చెప్పడానికి ఫీలవ్వడములో అర్థమేలేదు . నాకు మాత్రం మీకు తెలిసే ఇవన్నీ రాశారనిపిస్తోంది . మగవారి సెక్సు సామర్ధ్యాలపై ఉన్న రక రకాలను అపోహలను ఖండించడమే మీ ధ్యేయం అయితే . . మీరు ఇలా మొదలు పెట్టాల్సింది కాదనిపించింది . ఎందుకంటె . . నాకు ఇది చదవగానే . . ఆడవారికి వచ్చే రోగాల పేర్లన్నీ రాసి అది అంటే ఏమిటి అని అడగాలని పించింది . ఎవరో ఒకరు అలాంటి పని చేసినంత మాత్రాన నేనూ అలాంటి పనే చేయాలా అని ఆగిపోయాను అంతే . చాలా మంది మగవారు కూడా తమ జననావయవాల సమస్యలను భహిర్ఘతంగా చెప్పుకోలేరు . దాన్ని వెక్కిరించాల్సిన అవసరం లేదు . ఇలాంటి వ్యాధులున్నప్పుడు డాక్టరు దగ్గరకి వెల్లరు అనేది కేవలం అపోహ మాత్రమే . కాకపోతే , డాక్టరు దగ్గరికి వెలితే ప్రొసీజరు వేరుగా ఉంటుంది , ఆపరేషను అవసరం అనే వాల్లుంటారు , వీరిదగ్గర కేవలం మందుల ద్వారా నయం చేస్తాం అనే హామీలుంటాయి . కావాలంటే . . బయట బజార్లో . . చిన్న పిల్లలు ఇలాంటి ప్రకటనలకు సంభందించి పాంప్లెట్లు పంచుతూ ఉంటారు ( పల్లెటూర్ల లాంటి చిన్న చిన్న పట్టణాల్లో ) ఒక సారి అడిగి తీసుకొని పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది . ( మీరు స్త్రీ కాబట్టి , వారు మీకు ఇవ్వరు , అబ్బాయిలకే అవన్నీ ఇస్తారు , సహజంగా . మీరు ఇవ్వమని అడిగితే . . ఇవ్వచ్చు ) . ఇక డ్రాగన్లతో పోరాటాలు , ప్రపంచాన్ని రక్షించడాలూ ఇవన్నీ ఫాంటసీలు , మనిషికి వచ్చే రోగాలను ఫాంటసీలతో పోల్చి ఇవో లెక్కా అనడం విచిత్రంగా ఉంది . స్త్రీ సహనసీలి అంటు ఏవోవో చెబుతుంటారు . . ఆడవారి గురించి మరి వారికి వచ్చే రోగాల గురించి మేమూ ఇలానే అనుకోవాలా ? ఇంత సహనమున్నవారికి ఇవో లెక్కా అని ? నాకు మాత్రం మీ ఉద్దేశ్యములో చాలా తేడా కనిపిస్తోంది . . ఆ వెక్కిరింతలు , సెటైర్లూ , ఇవన్నీ ఎందుకో అర్థం కావడం లేదు . మీరు దేనిమీదో కోపం దేనిమీదో చూపిస్తున్నట్టుగా ఉంది .
సురపానలాంతకసుర వరుణానిల ధనద రుద్ర వందిత చరణున్ ధరణి జల వహ్ని మరు దం - బర రవి సోమాత్మమూర్తిఁ బరము నుతింతున్ ( 2 . 104 )
మా చిన్నతనం లో మా పక్కింటి మామ్మ గారు చెప్పేవారు . . వాళ్ళ ఆస్థాన మంగలికి సంవత్సరానికి రెండో మూడో బియ్యపు బస్తాలు ఇచ్చేవారుట . ఆ రోజుల్లో ద్రవ్య వినిమయం వస్తు మార్పిడి పద్దతిలో ఉండేదిట . పాపం మామ్మ గారు వాళ్ళ అత్తగారు కూడా ఆ మంగలి చేతనే పూర్తి క్షవరం చేయించుకునే వారుట ( ఉదయం 5 గంటలకు ముందే )
చల్ల గాలి వీస్తోంది . చాలా సార్లు కూర్చుని మాట్లాడుకున్న మేమి ఈ సాయంత్రం ఎందుకో నడుస్తూ మాట్లాడుకుంటున్నాం .
కర్రలన్నీ తనయనుకున్నాక కలిగిన భావన , ఇప్పుడు సగం కర్రలు తనయికావని తెలిసినాక కలిగిన భావన పొయ్యితో కలుపుకుంటే ఏదో దూరపుతనం ఏర్పడుతున్నట్టనిపించింది దేవవ్వకు . ఇంట్లో పొయ్యిని చూసినా , అడవిలో పొలంను చూసినా ఏదో అంటరాని వస్తువును చూసినట్టుగానే అనిపిస్తుంది . పొలంలో తిరుగుతుంటే తనకు తాను ఒంటరిగా తెలియని జాగలో తిరుగుతున్నట్టనిపించింది .
రాగి చెంబు ( తో శ్రేష్ఠము . ) తో గానీ , ఇత్తడి చెంబుతో గానీ , నూరాలి .
ఆ బూఱుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురముండేది . ఆ శుకం తన పిల్లలకు నివ్వరిపైరు ఆహారముగా పెట్టేది . తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలు . అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేశేది తామ్రతుండం . ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు క్రింద పడేవి . కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి కాలక్రమేణ ఒక చిన్న వరిపైరు తయాఱయింది !
ఈ మధ్య మన సర్వోన్నత న్యాయ స్థానం సహజీవనాలని సమర్థించింది .
నేను చనిపోతున్నాను . వయసు యాభై పైన పడింది . నేను జీవించిన జీవితానికి . . ఇంతకంటే ఎక్కువ ఆశించినా అత్యాసే అవుతుందేమో . నా శరీరానికి నేనెప్పుడూ గౌరవం ఇవ్వలేదు . దానికి కేవలం నా రుచులకు వాడుకున్నాను . నాకు ఉన్న దురలవాట్ల గురించి నేను గుర్తు చేసుకోవాలనుకోవడం లేదు . . ఎందుకంటే కనీసం నామీద నాకు కాస్తంత గౌరవం మిగిలి ఉండాలి అనేది నా ఆఖరి కోరిక . కరెంటు పోయింది . . కాస్త గాలి కూడా ఆడడం లేదు . పైగా నా చుట్టూ ' నా ' అనేవాళ్ళు ఉన్నారేమో ? ఊపిరి సలపనీయడం లేదు . కొడుకూ . . కోడలు అందరికంటే ఎక్కువ ఏడుస్తున్నారు . నేను పోతున్నానని ముందే తెలిసింది వాళ్ళకి . నిజానికి ఏడిచే వాళ్ళు వాళ్ళ ప్రేమని చెపుతున్నామని . . వెలిబుచ్చుతున్నామని అనుకుంటారు . కానీ ఏడిచి నన్ను ఇంకొంచెం ముందే పంపేస్తున్నారని వాళ్లకి తెలీయదు . ప్రేమ కూడా ఇబ్బందికరం గా ఉండేది ఎక్కువగా ఇలాంటి సందర్భాలలోనే . ఇక చూడడానికి వచ్చేవాళ్ళు నాకోసం ఏవో పళ్ళు తీసుకొచ్చి . . నాకు అందకుండా ఎక్కడో పెట్టేస్తారు . వాళ్ళు చెప్పే పనికిమాలిన కబుర్లు వినాలనుకుంటారు . ఇలాంటి సందర్భంలోనే గుండెకి ధైర్యం కావాలని , మనిషి ఆశాజీవిగా బ్రతకాలని చెప్పి ఉన్న కష్టాలను పదే పదే వివరించి హింసించి . . మరచిపోయిన ఎప్పటివో వాళ్ళ జ్ఞాపకాలను నాకు వదిలేసి వెళ్ళిపోతారు . ఇలాంటి వాళ్ళను చూస్తూ చూస్తూ ఇదే మంచం మీద ఇప్పటికే ఒక నెల రోజులు గడిపేసాను . నా భార్య తెలివైనది . నాకన్నా ముందే వెళ్ళిపోయింది . తను నాఅంత ఇబ్బంది పడలేదు . నిద్రలో పోవడమంత సుఖమైన చావు మరొకటి ఉండదు . కానీ ఒక రకంగా నేనే తనకన్నా అదృష్టవంతుడిని . చావును ప్రతిక్షణం దగ్గరనుండే చూస్తూ పరిచయం పెంచుకుంటున్నాను . నేను పోతే నావాళ్ళు ఎలా స్పందిస్తారో ముందే తెలుసుకున్నాను . నేను తెలుసుకున్నది తెలుసుకోక పోయినా పెద్దగా ఏమీ నష్టం లేదని తరువాతే తెలిసింది . అన్నిటి కన్నా కష్టమైనా విషయం మనం దయనీయమైన స్థితిలో ఉన్నామని ఒప్పుకోలేకపోవడమే . మనిషి తను తన దగ్గర లేని దానిగురించి ఎక్కువ ఆలోచిస్తాడు . ఉన్నది తక్కువైందని భాదపదతాడు . తృప్తి లేకపోవడమే దయనీయమైన స్థితి . . అది ఎంత మాత్రమూ ఒప్పుకోడు . ఎందుకో ? నాకు డబ్బుల్లు , మనుషులు , పేరు , ఎంత సంపాదించినా . . ఎంత ఎదిగినా ఇక చాలు అనే ఆలోచన రాలేదు . ఎక్కువ అని అనిపించనూ లేదు . ఇక్కడ క్షీణోపాంత ప్రయోజన సూత్రం వర్తించలేదు . ఇప్పుడు కూడా నాకేదో ఆరోగ్యం తక్కువైందని ఆలోచనే . అయితే ఇలా నా ఆరోగ్యం క్షీణ దశకు వచ్చింది నావల్లే . ఉన్నపుడు దానిని గౌరవించలేదు . లేనపుడు లేదు లేదని ఆలోచించినా ప్రయోజనం లేదు అని తెలిసినా ఆలోచిస్తున్నాను . నేను సగటు మనిషిని . నర్సు వచ్చి అందరినీ బయటకి పంపేసింది . ఇప్పుడు ఈ రూములో నేను ఒక్కడినే మిగిలిపోయాను . నాకిది కొత్త కాదు . ఈ గదిలో ఆ సిలిన్ బాటిల్ స్టాండుకు , ఈ మంచానికి , దూరంగా కనపడే ఆ మందుల స్టాండుకు , తెల్ల రంగు గోడలకు , రోజులో సగం సరిగా తిరగని ఈ పంకాకు . . నాకు మంచి స్నేహం ఏర్పడ్డాయి . అవి ఏదో చెపుతున్నట్టు . నాకు నేనే చెప్పుకుని నవ్వుకుంటూ ఉంటాను . ఇది నెల రోజులుగా జరుగుతూనే ఉంది . మొదట్లో ఇబ్బంది గా ఉండేది . తరువాత అలవాటయిపోయింది . నిజానికి ప్రేమగా చూసే దృష్టి ఉండాలి కానీ చేతనా అచేతనా అవస్తల్లోనూ మనకి నా అనే భావం ఏర్పడడానికి , అభేదాన్ని తెలుసుకోవడానికి పెద్ద సమయం పట్టదు . ఇలాంటి విషయాలు వెళ్ళిపోయే ముందు తెలుసుకోవడం అన్నిటికంటే భాదాకరం . అలా నేను తెలుసుకున్న మరుక్షణం నా నుండి ఆశించిన ప్రేమ దొరకని వారి అందరికీ . . నేను వదిలించుకున్న వస్తువులకి . . మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాను . జీవితానికి అనేక కోణాలు ఉంటాయి . నాకిప్పుడు అనిపిస్తోంది . నేనెప్పుడూ ఒకే కోణంలో ఆలోచిన్చేవాడినేమో అనే . దానిపేరే ' నాకోసం ' . నే చేసే ప్రతి పనిలో రెండు కోణాలు ఉండేవని నా అభిప్రాయం . ఒకటి ' నేను ' రెండోది ' ఇతరులు ' . ఇందులో తూకం ఎప్పుడూ నా వైపే తూగేది . నాకు తెలిసి అది ఎప్పుడూ నాకు చెడు చేసిందనిపించలేదు , అందుకే నేను దాన్ని నేనెపుడూ మార్చుకోలేదు . కానీ నేను చెడు చేస్తున్నానన్న విషం లాంటి విషయం తాగడానికి కూడా ఎప్పుడూ ప్రయత్నించలేదు . అది చేసుంటే బాగుండేదని ఇప్పుడు అనిపిస్తోంది . దీన్నే పశ్చాత్తాపం అంటారేమో . అయితే ఒకటి నిజం . ఎంత గొప్పదైనా మార్పు సమయం దాటేసాక వస్తే . . దాని విలువ సున్నాకే సమమౌతుంది . అదిగో కరెంటు వచ్చింది . . ఆ ఫాను తిరుగుతోంది నా మెదడులో ఆలోచనల్లా . . అవి ఎందుకో అస్సలు ఊరుకోవు . అలసిపోవు . ఇంతసేపూ ఎప్పుడు వస్తుందా అని చూసిన కరెంటు వచ్చేసింది . కానీ ఇకనించీ ఎప్పుడు పోతుందా అని ఎదురుచూస్తూ గడిపేస్తాను సమయం . నాకు ఏదోవిధంగా . . నే వెళ్ళేంత వరకూ సమయం గడవడం కావాలి . అందుకే నా దారులు నేను వెతుక్కుంటున్నాను . ఇంతలో నా కొడుకు వచ్చాడు . " నాన్నా చిన్న పనిమీద బయటకి వెళ్తున్నాను . ఏమైనా అవసరమైతే నీ కోడలు , మనవాళ్ళు బయటే ఉన్నారు " - చెప్పి వెళ్ళిపోయాడు . నాకిదేమీ కొత్త కాదు . వాడి చిన్నప్పటి నుండీ నేను వాడితో గడిపిన సమయం చాలా తక్కువ . ఇప్పుడు వాడు పెద్దవాడయ్యాడు . . నన్నే అనుకరిస్తున్నాడు . నేను ఇంతకమించి ఎక్కువ ఆశించకూడదు . నేను ఏమి ఇచ్చానో అదే నాకు తిరిగి ఇచ్చేసి వెళుతున్నాడు . సంపాదన పేరుతో నేను నా కుటుంబానికి చాలా తక్కువ సమయం ఇచ్చాను . కానీ ఇప్పుడు నా సంపాదన ఆ కాలాన్ని వెనుకకు తిప్పలేదు . లెక్కకు మించిన సంపాదన . లెక్కలకు మించిన తప్పులతో సమానం , ఆ తప్పులను దిద్దుకోవడం అంత సులభం కాదు . నాకా అవకాశమూ లేదు . జీవితం చాలా చిన్నది అని అంటారు . కానీ అది పెద్ద తప్పు . జీవితం చాలా పెద్దది . తప్పులు చేయడానికి . . వాటిని తెలుసుకోవడానికి తిగిరి మంచి చేయడానికి . . మనిషికి చాలా జీవితం ఉంటుంది . అది తెలుసుకునేందుకే మనిషి సిద్డంగాలేడు . ఇంతకీ నేను ఇప్పుడు నాతో ఏం తీసుకెళ్ళడానికి ఇంకా ఎదురుచూస్తున్నాను ? నాకూ తెలియదు . రెప్పల బరువు నేను మోయలేనంతగా ఉంది . నెమ్మది నెమ్మది గా మొత్తం చీకటి అయిపోయింది . ఇప్పుడు నాకు ఏమీ కనపడడం లేదు . . ఎవరో నన్ను బలంగా లాగుతున్నట్టు నేను అనే నా అస్తిత్వాన్ని బద్దలు చేస్తూ ఏదో వెలుగులోకీ ఈడ్చబడుతున్నట్టు . . అనిపిస్తోంది . నా చుట్టుపక్కలెవరో చేరుతున్నారు . అది ఏడుపే . కానీ నాకు వినపడం లేదు . ఇప్పుడు వాళ్ళ భాధ తాలూకు తరంగాలు మాత్రమే నన్ను తాకుతున్నాయి . ఇక్కడినుండీ నేను దూరంగా వెళ్ళిపోతున్నాను . నాకు తెలుస్తోంది . . ఇప్పుడిక ఉన్నా నేను లేనట్టే .
CBS - TV కలర్ టెలివిజన్ సిస్టంతో పనిచేసిన మొదటిదిగా ఉన్నప్పటికీ , వారు 1953లో RCAతో ఓడిపోయారు , ఎందుకంటే CBS కలర్ సిస్టం కొంతవరకూ అప్పటికే ఉన్న బ్లాక్ - అండ్ - వైట్ సెట్ల మీద పోటీని ఇవ్వలేక పోయాయి . RCA ( NBC యొక్క మాతృ సంస్థ ) దానియెుక్క కలర్ సిస్టంను CBSకు అందించినప్పటికీ , ఈ నెట్వర్క్కు RCA యొక్క లాభాలాను పెంచటం ఇష్టంలేదు మరియు అందుచే కొన్ని ప్రత్యేకమైన వాటిని మాత్రమే దశాబ్దం మిగిలిన భాగంలో కలర్లో ప్రసారం చేసింది . ప్రత్యేక కార్యక్రమాలలో ఫోర్డ్ స్టార్ జూబిలీ కార్యక్రమాలు ఉన్నాయి ( ఇందులో MGM యొక్క 1939 చిత్ర మహాకావ్యం ది విజార్డ్ ఆఫ్ ఓజ్ మొదటిసారిగా ప్రసారం చేసింది ) . ప్రదర్శించిన మిగిలిన ప్రత్యేక కార్యక్రమాలలో : 1957లో ప్రసారం అయిన రోడ్జర్స్ మరియు హామ్మెర్స్టీన్ యొక్క సిండ్రెల్లా , కోల్ పోర్టర్ యొక్క సంగీత తర్జుమా అయిన అలాద్దిన్ , మరియు ప్లేహౌస్ 90స్ యొక్క ఒకేఒక్క కలర్ ప్రసారం , 1958లో నిర్మించిన ది నట్క్రాకర్ ఉన్నాయి , వీటి నృత్య దర్శకత్వాన్ని జార్జ్ బాలచైన్ ప్రదర్శించారు . ఈ ప్రసారం 1954 నుండి న్యూయార్క్లో ప్రతి సంవత్సరం ప్రసారం అవుతున్న ప్రముఖ నిర్మాణం మీద ఆధారపడి ఉంది , మరియు దీనిని న్యూయార్క్ సిటీ బాలే నిర్వహించింది .
అంతా విన్న దాసరి ప్రసన్నుడయేడు . " దేని ఫలం ఏమిటో నాకేమీ తెలీదు ; అన్నిటినీ చూసుకునే వాడు ఆ నారాయణుడొక్కడే " అని దాసరి అంటూండగా అతని మాటలు అతని నోట్లో ఉండగానే బ్రహ్మరాక్షసుడి రూపం మారిపోసాగింది . మళ్ళీ సోమశర్మగా , వైష్ణవ చిహ్నాలు ధరించి నిలిచేడు ఎదురుగా . దాసరిని స్తోత్రం చేసి పూజించేడు .
బైపీసీ విద్యార్థులు ఫిజిక్స్ , కెమిస్ట్రీల సబ్జెక్టుల్లో అయితే ప్రాబ్లమ్స్పై ప్రధానంగా దృష్టి పెట్టి చదవాలి .
గురూజీ , ఆరు సూత్రాలు , ఏదుసూత్రలు , మల్కీలూ , పెద్ద మనుషుల ఒప్పందాలూ , చిన్న వాళ్ళ అగ్రిమెంట్లూ నాకు తెలియదు , నాకు అంత పరిజ్ఞానం లేదు . . అవి మీలాంటి మేధావులకు తెలుసు . . ఆంధ్రా లో కూడా ఎవరో దానికి సంబంధించిన వాళ్ళకి , మేధావులకి , తెలుస్తాయి . నేను ఒక సామాన్య మానవుడి గా నా స్పందనని రాశాను . తెలివి గా మాట్లాడటానికి నేనేమైనా ఆ క్లర్క్ ని అవినీతి చెయ్యమన్న అధికారినా ? నాకు ఆ క్లర్క్ అవినీతి చేస్తే ఏమి వస్తుంది ? నేను ఉండేది రాష్ట్రం బయట . మీరు చూసినంత దగ్గర గా ఈ అవినీతిని నేను చూడలేదు . తెలంగాణా కావాలంటే తీసుకోండి . కానీ సామాన్య ఆంధ్ర ప్రజల మీద ద్వేషం పెంచుకోవద్దు . మీరు కొంత పాజిటివ్ దృక్పధం తో చూస్తే నేనన్నది మీకూ అర్ధమౌతుంది . నేను నా టపా లో వేసిన ప్రశ్న లకు మీరు అనుకూల దృక్పధం తో సమాధానం చెప్తే సంతోషం .
కంప్యూటర్ ఎరా తెలుగు సాంకేతిక పత్రిక " వెబ్ లో తెలుగు వెలుగులు " పతాక శీర్షికతో ఇప్పుడు లభ్యం . అన్ని విషయాలను ( ఏదీ వదల లేదేమో బహుశా ) అంత నేర్పుగా కూరి కూరి అద్భుతంగా వండి పడేసిన ఘనత మాత్రం జ్యోతి గారిదే . అన్ని పేజీలకు తమ అమూల్యమైన పత్రిక పుటలను కేటాయించిన పెద్ద మనసు మన నల్లమోతు శ్రీధర్ గారిదే . . . వారిద్దరికి మనసారా ధన్యవాదాలు . నిన్న రాత్రి నేను నా ప్రతి కొనుక్కున్నా . . . పదిహేను రూపాయలలో మీకు పది రోజులకు సరిపడా చదువుకునేందుకు అందులో విషయాలు వున్నాయి . మరెందుకిక ఆలస్యం . . . మీ ప్రతి కొనుక్కునేందుకు బయల్దేరండి . లేదా సంవత్సర చందాదారులుగా చేరండి . మన అమ్మా నాన్నలకు కంప్యూటర్ నేర్పాలంటే ఇంతకంటే మంచి పుస్తకం దొరకదు .
పెద్ద జాతి మొసళ్ళు మనుషులకు చాలా ప్రమాదకరమైనవి . వాటి " నడక " వేగం కంటే మెరుపులా మీదపడే లక్షణం వల్ల మనుషులకు తప్పించుకొనే అవకాశం చాలా తక్కువ . వీటిలో ఉప్పు నీటి మొసలి మరియు నైల్ మొసలి యేటా ఆఫ్రికా , ఆగ్నేయాసియాలలో వందలాది మనుషుల మరణాలకు కారణమవుతున్నాయి . మగ్గర్ మొసలి మరియు నల్ల కెయ్మన్ కూడా చాలా ప్రమాదకరమైనవి . అమెరికన్ ఎలిగేటర్ అంత ప్రమాదకరమైనది కాదు . రెచ్చగొడితే తప్ప తనంత తనుగా ఇది మనుషులపై దాడి చేయదు . . . . . . పూర్తివ్యాసం : పాతవి
పద్మ ఏమే రాధా . . ఎంతవరకూ వచ్చాయే నీ విడాకులు ?
ఆఫీసులో కాస్త పని తగలడంవలన , ఇంటికి కాస్త లేటుగా వెళ్ళాల్సిరావొచ్చునని శ్రీరామచంద్రుడు సీతాదేవికి ఫొన్ చేయసాగాడు . . చాలాసేపటివరకూ నెట్వర్క్ బిజీ అని వచ్చేసరికి . . శ్రీరామచంద్రులవారికి ఓపిక నశించింది . . " ఛ . . ఆ బిఎస్ ఎన్ ఎల్ తీస్కోవద్దూ . . సరిగా సిగ్నల్ ఉండదు అని చెప్పినా వినిపించుకోకుండా . . అదే కావాలని మారాంచేసి మరీ తీసుకుంది సీత . . ఇప్పుడు అవసరమైనప్పుడు ఈ నెట్వర్క్ బిజీ అవుతుంది " , అని చిరాకు పడ్డారు . కాసేపటికి కనెక్ట్ అయ్యింది . . కానీ ఎంతసేపు రింగ్ అవుతున్నా సీతాదేవి ఫోన్ లిప్ట్ చేయకపోయేసరికి , శ్రీరాముడు మనసు కాస్త శంకించింది . . ఎదన్నా ప్రోబ్లమ్ ఏమోనని . . కాస్త భయమేసింది . కొంతసేపటికి ఫోన్ లిప్ట్ చేసారు కానీ సీతాదేవి మృదువైన పలుకులు కాక . . కేకలు వినిపిస్తున్నాయి . . ఎవరిదో భయంకరమైన నవ్వు వినిపిస్తుంది . చుట్టూ పెద్ద హెలీకాప్టర్ సౌండులాగా . . గోలగోలగా ఉంది . . ఆ భయంకర నవ్వు నవ్వుతున్న వ్యక్తి . . " మాట్లాడు ఇదిగో మీ శ్రీరామచంద్రుడితో . . నిన్ను నా లంకకు తీసుకెళ్తున్నానని చెప్పు . . కావాలంటే ఎడ్రసు చెప్తాను నోట్ చేసుకోమను . . గ్రేట్ లంకా ఎవెన్యూ , ఫేస్ సెవెన్ . . అక్కడ దిగి టాక్సీ ఎక్కి . . రావణ్ మహల్ . . అంటే ఎవడికైనా తెలుస్తుందని చెప్పు . . " , అని గర్జిస్తూ డైలాగులు వినపడ్డాయి . ఏదో పెద్దశబ్దంతో ఫోన్ కట్టయ్యింది . శ్రీరాములవారికి కంగారు మొదలయ్యింది . ఎదో అనుకోని ప్రమాదంలో సీత చిక్కుకుంది అని లక్ష్మణునికి ఫోన్ చేసాడు . " జయ జయ రామ్ . . శ్రీరామ పరంధామా . . జయరామ పరంధామా . . రఘురామ రామ రణరంగ భీమ … జగదేక సార్వభౌమా … … " , ( లవకుశ సినిమాలోని పాట ) అని వస్తున్న లక్ష్మణుడి ఫోన్ కాలర్ ట్యూన్ ని టెన్సన్ తో వింటున్నారు శ్రీరాములవారు . లక్ష్మణుడు ఫోన్ తీసి " అన్నయ్యగారు . . నేను బయట ఉన్నాను ఇంటికి వెళుతున్నాను . . చెప్పండి " అని వినయంగా అడుగగా . . శ్రీరాములవారు అంతా వివరంగా చెప్పారు . కంగారుపడ్డ లక్ష్మణులవారు . . " అవునా ? అన్నగారు . . ! ! నన్ను బజారుకు వెళ్ళమన్నారు వదినగారు . . నేను అన్నయ్యగారు వచ్చాక వెళ్తాను అంటే కాస్త కోప్పడ్డారు . సరే కదా అని ఒంటరిగా విడిచి వెళ్ళాను " . " బజారునుండి బయలుదేరేటప్పుడు ఎదో మర్చిపోయి అడుగుదాం అని వదినగారికి కాల్ చేస్తుంటే ఈ నెంబరు మనుగడలో లేదు మీరు కాల్ చేసిన నెంబరు సరిచూసుకోండి అని చెప్తుంది . . నాకర్దంకాలేదు . . సరేలే అని లేండ్ నెంబరుకు ట్రైచేసాను . . అది కూడా లిప్ట్ చెయ్యలేదు . . అసలే అది చక్రవాకం సీరియల్ వచ్చే సమయం . . వదినగారు ఇల్లువిడిచి ఎక్కడకూ వెళ్ళరు కూడా . . అందుకే కంగారుగా ఇంటికి చేరుకుంటున్నా " , అని . . చెప్పాడు లక్ష్మణుడు . . జరిగిందానికి శ్రీరాములవారు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు . లక్ష్మణుడు ఎలా జరిగుంటుంది అంతా విచిత్రంగా ఉందే . . అని విశ్లేషణ చేయసాగాడు . " ఎలాగైనా ఆ లంకా ఎవెన్యూ ఎంతదూరమో కనుక్కొని వాడి పని చెబుదాం మీరేమీ టెన్సన్ పడొద్దు . . మా స్నేహితులందరికీ ఈ విషయం ఎసెమ్మెస్ చేసాను . . ఎవరో హనుమంతులవారని మంచి మేధావి మహాబలుడు ఉన్నారని రిప్లై వచ్చింది . వివరాలు అన్నీ కనుక్కున్నాను . అతను ఎటువంటి ఎడ్రసునైనా గూగుల్ లో వెతికి పట్టేస్తాడంట . . ఎలాంటి చోటకైనా వెళ్ళి చెప్పిన పనిని సునాయసంగా చేయగలడంట . . అందుకే ఆయనని తీసుకురమ్మని నా స్నేహితునికి చెప్పాను . ఇప్పటికి వాళ్ళు బయలుదేరి ఉంటారు . . మీరేమీ చింతించవద్దు . మనకంతా మంచే జరుగుతుంది అన్నయ్యా " , అని . . శ్రీరాములవారిని ఓదార్చాడు లక్ష్మణుడు . హనుమంతులవారు హడావుడిగా శ్రీరాములవారిని చేరుకుని నమస్కరించారు . " నేను మీకు చాలా అభిమానిని సార్ . . ఎప్పట్నండో మిమ్మల్ని కలవాలని ఎదురుచూస్తున్నాను . కానీ ఇలా కలవాల్సొస్తుంది అని అనుకోలేదు . . మీరేమీ భాదపడొద్దు . ఇప్పటి టెక్నాలజీతో సాధ్యంకానిది ఏదీలేదు . . నేను మీకు తప్పనిసరిగా సాయపడతాను " , అని హామీ ఇచ్చి తన దగ్గర ఉన్న లాప్ టాప్ ని ఓపెన్ చేయసాగారు హనుమంతులవారు . " ఇది ఇంటెల్ వారి సెంట్రినో డ్యూయో తో బలపర్చబడినది . . చాలా వేగవంతమైనది . . " , అంటూనే గూగుల్ ఎర్త్ స్టార్ట్ చేసి . . సెర్చ్ చేయడం మొదలుపెట్టారు . లంక మొత్తం డెక్కటాప్ పై లోడ్ అయ్యింది . . జూమ్ చేయసాగారు . . హనుమంతులవారు . బిల్డింగ్స్ తో సహా అన్ని కనపడేసరికి శ్రీరాములవారిని ఆశ్చర్యచకితులను చేసింది . " ఇది ఓపెన్ సోర్సా అని అడిగారు కుతూహలంగా . . కాదు స్వామీ , ఫ్రీవేర్ అంతె అన్నారు . . " , హనుమంతులవారు . . " సరేసరే . . మనం ఉన్న చోటు చూపించండి . . తరువాత , సీత ఉన్న లంక సంగతి చూద్దాం అన్నమాటలు నోటిదగ్గరవరకూ వచ్చేసాయి . మళ్ళీ ఎందుకులే . . సీతకన్నా ఈ గూగుల్ ఎర్తే ఇంట్రస్టింగా ఉంది " , అని అందరూ అనుకునేరు అని కుతూహలాన్ని దాచేసుకుని . . ఆగిపోయారు శ్రీరామచంద్రులవారు . " ఛ . . ! ! కష్టం అని నిట్టూర్చారు . . " , హనుమంతులవారు . . శ్రీరామచంద్రులవారితో సహా లక్ష్మణులవారుకూడా కనుబొమలు చిట్లించి " ఏమైనది " , అని అడిగారు ఆశ్చర్యంతో . . " ఇది ఇంకా బీటా వెర్షన్ స్వామీ . . సరిగ్గా ఆ లంకలో మనకు కావలిసిన ఇమేజస్ దగ్గరకొచ్చేసరికి . . రావటంలేదు . . ఇంకా కనస్ట్రక్సన్ లో ఉంది . . ఇమేజస్ గేదర్ చేస్తున్నాం అని వస్తుంది . . ఇపుడు . . మనకు కాస్త కష్టమే స్వామి " , అని బాధపడ్డారు . హనుమంతులవారు . " సరే నేను లంకకు బయలుదేరతాను . . ఎలాగూ కాస్త ఆచూకీ తెలిసింది కాబట్టి . . దానితో అక్కడికి చేరుకుని వెతికి అసలు చోటు పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు స్వామి . . మీరు చింతించవద్దు . " , అని శ్రీరామచంద్రులవారి దగ్గర సెలవు తీసుకుని హనుమంతులవారు లంకకు బయలుదేరారు . ఇంకా ఇతర మార్గాలగురించి వెతుకుతూ . . లక్ష్మణుడు , శ్రీరాముడు . . అలోచిస్తూ . . ఉద్యానవనంలో తిరుగుతుంటే . . పరిచారిక వచ్చి . . " స్వామీ ! ! మన సీతమ్మగారిని టీవీలో చూపిస్తున్నారు . . " , అని చెప్పేసరికి . . ఇద్దరూ టీవీ చూడటానికి పరుగుపరుగున లోపలికెళ్ళారు . Tv 99 అనే చానల్ లో చెట్టుకింద కూర్చుని ఉన్న సీతాదేవిపై ఇంటర్వూ జరుగుతుంది . . " అసలు మీరెవరో . . ఇక్కడికి ఎందుకు వచ్చారో . . మాప్రేక్షకలోకానికి వివరంగా చెప్పండి " , అంటూ ఒక ఏంకర్ చేతిలో మైకును కత్తి తిప్పినట్లుగా తిప్పుతూ ప్రశ్నల యుద్ధంచేస్తున్నాడు . . సీతాదేవి ఏమీ మాట్లాడక మౌనం వహించి . . ఉంది . సీతాదేవి ఎక్కడుందో ఎలా ఉందో తెలియక సతమతమైన సమయంలో . . టీవీలో చూసి కాస్త మనసుకుదుటపడినా . . ఆమె పరిస్తితి చూసి శ్రీరాములవారికి , లక్ష్మణునికి కళ్ళవెంబడి నీళ్ళుకారాయి . . అమెను చూస్తున్నా ఎమీ చేయలేని పరిస్ధితిలా తోచింది శ్రీరాములవారికి . కాసేపటికి సీతాదేవి పెదవివిప్పి మాట్లాడటం మొదలుపెట్టింది . జరిగినదంతా చెప్పింది . . తనని ఎలా ఆ రావణాసురుడు వలలో చిక్కుకుని . . అతను లంకకు తీసుకొచ్చాడో వివరించింది . ఎలాగైనా ఈ విషయాన్ని మా శ్రీరామచంద్రులవారికి చేర్చమని వేడుకుంది . ఏంకర్ కెమేరామేన్ ని కాస్త సీతాదేవి . . కళ్ళవెంబడి నీళ్ళను . క్లోజప్ అన్నట్లు సైగచేయగా . . కెమేరామేన్ జూమ్ చేసి చూపించసాగాడు . . మధ్యలో ఒక్కసారిగా ఏంకర్ కెమేరాకు అడ్డొచ్చి . . " ఇప్పుడు కాసేపట్లో మీకు ఈ కిడ్నాపింగ్ కి కారణాలు . . ఎలా జరిగిందో విశ్లేషిస్తూ . . ఒక డాక్కుమెంటరీ చూపిస్తాం అప్పటివరకూ ఓ చిన్న బ్రేక్ . . " , అని ఎడ్వర్టైజ్ మెంట్స్ వేయసాగారు . బ్రేక్ తరువాత డాక్యుమెంటరీ . . వేయడం మొదలుపెట్టారు , ఊహా చిత్రం . . లాగా కొన్ని కేరెక్టర్స్ తో . . కళ్ళకు కట్టినట్లుగా చూపించారు . క్రింద అప్పుడే స్క్రోలింగ్ మొదలుపెట్టారు . . సీతాదేవి శ్రీరాముడిని చేరుకుంటుందా . . ? ? ఎ ) లేదు బి ) అవును సి ) చేరుకోవడం చాలా కష్టం డి ) చెప్పలేం . . వెంటనే 1233 కి ఎసెమ్మెస్ చేయండి . . బహుమతులు గెలుచుకోండి . అక్కడే తరువాత రాబోయే కార్యక్రమం గురించి కూడా రాసారు . . సీతాదేవితో మాట్లాడాలంటే ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేయండి అని . . కొన్ని నెంబర్లు ఇచ్చారు . తరువాత కార్యక్రమానికి Tv 99 కి ఫోన్ చేద్దాం అని నిర్ణయించారు . లక్ష్మణుడు ఫోన్ ట్రైచేసాడు . . చాలా సేపటికి దొరికింది . . లైవ్ షో అయినప్పటికీ చాలామంది కాలర్స్ ఉండటం వలన . . ఎవరో అమ్మాయి మాట్లాడి లైనులో ఉండమన్నారు . . అపుడు శ్రీరామచంద్రులవారు . . సీతాదేవి తన భార్య అని . . అమె ఉన్న ప్రదేశం ఎక్కడో చెప్పమని వాళ్ళని అడిగారు . దానికి ఆ అమ్మాయి నవ్వుతూ . . " అది ఇంకా రెండురోజులవరకూ చెప్పలేంసార్ . . అదే మా బిజినెస్ వ్యూహం . . సార్ . . ఏ టీవీ చానల్ కి తెలియని విధంగా మా రిపోర్టర్స్ కష్టపడి సంపాదించిన కొత్త వార్త ఇలా అందరికీ చెప్పకూడదు . . మీరు భర్తఅయినా మా లైవ్ షో చాలా రసపట్టులో ఉంది . . ఎసెమ్మెస్ లు రావడం మొదలుపెట్టాయి . . ఒక ఎనిమిదిగంటలు ఆగాక అపుడు చెప్తాం " , అని నవ్వుతూ సమాధానమిచ్చిందామె . ఫోన్ కట్ అయిపోయింది . తరువాత ఎన్నిసార్లు ప్రయత్నించినా మరలా కాల్ కలవలేదు . . ఆగ్రహంచెందిన లక్ష్మణుడు . . Tv 99 ని మట్టుపెట్టాలని ఆవేశంగా కదిలాడు . . " అన్నగారు . . ఆ రావణుడికన్నా ఈ మీడియా రావణులను . . ముందు మీరు వధించాలి " , అని . . అస్త్రశస్త్రములు తీసుకొచ్చి శ్రీరామునికిచ్చి . . నమస్కరించెను . శ్రీరాముడు . . యుద్దానికి సన్నద్దమయ్యెను . . శ్రీరాఘవం ధశరధాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుభాహుం అరవిందదలాయ దాక్షం రామం నిశాచర వినాశకరం . . నమామి … - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ఎక్కడ అన్యాయాలకూ , అక్రమాలకూ , అవినీతులకూ హద్దూ అదుపూ ఉండదో , ఆ అన్యాయాలపై కూడా ఆధారపడి ఎవరు వ్యాపారాలు చేస్తుంటారో . . అవి చోద్యంలా చూస్తూ . . పట్టించుకోని ప్రజలూ , ప్రభుత్వాలు . . ఉంటాయో . . . అక్కడ మరో శ్రీరాముడో . . మరో శ్రీకృష్ణుడో అవతరించాలని ఆశిద్దాం . ఇలా ఆశించడమైనా మన కర్తవ్యంగా భావిద్దాం .
Download XML • Download text