Text view
tel-10
View options
Tags:
Javascript seems to be turned off, or there was a communication error. Turn on Javascript for more display options.
ఇక గత పదేళ్లుగా , స్త్రీలకి వర్తింపజేసిన ఈ సూత్రాన్నే పురుషులకి కూడా వర్తింపజేసి , యువజన సంఘాలూ , సేవా సంఘాలూ , రైతుమిత్ర సంఘాలూ యేర్పరచుకొని , యే హామీ లేకుండా ఒక్కో సంఘానికీ యేకంగా పదేసి లక్షలు ( ఒక్కోడికీ ఓ లక్ష ) ఇవ్వాలని ప్రభుత్వంచేత సూచనలు జారీ చేయించుకొని , బ్యాంకుల మీద పడ్డారు గానీ , బ్యాంకులు వీళ్లని శక్తివంతంగా నిరోధించగలిగాయి . లేకపోతే , ఈ పాటికి కొన్ని లక్షల కోట్లకి ములిగిపోయి వుండేవి .
- నీరాటము , వనాటము , పోరాటము , ఆరాటము , ఘోరాటవి : బాగుంది ప్రాస ఇంతకీ , భద్రకుంజరముకున్ : అంటే ఏమిటి ? కుంజరము అంటే ఏనుగు కదా . భద్ర అంటే కూడా ఆంధ్ర భారతిలో చూసిన రకరకాల అర్థాల్లో , ఏనుగు ఒకటి … మొసలి ఏదీ మరి ? ?
పరిశ్రమలో వివిధ రకాల పనిచేసే కార్మికులున్నారు . క్వారీల నుంచి రాళ్లను తెచ్చే కార్మికులు బట్టీల్లో కాల్చేందుకు రాళ్లను చిన్న చిన్న ముక్కలు చేసే కార్మికులు , కాల్చేందుకు అవసరమైన బొగ్గును ముక్కలుగా చేసే కార్మికులు , పగులగొట్టిన బొగ్గును , రాళ్లను బట్టీదగ్గరకు మోసే కార్మికులు , బట్టీ కాల్చే కార్మికులు , డ్రైవర్లు , సూపర్వైజర్లు ఉంటారు . బట్టీల్లో , మిల్లుల్లో సున్నం తయారయ్యే యంత్రం దగ్గర పనిచేసే కార్మికులు , సున్నం లోడ్ చేసే కార్మికులు , ప్యాకింగ్ కార్మికులు , సూపర్ వైజర్లు ఉంటారు . అయితే వీరంతా ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం ఒక్కటే . తమ యజమానులు వేతనాలు పెంచాలని , చట్టపరమైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు . కానీ యాజమాన్యం పట్టించుకోవట్లేదు . కార్మికశాఖ స్పందించట్లేదు . సర్కారు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదు . ప్రస్తుతం బట్టీ కాల్చే కార్మికులకు ఒక టన్ను రాయిని కాల్చేందుకు యాజమాన్యం 2 , 22 రూపాయలు ఇస్తోంది . అయితే ఇది ఏ ఒక్క వ్యక్తో చేసే పనిగాదు . అది కాల్చాలంటే బట్టీ దగ్గరకు తీసుకు రావాలి . పొడువుగా ఉండే బట్టీపైకెక్కి అందులో వెయ్యాలి . కింద పొయ్యి దగ్గర కాలిన రాయిని పక్కకు లాగాలి కాబట్టి , కొంతమంది గ్రూపుగా ఏర్పడి బట్టీ కాల్చే పని చేపడతారు . ఒక్క గ్రూపులో 12 నుంచి 15 మంది వరకు ఉంటారు . అంటే ఒక టన్ను కాల్చేందుకు యాజమాన్యం ఇచ్చే 2 , 20 రూపాయల్లో ఆ గ్రూపులోని సభ్యులంతా పంచుకోవాలన్న మాట . ఇలా రోజుకు ఎన్ని టన్నులు కాల్చితే అన్ని 2 , 20 రూపాయలు పొందుతారు . దీనివల్ల కార్మికులు ఎక్కువ రిస్కును ఎదుర్కోవాల్సి వస్తుండగా యజమానులు మాత్రం వారి శ్రమ ద్వారా లాభాలు ఘడిస్తున్నారు . కేవలం బట్టీ కాల్చే వారికేగాదు . ఇలా రాయిపగులగొట్టే వారికి , బొగ్గును ముక్కలు చేసేవారికి కూడా టన్నుకు ఇంత చొప్పునే లెక్కగట్టి ఇస్తున్నారు . ప్రస్తుతం ఝరియాబొగ్గు ముక్కలు చేసే వారికి టన్నుకు 65 రూపాయలు , చెక్క బొగ్గు ముక్కలు చేసే వారికి టన్నుకు 30 రూపాయలు ఇస్తున్నారు . ఇక బట్టీల్లో , మిల్లుల్లో లోడింగ్ చేసే హమాలీలకు ముగ్గు సున్నం అయితే టన్నుకు 50 రూపాయలు , సున్నం అయితే టన్నుకు 165 రూపాయలు ఇస్తున్నారు . అన్ని రకాల పనుల్లోనూ టన్నులెక్కన డబ్బులిస్తే కార్మికులు గ్రూపులెక్కన ఏర్పడి పనిచేసి వాటిని పంచుకోవాలి .
అలా మాట్లాడుకుంటూ పోతే రైలు అరక్కోణంలో ఆగినప్పుడు గాని తెలియలేదట , ఎంతసేపు అయిందనీ , తను టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాననీ ! అప్పుడు చిలుకూరి :
బ్రాహ్మణుడు : " ప్రహ్లాదా ! అయితే అందరి హృదయాల్లోనూ ఉన్న అతన్ని ఎలా చంపగలవు ? చూడబోతే నాకు మల్లేనే నీవు కూడా తెలివి తక్కువ వాడిలా ఉన్నావు . శుక్రాచార్యుని బోధలు విని దుష్ట ప్రతిజ్ఞ పూనినట్టున్నావు . నేను ఓ కట్టెను ఇక్కడ నాటుతాను . దాన్ని నీవు బయటికి లాగగలిగితే నీకు విష్ణువు జయించే శక్తి ఉన్నట్లు లెక్క . "
పుష్పాలలో లక్ష్మీదేవి నివస్తిస్తుంది . అందువల్ల భగవంతునికి అర్పించేప్పుడు పువ్వులు క్రింది ముఖభాగంగా ఉండకుండా జాగ్రత్తపడాలి . అయితే పుష్పాంజలి సమర్పించే సమయంలో ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు . తులసీ దళాలకు , బిల్వ పత్రాలకు ఈ విధానం వర్తించదు . ఏ విధంగానైనా ఆ పుష్పాలను లభించకపోయి నట్లయితే శ్రీహరి పూజకు తులసీ దళాలను సమర్పించుకోవడమే ఉత్తమమైన పద్ధతి అని వృద్ధ గౌతమ స్మృతి చెబుతోంది . పరమేశ్వరునికి పసుపురంగు దేవకాంచనం , విష్ణువుకు నల్లకలువ , అమ్మవారికి మల్లి , మందారం , లలితా పరమేశ్వరీ దేవికి చంపక , కుంద , కేసర , శిరీష పుష్పాలంటే ఇష్టమని చెప్పబడింది . లలితాపరమేశ్వరి ఈ పుష్పాలనే తన శిరోజాలలో అలంకరించుకుంటుందట . అలాగే ఆ తల్లి కదంబ వనాలలో సంచరిస్తూ కదంబపువ్వులను అలంకరించుకుంటుందట .
@ ఎక్కడి నుంచి తెచ్చారో లెక్కా పత్రం ఉంటుంది కదా , దానికి IT వారికి చూపించ వచ్చుకదా . ఎవరు చూపి౦చాలి ? ఆ డబ్బు తో బాబాకు స౦బ౦ధ౦ ఉన్నదని నిరూపి౦చగలమా . ఇ౦కా బోల్డన్ని చూడాలి మన౦
ఇప్పటివరకు 24 , 164 మంది గిరిజన అమ్మాయిలపై ప్రయోగించారు . ఇది 3 డోసులుగా 6 నెలల వ్యవధిలో ఇవ్వాలి . ఇప్పటికి 2 మార్లు ఇవ్వడమైనది . దీని పేరు GARDASIL . ఇది వ్యాధి రాకుండా మత్రమే చూస్తుంది . క్యూర్ చేయదు . NGOPATH ( India ) అనే సంస్థ తో పాటు ఏఫీ , గుజరాత్ ప్రభుత్వాల సహకారంతో ఈ ప్రయోగాలు చేస్తున్నారు .
March 10 , 2008 Monday 11 : 45 AM మిడ్టౌన్ నించి ఐదో ఎవెన్యూ వెంబడి అప్టౌన్ వేపు నడక సాగించాడు . ఎదురుగా వస్తున్న ట్రాఫిక్ . ఎక్కడికో ఆ పరుగులు . తనొక్కడికేనా తీరిక ? నిమిషమంటే డాలర్లుగా , డబ్బే ఊపిరిగా , లాభాలు ఆర్జించడమే జీవిత ధ్యేయంగా , క్షణం తీరిక లేకుండా గడిపిన జీవితం . కొద్ది గంటల క్రితం వరకూ , తానూ ఆ బిజీ స్రవంతిలో ఒక పాయ . ఇప్పుడు . . అకస్మాత్తుగా . . ఉన్నదంతా తీరికే . ఇక్కణ్ణించి కనుచూపు మేర బోలెడు తీరిక . భరించలేనంత తీరిక . ఏం చేసుకోవాలో తెలియనంత తీరిక . ఇంకా చలికాలం పూర్తిగా పోలేదని గుర్తు చేస్తూ చిరు చలి . మబ్బు తెరల్ని చీల్చుకుని మీద పడుతున్న పల్చటి ఎండలో వడివడిగా నడుస్తుంటే బాగుంది . ఎర్ర లైటు దగ్గర ఆగాడు . ఎనభై రెండో వీధి . అప్పుడే నలభై బ్లాకులు నడిచాడా ? నలభై బ్లాకులంటే ఎన్ని మైళ్ళు ? ఎడమ పక్కగా మెట్రోపాలిటన్ మ్యూజియం . రెండేళ్ళుగా న్యూయార్కులో ఉన్నా , ఎప్పుడూ వెళ్ళలేదు . వేరే పనేముంది ? కాసేపు మ్యూజియంలో గడుపుదామా ? ఆకలేస్తోంది . మ్యూజియం ముందు సైడ్ వాక్ మీదున్న ఒక బండి వాడి దగ్గర ఒక హాట్ డాగ్ కొనుక్కుని , అక్కడే నిలబడి తినేశాడు . ఒక ఐస్ టీ సీసా కొనుక్కుని మ్యూజియం దాటి సెంట్రల్ పార్కులో అడుగు పెట్టాడు . సోమవారమైనా , లంచి సమయం కావడం వల్ల కాబోలు పార్కు దారుల వెంబడి మనుషుల అలజడి బాగానే ఉంది . అలా కాలికి దొరికిన దారి వెంబడి నడిచి , ఒక బెంచి ఖాళీగా కనబడితే దాని మీద కూర్చుని చుట్టు చూస్తున్నాడు . చుట్టూతా పల్చగా మనుషుల అలజడి . తీరిగ్గా కబుర్లాడుకుంటూ బెంచీల మీద లంచిలారగిస్తున్న వాళ్ళు . లంచి ముగించుకుని తిరిగి తమ కార్యాలయాలకి వెళ్ళేవాళ్ళు . అటూ ఇటూ తిరిగే వాళ్ళు . వ్యాయామం కోసం నడకలూ పరుగులూ సాగించే వాళ్ళు . ఇంకా ఎక్కడో దూరంగా పిల్లల కేరింతలు . ఈ చప్పుళ్ళన్నిటికీ నేపథ్యంగా ఐదో అవెన్యూ మీద దూసుకు పోతున్న ట్రాఫిక్ హోరు . నా బేంకు కూలిపోయింది . ఐనా ఈ ప్రపంచం బాగానే ఉందే . వీళ్ళంతా ఇంత హాయిగా దిలాసాగా ఉన్నారే ? వీళ్ళకేం పట్టదా ? బెంచి మీద తన పక్కన ఎవరో కూర్చున్నట్టు అనిపించి కొద్దిగా తల తిప్పి ఇటు చూశాడు . ఎవరితో మాట్లాడాలని లేదు . వాళ్ళు గనక పలకరిస్తే అక్కణ్ణించి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు . ఆ కూర్చున్నది ఎవరో అమ్మాయి . భుజాల కింది వరకూ ఫేషన్ గా కత్తిరించుకున్న నల్లటి జుట్టు మాత్రం కనిపిస్తోంది . జీన్స్ మీద నల్లరంగు కాటన్ టాప్ . దాని మీద ఏదో మెరిసే దారంతో కుట్టిన ఇండియన్ డిజైన్లు . ఇదేంట్రా ఈ అమ్మాయి కనీసం జాకెట్టైనా స్వెట్టరైనా లేకుండా ఉత్తి చొక్కాలో ఇలా తిరుగుతోంది అనుకున్నాడు . ఇంతలో ఆ అమ్మాయి తల పైకెత్తి తేజాకేసి చూసి పలకరింపుగా నవ్వింది . కచ్చితంగా ఇండియన్ మొహమే . అదుగో , ఆ కనుబొమల మధ్య చిన్న మెరిసే బొట్టు బిళ్ళ . కానీ అది కొంచెం వంకరగా , ఒక పక్కకి ఉంది . అప్రయత్నంగా ఆ బొట్టుబిళ్ళని సరి చెయ్యడానికి కుడిచెయ్యి చాచాడు . చేతి వేళ్ళకి పాత చెక్క బెంచీ గరుగ్గా తగిలి మెలకువొచ్చింది . చుట్టూ చూశాడు . అమ్మాయి లేదు . కోటు జేబులో ఐఫోన్ చప్పుడు చేసింది . రాబర్ట్ నించి టెక్స్ట్ మెసేజ్ . రేపు సాయంత్రం ఆరింటికి మర్ఫీస్లో కలుద్దామని . * * * March 25 , Tuesday , 7 : 15 PM మర్ఫీస్ ఖాళీగా ఉంది . రాబర్ట్ , తేజా ఒక మూలగా ఉన్న బల్ల దగ్గర కూర్చునున్నారు . ఇద్దరూ నిశ్శబ్దంగా తమ తమ గ్లాసుల్ని చప్పరిస్తున్నారు , రాబర్ట్కి రెండో మార్టినీ , తేజాకి ఒకటే ఐస్ టీ . ఉన్నట్టుండి రాబర్ట్ బల్ల మీద చరిచాడు . తేజా ఉలిక్కిపడి తలెత్తి మిత్రుడికేసి చూశాడు . " స్క్రూ బేర్ స్టెర్ణ్స్ . . స్క్రూ వాల్ స్ట్రీట్ . . స్క్రూ ద హోల్ డాం థింగ్ . నేను అయోవా ( 1 ) తిరిగిపోయి పొలం దున్నుకుంటా . " తేజా తన మిత్రుడికి పిచ్చెక్కిందేమో నన్నట్టు చూశాడు . " రాబ్ , నీకు షాక్ తగిలి తాత్కాలికంగా మతి భ్రమించి నట్టుంది . కూల్ మేన్ . " " లేదు తేజా , నేను నిశ్చయానికొచ్చేశాను . " " ఇంత మాత్రానికే ? బేర్ స్టెర్ణ్స్ కాకపోతే ఇంకా చాలా బేంకులున్నై . మనకి ఆ మాత్రం ఇంకో ఉద్యోగం దొరక్క పోదు . " " దొరకొచ్చు , దొరక్క పోవచ్చు . అది కాదు విషయం . ఈ సబ్ ప్రైం , ఈ లొసుగులు , ఈ దొంగ లావాదేవీలు , ఈ అబద్ధాలు . . ఈ విషాన్నించి కొన్నాళ్ళు దూరంగా ఉండాలి . " " ఏంటీ ? స్టార్ బ్రోకర్ రాబర్ట్ లుప్చోవ్స్కీయేనా ఈ మాటలు మాట్లాడేది ? " " అక్షరాలా . . అసలు మొత్తానికి బేంకింగ్ వొదిలేస్తా ననడంలేదు . కొన్నాళ్ళు బ్రేక్ . జరిగిందేదో మన మంచికే జరిగింది . కొన్నాళ్ళు ఈ పిచ్చి గోల నించి దూరంగా ఉండి , అప్పుడు , మళ్ళీ తిరిగి రావాలనిపిస్తే వస్తా . " " కొన్నాళ్ళు ? ఎన్నాళ్ళు ? " " ఏమో , ఒక ఏడు , రెండేళ్ళు . " " ఏం చేస్తావ్ అంత సమయం ? " " ఏదో ఒకటి , మనసుకి నచ్చింది . చూడూ , మనిద్దరికీ ప్రస్తుతానికి డబ్బుకి ఇబ్బంది లేదు . మరీ హై స్టేక్స్ పోకర్ గేములాడాకపోతే , ఒక ఏడాది రెండేళ్ళు హాయిగా కాలక్షేపం చెయ్యొచ్చు . దేశమంతా సైకిలు మీద తిరగొచ్చు . ఈజిప్టుకెళ్ళి పిరమిడ్లు చూడచ్చు . బుద్ధి పుడితే మా నాన్న పొలంలో ట్రాక్టర్ తోలచ్చు . అసలేమీ చెయ్యకుండా చెట్టు నీడన హేమక్ లో పడుకోవచ్చు . " " నీకు నిజంగా పిచ్చెక్కింది . " " . . . " " యు నో ? నిన్న మా అమ్మతో మాట్లాడితే , తను కూడా అదే అంది . . కొన్నాళ్ళు మిషిగన్ రమ్మని . " " మరింకేం ? చూడు , నేను చెప్పిందే కరక్ట్ . ఈ న్యూయార్క్ లో ఉండి , ఉద్యోగం దొరక్క పోతే అదొక నరకం . దొరికితే ఇంకో నరకం . నో ! పద పోదాం . బైదవే , మీ అమ్మక్కూడా పొలముందా ? మిషిగన్లో ? " " హ హ్హ హ్హ . అమెరికాలో ఇండియన్లు పొలాలు దున్నర్రా ఇడియట్ . మా అమ్మ కొమెరికా బేంక్ లో వైస్ ప్రెసిడెంట్ . " " చచ్చాం పో . " " ఐ నో . బట్ మై మాం ఇస్ కూల్ . యు నో , మిట్ రామ్నీ ప్రైమరీ బరిలో దిగినప్పుడు నాకు చాలా ఉత్సాహం వేసింది . ఆయన కేంపేన్ కి వాలంటీర్ చేద్దామనుకున్నా . అఫ్కోర్సు , ఇన్నాళ్ళు మనకి టైము లేదనుకో . పోనీ ఇప్పుడు చేద్దామంటే గురుడు ఆల్రెడీ మెక్కెయిన్ కి సరెండరైపోయాడు . హమ్మ్ . " " హే తేజా , తేజెష్టర్ , తేజుమేన్ . . ఏలోకంలో ఉన్నావ్ మై డియర్ ? ఇది ఒబామా సంవత్సరం . ఇది ఒబామా ఎన్నిక సమయం . నీకు ఏ మాత్రం సివిక్ సెన్సున్నా ఒబామా కేంపేన్ కి పనిచెయ్ . " " హ హ హ . ఇంతకు ముందు దాకా ఏవన్నా డౌటుంటే అది కాస్తా ఇప్పుడు పోయింది . నీకు సెర్టిఫైడ్ గా స్క్రూ లూజ్ . పోయి పోయి ఆ సోషలిస్ట్ కా ? ఈ జన్మలో జరగదు ? మెక్కెయిన్ ( 2 ) ఒట్టి తిక్కలాడు , పార్టీ సిద్ధాంతాలకి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండడు , ముఖ్యంగా ఆర్ధిక విధానాలకి . ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ డెమోక్రాట్లతో కలిసి వోటేస్తూంటాడు . అతని కేంపేన్కి పని చెయ్యాలనే ఉత్సాహం ఐతే నాకు లేదు గానీ , పోయి పోయి ఒబామాకి సాయం చెయ్యడమా ? నో వే ! " " యెస్ వే టూ ! హే , అయోవా నించొచ్చిన నేనే ఒబామాని సపోర్ట్ చేస్తున్నా ? మిషిగన్ వాడివి నీకేంటోయ్ ? ఈ దేశం ప్రస్తుతం కూరుకుంటున్న ఊబిలోంచి ఎవడన్నా బయటికి లాగ గలడంటే అది ఒబామా ఒక్కడే . " " హే రాబ్ . . ఏంటిది , ఆయనేదో కొత్త మెస్సయ్యా ( 3 ) లాగా . . " " హీ ఈజ్ దా మెసాయా . యు బెటర్ బిలీవిట్ . ఇందాక అసలు విషయం మర్చిపోయా . . ఇన్నాళ్ళుగా కోమాలో పడున్న మన రొమాంటిక్ లైఫ్ ని నిద్ర లేపేందుక్కూడా ఇదో ఛాన్సనుకో ! ఇప్పుడు అమ్మాయిలందరూ పిచ్చ పిచ్చగా ఒబామా అంటే పడి చస్తున్నారు . మనం కూడా ఒబామా కేంపేన్ లో పని చేస్తే . . అమ్మాయిలే అమ్మాయిలు ! " " . . . " " ఏంటో ఆ వంకర నవ్వు ? ఓ , గాట్ ఇట్ ! మీ ఇండియన్స్లో మీ పేరెంట్సే ఎరేంజ్ చేస్తారంటగా ? డోంటెల్మీ . . మీ అమ్మ నీకప్పుడే ఒకమ్మాయిని మిషిగన్లో సెటప్ చేసిందని ! " " నో నో . . అలాంటిదేం లేదు . గత రెండు వారాల్లో నాలుగు సార్లు నాకు ఈ విచిత్రమైన కలొచ్చింది . కలలో ఒకమ్మాయి . . " " ఫిగరు బావుందా ? " " ఏమో నేను గమనించలేదు . కానీ . . ఈ తమాషా చూడు . . ఇండియన్ అమ్మాయి . " " ఇంకేం ? చూసుకో నేంచెప్పేస్తున్నా నీ ఫ్యూచర్ . . గుర్తు పెట్టుకో . నువ్వు మిషిగన్ వెళ్ళేప్పటికి మీ మమ్మీ నీకుమాంఛి డాక్టర్ పిల్లని సెటప్ చేసేసి ఉంటుంది . నువ్వు అక్కడ దిగిన రెండు వారాల్లో ఎంగేజ్మెంట్ , మూణ్ణెలల్లో పెళ్ళి . " " అంతేనంటావ్ . ఐతే నువ్వు అయోవాకీ , నేను మిషిగన్ కీ తప్పదంటావ్ ? " " ఏమో ఎవరు చూడొచ్చారు ? నీకు సెటప్పయ్యే స్వీట్హార్ట్కి మాంఛి బేబెలిషియస్ బెస్ట్ ఫ్రెండ్ ఉందనుకో , ఒక్క టెక్స్ట్ మెసేజ్ కొట్టేయ్ , రెక్కలు కట్టుకుని నేను కూడా మిషిగన్లో వాల్తా . " * * * పద సూచిక ( 1 ) అయోవా - అమెరికా నడిబొడ్డున ఉన్న రాష్ట్రం . వ్యవసాయం ఇక్కడి ముఖ్య వృత్తి . రాజకీయంగా ఎప్పుడూ రిపబ్లికన్ పార్టీని సమర్ధించే రాష్ట్రాల్లో ఒకటి . అధ్యక్ష ఎన్నికలకి ముందు అభ్యర్ధుల ఎంపికలో మొట్టమొదటి కాకస్ ఈ రాష్ట్రంలో జరుగుతుంది . ( 2 ) జాన్ మెక్కెయిన్ - అమెరికను రాజకీయ వేత్త , సెనేటు సీనియర్ సభ్యుడు , అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు . ( 3 ) మెస్సాయా - హిందూ మతంలో కల్కి అవతారం లాగా రాబోయే దివ్య రక్షకుడు . కొన్ని ఆచారాల్లో ఏసుక్రీస్తుని కూడా ఇలా అంటారు . హేండెల్ అనే జెర్మను సంగీత వాగ్గేయకారుడు ఏసుక్రీస్తు జననాన్నీ , జీవితాన్నీ కీర్తిస్తూ ఈ పేరిట రచించిన గొప్ప గాత్ర సంగీతం చాలా పేరు పొందినది .
ఇలాంటి ప్రశ్న అడిగితే ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం విడిగా ఉండటం వల్ల ప్రయోజనం ఉంటుందా ఉండదా అనే అలోచిస్తారు . సహజంగానే రాయలసీమ వాసులు , ఆంధ్రా ప్రాంతం వారు తాము ఆంధ్ర ప్రదేశ్ నుండి విడిపోవడానికి సరైనా కారణం కానీ , విడిపోతే అదనంగా వచ్చే లాభం కానీ లేదు . పై ప్రశ్నకు అందుకే వారు " లేదు " అని జవాబిస్తారు .
ఎన్నికల కమిషన్ సూచన మేరకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు , రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని డిఆర్ఓ వై . నర్సింహరావు కోరారు . సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ అక్టోబర్ 1నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జరుగుతుందన్నారు . దీనికి ముందు పోలింగ్ కేంద్రాల పునవ్యవస్తీకరణ చేస్తామన్నారు . ఎవరికైన ఓట్లు లేకపోయినా , ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లున్నా జాబితాలో మార్పులు చేసి ఇవ్వాలని కోరారు . ఈనెల 15లోగా ఎన్నికల కమిషనర్కు వివరాలు పంపుతామన్నారు . బిజెపి నాయకులు పాకలపాటి మురళి మాట్లాడుతూ కొన్ని పాఠశాల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని , అందులో ఉన్న పోలింగ్ కేంద్రాలను మార్చాలని కోరారు . డిఆర్ఓ స్పందిస్తూ దగ్గరలో ఉన్న ప్రభుత్వ భవనాలు లేదా కమ్యూనిటీ హాలును పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు . కాంగ్రెస్ ప్రతినిధి యడ్ల ఆదిరాజు మాట్లాడుతూ బూత్స్థాయి అధికారుల జాబితాను ఫోన్ నెంబర్లతో సహా అందజేయాలని కోరారు . ఎన్నికల సూపరింటెండెంట్ త్రినాధమ్మకు జాబితా అందించాలని సూచించారు . సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం . కృష్ణమూర్తి , లోక్సత్తా జిల్లా అధ్యక్షులు భీశెట్టిబాబ్జీ , సిపిఐ జిల్లా కార్యదర్శి పి . కామేశ్వరరావు , ఆర్డిఓ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు .
ఆ . వె . తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స . తెలుగు అది ఏల అన్న దేశంబు తెలుగు ; ఏను తెలుగు వల్లభుండ ; తెలుగు ఒకండ ; ఎల్ల నృపులు కొలువ ; ఎరుగవే బాసాడి ; దేశ భాషలందు తెలుగు లెస్స ఏను = నేను తెలుగు = తెలుగుభాష , తెలుగు మాట్లాడు వ్యక్తి , ఆంధ్రదేశము బాసాడు = భాషించు అనగా మాట్లాడు ( బాసాడు బాసయాడు భాషణముచేయు ) తెలుగే ఎందుకంటే దేశం ఆంధ్రదేశం , నేను తెలుగువాడినైన రాజును , ఒక తెలుగువాడిని . అలాకాదుగానీ , రాజపూజ్యమైన తెలుగుభాషని మాట్లాడి , తెలుగు లెస్స అని తెలుసుకొనుము !
ఇక్కడ ఆలుమొగల భేదాన్ని మర్చిపోతే - తండ్రీ కొడుకుల వ్యత్యాసాన్ని మర్చిపోయేది , అందరు " కుమార్ " ల విషయం లోను . . " కుమార్ " , కేవలం అలంకారప్రాయెమే అని . . రవి కుమార్ లని రవి అని , శశి కుమార్ లని శశి అని , కిరణ్ కుమార్ లని కిరణ్ అని పిలుస్తాం .
ఈనాడు బలంలో చాలా రకాలున్నాయి . లోకంలో అన్ని బలాలూ పురుష శరీరం తరహా ఉపోద్ఘాతప్రాయ ( rudimentary level ) బలాలు కావు . మనుషులు శారీరిక బలం కంటేనూ విద్యాబలం , పరిజ్ఞానబలం , నైతికబలం , అర్ధబలం , అంగబలం , అధికారబలం , చట్టబలం , సంప్రదాయబలం , సాంఘికబలం , స్థానబలం మొదలైన హంగుబలాల వల్ల ఎక్కువ బలవంతులవుతారు . అంటే బలం అనేది నీ మర్మాంగం ఏంటనేదాని మీద కాక నువ్వు పుట్టిన కుటుంబం ఏ వర్గానికి చెందినదనేదాని మీద , నీ సర్కిల్ ఏంటనేదాని మీదా ఆధారపడి ఉంటుంది . దురదృష్టవశాత్తూ ఆధునిక కాలంలో వట్టి శారీరిక బలం మోటుపశువు అనిపించుకోవడానికి తప్ప ఇహ దేనికీ ఉపయోగపడదు . ఒక పురుషుడు శారీరిక బలం , విద్యాబలం , పరిజ్ఞాన బలం , నైతిక బలం లాంటివి మాత్రమే కలిగి ఉండి అతని భార్యకు అర్ధబలం , అంగబలం , సాంఘికబలం కూడా ఉన్నప్పుడు ఆమె ముందు అతను బలహీనుడే అవుతాడు . ఆమె అతనితో యథేచ్ఛగా ఫుట్బాల్ ఆడుకోగలదు . అతనికి ఆమె నుంచి చట్టపరమైన రక్షణ అవసరం . ఒకవేళ పైన చెప్పిన బలాలన్నీ అతనికి ఉన్నప్పటికీ చట్టం దగ్గఱ అతనికి బలం లేకపోతే అతను ఆడదానికంటే బలహీనుడవుతాడు . వాస్తవానికి ఇప్పుడు మగవాళ్ళందఱి పరిస్థితి ఇదే . వారంతా చట్టపరంగా మిక్కిలి బలహీనులు . ఆడవాళ్ళతో పోలిస్తే ఏ విధమైన హక్కులూ , మద్దతూ లేనివాళ్ళు . ఫెమినిస్టు చట్టాల దృష్టిలో మగవాళ్ళు అసలు మనుషులే కారు . వారు ఆడవాళ్ళ బరువుబాధ్యతలు మోయడానికి మాత్రమే పుట్టిన కూలీ - చీమలూ , గానుగెద్దులూను . మానవీయమైన ఏ మన్నన ( treatment ) కూ వారు తగరు . వారిని ఎంత అమానుషంగా హింసిస్తే ఆడవాళ్ళకు అంత ఘనంగా న్యాయం జఱిగినట్లు . అలా చట్టపరమైన రాజ్యహింస ( legitimized State violence ) కు బలికాకుండా ఉండాలంటే ఆ మగవాడు ఒక ఆడదాన్నుంచి " మంచివాడు " అనే సర్టిఫికేట్ సంపాదించుకోవాలి . ఒకవేళ ఆమె మీద అతనికి ఫిర్యాదులుంటే వాటిని వినిపించుకునే వ్యవస్థే లేదు . ఆ విధంగా sub - human sex గా మార్చబడ్డ మగవాళ్ళ పని అల్లా - ఈ పురుష వ్యతిరేక ప్రభుత్వాలకు నోరు మూసుకొని వోట్లెయ్యడం , ఠంచనుగా వాటికి పన్నులు కట్టడం , చెమటోడ్చి , ఒళ్ళు హూనం చేసుకొని , దేవుడికీ , సమాజానికీ , అంతరాత్మకీ కూడా చీడపురుగులుగా మారి ఆడవాళ్ళకు ఆదాయాల్నీ , ఆస్తుల్నీ దోచిపెట్టడం , వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయడం , చేసుకోవడం , వాళ్ళకు కోపమొచ్చినప్పుడల్లా ఫెమినిస్టు చట్టాల ప్రకారం బుద్ధిగా జైలుకెళ్ళడం , వాళ్ళకు బట్టలూ , నగలూ , ఇహ ఏది కావాలంటే అదల్లా కావాల్సినప్పుడు సవినయంగా కొనిపెట్టడం . . పెట్టడం . . . పెట్టడం . . . అంతే !
" వాడు నిజం చెప్పడం లేదని నాకు తెలుసు . మళ్ళీ వీడి సంగతి స్కూల్లో అందరికీ తెలియాలా ? అయినా సోమవారం దాకా ఎందుకు . ఇప్పుడే వాడి నోటి తోటే నిజం చెప్పించాలి . "
ఎందుకంటే విద్య తెలిసినవాడు , అవగాహన వున్నవాడు , తన బంధనాన్ని తనే తెంచేసుకుని కేంద్రస్థానంలోకి వస్తే - పిడుగురాళ్ళ నుంచి ఒక కొత్త సాహిత్య వికాసం జరగటం మొదలవుతుంది . ఆ ప్రాంతపు కవులందరూ ఎంతో కొంత త్యాగం చేయాలి . మరోచోట కొంత పొందాలంటే , కొంత త్యాగం చేయాలి . బహుశ ఆ తరుణం వచ్చిందని నేననుకుంటున్నాను . మోహనరావు గానీ , కోనూరి రవికుమార్ గానీ , శర్మగారు గానీ దీని గురించి ఆలోచించాలి . మీరు కేంద్రమయితే కొత్తతరం జన్మిస్తుంది . ఒక తరం గొప్పతనం అది సాధించిన విజయాలు కాదు , అది తయారుచేసిన మలితరం . మనకి వారసుల్ని మనం తయారుచేయాలి . ఆ వాతావరణం మనం ఏర్పరచాలి . ఆలోచించండి .
" మో " వ్రాసిన భయద నిషాద , విషా , నిషా ? గీతాలు మీ కోసం కినిగే పై
సుబ్బలష్షిమి : బావా ఎప్పుడూ , చిరుగులు పడ్డ లుంగీ చింపటానికి కూడా ఒప్పుకొనే వాడివి కావు , కుట్టి కట్టుకుంటా అనేవాడివి , అంతగా ఐతే చిరుగులు కనపడకుండ శాలువా లాగా కప్పుకుంటా అనేవాడివి , ఇవాలేంటి బావా ఇలా అంటున్నావు ?
అంతవరకూ ఓపిగ్గా వింటున్న మరో చుట్టం , " అదేమిటండీ , ఆవిడ చేసిన వంట ఆవిడ తినకుండా మీరు కూర్చుని భోంచేశారా ? " అన్నాడు .
సెయింట్ లూయిస్ అఖాతం , బిలోక్సీ మరియు పాస్కాగౌలా వద్ద ఉన్న పెద్ద అఖాతాలు తీర ప్రాంతంలో భాగంగా ఉన్నాయి . లోతులేని మిసిసిపీ శాఖ ద్వారా మెక్సికో సింధుశాఖ నుంచి ఇది వేరుచేయబడుతుంది , మిసిసిపీ శాఖలో పెటిట్ బోయిస్ ద్వీపం , హార్న్ ద్వీపం , ఈస్ట్ అండ్ వెస్ట్ షిప్ ఐల్యాండ్స్ , డీర్ ఐల్యాండ్ , రౌండ్ ఐల్యాండ్ మరియు క్యాట్ ఐల్యాండ్ వంటి ద్వీపాలు ఉన్నాయి .
29 పాదా నిన్దో రమృతశిశిరా ఞ్జాలమార్గప్రవిష్టాన్ పూర్వప్రీత్యా గతమభిముఖం సంనివృత్తం తథైవ చక్షుః ఖేదాత్సలిలగురుభిః పక్ష్మభి శ్ఛాదయన్తీం సాభ్రేऽహ్నీవ స్థలకమలినీం న ప్రబుద్ధాం న సుప్తామ్
ఆ పిల్లాడు చాక్లెట్ల కోసం యేడవడం లేదు బాంబుల దాడిలో తెగిపోయిన రెండు చేతుల కోసం యేడుస్తున్నాడు దేశాల కోసం జెండాల కోసం కూడా కాదు గుండెలు బాదుకోవడానికి రెండు చేతులు లేవని యేడుస్తున్నాడు యిప్పుడు కవిత్వం కావాల్ట , కవిత్వం పూర్తిగా చదవండి »
ఇలాంటి ఇబ్బందులనుండి తప్పించుకోవాలంటే చైనా రెస్టరాంటుకీ , ఇండియన్ రెస్టారాంటుకీ , ఒక్కళ్ళూ వెళ్ళకూడదు , ఒక చిన్న మందలా వెళ్ళాలని ఒకడు నాకు హితోపదేశం చేసేడు . ఇంట్లో మా ఆవిడ చెప్పినట్లు , ఆఫీసులో మా సెక్రటరీ చెప్పినట్లు వినటం అలవాటయిపోయిందేమో మనమంచికే చెబుతున్నాడు కదా అని ఆ హితైషి చెప్పినట్లు ఒక సారి అరడజను మంది సహోద్యోగులతో చైనా రెస్టరాంటుకి వెళ్ళేను . వాళ్ళంతా బాతులని , కుక్కలని , పందులనీ ఆర్డరు చేసుకుంటున్నారు . నేను బితుకు బితుకు మంటూ బుద్ధాస్ డిలైట్ ఆర్డరు చేసేను . అందరివీ ఒకటీ ఒకటీ వస్తున్నాయి . నేను తప్ప అందరూ వడ్డించుకుని లొట్టలు వేసుకుంటూ తింటున్నారు . నేను బిక్క మొహం బైటకి కనిపించకుండా బింకంగా పోజు పెట్టి బుద్ధాస్ డిలైట్ కోసం ఎదురు చూస్తున్నాను . ఆది వచ్చే సరికి ఒక వాయి భోజనాలు కానిచ్చేసిన నా సహోద్యోగులు దీని మీద కలబడి పంచేసుకుని , " రావ్ , మేము కూడ నీలాగే వెజిటేరియన్ ఆర్డర్ చెయ్యవలసింది , ఇది చాలా బాగుంది " అంటూ ఆ ప్లేటుని ఒకరి చేతుల మీదుగా మరొకరు నా దగ్గరకి పంపేసరికి అది కాస్తా ఖాళీ అయిపోయింది . నేను మొర్రో మొర్రో అంటే మరొక ప్లేటు తెప్పించేరు . ఆది వచ్చేసరికి అందరి భోజనాలు అయిపోయాయి .
సమాజంలో నెలకొన్న తీవ్ర అంతరాల నేపథ్యంలో కార్మిక కుటుంబాలు ఎన్నటికీ ఆస్తులు సంపాదించుకోలేవు . అవి ఎప్పుడూ అప్పుల్లో మునిగి తేలుతూనే ఉంటాయి . ఈ రుణాలపై వారు చెల్లించే వడ్డీల కారణంగా శాసన సభ్యుల ఆస్తులు పెరుగుతాయి . ఈ ఎమ్మెల్యేల్లో కొంతమంది రుణ దాతలు కావడం గమనార్హం . ఈ శాసన సభ్యుల సంపద కార్పొరేట్ ప్రపంచంతో పోలిస్తే అత్యంత స్వల్పం . పది లక్షల కార్మిక కుటుంబాలు సుమారు 275 సంవత్సరాలు జాతీయ ఉపాధి హామీ చట్టం కింద పనులు నిర్వహిస్తే 3 . 5 లక్షల కోట్ల రూపాయలు సమకూరతాయి . ఇది ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి గత ఆరు సంవత్సరాలుగా వార్షికంగా సగటున అందించిన రాయితీలతో సమానం .
కొన్నాళ్ళ క్రితం బ్లాగ్ మిత్రులు జయ గారు తదితరులు బంగారం ( బుజ్జులు ) కబుర్లు అడిగారు . . . వాళ్ళకోసం : - )
" ఒక జాతి పోరాటాన్ని గౌరవించలేనివాడు ఐక్యతకు ఎప్పుడూ నాంది పలుకలేడు " - జూలూరు గౌరీశంకర్
మీరు రాజకీయాల్లో చేరితే ఖచ్చితంగా హోమ్ మినిస్టరైపోతారు . ఇప్పుడదేకదా అంటారా ? ; ) అందకుండా సమాధానాలివ్వడంలో జానారెడ్డి తరువాత మీరే . : - ) )
నేనొక యుద్ధంలో ఓడినాను మరో యుద్ధంలో గెల్చినాను కానీ నన్ను మాత్రం ఇంకా గెలుచుకోలేదు !
అలా ఓ పది గదులో యెన్నో వున్నాయి . ( అక్కడ తెగుతున్న టిక్కెట్లని బట్టి , తరవాత గదుల్లో టైములు అడ్జస్ట్ చెయ్యబడతాయి ) . అవన్నీ పూర్తయితే , మళ్లీ ఓ మినీ థియేటరు లోకి ప్రవేశం . అందులో ఓ యేడెనిమిది వందలమంది పడతారు . 70 ' X 70 ' అనుకుంటా - - పెద్ద స్క్రీను . ఫుల్ స్టీరియో డొల్బీ సౌండ్ సిస్టం వగైరాలతో . ఆ థియేటరు నిండేవరకూ , గ్యాప్ . టాయిలెట్లకి వెళ్లేవాళ్లూ , అక్కడ దొరికే ఐస్క్రీములూ , చాక్లెట్లూ లాంటివి కొనుక్కొని తినేవాళ్లూ , పిల్లలని రిలాక్స్ చేసేవాళ్లూ . . . . థియేటరులో కూర్చొని సేదదీరేవాళ్లూ . . . ఇలాగ . నేను నా సెల్ఫ్ హిప్నోసిస్ లోకి వెళ్లి , ఓ ఇరవై నిమిషాలు రిలాక్స్ అయ్యాను . అప్పుడు సినిమా మొదలు . ఆ సినిమా యెవరు తీశారో , తీయించారోగానీ , థియేటర్లలో రిలీజు చేస్తే , రెండో ఆటకి జనం వుండరు ! చిత్రం మాత్రం అద్భుతంగా వుంది !
సాక్షి ని చాలామంది కేవలం ఫామిలీ పేజీ కోసం తెప్పిస్తారనే సంగతి కాదనలేని సత్యం ! మిగతా విషయాలెలా ఆయన లేకపోవడం ఫామిలీ పేజీకి నష్టమేనేమో !
ఇక బంగారం మఱియు వెండి విగ్రహాల విషయానికి వస్తే , ప్రతీ రోజు వీఐపీలు దర్శనార్దం వస్తూ ఉంటారు కాబట్టి , వారుకి ఆశీర్వాదంగా ఇచ్చే ప్రక్రియలో వీరు ముందుగా వీటిని తయారు చేయించి పెట్టుకున్నారు అన్న సమర్దన నాకు అంగీకారమే . అందువల్ల అలాంటి వాటిని నేను శంకించను . లాటుగా ఒకేసారి వీటిని తయారు చేయించు ఉంచుకోవడం వల్ల పలు సౌకర్యాలు ఉంటాయి . అందువల్ల సత్య సాయి బాబా అనునాయిలు ఇలా భారీ మొత్తంలో బంగారు విగ్రహాలు చేయించి ఉంచుకోవడం వల్ల పలు లాభాలు గమనించి ఉంటారు .
తమకు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సివుండగా రూ . 1 . 57 లక్షలు ఎదురివ్వాలంటూ బట్టీ యజమానులు బెదిరింపులకు దిగారు . డబ్బులిచ్చే దాకా ఎవ్వరినీ కదలనివ్వబోమంటూ నిర్బంధించారు . గత 15 రోజులుగా ఈ నిర్బంధం కొనసాగుతూనే ఉంది . దీంతో బాధితులు తోట్లవల్లూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు . ఆనక ఎసిపిని కలిసి విన్నవించారు . తహసీల్దార్ను కలిసి వేడుకున్నారు . ఎవ్వరూ వీరి మొర ఆలకించలేదు . కెవిపిఎస్ , ఇతర దళిత సంఘాల నాయకులతో మాట్లాడారు . అసలు విషయం బయటకు వచ్చింది . కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నవరపు నాగేశ్వరరావు సంఘటనా ప్రదేశానికి వెళ్లారు . బాధితులకు విముక్తి చేయటానికి జిల్లా ఎస్పి , కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు . తోట్లవల్లూరు తహసీల్దార్ ఎం . బాబురావు సంఘటనా స్థలానికి వచ్చి నిర్బంధంలో ఉన్న దళితులను పరామర్శించారు . దళితుల వాంగ్మూలాన్ని తీసుకున్న ఆయన నివేదికను పోలీసు ఉన్నతాధికారులకూ , కలెక్టరుకూ , ఆర్డీఓకూ , కార్మిక శాఖకూ , ఛైల్డ్ వెల్ఫేర్ తదితర ఉన్నతాధికారులకు నివేదిక రూపంలో పంపారు . అయినా బాధితులకు న్యాయం నేటికీ జరగలేదు . నిర్బంధంలో ఉన్న వారికి తహసీల్దార్ రూ . 1000 చొప్పున అందజేసి చేతులు దులుపుకున్నారు . బాధితులను వారి స్వస్థలాలకు పంపించివేశారు . కెవిపిఎస్ పామర్రు డివిజన్ కార్యదర్శి చేబ్రోలు భాస్కరరావు , వ్యవసాయ కార్మిక సంఘం తోట్లవల్లూరు మండల కార్యదర్శి దేవరపల్లి చంద్రశేఖర్ , దళిత బహుజన ఫ్రంట్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ సదా లక్ష్మి , ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు శేఖర్బాబు , గ్రామ దళిత నాయకులు వల్లూరు సుదర్శన్ తదితరులు బాధితులను ఓదార్చారు . బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని జిల్లా కలెక్టర్ రిజ్వీ హామీ ఇచ్చారు . అయినా ఎలాంటి న్యాయం జరగలేదు . పోలీసులు మాత్రం బట్టీల యజమానులపై కేసు నమోదు చేసి ఊరుకున్నారు . తమకు ఇంకా న్యాయం జరగలేదని మేస్త్రి జె . నాగయ్య వాపోయాడు .
అన్ని కర్మలలోని దోషాలను యజ్ఞం పరిహరిస్తుంది . సర్వ కర్మలకు భోక్త ఆ భగవంతుడే . భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం | సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్ఛతి | | ( అ . 5 - శ్లో . 29 ) యజ్ఞాలకూ , తపస్సులకూ భోక్తననీ , సర్వలోకాలకూ ప్రభువుననీ , సమస్త ప్రాణులకూ మిత్రుడననీ నన్ను తెలుసుకున్నవాడు పరమశాంతి పొందుతాడు . అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ | ( అ . 9 - శ్లో . 24 ) సర్వ యజ్ఞాలలో భోక్త , ప్రభువు నేనే . భగవంతుడు యజ్ఞంలో స్థితమై ఉంటాడు . కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మా క్షర సముద్భవం | తస్మా త్సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం | | ( అ . 3 - శ్లో . 15 ) కర్మ వేదం నుండి పుట్టినది . పరమాత్మ వల్ల వేదం వెలసినది . అంతటా వ్యాపించిన పరమాత్మ అందువలనే యజ్ఞంలో ఎప్పుడూ ఉంటాడు . ' యజ్ఞం ' యొక్క ప్రేరేపణతో చేసే కర్మను ' యజ్ఞం ' హవిస్సుగా స్వీకరిస్తుంది . ఈ విధంగా యజ్ఞార్ధం చేసే కర్మ యజ్ఞంలోని భగవంతుడికి సమర్పింపబడి దానిలోని దోషాలు దగ్ధమై దోషరహితమైన ' అంశీభూత గుణకర్మ ' గా మారుతుంది . అదే కర్మఫలంగా ( యజ్ఞ శేషంగా ) ఆ మానవుడికి దక్కుతుంది . అది సత్య నిర్మాణంలో పాలుపంచుకుంటుంది . యజ్ఞం మూడు గుణకర్మలనూ హవిస్సులుగా కోరుతుంది కనుక త్రివిధమైన అంశీభూత గుణాలూ ఏర్పడి అవి మూడునూ పరస్పరం సమన్వయం చెంది ' సత్యం ' ఆవిష్కరింపబడుతుంది . ఆ విధంగా ఆ మానవుడి జీవనం సత్యమయమౌతుంది . రాగద్వేషాలతో చేసే కర్మలను భగవంతుడు స్వీకరించడు . ఎందుకంటే అవి ( యజ్ఞార్ధం చేయబడలేదు కనుక ) ఆయనకు సమర్పింపబడటంలేదు . అందువలన వాటిలోని దోషం దగ్ధం కాదు . దోషభూయిష్టమైన కర్మ ఫలమే ఆ మానవునికి అందుతుంది . అది కర్మ బంధానికి దారితీస్తుంది . యజ్ఞశిష్టాశిన స్సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః | భుంజతే తే త్వఘం పాపాః యే పచంత్యాత్మ కారణాత్ | | ( అ . 3 - శ్లో . 13 ) యజ్ఞశేషమును భుజించు సజ్జనులు సర్వ పాపముల నుండీ విముక్తులగుచున్నారు . కర్మలను యజ్ఞార్ధం కాక తమ ఇష్టయిష్టాలమేరకు చేసేవారు పాపమునే వండుకుని ఆ పాపమునే భుజిస్తున్నారు . యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనం | నాయం లోకో స్త్య యజ్ఞస్య కుతో న్యః కురుసత్తమ ! | | ( అ . 4 - శ్లో . 31 ) కురుకుల భూషణా ! యజ్ఞశేషము అమృతము . దీనిని భుజించేవారు శాశ్వత పరబ్రహ్మపదం పొందుతారు . యజ్ఞం ఒకటీ చేయని వాడికి ఇహలోక సుఖంలేదు ; పరలోక సుఖం అసలే లేదు . ఇంతకు ముందు ( ' యజ్ఞం ' అనే అంశం యొక్క ప్రారంభంలో ) చెప్పుకున్న ఉదాహరణలలో ' యజ్ఞం ' ద్వారా ' సత్యం ' ఏ విధంగా ఆవిష్కరించబడుతుందో చూద్దాం . ' వ్యవస్థ ' అనే విషయంలో పాలకులు ఏ ఒక్క గుణకార్యానికి లోబడకుండా అటు తమో గుణకార్యమైన ' రాజ్యం ' యొక్క ప్రయోజనాలు , ఇటు రజో గుణ కార్యమైన ' సమాజం ' యొక్క ప్రయోజనాలు , అలాగే సత్వ గుణకార్యమైన ' వ్యక్తి ' యొక్క ప్రయోజనాలు ఇలా మూడింటినీ సమన్వయపరచి , మూడింటి యొక్క ప్రయోజనాలనూ నెరవేర్చినచో ' వ్యవస్థ ' విషయంలో ' యజ్ఞం ' జరిగి ' సత్యం ' ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు . అలానే ' భాష ' విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి ఒక్కొకసారి వాడుక భాష , ఒక్కోకసారి ఇంగ్లీషు భాష ( శిష్ట భాష ) , ఒక్కొకసారి సంస్కృతం ( పురాతన భాష ) ఇలా మూడు భాషలనూ అంగీకరించినట్లైతే భాష విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరించబడినట్లుగా భావించవచ్చు . అలానే ' జీవన విధానం ' విషయంలో సందర్భౌచిత్యాన్ననుసరించి సంప్రదాయాలనూ పాటించాలి . ఆధునికంగానూ జీవించాలి . ఒక్కొక సందర్భంలో కాలానుగుణమైన మార్పులనూ అంగీకరించాలి . ఇలాగనుక ప్రవర్తిస్తే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు . అలాగే ' పిల్లల పెంపకం ' లో ఒక్కొక సందర్భంలో వారిని క్రమశిక్షణతో కట్టడి చేయాలి . ఒక్కొక సందర్భంలో వారికి స్వేచ్ఛ నిచ్చి వారు అడిగినది సమకూర్చాలి . ఒక్కొక సందర్భంలో మన ప్రమేయంలేకుండా విషయాన్ని వారి స్వయం నిర్ణయానికి వదలి వేయాలి . ఇలా గనుక ప్రవర్తిస్తే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు . అలాగే సమాజంలో మనుగడ సాగించే మానవుడు సత్వ గుణ సంబంధమైన విజ్ఞానాన్నీ ఆర్జించాలి . రజోగుణ సందర్భమైన లౌక్యాన్నీ , వ్యవహార దక్షతనూ పెంపొందించుకోవాలి . అలానే తమోగుణసంబంధమైన మంచి నడవడికనూ కలిగి ఉండాలి . ఇలా గనుక జరిగినట్లైతే ఈ విషయంలో యజ్ఞం జరిగి సత్యం ఆవిష్కరింపబడినట్లుగా భావించవచ్చు . ఇలా సనాతనమైన , సార్వత్రికమైన , సార్వజనీనమైన ' యజ్ఞం ' ద్వారా ఏ విషయంలోనైనా సత్యావిష్కరణ చేయవచ్చు . సర్వేసర్వత్రా ఎక్కడైనా , ఎప్పుడైనా మానవాళి జీవనంలోని ఏ కోణానికైనా , ఏ శాస్త్రానికైనా , ఏ రంగానికైనా యజ్ఞాన్ని అన్వయించుకోవచ్చు ; ఆయా విషయాలకు సంబంధించి సత్యాన్ని సాధించవచ్చు . ( విషయం అవగాహన అవటం కొరకు ఎక్కువగా తేలిక పాటి విషయాలను తీసుకొని వివరించడం జరిగింది . దీనిని బట్టి ' సత్యనిర్మాణం ' ఇంత తేలికా అని అనుకోకూడదు . మనకు వాస్తవ జీవితంలో అది వ్యక్తిగతమైనా కానివ్వండి సామాజికమైనా కానివ్వండి చాలా సంక్లిష్టమైన సమస్యలు ఎదురుపడుతుంటాయి . ముందు సులువైన విషయాల ద్వారా యజ్ఞప్రక్రియను అర్ధం చేసుకుంటే ఆ తరువాత ఎంతటి క్లిష్టమైన వ్యవహారంలోనైనా మనం సరిగా వ్యవహరించగలుగుతాము . ) … ( సశేషం )
ఎంత విచిత్రం ? సరిగ్గా ఇవ్వాళ్ళే త్యాగరాజస్వామి వారి ఆరాధన తిథి . ఇప్పుడే ఈయన స్వర్గారోహణం . అక్కడ త్యాగరాజస్వామితో కలిసి జుగల్బందీ చేస్తాడు కావును ! మొన్నటికి మొన్న వినాయకచవితి పండక్కీ , పండరిపూర్ యాత్రా సందర్భంగానూ పుణే నగర వీధుల్లో అనుకోకుండ ఈయన పాట ఎదురుపడితే నిశ్చేష్టుడినై , బయటికి వెళ్ళిన పని మరిచిపోయి ఆ సంగీతంలో తలమునకలై పోయిన అనుభవం ఇంకా పచ్చిగానే ఉంది . హేమంతపు రాత్రుల్లో తన గురువుగార్ని తల్చుకుంటూ మహామహుల్ని పుణేకి రప్పించి రాత్రింబవళ్ళు కచేరీలతో హోరెత్తించిన సవాయ్ గంధర్వ ఉత్సవ జ్ఞాపకం వెచ్చగానే ఉంది . గాన గంధర్వా ! నీ స్మృతికి మరుపెక్కడ ! నిన్ను మరవాలంటే ఆ విమలగాంధర్వం మరపుకి రావాలి . అది ఈ జన్మకి జరిగే పని కాదు .
మళ్ళీ వర్షం మొదలై పోయేది . మంచం మీద దుప్పటి కప్పుకుని వాన చప్పుడు వింటూ కళ్ళు మూసుకునే దాన్ని . వర్షం కచేరి చేస్తూ వుంటే వురుములు , మెరుపులు , పిడుగులు పక్క వాయిద్యాలు వాయిస్తున్నట్టు … వింటూ ఎప్పుడో నిద్రలోకి జారుకునే దాన్ని .
నమస్తే . . ! నాకు రచయితగా జన్మనిచ్చిన కథ " పిల్లి పోయి ఎలుక వచ్చె డాం డాం డాం " . . ఈ హాస్య కథ నవ్య వార పత్రికలో 31 - జనవరి - 2007 న ప్రచురితమయింది . . . .
ఈ టెంపుల్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు . అయితే ఎన్ని తీసినా , చూపినా చందమామ కథలా చక్కగా ఆసక్తికరంగా వినిపించొచ్చు . అయితే మనకు రామాయణం , మహాభారతం . . . అందులో నుంచి పుట్టిన అనేక కథలు , గాథలున్నాయి . ఇందులో ప్రతీదీ ఆసక్తిదాయకంగా ఉంటుంది . కారణం కన్విన్సింగ్ పాయింట్ తప్పకుండా ఉండటమే . బద్రీనాథ్కు మూల కథనందించిన చిన్నికృష్ణకు ఈ విషయం తెలియకపోదు . చెప్పినదానికి , చూపేదానికి చాలా తేడా ఉంటుంది . కథానాయకుడి కళా ప్రదర్శన కోసం ఇష్టమొచ్చినట్టు మలుపులు తిప్పుకుంటూ పోయారు . వాటికి ఉదాహరణలుగా ఈ కిందివాటిని పేర్కొనవచ్చు . . .
బొటనవేలు పగిలి చిత్తడయిన పాదాల ముని వేళ్ళతో ఒక సలపరాన్ని దారి పొడువునా అద్దుతూ కొనసాగడమొక్కటే ఉపశమనమై జ్వలించీ జ్వలించీ నెమ్మదినెమ్మదిగా బూడిదబారే వేయి తలల మహా కేతనంలా
" ఐతే వాళ్ళ ఇంట్లో ఎందరో వుండొచ్చు కదా , మరి ఇతనే మీతో చాట్ చేసినవాడని ఎలా నిర్ణయించారు ? " " ఇలాటి కేసులు మాకు మామూలే . ఈ మధ్య ఇంటర్నెట్ బాగా ప్రచారం లోకి వచ్చాక ప్రతి వేసవిలోను ఇలాటి వాళ్ళు కొందరు దొరుకుతున్నారు . ఆ చాట్ చేసిన వ్యక్తి ఇతనే అని నిర్ధారణ చేసుకోవటానికే అతనికీ ఏంజెల్ కీ మధ్య భేటీ ఏర్పాటు చేశాము . అతని సలహా మీదనే ఒక రహస్య ప్రదేశంలో కలుసుకోవటానికి ఇద్దరమూ అంగీకారానికి వచ్చి , అక్కడికి అతను ఒక్కడే వచ్చినప్పుడు అతన్ని అరెస్ట్ చేశాము . " " ఐతే , అతను ఏంజెల్తో సెక్స్ కోసమే వచ్చాడని ఎలా తెలుసు మీకు ? " " అతన్ని అరెస్ట్ చేసినప్పుడు అతని కార్లో ఒక తెరవని కండోమ్ పేకెట్ దొరికింది . అది చాలా ప్రత్యేకమైన బ్రాండ్ . " " అది మరే కారణం వల్లనైనా అతని కార్లో ఉండవచ్చుగా ? " " వీల్లేదు . ఎందుకంటే , ఆ బ్రాండ్ కండోమ్స్ తీసుకు రమ్మని అతనికి సలహా ఇచ్చింది నేనే ! అంటే ఏంజెల్ అన్నమాట . నేను చెప్పేవరకు అలాటి కండోమ్స్ ఉన్నాయని కూడ అతనికి తెలియదట ! "
ఇని్న మాట లెందుకు . . తలుచుకున్నంతనే నా లాటి ( కవి ) పామరులలో కూడా కవిత్వము పుట్టించ గల గొప్పతనము ఈ కాయ సొంతము . ఇంకా ఆలస్యమెందుకు ? వెళ్ళి ఆ పండు తినండి . లేనిచో మీ తల వేయి వక్కలు … . ఈ కథ చదివారుగా పరవా లేదులేండి . . మీకేమీ అవదు .
నల్లమోతు శ్రీధర్ : పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి . తప్పులేదు కానీ ఫ్రెండ్లీగా ఉంటున్నామన్న నెపంతో వాళ్లకి పూర్తి స్వేచ్ఛని ఇవ్వకూడదు . అలా పూర్తి స్వేచ్ఛని ఇస్తే ఎప్పుడైనా కొద్దిగా కఠినంగా ఉండవలసి వచ్చినా దాన్నివాళ్లు చావడానికో , చంపడానికో , మానసికంగా హింసించడానికో కారణంగా వెదుక్కుంటారు .
అచ్చుతో అంతమయ్యే విషయం వల్ల ఇది సంగీతపరంగా సంగీతకారులకు చాలా ఇష్టమైన భాష . ముఖ్యముగా కర్ణాటక సంగీతం లోని చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నవి . త్యాగరాజు , భద్రాచల రామదాసు , క్షేత్రయ్య , అన్నమయ్య , వంటివారు తమ తమ కృతులతో , కీర్తన లతో , తెలుగును సంగీతపరంగా సుసంపన్నం చేసినారు . పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన యూరోపియనులు తెలుగును " ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ " ( Italian of the east ) అని పిలుచుకున్నారు . ( నిజానికి ఇటాలియను కంటే తెలుగు పురాతనమైనది . కాబట్టి మనము ఇటాలియనును " తెలుగు ఆఫ్ యూరోపు " అని పిలుచుకోవచ్చు ! ) .
వసంతోత్సవాల ప్రసక్తి వచ్చేసరికి ఆనందంతో అరమూతలు పడ్డాయి వారుణి కనులు . " ఎనిమిది సంవత్సరాల నించీ ఈ అడవిలో వుంటూ నాగరికతకు దూరంగా బతుకుతున్నాం . విద్యాభ్యాసం పేరుతో ఎన్నెన్నో అనుభూతులను , అనుభవాలను కోల్పోతున్నాం … . వసంతోత్సవాలలో పాలుపంచుకోవటం అంటే నా మనస్సు ఉప్పొంగిపోతున్నది " తన్మయత్వంగా చెప్పింది అతనికి .
మన ప్రతిమాటలో , ప్రతి చేతలో తెలంగాణ ( త ) త్వాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు చాలా అవసరం !
నేను చదివిన ఓ ఇంగ్లీష్ క్రైం నవల లో ఓ వూళ్ళో ఓ పెద్దమనిషి ఇంట్లో నిలువెత్తు ఇత్తడి విగ్రహాలు - - జీవకళ వుట్టిపడుతూ కనువిందు చేసేవిట .
అవును . అతనికొచ్చే జీతంలో బేసిక్ పే ఎంతో అతనికి గుర్తు ఉండదు . డి . ఎ . పాయింట్లు ఎంత పెరిగిందో తెలీదు . ఏ లోను ఎంత కటింగు అయి , నెట్ ఎంత వస్తున్నదీ చెప్పలేడు .
ఈ కథ ద్వారా తను ప్రజా రచయితగా కాకుండా పాలకపక్ష రచయితగా రఘోత్తమ్ ప్రూవ్ చేస్కున్నారు . ఈ కథ ముగింపు రచయితకు సెజ్పట్ల సెజ్లోని లేబర్ చట్టాలపట్ల ఏ మాత్రం అవగాహన లేదని తెలుపుతుంది . లేకపోతే తన భూముల్లోనే సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నవాళ్లు సమ్మె చేసి తమ జీతం రెండొందలు పెంపు చేస్కున్నారు అని ఎలా రాస్తారు ? పైగా ఇందులో కిటుకు ఉన్నదట . వాళ్ల సమ్మె వలన అనాదిగా మానవ జాతి ఎలా మనగలుగుతూ వస్తుందో చటుక్కున స్ఫురించిందట . అదేంటంటే ప్రభుత్వం గుంజేస్కున్న పనికిరాని భూమి పోయినప్పట్కి ఫాక్టరీలో ఉద్యోగాలనే అభివృద్ధి ప్రతిఫలనాలను అందుకుంటూ అందులోనే ఇంకొద్ది మంచిగా జీవించడానికి జీతాల పెంపుకోసం సమ్మెలూ గట్రా చేస్కుంటూ నెట్టుకురావడం .
ఆపైన క్షణం కూడా ఆలస్యం చేయలేదు శ్యామ్సుందర్ . వాసంతి చేతిని వదిలించుకొని వింటినుంచి వెలువడిన బాణంలా వంతెనమీదికి పరుగు తీశాడు .
రాము వాళ్ల అమ్మ వాడికొక ముతక దుప్పటి ఇచ్చింది . తనొక పలచని చీర కప్పుకొని , గదిలో ఒక మూలగా చాపమీద ముడుచుకొని పడుకున్నది . రాముకోసం మరొక చాప ఉంది వాళ్లింట్లో .
ఈనాటి సంగీత సాహిత్యాల గురించి వేటూరిగారు చెప్పిన విషయాలు కొంతవరకు నిజమే . కానీ , పంచభర్తృకలై కవులు పాటలెందుకు వ్రాయాలి ? అసలు దర్శకుడు పాట ఏ సందర్భంగా కావాలో చెప్పకపొతే రచయిత ఏమి వ్రాస్తాడు ? సంగీత దర్శకుడు ఏ స్వరాలు కూరుస్తాడు ? గాయకుడేమి పాడుతాడు ? నిర్మాత , దర్శకుల బావమరుదులు చెప్పటమేమిటి వీరు వ్రాయడమేమిటి ? ఉన్నత శిఖరాలు అధిరోహించిన కవులు తమ ఔన్నత్యాన్ని తగ్గించుకొని ఎందుకు వ్రాయడం ?
ఈ రోజుల్లో టీ . వీ . షోల్లో ఎన్నో పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్న చిన్నారుల ప్రతిభ వెనుక కనిపించని తపన , శ్రమ . ఒత్తిడి ఉన్నాయన్నమాట తెలిసిందే . ఇందుకోసం ముక్కుపచ్చలారని వయసులో పిల్లలు పడుతున్న యాతన అంతాఇంతా కాదు . హాయిగా ఆడుతూ పాడుతూ నచ్చినట్టు విహరించాల్సిన వయస్సులో ఒక ప్రక్క చదువుల హోరు , మరో ప్రక్క కాంపిటేషన్ల జోరు . దేన్లోనూ వెనుకబడటానికి వీలులేదు .
ఆ మాటకొస్తే నేను పుస్తకాలు ఎక్కువగా చదివేదాన్ని కూడా కాదు . కాకపోతే చివరి అట్ట క్షుణ్ణంగా చదివేదాన్ని . ఆమాత్రానికే నన్నో ఇంటలెక్చువల్గా చూసేవాళ్ళు .
సురవరం ప్రతాపరెడ్డి సామాజిక జీవితం : ప్రతి మనిషికీ సామాజిక జీవితం ఉంటుంది . సామాజిక జీవితం ఎంతమాత్రమూ లేని , ఒంటరి ద్వీపంలాగ బతికే మనిషిని ఊహించడమే అసాధ్యం . మనిషి సంఘజీవి అనేది శుష్కమైన పదబంధం కాదు . సంఘం లేకుండా , తోటి మనుషులు లేకుండా , మానవ సంబంధాలు లేకుండా మనిషి జీవించడమే అసాధ్యం .
నాహం సంస్కృత పండితః , న చ కవిఃకింత్వేష యత్నః కృతఃవిజ్ఞాతుం బహుమాని తాంధ్ర కవితామాధుర్య మాంధ్రేతరేకాంక్షంతీతి భ్రంశం విచింత్య కతిచిత్పద్యాని గేయా న్యహంప్రీత్యా సంస్కృత భాష యా వ్యర చయంమా మాద్రి యాంతాం చుదాః . "
ఈ నెల 5 వ తారీఖున ఆఫీసుకి సంబంధించిన పనికోసం రాజ్ భవన్ రోడ్ కి వెళ్ళాను . మిట్టమధ్యాహ్నం ఎండ నడి నెత్తిమీద ఉంది . ఇంకా బేగంపేట బ్యాంక్ పనిమీద వెళ్ళాలి . . అనుకుంటూ . . అక్కడ పని ముగించుకుని బయటకి వచ్చాను . రాజ్ భవన్ రోడ్ దగ్గర ఆటోలు దొరకడం తక్కువ . . అనుకుంటూ ఉండగా " ఆటో కావాలా మేడం " అని ఆగాడు ఆటో అతను . బేగంపేట వెళ్ళాలి . . అని ఆటో ఎక్కి కూర్చున్నా . . అతనిని నేనసలు గమనించలేదు ఎక్కెప్పుడు . . ఆటో ఎక్కి కూర్చున్న తరువాత " మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను నేను మీది ఫలనా కాలనీ కదా " అని అడిగాడు . . అప్పుడు గమనించా అతనిని నిజమే మా కాలని బస్టాండ్ దగ్గర చూశాను . అదే చెప్పాను , తెలిసిన మనిషిని అవడం చేతో మరి చెప్పాలనిపించిందో కాని . . ఈ నెల 25 న నాకు operation ఉందమ్మా . . 10 యేళ్ళ క్రితం జ్వరం వచ్చింది , ప్రభుత్వాసుపత్రికి వెళ్తే పెన్సిలిన్ ఇంజెక్షన్ ఇచ్చారు . . Date అయిపోయిందో ఏమో అది కాస్తా వికటించింది . . కాళ్ళు రెండు చచ్చుబడిపోయాయి . . రోజుకి 14 గంటలు కష్టపడ్తాను , ఆటో అద్దె పోగా నెలకి 1000 / - రూపాయల చొప్పున పొదుపు చేస్తున్నా . . ఇప్పటికి 25 , 000 / - అయింది . నాకోసం ప్రార్థించండి
తెలుగు సినీ సాహిత్యంలో హనుమంతుని గురించిన పాటలు పద్యాలను వివిధ తెలుగు సినిమాలలో చిత్రీకరించి ప్రజలందరికీ అందించారు . వీరాంజనేయ అనే పేరుతో ఒక సినిమా కూడా రూపొందించారు .
చిత్రకారులంతా కుంచెలనీ , రంగులనీ ఉపయోగించి అందమైన వర్ణచిత్రాలకు రూపు దిద్దుతారు . ఒకానొక చిత్రకారుడు , కుంచెతో పాటుగా కలాన్నీ చేతపట్టి , కేవలం రంగులతో మాత్రమే కాకుండా అక్షరాలతోనూ బొమ్మలు గీశాడు . వాటిలో ఒకానొక దృశ్య కావ్యమే ' హిమబిందు . ' రచయిత అడివి బాపిరాజు . ఈ చారిత్రాత్మక నవల చదువుతున్నంత సేపూ ఎక్కడా కూడా కేవలం ' చదువుతున్న ' అనుభవం కలగలేదు . కథంతా నా కళ్ళెదుట జరుగుతున్నట్టుగానూ , నన్ను నేను మైమరిచి జరుగుతున్న దానిని చూస్తున్నట్టుగానూ అనిపించిందంటే , అది కేవలం అడివి బాపిరాజు చేసిన అక్షర మాయాజాలం . ఆంధ్రుల చరిత్రలో శాతవాహనులది ముఖ్యమైన కాలం . అసలు తొట్టతొలి ఆంధ్ర పాలకులు శాతవాహనులే అన్న వాదనకూడా ఉంది . ' హిమబిందు ' నవల కథాకాలం శ్రీముఖ శాతవాహనుడు ఆంధ్ర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న రోజులు . ధాన్యకటక పట్టణంలో ప్రముఖ వ్యాపారి చారుగుప్తుడి ఏకైక కుమార్తె హిమబిందు కుమారి . చారుగుప్తుడిని గురించి ఒక్క మాటలోచెప్పాలంటే అతడు కుబేరునికే అప్పివ్వగలవాడు . గ్రీకు వ్యాపారవేత్త డెమాస్తనీస్ సోదరి - తర్వాతికాలంలో ముక్తావళిదేవి గా మారిన - ' పెర్లా ' కుమార్తె ప్రజాపతి మిత్ర హిమబిందు తల్లి . ఆవిధంగా హిమబిందులో ఆంధ్ర , యవన రక్తాలు ప్రవహిస్తున్నాయి . స్త్రీలు కూడా తిరిగి చూసే అందం హిమబిందు కుమారిది . చారుగుప్తుని సోదరి అమృతలతా దేవి కుమారుడు , శాతవాహన రాజ్యపు యువ సైనికాధికారీ అయిన సమదర్శికి తన మరదలంటే ఇష్టం . అమృతలతా దేవికి మేనకోడలినే తన కోడలిగా చేసుకోవాలని కోరిక . అయితే , యువరాజు శ్రీకృష్ణ శాతవాహనునికి హిమబిందు కుమారిని ఇచ్చి వివాహం చేయడం ద్వారా మహారాజుతో వియ్యమందాలన్నది చారుగుప్తుని అభీష్టం . మహారాజు జన్మదిన సందర్భంగా జరిగిన ఎడ్లబళ్ళ పందాలలో సమదర్శిని సైతం ఓడించి నిలిచిన యువ వీరుడూ , శిల్పీ అయిన సువర్ణశ్రీ - హిమబిందు తొలిచూపులోనే ఒకరితో ఒకరు ప్రేమలో పడతారు . అదే సంరంభంలో సువర్ణశ్రీ చెల్లెలు నాగబంధునిక సమదర్శితో ప్రేమలో పడుతుంది . బౌద్ధ మతావలంబకులైన శాతవాహనుల కారణంగా , రాజ్యంలో ఆర్ష ధర్మం అడుగంటుతోందన్న ఆగ్రహంతో అపర విశ్వామిత్రుడిగా పేరు తెచ్చుకున్నస్థౌలతిష్య మహర్షి , శాతవాహనుల మీద ఆగ్రహంతో , శ్రీకృష్ణ శాతవాహన యువరాజుని అంతం చేయాలనే సంకల్పంతో తన మనవరాలు చంద్రబాలని ' విషబాల ' గా తయారు చేసి ఆమెని యువరాజుపై ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేస్తాడు . ఇంతలోనే ఉజ్జయిని పై శత్రువులు దండెత్తడంతో యుద్ధం అనివార్యమయింది . పాటలీపుత్రాన్ని కూడా జయించి శ్రీముఖుడు జంబూద్వీపానికే చక్రవర్తి కావాలన్న తన ఆకాంక్షని బయట పెట్టిన చారుగుప్తుడు , దండయాత్రకి అవసరమయ్యే సమస్త ఖర్చులూ తనేభరిస్తానని మనవి చేస్తాడు మహారాజుకి . ఓపక్క సువర్ణశ్రీ - హిమబిందు కుమారిల ప్రణయం , మరోవంక యుద్ధ సన్నాహాలు . మహారాజుతో కలిసి యుద్ధానికి బయలుదేరబోతూ , హిమబిందుని శ్రీకృష్ణ శాతవాహనునికిచ్చి ఆమెని భావి సామ్రాజ్ఞిగా చూడాలన్నతన కోరికని కుమార్తె ముందుంచుతాడు చారుగుప్తుడు . తండ్రికి ఎదురు చెప్పే స్వభావం కాదు హిమబిందుది . హిమబిందు భావి సామ్రాజ్ఞి కానున్నదన్న విషయం సువర్ణశ్రీ కి తెలుస్తుంది . అంతలోనే ఊహించని విధంగా , శత్రువులెవరో హిమబిందునీ , ఆమె అమ్మమ్మ ముక్తావళీ దేవినీ అపహరిస్తారు . ఆమెని వెతుకుతూ బయలుదేరతాడు సువర్ణశ్రీ . యుద్ధానికి బయలుదేరుతున్న శ్రీకృష్ణ శాతవాహనునిపై విషబాలని ప్రయోగిస్తాడు స్థౌలతిష్య మహర్షి . ప్రేమలూ , పగలూ , రాచరికపుటెత్తులూ , వ్యాపారపు మాయలూ , ఆర్ష ధర్మం , బుద్ధ బోధనలు , యుద్ధ నీతులూ , ఉత్కృష్టమైన కళా సంస్కృతులు , ఊహకందని మానవ సంబంధాలు . . . పూర్తిగా ఓ కొత్త ప్రపంచం - అది కూడా పాఠకులని ఇట్టే ఆకర్షించే ప్రపంచాన్ని అలవోకగా సృష్టించారు బాపిరాజు . మొదటి పాతిక పేజీలని కొంచం ఓపిగ్గా చదివితే , తర్వాత ఈ పుస్తకాన్ని పూర్తిచేసి కానీ పక్కన పెట్టలేం . సువర్ణశ్రీ పాత్ర పట్ల రచయిత ప్రేమ ఎక్కడా దాగలేదు . అతన్నో వీరాధి వీరుడిగా , నిశిత బుద్ధి గలవాడిగా , ఒక ఆదర్శ మూర్తిగా చిత్రించారు బాపిరాజు . హిమబిందు ప్రధాన నాయిక అయినప్పటికీ , ఆమెకన్నా విషబాలని ఎక్కువ శ్రద్ధగా తీర్చి దిద్దారేమో అనిపించింది చాలాసార్లు . స్థౌలతిష్య మహర్షి చేసే పనులు తెలిసీ మహారాజు ఊరకుండడం ద్వారా శాతవాహనుల పరమత సహనాన్ని చిత్రించారు రచయిత . అలాగే స్థౌలతిష్యుడు బౌద్ధ గురువు అమృతపాదుల మధ్య జరిగిన వేదాంత చర్చ ఆద్యంతం ఆసక్తిగా చదివించింది . ఇక్కడే కథకి ఒక అందమైన ముడి వేశారు బాపిరాజు . శాతవాహనుల పాలన , సైన్యాన్ని పోషించిన తీరు , ఆనాటి వర్తక వాణిజ్యాలు , చార వ్యవస్థ , బౌద్ధాన్ని వ్యాప్తి చేసిన విధానం వీటన్నింటినీ అత్యంత నిశితంగా అక్షరబద్ధం చేశారు . సువర్ణ శ్రీ కుటుంబం చెల్లెళ్ళు నాగబంధునిక , సిద్ధాంతికలతో అతని అనుబంధం , హిమబిందు - నాగబంధునికల స్నేహ బంధం , విషబాలని పెంచిన తీరు , ఆమె ఆలోచనల్లో క్రమంగా కలిగే మార్పులు , వివాహాన్ని గురించి యువరాజు , సమదర్శిల ఆలోచనలు . . ఇలా ఎక్కడా బిగి సడలని విధంగా కథని నడిపించారు . నిజానికి ఈనవల ఆధారంగా ఒక మల్టీ స్టారర్ చారిత్రిక సినిమా చేయొచ్చు . ముగ్గురు కథానాయకులు , నాయికలు , ఇంకా అనేక ప్రధాన పాత్రలు . రాజమహళ్ళు , యుద్ధాలు . . చాలా భారీ బడ్జట్టే అవుతుంది . అయితేనేం ? కథలో సినిమాకి కావాల్సిన హంగులన్నీ ఉన్నాయి . అసలు నవల చదువుతుంటేనే సినిమా చూస్తున్న అనుభూతి కలిగింది . ' నారాయణరావు ' ' కోనంగి ' నవలల్లో వలె ప్రధాన కథానాయకుడు సువర్ణశ్రీ ఉత్తమ గుణాలు కలవాడు , ' తుపాను ' కథానాయకుని వలె శిల్పి . ఆ నవలల్లాగే ఈ నవలకీ చదివించే గుణం పుష్కలంగా ఉంది . విశాలాంధ్ర ప్రచురించిన ఈ 296 పేజీల నవల వెల రూ . 150 . ఏవీకెఎఫ్ లోనూ లభిస్తోంది .
మీకు ఒక సొంత సైట్ ఉంటే దాని నిర్మాణం మొత్తం మీకు మీరే చేతులమీదకి ఎత్తుకోవక్కర్లేకుండా , కాగల కార్యం చిక్కుల్లేకుండా కానిచ్చేసేందుకు ఎన్నో సాఫ్ట్వేర్లు ఉన్నాయ్ . వాటిని కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటారు . అందులో చాలా తేలికైన , ప్రసిద్దిచెందిన వర్డుప్రెస్సుని మీ సైట్ లో ఎలా ఇన్స్టాల్ చేస్కోవాలో చూద్దాం .
" ఆ తరవాత ఆ స్వభావసిద్ధుడు తన యోగసాధనకి అనుకూలమైన స్థలం కోసం చూస్తూ తిరుగుతూ తన ఊరు చేరుకుని అక్కడి శతతాళదఘ్న సరస్సులో నివాసం ఏర్పరుచుకున్నాడు . అంతలో తన అల్లుడైన శాలీనుడు ఆ మడుగులో దూకినప్పుడు అతన్ని కాపాడి వయస్స్తంభన మణి మొదలైన వాటిని అతనికిచ్చి పంపాడు . ఐతే పోయిన బంధాల్ని మళ్ళీ తగిలించుకోవడం ఎందుకని తమ బంధుత్వాన్ని గురించి అతనికి చెప్పలేదు .
తెలంగాణా ఉద్యమం ఎంత పక్కదారి పట్టిందో ఇక్కడ వ్యాఖ్యానాలు చూస్తే తెలుస్తుంది . తెలంగాణా ఉద్యమం లక్ష్యం ఏమిటి ? ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి ? ఇది ఏ రకంగా తెలంగాణా సాధనకు ఉపయోగిస్తుంది ? అనే ఇంగితజ్ఞానం ఉన్నవారు అరుదుగా కనిపిస్తున్నారు . ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటినుండి ఇప్పటివరకూ తెలంగాణా ప్రజాప్రతినిధులుగా అక్కడిఅభివృద్ధిని విస్మరించిన వారే ఇప్పుడు సామాన్యులను రెచ్చగొడుతున్నారు . ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమవుతుంది . పేరుమారుతుంది . మళ్ళీ అదే నాయకులు , మళ్ళీ అదే పాలన . ఈ మాత్రం అవగాహన లేకుండా పోయినప్పుడు ఇంకా మాట్లాడేముంది ? నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఏం పీకావు అని ఒక్క నాయకుణ్ణి నిలదీసేవాడు లేడు . నోరులేని విగ్రహాల మీద శౌర్యప్రతాపాలు .
దానికి తోడు ఇదిగో ఇలా అప్పుడప్పుడూ పార్టీలు , ఒకళ్ళింటికి ఒకళ్ళు పిల్చుకోవటాలు . అసలు సంగతేవిటంటే , ఆ సాయంత్రం పైరేట్స్ ఆఫ్ ది కరిబ్బియన్ మూడో సినిమా చూడాలని ముందు అనుకున్నాం శ్రీదేవీ నేనూ . శనివారం కుదరకపోతే మళ్ళీ కుదర్దు . ఆదివారం శలవన్న మాటే గానీ వారమంతా వాయిదా వేస్తూ వచ్చిన ఇంటిపనులు చేసుకోడానికీ , రాబోయే పని వారానికి తయారవడానికే సరిపోతుంది గద . ఈ సతీశుడేమో ఏంటో ఆఖర్నిమిషంలో పిల్చాడు . శ్రీదేవికి ఒళ్ళుమండటానికి ఇది కూడా ఒక కారణమనుకోండి . ఐనా సంఘజీవుల మైనందుకు , మనది కాని దేశంలో ప్రవాసమున్నందుకు కాస్త మనవాళ్ళతో రాకపోకలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలని నా ఉద్దేశం . రేపేదన్నా అవసరం పడితే మన అన్నవాళ్ళు తోడుండాలి కదా . ఎప్పుడో రాబోయే అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు స్నేహాలు చేస్తామని కాదు , మాటవరసకి చెబుతున్నా .
ఏరకమయిన పాలసీ అయినా దాదాపు ఒకే పద్దతిలో నడుస్తుంటుంది . మనం చెల్లించినదానిలో కొంత మెత్తాన్ని మన ఇన్సూరన్సుకోసం ఉంచి మిగిలిన దాన్ని స్టాకు మార్కెట్టులోనో , ఇంకో దాంట్లోనో మదుపు చేస్తారు . ఏపాలసీ అయినా ఎంచుకునే ముందు మీరు చెల్లించే దానిలో ఎంత మొత్తాన్ని వారు మదుపు చేస్తున్నారో తెలుసుకోండి . మిగతా మొత్తం వారి నిర్వహణా వ్యయాలకు పోతుంది . అంత నిర్వహణా వ్యయంతో మీకు సరిపోయినంత ఇన్సూరన్సును మీరు తీసుకొనగలరో లేదో ఆలోచించండి . నా అభిప్రాయం ప్రకారం , ఇలాంటి వాటి జోలికి పోకుండా పైన చెప్పిన విధంగా మీకు కావలసినంత పాలసీని టర్ము ప్లానులో తీసుకొని మిగతాది మీ అభిరుచికి తగ్గట్లుగా వేరే దానిలో మదుపుచేసుకొనడం ఉత్తమం .
జిల్లాలో సిర్నాపల్లి సంస్థానానికి ప్రత్యేకత ఉంది . నిజాం నవాబు కాలంలో రాణి జానకీబాయి హయాంలో జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటికీ అజరామరం . 1859 నుంచి 1920 వరకు సిర్నాపల్లి సంస్థానాన్ని ఆమె పాలించారు . చెరువులు , ఆనకట్టలు , కుంటలు , బావులు , కాలువలు కట్టించారు . ఆమె ఇందల్ వాయి , నిజామాబాద్ లోని సిర్నాపల్లి గడి , కోటగల్లిగడి , మహబూబ్ గంజ్ లోని క్లాక్ టవర్ కట్టడం తదితర నిర్మాణాలు , జానకంపేట , నవీపేట , రెంజల్ దాకా 100 గ్రామాల్లో పరిపాలన సాగించారు . సికింద్రాబాద్ - నిజామాబాద్ రైల్వేలైనును నిజాం నవాబు ఉప్పల్ వాయి , డిచ్ పల్లిల మీదుగా వేస్తే , ఈమె ఆ లైనును తన సిర్నాపల్లి మీదుగా వెళ్ళేలా వేయించుకున్నారు .
నా చెప్పిన వచన పద్య లక్షణ సామంజస్యమేమయినా , వచన పద్యం ' పద్యం ' కావటం అనివార్యం . పద్య మౌలిక లక్షణమయిన పాదబద్ధతే దానికా శక్తి కలిగించింది . ( పాద స్వరూప విచారణ ఆ తరువాత . ) వృత్త , జాత్యుపజాతి , మాత్రాఛందస్సుల్ని అధిగమించి వస్తూ , ప్రాచీనుల ' వచనా ' లనూ , ఆధునికులైన భావకవుల ' భావగద్యా ' లనూ పరిశీలించి సమన్వయించుకుంటూ ; కొందరు భావకవులు వచనంగా మార్చిన ' పద్యా ' లను గమనిస్తూ వచన పద్యాన్ని నిష్పన్నం చేసింది పద్య రచయితలే తప్ప వచన రచయితలు కాదు . అందుకే నిష్పన్నమయింది ' వచన పద్యం ' . అత్యాధునికంగా పద్యకుటుంబానికి మాత్రమే కలిసివచ్చి విస్తరించిన ఆస్తి ' వచన పద్యం ' .
అన్నట్టు ఇక్కడ మంచితనం , మూర్ఖత్వం కూడా ఆయా నేపథ్యాల ప్రకారమేనండోయ్ . ఎందుకంటే నాకు మంచితనం అనిపించింది మరొకరికి చేతకానితనం లాగా అనిపించవచ్చు . నాకు మూర్ఖత్వం అనిపించింది ఇంకొకరికి పట్టుదలగా కనిపించవచ్చు . నాకు విపరీత ఆలోచనలు అనిపించినవి ఇంకొకరికి చాలా సాధారణ ఆలోచనలు కావచ్చు . అవన్నీ అలా ఆలోచించటానికి వారి నేపథ్యమే కారణమూ కావచ్చు .
మారుమూల ప్రాంతాలకు కూడ విస్తరించిన రవాణా మార్గాలు రోడ్డు మార్గాలే . రోడ్డు మార్గాలలో జాతీయ రహదారులు , రాష్ట్ర రహదారులు , జిల్లా రహదారులు , గ్రామ పంచాయతి రహదారులు అని 4 రకాలు . దేశంలోని మొత్తం రోడ్ల నిడివిలో కేవలం 2 % ఆక్రమించిన జాతీయ రహదారులు , ట్రాపిక్ లో మాత్రం సుమారు 40 % ఆక్రమిస్తున్నాయి .
" ఫోన్ చేసి నాన్నా నేను , ఇండియాలో పుట్టి పెరిగిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . "
" నువ్వేదో ఊహించుకొని ఇక్కడ జేరినట్టున్నావు పదేళ్ళ క్రితం నేను జేరినట్టు . నిజానికిదంత తీసివేయదగ్గదేమీకాదు . విశాఖ తర్వాత అంత పేరుంది . నెల నెలా వేలకొద్దీ టన్నుల ఆర్డర్లుండేవి . కార్మిక రత్న , యాజమాన్య రత్న వగైరా అవార్డులొచ్చేవి ప్రతియేటా . 88 లో ప్రభుత్వం ప్రకటించిన శ్వేతపత్రంలో మంది మూడో ఉత్తమ కంపెనీగా లెక్క గట్టారు . అయితే ఇప్పుడది గతించి పోయిన స్వర్ణయుగం . రెండేళ్ళ నుంచి అంతా తలకిందులయింది . ఇప్పుడు పరిస్థితేంటంటే గత నాలుగు నెల్లగా నెలజీతాలివ్వటం కూడా కనాకష్టంగా మారింది . బోనస్ల మాట దేవుడెరుగు . ఇన్సూరెన్సూ , పి . యఫ్ కట్టటం కూడా మానేశారు . కంపెనీ బస్సులు కూడా రద్దయ్యాయి . ఇప్పుడు రోజూ క్యాంటీన్ నడవటమే గగనం " .
రెండవ మైసూరు యుద్ధం జరుగుతుండగా చిత్తూరు దగ్గర్లోని నరసింగరాయనిపేట దగ్గర హైదరాలో డిసెంబరు 6 , 1782 లో క్యాన్సర్ సోకి మరణించాడు . ఆర్కాటు నవాబుల పరిపాలనలో చిత్తూరు ఖిల్లా గానూ , దానికి మొహమ్మద ఆలీ సోదరుడు అబ్దుల్ వహాబ్ ఖిల్లాదారు గానూ ఉండేవాడు . అతని దగ్గర సైనికుడుగా చేరిన హైదరాలీ తర్వాత అతన్నే ఓడించి మైసూరుకు బందీగా తీసుకుని వెళ్ళాడం కేవలం విధి .
రాష్ట్రావతరణ సమయంలో హైదరాబాద్ రాష్ట్ర ఆదాయం ముందు ఆనాటి ఆంధ్ర రాష్ట్ర ఆదాయం దిగదుడుపేననీ , వారు లోటులో ఉన్నారనీ కొంతమంది మేధావులు ప్రచారం చేస్తున్నా రు . అది నిజాలను వక్రీకరించడమే . 1954 - 55లో 82 , 170 చద రపు కిలో మీటర్ల విస్తీర్ణంగల అవిభక్త హైదరాబాద్ రాష్ట్ర బడ్జెడ్ కేవలం 100 కోట్లుకాగా , 63 , 610 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ 116 . 2 కోట్లు ఉందన్నది వాస్తవం . అభి వృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధులు హైదరాబాద్ రాష్ట్రం కంటే ఆంధ్ర రాష్ట్రంలో 50 శాతం ఎక్కువ . ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో మధ్య నిషేధం అమలులో ఉండటం మూలంగా అబ్కారీ ఆదాయం శూన్యం కాగా హైదరాబాద్ రాష్ట్ర ఆదాయం లో అదే గణనీయమన్న మాట కూడా వాస్తవం . ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలను పరిశీలిస్తే - రాజధాని ప్రాంతం నుంచి 39 శాతం , కోస్తానుంచి 16 శాతం , రాయలసీమ నుంచి 4 శాతం రాగా తెలంగాణ ప్రాంతం నుంచి 21 శాతం వస్తోంది . ఈ లెక్కల్ని పరిశీలిస్తే ఏ ప్రాంతం అభివృద్ధి చెందినట్టు ? పైగా తెలంగాణ ప్రాంతానికి 60 శాతం నిధులు ఖర్చుపెడుతున్నట్టు ఆధారాలతో సహా నీటిపారుదల శాఖామాత్యులు చెబుతున్నారు . మిగిలిన దాంట్లో రాయలసీమకు 25 శాతం . మిగిలింది కోస్తాకు . చారిత్రికాధారాలు , లెక్కలు చెబుతున్న వాస్తవాలు ఇంత స్పష్టంగా ఉండగా , ఇప్పుడు రాజధానీ నగరమైన హైదరాబాద్ మాదేనని , దాంతోపాటే ప్రత్యేకమైపోతామనీ , మిగతా ప్రాంతా లు ఎటుపోయినా మాకనవసరమనీ , ఎవరిపాట్లు వారు పడాల నీ దబాయింపులకు దిగడం న్యాయమేనా ? నిజంగా అభివృద్ధిని కోరుతూ ప్రత్యేక రాష్ట్రాలు కావాలని పోరాడాల్సింది కోస్తా , రాయలసీమ వాసులు కాదా ? ఎక్కడెక్కడి నుండో వలస వచ్చిన వారు కూడా తెలుగు సోదరులను వలసవాదులుగా ముద్రలే స్తూ , మిత్రులుగా వారికున్న పాటి హక్కు కూడా రక్త సంబంధీ కులైన తెలుగు సోదరులకు లేదని వాదించడం ఎంతవరకూ సమంజసమో ఆలోచించమని మనవి చేస్తూ , అభివృద్ధి పథంలో భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరం భార తీయులందరిదీ అన్న విషయాన్ని మరువకూడదని మనవి .
నాలుగో రోజు గాడిదపై ఇద్దరూ ఎక్కి కూర్చొని యధాప్రకారంగా తిరిగి వచ్చారు . కొడుకు ఊర్లోకెళ్ళి విషయాలు కనుక్కొని వచ్చి " నాన్నా ! అందరూ , అబ్దివలీ , ఆయన కొడుకూ ఎంత కనికరం లేని కసాయి వాళ్లు , పాపం ! ఆ మూగ జంతువుపై దర్గాగా ఎక్కికూర్చున్నారని నన్ను కొట్టడానికి వచ్చారు " అని విన్నవించుకున్నాడు . తండ్రి ఒక చిన్న నవ్వు నవ్వి , " చూశావా ! నువ్వేది చేసినా , లోకులు ఏదో ఒకటి అంటూనే ఉంటారు . . కాబట్టి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని " తన అనుభవ సారాన్ని కొడుక్కు కలకాలం గుర్తుండే పాఠంగా మిగిల్చాడు . బద్ధకం వదిలితే భవిష్యత్తులో మరికొన్ని కథలు . .
రావి శాస్త్రి వంటి రచయితల కధల్లో కూడా చాలా ప్రతిభావంతమైన పోలికలు కనిపిస్తాయి . పోలిక చెప్పే పనిని ఆయన కొన్ని సమయాల్లో చెప్పే విషయానికి పరిపుష్టిని కలిగించటానికుపయోగించినా , మరి కొన్నిసార్లు కేవలం ఉపమించటంలో ఉండే ఆనందం కోసం చేసారనిపిస్తుంది . ఎక్కడో ఒక కధలో ఆయన మగవాడి చూచుకాలు కుంకుమ భరిణె మూతల్లా ఉన్నాయని రాసారు !
& nb ; ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే , మా మనవరాలు నవ్య కూడా ఈ తరానికి చెందినదేగా . వీలున్నంతవరకూ నేను ఎప్పుడూ నోరుమూసుకునే ఉంటాను . నోరెత్తితే ఏం అవాకులూ , చవాకులూ మాట్లాడుతానో అని . మా అబ్బాయీ , కోడలూ , మా ఇంటావిడా తన ఎదురుగుండా ఒక్క మాటా కాజుఅల్ గా మాట్లాడరు . నేను ఏం మాట్లాడినా క్యాజుఅల్ గానే మాట్లాడతాను ! ఈ వయస్సులో ఇలాంటి కర్ఫ్యూలు ఉంటే కష్టం కదాండీ ? అయినా నా జాగ్రత్తలో నేనుంటాను . మనకీ ఓ బాధ్యత ఉందిగా ! మా పిల్లలసంగతి చెప్పాలంటే పాపం వాళ్ళకి క్రమశిక్షణ కొంచెం ఎక్కువే . అది మేమేమీ నేర్పలేదు . ఇంట్లో ఎప్పుడూ వాళ్ళెదురుగా ఎవరిగురించీ మాట్లాడుకునేవాళ్ళం కాదు . ఏం మాట్లాదుకుందామన్నా బయట వాక్ కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడమే .
అయితే మార్క్సిజం గురించి పరిచయం లేనివారికి మార్క్సిజానికీ , సమాజానికి ఉన్న సంబంధంతో గూడా పరిచయం ఉండదు . వారు మార్క్సిజం గొప్పతనాన్ని ఒప్పుకోమని శాసించలేము . మార్క్సిజం ఫలానా చెబుతుంది అని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు . అలా చెబుతున్న చోట మార్క్సిజం నిజానికి ఏం చెబుతుందో చెప్పడానికి ప్రయత్నించవచ్చు . వారు చెబుతున్నది నిజమని నమ్ముతున్నవారికి మాత్రమే మార్క్సిజం ఏం చెబుతుందో చెప్పగలం కానీ , మార్క్సిజంపై గుడ్డి ద్వేషంతో అదేం చెబుతుందో కూడా తెలియకుండా అది ఫలానానే చెబుతుందని వాదించేవారికి మార్క్సిజం గురించి బోధించాలని చూడటం వృధా ప్రయాస .
ప్రమాదాలు జరుగుతాయని ప్రయాణం మానేయగలమా ఊబకాయం వస్తుందేమో అని తినడం ఆపేయగలమా అంతమేంటో తెలియదని ఆరంభించకుండా ఉండగలమా మతిపోతుందేమో అని అందాన్ని ఆస్వాదించమా ఆశ నెరవేరలేదని ప్రయత్నించడం నిలిపివేయగలమా కలల సుందరి కానరాలేదని కళ్యాణఘడియని తప్పించగలమాపిచ్చోడా ! ! అంతా తికమక మకతిక , ఎప్పుడు తెలుసుకొంటావ్ ! ! ! [ … ]
నిన్నలా చూడడం నా కెంత శిక్షో నీకు తెలుసా చిరుగాలికి రావి ఆకులు గలగలాడినట్టు పారిజాతాలు జలజలా రాలిపడినట్టు తెరలు తెరలుగా మొగలి రేకుల్నివిడదీసినట్టు సహజంగా , సెలయేరు దూకినంత స్వచ్చంగా నవ్వే నువ్వు నీ నవ్వుతో నన్ను వెలిగించే నువ్వు కన్నీళ్ళు కన్నీళ్ళుగా కరిగిపోవడం ఆ కన్నీళ్ళకి కారణం నేనే కావడం అబ్బ ! నాకెంత గుండె కోతో నీకు తెలుసా ? ఒకరి సమక్షం ఇంకొకరికి ప్రాణమైన చోటే ఒకరినొకరం స్ప్రుశించలేకపోవడం ఎంత విషాదం ? ఒకరికొకరం ప్రాణంగా స్నేహానికి నిర్వచనంలా నిలబడిన మనం ఈ రోజు ఎందుకింత నిస్సహాయులమైనాం నేస్తమా !
ఓ పది మంది స్త్రీలు , ఓ " స్వయం సహాయక సంఘం " సంఘం గా యేర్పడి , ముగ్గురు లీడర్లని యెంచుకొని , వాళ్లలో వాళ్లు ( ఇంటర్ సే ) వొడంబడిక వ్రాసుకుంటారు . తరవాత , ఒక్కో సభ్యురాలూ నెలకి ఇంత అని నిర్దిష్టం గా ' పొదుపు ' చేసి , ఆ పొదుపుని బ్యాంకుల్లో అదివరకే తెరిచిన ఖాతాల్లో జమ చెయ్యాలి . ప్రతీ నెలా మీటింగులు పెట్టుకొని , సాధక బాధకాలని చర్చించుకొని , తీర్మానాలు చేసుకోవాలి . ఇలా సవాలక్ష నిబంధనల క్రింద , ఓ యేడాది పాటు క్రమం తప్పకుండా పొదుపు చేసిన " గ్రూపులకి " అప్పు చెయ్యడానికి అర్హత లభిస్తుంది - - అన్నమాట !
కాలాన్ని నా రథం పై విహార , విజ్ఞాన , వికాస యాత్ర చేయిస్తాను . నా మాతృభాష తెలుగులో విశ్లేషిస్తాను . ' కాలరథమ్ము మీదనె జగత్పతి నిత్యము స్వారి చేయునో ? కాలరథమ్ము చక్రముల ఘట్టన పుట్టుచు రాలుచుండు కెం థూళి కణమ్ములే అగునొ తోచెడి ఈ సకల ప్రజాళియున్ ? ' కాల రహసమున్ తెలియగల్గుటె పుట్టుకకున్ ఫలమ్మొకో ? ( బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు )
ఫిల్మ్ ఫేర్ అవార్డ్ తీసుకోగానే నరేష్ - " మా నాన్న చాలా సినిమాలు డైరెక్ట్ చేసారు , మా అన్న చాలా సినిమాల్లో నటించారు . వాళ్ళకెవరికీ ఇంతవరకూ ఫిల్మ్ ఫేర్ రాలేదు . మా ఇంట్లో నాకే ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ " అన్నాడు . చూస్తున్నవాళ్ళక్కూడా పెదాల మీద ఆటోమేటిగ్గా చిరుదరహాసం వచ్చేసింది అలా అనగానే . అదీ కాక వాళ్ళ ఇంట్లో వాళ్ళకైనా , స్టేజ్ మీద గుండేలు పిండే ప్రోగ్రాం పెట్టుకునే బదులు " అలా సరదాగా మాట్లాడితేనే ఇష్టపడతారనుకుంటా .
సత్యసాయి బాబాకు మహిమలు లేవని ప్రపంచంలో అందరికంటే ముందుగా , అందరికంటే బాగా తెలిసిన ఒకే ఒక వ్యక్తి సత్యసాయి బాబాయే . ఆ విషయం స్పష్టంగా తెలుసుగాబట్టే , గతంలో అబ్రహాం టి . కొవూర్ , నరసింహయ్య , గోరా , లవణం , ప్రేమానంద్ వంటి మేధావులతో ఒక్కసారి కూడా చర్చకు సిద్ధం కాలేదు . వాళ్ళ సవాళ్ళను స్వీకరించలేదు . కనీసం తన ఆశ్రమంలోకి వారిని అనుమతించక పోవటమేకాక తన శిష్య శిఖామణులచేత నిర్ధాక్షిణ్యంగా మెడలు పట్టి బయటకు గెంటించారు . ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికీ మహిమలుండవు .
నా మట్టి బుర్రకి తట్టిన ఆలోచనలివి . బోడి ఏడు కోట్లకు మంత్రివర్గం నుంచి తీసేయాల్సిన రోజులు పోయాయి . కాంగీ స్టాండర్డ్స్ ప్రకారం కనీసం ఆ బొక్కిన సొమ్ము వందల కోట్లలో ఉంటే అప్పుడు అయ్యవారు ఆ విషయం ఆలోచిస్తారు . కానీ ఏమీ చేయరు , అది వేరే విషయం . ఇక మొదటి సూర్యుడు . ఇవి బోడి ఏడు కోట్లే కదా , నీకు కనీసం యాభై కోట్లు దొరికే " అవకాశం " చూపిస్తాలే అనుంటాడు అయ్యవారు .
మొత్తం చదివాను . @ చదువరి గారు మీకు అభినందనలు . ఎప్పటికప్పుడు ఎదురవుతున్న ప్రతీ సమస్య గురించి మీరు ఆలోచించి స్పందించడం నన్ను ప్రభావితం చేస్తుంది . నాలో ఉన్న బద్ధకాన్ని వెక్కిరిస్తుంది . మీ టపా చాలా సమగ్రంగా ఉంది . పరిష్కార మార్గాలనే చూపారు . నాకు ఆ దిశే కనపడింది కానీ , ఏదో మతప్రాతిపదికగా పక్షపాతంగా పరిష్కారాలు సూచించినట్టు కనపడలేదు . . . మీ మీద ముద్ర వేసినా సమర్ధంగా , సంయమనంతో ఎదుర్కొన్నందుకు మరిన్ని అభినందనలు . @ కత్తి మహేష్ గారు " నిరాశ , భయం , అపనమ్మకం , దిగులు , ఆవేశం , విద్వేషం నింపే దిశగా వుంటున్నాయేగానీ సమస్యకు సమాధానాలు వెతికే దిశగా వుండటం లేదు . దాదాపు హిందూవాద భావజాలంలాంటి మీ ఆలోచనల యొక్క ఉద్దేశం అదే అయినప్పుడు సమస్య లేదు . కానీ ఎవరైనా కొంత alternative ప్రతిపాదిస్తే వాళ్ళని pseudo - secularist లేదా hypocrites అనే ముందు మీలోని pseudo - hindusit ( కొత్తపదమా ! ! ) , hypocrite ని ఒకసారి చూసుకోండి " మీరు ఆ పదాలు ఎందుకు ఎక్కువగా వాడుతున్నారో నాకు అర్ధం అవ్వడం లేదు . చదువరిగారి గత టపాలోను , ఇక్కడ కూడా ! please stop using them before those words become cliches ( తెలుగులో ఊతపదాలు సరైన అర్ధం ) . నాకు ఈ దాడుల నేపధ్యంలో చదువరి రాసిన టపాలలో ఆందోళన కనపడింది ( ఆయన దిగులుని వ్యక్త పరచినా ) , ఆ ఆందోళన నుండి సమగ్రమైన పరిష్కార మార్గాలు అన్వేషించాలి అనే ఆలోచన కనపడింది . నాకు ఈ టపాలో మత పక్షపాతం ఎక్కడా కనపడలేదు . పది మందితో సమాలోచన చెయ్యాలి అని ప్రయత్నించే ( సమస్యకి పరిష్కారం కావాలి అనే నిజయితీతో కూడిన ప్రయత్నం ) మనిషికి ఒక కొత్త ముద్ర వేసేసి , పరిష్కార మార్గాన్నో పరిష్కారాన్నో మీరు సూచించకుండా రాళ్ళు విసరడం అనేది నిజంగా నాకు విభ్రాంతి కలిగిస్తుంది . . . విషయ సమగ్రత / వ్యక్తిత్వ సమగ్రత లేని వ్యక్తి కానీ , సమగ్రత కోసం ప్రయత్నించే వ్యక్తి అయ్యి ఉంటే అతనికి మీరు వేసిన ఆ ముద్ర చాలా నష్టం కలిగిస్తుంది . చర్చని ముందుకు సాగనివ్వదు . మొత్తం చదివాను . మీరు అసలు టపాలో విషయం గురించి చర్చించలేదు . పరిష్కారాన్నీ సూచించలేదు . @ ఇస్మాయిల్ గారు అవును , మీరు స్మైలీ పెట్టినా పెట్టకపోయిన అది నాకు కూడా ఇబ్బంది కలిగించిన వ్యాఖ్యే . ఇంకో విషయం కమాల్ హుస్సైన్ పేరు చూసి ఫ్రాన్స్ వాళ్ళు ఆపేసిన ఉదాహరణనే చదువరి గారు చుపించారు . యూరోప్ లో కూడా ఇస్లాం తీవ్రవాదం ఉంది దానికి కారణాలు ఏవైనా కావొచ్చు . వాళ్ళకి అనుమానం వచ్చింది ఆపేసారు . చదువరి గారి మాటల్లో నాకు కేవలం పేరు చూసి మాత్రమే ఆపెయ్యాలి అనో , తప్పు లేకుండా కూడా ఆపెయ్యాలనో , ముస్లిం అయ్యాడు కాబట్టి ఆపెయ్యాలనో ద్వనించలేదు . కేవలం అనుమానం వచ్చింది , ఆలోచించకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు అని మాత్రమే కనపడుతుంది . ఇంకో విషయం , అజ్ఞాత చేసిన వ్యాఖ్యలో " పాకిస్తాన్ = ముస్లిం = తీవ్రవాదం = భారతీయ ముస్లిం " ఈక్వేషన్ కనపడలేదు . అలా అని ఆ అజ్ఞాతకి మహేష్ గారు ఆపాదించారు . . ముద్ర వేసారన్నమాట . మీరు దానికి స్పందించకుండా ఉంటే బాగుండేది . అలా స్పందించడంలో బాగంగా ఈ టపాకి సంభంధంలేని వ్యాఖ్య చెయ్యడం వల్ల అనవసరమైన రచ్చ జరిగింది . చివరి విషయం , మీరు చదువరి కి చెప్పిన మాటల్లో " కానీ మళ్లీ మళ్లీ మీరు ( కుహనా లౌకికవాదులు జపించినట్లు ) ఒకే మంత్రాన్నే జపిస్తున్నారు . మీ పంథా మార్చుకోమని చెప్పడం లేదు కానీ , కనీసం సొలుతిఒన్స్ తెలిపే టపాలో నైనా కాస్త నిగ్రహం వహించాల్సింది . " ఒకే మంత్రం అన్నారు . అసలు మీకు అనిపించిన ఒకే మంత్రం ఏంటో నాకు అర్ధం కాలేదు . మరి చదువరి గారికి కానీ , ఇంకెవరికైనా కానీ అర్ధమయిందో లేదో ! నాకైతే ఈ టపాలో చాలా నిగ్రహం కనపడింది . మీరే కొంచెం emotional అయి వ్యాఖ్యలు రాసినట్టుంది .
ఇవన్నీ రచయితకు తెలిసియుండవచ్చు . స్థలాభావమువల్ల వ్రాసియుండక పోవచ్చు . కాని అందరికీ ఇవి తెలిసిన మంచిదని నేను తెలియజేయుచున్నాను .
వివరాలు యాడ్స్ తరువాత , ఐ విల్ కమ్ బ్యాక్ , డోంట్ గో ఎవే ఎనీవేర్ . . . వెల్కమ్ బ్యాక్ అగైన్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ కళాశాలలు , పాఠశాలలు కునారిల్లుతున్నాయి . అధ్యాపకులు , ఉపాధ్యాయుల కొరతతో పాటు . . ఇంకా
ఇప్పటి వరకు కోన్ని ఉపకణాలు సీడాక్ వారు చేసివున్నారు కానీ అవి అంతగా ప్రచారానికి నోచుకోలేదు . మన తెలుగు వారందరము ఆంగ్ల వ్యామోహంవలన , సాంకేతిక పరిమితుల వలన వాణిజ్య పరమైన వెసులుబాటు లేక పోవుట వలన దీని వలన అయితేనేమి మరి దాని వలన అయితే నేమి మరిదేనివలన ఆయితేనేమి ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు .
ఈ పాడులోకంలోకి రానందుకు ఆ బిడ్డ అదృష్టవంతురాలే . . . కానీ అంత మంచి తల్లి ప్రేమను పొందలేని దురదృష్టవంతురాలే కదా . . . కవితలో కొంత కాంట్రడిక్షన్ ఉన్నట్టుంది కదూ . . . ఎందుకో అలా అనిపించింది , నేనూ పెద్దగా విశ్లేషించలేను !
ఉగాది ఇతర పందగల మాదిరి ఏదొ వక దేవత ను పూజించే పండుగ కాదు . కాలానికి సంబందించిన పండుగ . కాలాన్ని మన వీలు కొసము సంవత్సరాలు గా లెక్కించి నారు . సంవత్సరము మొదలు అయిన రొజు ఉగాది పండుగ . ఉగాది జాతీయ పండుగ . దశము లొని వివిద రాష్ట్రాల లొ ఈ పండుగను రక రకా ల పెర్లతొ జరుపు కుంటారు . ఉగాది రొజు ఇస్ట దేవతను పూజించి ఉగాది పచ్చడి ని పెద్దవారి తొ పెట్టించుకొని తినాలి . ఆరు రుచులు కలిపి చేసిన ఉగాది పచ్చడి జీవిత ము లొని కష్ట సుఖముల కు ప్రతీక . ఉగాది నాడు సాయంకాలము దేవాలయము లొ కాని , గ్రామ చావిడి లొకాని , నగరాల , పట్టణాల లొ అడిటొరియము లలొ పంచాంగ శ్రవణము చెస్థారు . పంచాంగ శ్రవణము లొ ఆ సంవత్సర పలితాలను అంచనా వెస్తారు . ఉగాది ని సాంప్రదాయ బద్దముగా పాటించటము వలన సకల శుభాలు కలుగుతాయి .
ఆఫీసునుండి ఇంటికి రాగానే మా ఆవిడ ముళ్ళపూడి వెంకటరమణగారు పోయారటండీ అంటే ఏడుపొచ్చేసినంత పనయింది . న్యూస్ ఛానళ్లు అన్నీ గబ గబా తిరగేశాను . కాని ఎక్కడా ఆవిషయం గుఱించి లేకపోయేసరికి మా ఆవిడ ఏదో పరాకుగా చెప్పిందేమో అని అనుకుంటూ కంప్యూటరు ముందు కూర్చుని ఓపెన్ చేయగానే మీ బ్లాగులో వార్త కనిపించి చాలా బాధ వేసింది . అవును . మన బుడుగు కనిపించి మా నాన్నేడీ అంటే ఏం సమాధానం చెప్తాం మనం ?
ఒక ఆడది , ఒక మగవాడూ రోడ్డు మీద వెళుతూంటే మిగతా ఆడవాళ్ళు తలతిప్పుకొని ఎవరిని చూస్తారు ? వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆడదాన్నే చూస్తారు . ఎందుకు చూస్తారనేది ఇక్కడ ప్రాస్తావికం కాదు . వాళ్ళు మగవాణ్ణి అసలు పట్టించుకోరు . మఱి మగవాళ్ళు ఎవరిని చూస్తారు ? అంటే , వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆ ఆడదాన్నే చూస్తారు . కాబట్టి అంతిమంగా ఆడా , మగా అందఱూ ఆడదాన్నే చూస్తారన్నమాట . ఇదీ ఇందులోని వ్యాపార రహస్యం . కనుక ఒక ఆడది తన ఒళ్ళు కనపడీ కనపడకుండా బట్టలు వేసుకుంటే ఎంత సెక్సీగా ఉంటుందో , ఎంతగా మగవాళ్ళని ఆకర్షించ గలుగుతోందో మిగతా ఆడవాళ్ళకి దృష్టాంత పూర్వకంగా చూపించడం , తద్ద్వారా వాళ్ళకి ఆ రకం బట్టల మీదా , వాటిని అమ్మే తమ సంస్థ మీదా ఆసక్తి కలిగించడం ఈ ప్రకటనల లక్ష్యంలా తోస్తోంది . ఈ రకమైన దృశ్యాలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆడ , మగ పిల్లల మీద ఏ విధమైన ప్రభావాన్ని కలిగిస్తాయి ? ఎదురైన ప్రతి ఆడదాన్ని వయసుతో నిమిత్తం లేకుండా చెడు దృష్టితో చూసే దుష్ట సంస్కారానికి ఇవి బాసటవుతాయి . మనుషులకి అంతకుముందు లేని ఆలోచనల్ని సైతం కలిగిస్తాయి . అలాగని వీటిని నిషేధించాలని కాదు నేనంటున్నది . " నాన్నా ! వాడు నన్ను కొట్టాడు " అంటూ ప్రతిదానికీ పెద్దవాళ్ళ దగ్గరికి పరిగెత్తే ఎల్ . కె . జి . పిల్లకాయ మనస్తత్త్వం ప్రజల్లో పెంపొందడం నాకు నచ్చదు . ప్రజలు తమ సమస్యల్నితామే కలిసికట్టుగా పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి . ఈ కళానికేతన్ ల వాళ్ళనీ , ఈ బ్రిసా వాళ్ళనీ బహిరంగ ప్రజా చర్చలకి ఆహ్వానించాలి . ఈ ప్రకటనల్ని ఈ రూపంలో జారీ చెయ్యడంలో మీ ఉద్దేశం ఏంటని వాళ్ళ మొహం మీదనే అడగాలి . ఆ ప్రకటనల్లో ఆ రకమైన దుస్తుల్లో తమ కన్నతల్లుల్నీ , సొంత చెల్లెళ్ళనీ , కట్టుకున్న భార్యల్నీ ఎందుకు నిలబెట్టలేదో వాళ్ళు విశదంగా చెబితే బావుంటుంది . బట్టల కొట్లవాళ్ళు ఈ విధంగా తమ కుటుంబ స్త్రీలకొక నీతి , బయటి ఆడవాళ్ళకింకొక నీతి ఎందుకు అమలు జఱుపుతున్నారో తెలుసుకోవాల్సి ఉంది .
ఆఫీసయిపోయింది . ఇంటికి బయలుదేరాను . పని మీద ఇంకో ఆఫీసుకి రావడంతో ఇవాళ్టికి క్యాబు లేదు . అలాగే బైకూ లేదు .
ముకుళించే పెదవుల్లో మురిపాల్ని చక్కిలిగింతల రాగంలో శృతిచేసి , ఋతువుల్లో మధువంతా శ్రోతలకి సగపాలు పంచారు . ఆయన కలమొచ్చి కురిసేదాకా ఎవరూ అనుకోలేదు భావుకత్వమొక శ్రావణ మేఘమని , ఆ వానలో తడవడమొక తీరని దాహమని . ఆ వర్షాకాలం కాస్తా వెళ్ళిపోతుంటే సరస్సులో శరత్తు కోసం తపస్సులు చేసి జగాలులేనీ సీమలో , యుగాలు దాటే ప్రేమలో రససిద్ధిని సాధించారు . ఇంత శృంగారాన్నీ ఒలికించి సన్నాయి జళ్ళోంచి సందేళ లాగేసిన సంపెంగ సంగతి మాత్రం దాటేస్తారు . అదేమంటే మరునికి మర్యాదలు చేసి చేసి అలసిపోయానంటారు .
ఫిల్మ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతుంటే మిత్రుడొకడు మీరు కనుక్కొన్న ఈ భాష కి లిపి ఏంటని అడిగాడు . ఫిల్మ్ లాంగ్వేజ్ అంటే మన వాళ్ళకి బొత్తిగా అవగాహన లేదని చెప్పడానికి ఈ ఉదాహరణ చాలనుకుంటాను . మరి ఫిల్మ్ లాంగ్వేజ్ అంటే ఏంటని ఎవరైనా అడిగితే " ' Film language ' describes the way film ' speaks ' to its audiences and spectators " అని చెప్పొచ్చు . గత సంవత్సరం ట్యాంక్ బడ్ దగ్గర ఉన్న ప్లై ఓవర్ దగ్గర [ . . . ]
అగ్నాతలూ , ఒకవేళ G . V : Ramakrishna Rao తన ఆటోబయోగ్రఫీలో రాసుకుంది నిజం అయినా కాకపోయినా , మిగతా విషయాలు చాలు అప్పటి ఆంధ్ర నాయకులను ఎండగట్టడానికి . మద్రాసును సాధించడం సాధ్యపడదనీ , ఒకవేళ సాధ్యమయినా అది ఇరువర్గ ప్రజలకు సంబందించినది కాబట్టి కేవళం సత్యాగ్రహం అనబడే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ద్వారా పొందడం సాధ్యపడదనీ , సుదీర్ఘ మంతనాలు అవసరమనీ తెలిసీ శ్రీరాములును ఎందుకు దీక్షకు ఉసిగొలిపారు , ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించి , శ్రీరాములు అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఎందుకు దీక్షను విరమిపజేసి వైద్యం అందించలేదు ? దీనివలన తేలేదేమంటే పోట్టి శ్రీరాములు ఆంధ్ర కొరకు ఆత్మత్యాగం చెయ్యలేదు , కొందరు స్వార్ధ నాయకులహేత రాజకీయ అవసరాలకొరకు బలిపశువయ్యాడు .
రేపు తెలంగాణ వచ్చినా ఇదే తంతు . అదే నా పోస్ట్ లో కూడా రాశాను . తెలంగాణ ఒక రాష్ట్రం గా ఉండటం , తెలుగు ఎ . పి గా ఏర్పడకముందు తెలంగాణ ప్రాంత ప్రయోజనాల రక్షణ కోసం కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడం ఒక వాస్తవం . వాటిని అమలు చేయలేదన్నది కూడా వాస్తవమే . ఇలా కొన్ని కారణాల వలన , భాషలో ఉన్న కొన్ని తేడాల వలన , రెండొందలేళ్ళూ ఉర్దూ ఆధిపత్యంలో జీవించి తెలుగూ - ఉర్దూల సమ్మిళిత భాష యాసగా ఏర్పడి ఆ విధంగా భాషలో తేడాలు రావడం వలనా తెలంగాణ ప్రాంతం వారికి ఒక ప్రత్యేక అస్తిత్వం ఏర్పడింది . అంతే కాక స్వాతంత్ర్యం రాకముందు రెండొందలేళ్ళు ముస్లిం పాలనలో ప్రత్యేక దేశంగా ఉన్న ప్రాంతం అది . నా ఆర్టికల్ లో రాసినట్లు ఆర్ధిక అభివృద్ధిలో కూడా తేడాలుండటంతో కలిశాక కూడా ఏకీభావం రావడానికి అవన్నీ అడ్డంగా పనిచేశాయి . రెండొందలేళ్ళు వేరువేరుగా ఉన్న స్ధితి , తద్వారా తలెత్తిన సంస్కృతీ తేడాలు , ఆర్ధిక వృద్ధిలొ తేడాలు ఇవన్నీ తెలంగాణ వారిని వేరుగా నిలిపాయి . ఇది జీవన విధానంలోనే సంభవించిన తేడా . వివిధ తెగలు , జాతులు మధ్య తేడాల్లో జీవన విధానం , సంస్కృతి , భాష ప్రధాన పాత్ర పోషిస్తాయి . వీటిల్లోనే తెలంగాణ , ఇతర ఎ . పి లో తేడాలొచ్చినందున ఆ వేరుతనం అలా నిలబడింది .
" గుడికా ? " అని నీరసంగా వినిపించిన తన స్వరానికి అమ్మ కొంచెం దబాయింపుగా ,
ఇంద్రజాలం ఇంద్రాణి గారి కవితల ఇంద్రజాలంలో ఏడాదిగా పడి కొట్టుకుంటున్నాను . జనవరిలో ఎన్నో చోట్ల వెతికినా వస్తుందన్న కవితల పుస్తకం దొరకలేదు . నెట్ లో దొరికిన కాసిన్ని కవితలనే మళ్ళీ మళ్ళీ అబ్బురంగా సంబరంగా చదువుతున్నాను . గుప్తనిధి అని ముకుందరామారావు గారన్నమాట , ప్రతిభ గల కవయిత్రి అని యదుకుల భూషణ్ గారన్నమాట ముమ్మాటికీ నిజం . ఈ కవితలకి ఇంతటి లాలిత్యం ఈ సమ్మోహక శక్తి ఎలా వచ్చి ఉంటాయా అని నాలో నేనే కులికి చస్తున్నాను . ఇది చాల జటిలమైన ప్రశ్న ; దీనికి సమాధానాలు మాత్రం ఈ కవితలలానే చాల సున్నితమైనవి , మేధస్సుకు అతీతమైనవి అయి ఉండాలి . ఎంతో ఇష్టంగా అవి వెదుకుతున్నాను ; కాని మొత్తం పుస్తకం నాకు దొరకలేదు . పరిచయంలో ముకుందరామా రావు గారు చూపినటువంటి సంయమనం , ఏ నిరాశకు గురి కాకుండా ఉండాలన్న ఆకాంక్ష , ఈ ఐంద్రజాలికి చేయతగిన కనీస గౌరవాలు . దొరికిన కవితలు చదినప్పుడల్లా నేను అలాగే అనుకున్నాను .
ఎంపీ రాజగోపాల్ అనగానే మన విజయవాడ ఎంపీ లగడాపాటి రాజగోపాల్ అనుకొనేరు కాదండీ … . ఇతను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి . పొన్నం ప్రభాకర్ ఆద్వర్యంలో తెలంగాణ ప్రాంత ఎంపీ లు అందరు భేటి అయ్యారు . శ్రీ క్రిష్ణ కమిటీ తన నివేదిక సమర్పించిన తర్వాత కాంగ్రెస్ కి సంబంధించిన ప్రజాప్రతినిధుల కి ఎదురు గాలి వీస్తున్నది అని చెప్పుకోవచ్చు . " తెలంగాణ ఇచ్చేది మేమే , తెచ్చేది మేమే " అనే నినాదం తో ముందు కి వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కి శ్రీ క్రిష్ణ కమిటీ నివేదిక మింగుడు పడాటల్లేదు . దీనికి తోడు తెలుగుదేశం పార్టీ , టి ఆర్ ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల పైన విమర్శలు గుప్పిస్తున్నారు . రాష్ట్రం లోను , కేంద్రం లోనూ … Read more »
" ఇలా రండి , ఈ గట్టు మీద కూర్చుందాం " అంది . ఆమె కూర్చుంది , అతను కూర్చుని ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు . ఆమె కళ్ళలోకి చూస్తూ
ఈ లోగా డాలీ తాతయ్యకి అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేర్చారని కబురొస్తే వాళ్ళందరూ రాజమండ్రి వెళ్ళారు . డాలీకి వాళ్ళతో వెళ్ళక తప్పలేదు .
జాతీయంగా , అంతర్జాతీయంగా జరిగే పరిణామాల్లో ముఖ్యమైన వాటిని ఎంచుకొని ( కనీసం నాకు ముఖ్యమైనవిగా అనిపించినవి ) వాటి గురించిన విశేషాలను తెలుగు పాఠకులకు అందించాలన్న నా ఈ చిరు ప్రయత్నానికి పెద్దలు , పిన్నలు సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నా .
@ Bhardwaj Velamakanniగారు : నెనర్లు @ సుమలతగారు : నెనర్లు @ కత పవన్గారు : నెనర్లు @ శరత్ ' కాలమ్ ' గారు : నెనర్లు @ prabandhchowdary . pudotaగారు : నెనర్లు @ Rao S Lakkarajuగారు : నెనర్లు @ karthikగారు : నెనర్లు @ chaituగారు : నెనర్లు @ ishika గారు : నెనర్లు ; conclusion : మనమేదన్నా చేద్దామనుకున్నప్పుడు ఇలా అవేశంగా మేమిది చేస్తాము , అది చేస్తాము అని రాయడం కాదు చేయగలిగితే చేసినతరువాత రాద్దము అన్న సందేశం . మరెందుకు రాశారు అని అడిగారనుకొండి ; ) నేనేమి చేద్దాము అనుకోలేదు , ఇలా చెప్దాము అనుకున్నాను అంతే . ; ) పైన రాసినదానికి కింద ముగింపుకి అర్థం ఉందండి . కరెక్ట్గా విషయాలు ఫాలో అయితే .
౪౬ ) పేలని టపాకాయలను అలానే వదిలివేయండి . వాటిని ముట్టుకోవడం , విప్పి చూడటం వంటి చేయడం అత్యంత ప్రమాదకరం .
కుక్షి యనే రెండక్షరాల ఆ సజీవ జీవ జాల యంత్రాంగం ఆకలి యను మూడక్షరాల తన భావనా సం హరణా ప్రక్రియలో జీవుల పై అధిరోహణ ! ! ! స్వారి చేస్తూ వేటాడుతూ సంహరిస్తూ … . జలంలోన భూమి పైన వాయు పరిధి నెచటనైన బలహీన జీవ బక్షణ
ఇస్మాయిల్ ప్రకృతిని ప్రేమించిన వాడనీ , సదా బాలకుడనీ కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఈయన మీద ఉందనీ రకరకాల మాటలు చెప్పారు విమర్శకులు . కాని ఇస్మాయిల్ అంత తేలిగ్గా దొరికిపోయే కవి కాడు . ఈయన చాలా గడుసైన కవి . చాలా పరిణతమైన , గాఢమైన ఊహాశక్తి వున్నవాడు . లోకం క్షుణ్ణంగా తెలిసిన వాడు . ప్రేమికుడో అమాయకుడో కాడు . పైగా కృష్ణశాస్త్రి గారి ప్రభావం ఇస్మాయిల్ కవిత్వం మీద సుతరామూ లేదు . కృష్ణశాస్త్రి గారంటే ఇస్మాయిల్కి ఇష్టం వుంది . కాని ఇష్టం వేరు , ప్రభావం వేరు .
1 కన్యకయైన బబులోనూ , క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ , సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు . 2 తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము . 3 నీ కోకయు తీసివేయబడును నీకు కలిగిన యవమానము వెల్లడియగును నేను ప్రతిదండన చేయుచు నరులను మన్నింపను . 4 సైన్యములకధిపతియు ఇశ్రాయేలుయొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా అని మా విమోచకునికి పేరు . 5 కల్దీయుల కుమారీ , మౌనముగా నుండి చీకటిలోనికి పొమ్ము రాజ్యములకు దొరసానియని యికమీదట జనులు నిన్నుగూర్చి చెప్పరు . 6 నా జనులమీద కోపపడి నా స్వాస్థ్యము నపవిత్ర పరచి వారిని నీ చేతికి అప్పగించితిని నీవు వారియందు కనికరపడక వృద్దులమీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి . 7 నేను సర్వదా దొరసానినై యుందునని నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి . 8 కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను నేను తప్ప మరి ఎవరును లేరు నేను విధవరాలనై కూర్చుండను పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్నదానా , ఈ మాటను వినుము 9 ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్ర శోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభ వించును . నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రములను నీవు ఆధార ముగా చేసికొనినను ఆ యపాయములు నీమీదికి సంపూర్తిగా వచ్చును . 10 నీ చెడుతనమును నీవు ఆధారము చేసికొని యెవడును నన్ను చూడడని అనుకొంటివి నేనున్నాను నేను తప్ప మరి ఎవరును లేరని నీవను కొనునట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను . 11 కీడు నీమీదికివచ్చును నీవు మంత్రించి దాని పోగొట్ట జాలవు ఆ కీడు నీమీద పడును దానిని నీవు నివారించలేవు నీకు తెలియని నాశనము నీమీదికి ఆకస్మికముగా వచ్చును . 12 నీ బాల్యమునుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కర్ణపిశాచ తంత్రములను నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో ఒకవేళ నీవు మనుష్యులను బెదరింతువేమో 13 నీ విస్తారమైన యోచనలవలన నీవు అలసియున్నావు జ్యోతిష్కులు నక్షత్రసూచకులు మాసచర్య చెప్పు వారు నిలువబడి నీమీదికి వచ్చునవి రాకుండ నిన్ను తప్పించి రక్షించుదు రేమో ఆలోచించుము . 14 వారు కొయ్యకాలువలెనైరి అగ్ని వారిని కాల్చివేయు చున్నది జ్వాలయొక్క బలమునుండి తమ్ముతాము తప్పించుకొన లేక యున్నారు అది కాచుకొనుటకు నిప్పుకాదు ఎదుట కూర్చుండి కాచుకొనదగినది కాదు . 15 నీవు ఎవరికొరకు ప్రయాసపడి అలసితివో వారికి ఆలాగే జరుగుచున్నది నీ బాల్యము మొదలుకొని నీతో వ్యాపారము చేయు వారు తమ తమ చోట్లకు వెళ్లిపోవుచున్నారు నిన్ను రక్షించువాడొకడైన నుండడు .
మేము గనక అలవేలు మంగను దర్శించక పోతే , ఒకవేళ ఆవిడ అలిగితే , మరలా వేంకటేశ్వర స్వామి వారికి , ఆవిడను సమాధాన పరచడం కష్టమవుతుందేమోనని , మొదట , అలివేలు మంగాదేవి నే దర్శించాం . క్యూ లో ఇసుకేస్తే రాలనంత జనం . ( నిజం గా ఇసుకేస్తే రాలదేమో ! ! ) . సరే , ఎలాగోలా దర్శనం చేసుకుని బయట పడ్డాం . అందరికీ ఇంకొక్కసారి దర్శనం అయితే బాగుంటుందని అనిపించినా , అది సాధ్యం కాదు . నన్నడిగితే , ఉచిత దర్శనానికే వెళ్ళమని చెబుతా . జనం తక్కువ ఉంటారని అందరు టికెట్టు కొనడంతో , ఇక్కడ ఇంకా జనం వచ్చేసారు ( ఉచిత దర్శనం క్యూ ఖాళీ ! ) . అప్పుడు తెలుసుకున్నాం మా తప్పు . సర్లేండి . , కనీసం మీరైనా ఈసారి సుఖంగా వెళ్ళొచ్చు , ఇది తెలుసుకుని .
ఓ రాత్రీ , ఓ పగలూ అప్పటికే ప్రయాణించడంతో ప్యాంట్రీ కారు వాడికి నా సంగతి కొంత బాగానే తెలిసింది . రాత్రి ' డిన్నర్ ' అంటూ వాడో పుస్తకం , పెన్సిలూ పట్టుకొని వచ్చేసరికి వాడిని విషయించేశాను . " డిన్నర్లో యేమి ఇస్తావు ? యెప్పుడు ఇస్తావు ? రోటీ చావల్ అయితే యెంతా ? వట్టి రోటీనే అయితే యెన్ని ఇస్తావు ? యెంతా ? వట్టి చావల్ అయితే యెన్ని కప్పులు ఇస్తావు ? కూరలు ఇస్తావా ? వూరగాయే గతా ? " ఇలా ముత్యాల ముగ్గులో మాడా లాగ !
ఇహ చెలియలికట్టలో సీతారామయ్య రెండవ భార్య రత్నావళి . ముందు భార్య రత్నమ్మ చనిపోతే రత్నావళితో అతడికి మళ్ళీ పెళ్ళి జరుగుతుంది . సీతారామయ్య తమ్ముడు రంగారావు ( రంగడు ) ను అతికష్టం మీద డబ్బులు పంపి లక్నో లో చదివిస్తూఉంటాడు . ఈ రంగారావు ఆధునిక భావాలను పెంచుకుంటూ అటు పాశ్చాత్య రచయితలనీ ఇటు పాశ్చాత్య భావాలు పలికే ( చలం వంటి ) తెలుగు రచయితలనీ చదివి ఆ స్త్రీ స్వేచ్హా భావాలనన్నీ తలకెక్కించుకుని సనాతన ధర్మాలకు దూరం కావటమే కాకుండా , తన అన్న భార్య అయిన రత్నావళికి కూడా తాను చదివే పుస్తకాలిచ్చి , తన భావాలన్నీ నూరిపోసి ఆమెలో విప్లవ భావాలను నాటతాడు . వీటన్నిటి మూలంగానే ఆమె సీతారామయ్య ఎడల విముఖురాలై రంగడితో మదరాసు " లేచి " వచ్చేస్తుంది . ఇహ ఇక్కణ్ణించి రత్నావళి రంగడి సిధ్ధాంతాలు ఎలా తప్పుల తడకలో నిరూపించడం కోసం పేజీ పేజీ లోనూ వాదనలను పెంచుకుంటూ పోతుంది . చివరికి ఆమెకు చదువు చెప్పడానికి సాక్షాత్తూ విశ్వనాథ సత్యనారాయణ గారే ముకుందరావనే పాత్రగా ప్రవేశించి రత్నావళిలో రంగడి సిధ్ధాంతాల పట్ల ఏర్పడిన చులకన భావాలకు నీరు పోసి మరింతగా పెంచి , తన వాదనా పటిమతో , బోధనా గరిమతో రత్నావళిని తిరిగి సనాతన ధర్మం వైపు మళ్ళించి తనంతదానిగా తయారు చేయిస్తారు . రత్నావళి నవల చివర్లో మాట్లాడినవన్నీ ఈ ముకుందరావు మాటలే . చేసిన నిర్ణయాలన్నీ ముకుందరావు చూపిన మార్గానికి నడవడం కోసం చేసినవే . ఒకసారి వివాహ వ్యవస్థ కాదని కాలు బయట పెట్టిన ఆడదానికి మరణం లో తప్ప నిష్కృతి లేదు కనక , రత్నావళి నవల చివర్లో ఈ సంగతి మిగతా పాత్రలతోనూ ( పాఠకులతోనూ ) చెప్పి మరీ చనిపోతుంది . చనిపోయేముందు ఆమె తాను విడిచివచ్చిన సీతారామయ్య కాళ్ళ మీద పడుతుంది . మదరాసులో విదుషీమణి ( అంటే తెలుగు టీచరన్న మాట ) తాను సంపాదించిన డబ్బును తన భర్త మూడవ భార్య ( రత్నావళి వెళ్ళిపోయాక ఆయన మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు ) రాజ్యలక్ష్మికి పుట్టిన కొడుకుపేర రాసి వాడు తన కి తద్దినాలు పెట్టేటట్టుగా వాగ్దానం చేయించుకొని అప్పుడు చచ్చిపోవటానికి వెళ్ళిపోతుంది . చివరికి ఆమెతో పాటు రంగారావు ( చలం భావజాలాన్ని నమ్మిన వాడు ) కూడా తన తప్పులన్నీ ఒప్పుకుని రత్నావళితో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు ఉప్పెన ముంచుకొస్తున్న సముద్ర తీరానికి కలిసి వెళ్ళిపోతాడు . క్లుప్తంగా ఇదీ కథ . ఇంకా ఈ నవలలో సీతారామయ్య అప్ప చెల్లెలు సరస్వతీ ( విధవరాలు ) ఆమె కొడుకు నీలాంబరుడూ కూడా ముకుందరావు మాట్లాడే మాటలన్నీ మాట్లాడతారు .
ఒకతనికి ఒంట్లో నలతగా ఉండటంతో స్నేహితుణ్ణి ఎవరైనా మంచి డాక్టర్ గురించి చెప్పమన్నాడు .
ఈ వ్యాసం మరియు తర్వాతి పరంపర చాలా ముఖ్యమైన సమస్యను మనకు పరిచయం చేస్తుంది . ఒక మంచి క్రుషి . అయితే , ఈ వ్యాసం కాంటెక్స్ట్ లో రిజర్వేషన్లంటే ఏమిటో తొలి పేరా లోనే కొంచెం వివరణ ఇవ్వడం అవసరం . రిజర్వుడు భౌగోలిక ప్రాంతాలని ( దాదాపు మన దగ్గర రిజర్వుడు ఫారెస్టు లాగా అని ) అర్థం కదా . లేకపోతే , మనదగ్గరి రిజర్వేషన్లలాంటివి అని అనుకునే గందరగోలానికి అవకాశం ఉంది .
నవ్విన నాపచేనే పండింది . అప్పట్లో ఎగతాళి చేసినవాళ్ళే ఇప్పుడు ఆ కారును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు .
గురుత్వాకర్షణ శక్తి గురించి కలిగిన ఆలోచన వెనకాల ఓ మహానుభావుడైన సర్ ఐజక్ న్యూటన్ ఆలోచనా విధానం మనకు ఓ ఉదాహరణ . ఈ మహాను భావుడు విపరీతంగా ఆలోచించలేదు కానీ వైవిధ్యభరితమైన కొత్త కోణాన్ని సృజించారు . అంతే కాని ప్రకృతి కి విరుద్దమైన ఆలోచన చేసి ఎయిడ్స్ లాంటి రుగ్మతకు రూపం పొందించలేదు . ఎకే 47 సృష్టికర్త కూడా ఇలాంటి మారణాయుధాన్ని ఎందుకు కనుగొన్నానా అని విలపించాడు . న్యుక్లియర్ బాంబ్ కనుక్కొవడమెందుకు ఆ తరువాత అనుభవించడం ఎందుకు .
పొద్దున్నేలేచి వేడివేడి రెడ్ లేబుల్ టీ తాగుతూ బాల్కనీలోకొచ్చి ఒక్కసారి ఆకాశాన్ని చూసాను . . అబ్బా ఎన్నాళ్ళయ్యింది ప్రశాంతంగా ఇలా ఆకాశాన్ని చూసి అని మనసులో అనుకుంటూ . . చల్లని గాలి పీల్చుకున్నాను . ఈ మధ్యన ప్రాజెక్టు రిలీజ్ గొడవలోపడి . . బయట ఎండా కొండా . . వానా గీనా తెలియకుండా పోతుంది . ఈ వెధవ టెన్సల్ననుండి ఎప్పుడు బయటపడతానో ఎంటో అనుకుంటుండగానే . . ఫోన్ మోగింది . . , టెస్టింగ్ టీమ్ నుండి . . అదేదో పనిచేయటంలేదని . . క్లైంట్ నుండి మెయిలొచ్చింది . . , మీటింగ్ వుంది త్వరగా ఆఫీసుకు రమ్మని . . . , కాసేపు ప్రశాంతంగా ఉందామనుకున్నానా . . అయిపోయింది . . మళ్ళీ ఎక్కడలేని బి . పి వచ్చేసింది . . త్వరత్వరగా స్నానంచేసి రడీ అయ్యాను . నిన్ననేగా ప్రోజెక్ట్ రిలీజ్ ఇచ్చాం ఏమయ్యుటుంది మళ్ళీ . . అని అలోచిస్తూనే హాల్లోకొచ్చి మా ఆవిడిచ్చిన ఇడ్లీ ప్లేట్ అందుకుని తింటున్నా . . ఒక ఇడ్లీ మొత్తం తినేసాకా తెలిసింది . . అందులో రోజూ చేసే చెట్నీలేదని . . అల్లంచెట్నీ వేసిచ్చిందని . . , చెట్నీలేందే ఇడ్లీ అస్సలు నచ్చదు నాకు . . అల్లంచెట్నీలు . . ఆవకాయ - పెరుగు చెట్నీలు ప్రత్యామ్నాయాలుగా అనిపిస్తాయి . . ఎందుకో మరి , చెట్నీలేని ఇడ్లీ నాకు - ప్లానింగ్ లేని ప్రాజెక్టులాగా . . గాలిలేని టైరులాగా . . మ్రోగలేని సెల్లులాగా . . పనిలేని టెస్టర్ లాగా కనిపించి మంట తెప్పిస్తాయి . ఒక్కసారే . . ఉగ్రరూపం దాల్చి . . చెట్నీ చేయొచ్చుగా అన్నాను . ఏ రెస్పాన్స్ రాలేదు అవతలివేపునుండి . కానీ మాచంటాడు కెవ్వున కేకేసి ఏడవటం మొదలెట్టాడు . అమ్మో వీడెడవటం మొదలెట్టాడు . . అనుకుంటూనే . . గడియారం వంక చూస్తూ . . టైమయిపోతుందని టెన్సన్లో ఎప్పుడు తినేసానో ఇడ్లీలన్నీ తినేసా . . కంగారు కంగారుగా పార్కింగ్ ఏరియాలోకొచ్చాను . . , రోజూ . . నా టూవీలర్ సీటుని హైకులటైములో మేనేజర్ ని గోకినట్టు గోకేస్తూ నాకు దొరక్కుండా పారిపోతున్న పిల్లి . . చక్కగా బండిపైకెక్కి . . ముడుచుకుని . . టెన్సన్ లేని నిద్రతో ఎంజాయ్ చేస్తుంది . చెట్నీలేదని ఒకపక్క . . . ఆఫీసులో టాస్క్ టెన్సన్ మరోపక్క . . . , ఈ కోపాలన్నీ ఒక్కసారి గుర్తుచేసుకుని . . హాయిగా నిద్రపోతున్న పిల్లిని . . లాగి పెట్టి నడ్డిమీద ఒక్కటి తన్నాను . అదేదో సినిమాలో చిరంజీవి గుఱ్రంతో పాటుగా లారీకిందనుండి జర్రున జారి అవతలివైపుకొచ్చినట్టుగా . . పక్కనేవున్న కారు కిందనుండి జారి అవతలికెళ్ళిపడి లేచి . . నా వంక తిరిగి చూసిందా పిల్లి . " లేకపోతే . . ఆఫీసులో టెన్సన్ క్రియేట్ చేస్తావా ! ! ! . . చెట్నీలేకుండా చేస్తావా ! ! ! . . నా సీటు గోకేస్తావా . . ! ! " , అని తిట్టుకుంటూ దాని కళ్ళలోకి కళ్ళుపెట్టి చూస్తూ . . పళ్ళుకొరికా . . " అవన్నీనాకేంతెలుసు . . ఏదో సరదాగా టైమ్ పాస్ కి సీటుగోకానంతే . . " , అన్నట్టు నా వంక చూసి మేవ్వ్ అంది . . . " ఛస్ . . " , అని బెదిరించా . . పారిపోయిందా పిల్లి . బండి స్టార్ట్ చేసి స్పీడుగా లాగించాను . . మా బిల్డింగ్ గేటు దాటి బయటకొచ్చాను . . దారిలో ఆగివుంది ఒక పసుపు కలర్ లారీ . . , పక్కనుండి తప్పించుకుని వెళ్ళే ఓపికలేదు . . సమయమూలేదు . . ఎవడ్రా అడ్డంగా ఆపాడు అంటూ ఎక్సలేటర్ పెంచి జుమ్మనిపించి . . లారీపైనుండి ఎక్కించేసా . . ముక్కముక్కలైపోయింది . . నా బైకు కాదు . . లారీ . . ! ! ! , ఎవరూ చూడలేదు కదా . . అని అటుఇటూ చూస్తూ . . బండి ఇంకా స్పీడుగా లాగించేసాను . ఇంకా నయం . . ఆ ఐస్క్రీమ్ బండిదగ్గర ఐస్క్రీమ్ కొనుక్కుంటున్న చిన్నపిల్లాడు వెనక్కు తిరిగి చూడలేదు కాబట్టి సరిపోయింది . . లేకపోతే కింద పడి " నా బొమ్మ లారీ నాకిచ్చేయ్ . . " , అని ఏడ్చి . . గీ . . పెట్టేవాడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాను . ఆఫీసు చేరుకున్నాకా బలవంతంగా పార్కింగ్ ఏరియాలో రెండు దున్నపోతుల్లావున్న యమహా . . బైకులమధ్యన నా బండిని ఇరికించటంవల్ల అటుఇటూ ఒక గీత పడింది . . అరెరే . . ఎంత జాగ్రత్తగా చూసుకునే బైకిలా అయిపోయిందేంటా అని . ప్రాణం చివుక్కుమంది . . అక్కడనుండి మొదలయింది నా బ్యాడ్ డే . . . ఆ రోజంతా గజిబిజి గందరగోళం . . ఒకడికనుకుని ఒకడి మెయిల్ పంపించి నీకు మెయిలిచ్చాను కానీ నువ్వు రిప్లై ఇవ్వలేదు , అది నా తప్పుకాదని పెద్ద దెబ్బలాటపెట్టుకున్నా , వాడేమో నాకు రాలేద మొర్రో అని తలపట్టుకున్నాడు . తీరా వెళ్ళి నా మెయిల్ సెంట్ అయిటమ్స్ లో చూస్తే రమేష్ అన్నవాడికి పంపబోయి . . రాహుల్ అన్నవాడికి పంపానని తెలిసింది . ఎడ్రస్ బార్లో . . R అని కొట్టగానే అవుట్ లుక్లో ఏదొస్తే అది చూడకుండా ఎంటర్ కొట్టేయటం వల్లే కదా . . ఇలా జరిగింది . . , ఎధవ ఐ . టి బద్దకం . . , ఛ అనుకన్నా . ప్రోజెక్ట్ టెస్టింగ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో డిస్కస్ చెయ్యాలి మీటింగ్ అన్నారు . ఏంటో తాడో పేడో తేల్చేయాలి . . అని తొడకొట్టుకుంటూ . . లేని మీసం తిప్పుకుంటూ . . మీటింగ్ రూమ్ వైపు బయలుదేరాను . గంటన్నర చెమటలు పట్టేలా డిస్కస్ చేసి . . ఎనాలసిస్ అని తలకాయని . . అందరూ తమతమ అభిప్రాయాలు చెప్పాకా తెలిసింది తేలింది ఏంటంటే . . మా క్లైంట్ గాడు పొద్దుపొద్దున్నే బెనడ్రిల్ కాఫ్ సిరప్ తాగొచ్చు . . . మత్తుమత్తు కళ్ళతో పురాతన వెర్షన్లో వేలుపెట్టి టెస్ట్ చేసి . . , మీరేమీ చెయ్యకుండా కొత్త బిల్డ్ ఎలా పంపారు అని సీరియస్ గా మెయిల్ రాసాడని . హమ్మయ్యా మనవైపు ప్రోబ్లమ్ ఏమీలేదన్నమాట . . అని అందరూ ఊపిరి పీల్చుకుని వాడిని బండబూతులు తిట్టుకున్నారు . . కానీ నాకు మాత్రం పాపం వాడికీ ఇడ్లీలో చెట్నీ ఏనచ్చోవుండదులే . . అదే ఎఫెక్ట్ అయ్యుటుందని సర్దిచెప్పుకున్నాను . మీటింగ్లో మాట్లాడి మాట్లాడి ఓపికలేక . . పాక్కుంటూ నాసీటు దగ్గరకొచ్చేసరికి . . ఎక్కడనుండో లోకల్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది . . . , నీరసంగానే ఎత్తి హలో అన్నా . . , " నమస్తే సార్ . . " , అంది ఒక ఆడగొంతు . . " యస్ . . " , అన్నానేను . . " సార్ . . మీరు ఈ సంవత్సరం టాక్స్ సేవింగ్ ప్లాన్ చేసారా . . కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్ఛర్ బాండ్స్ పై . . . " , అని . . ఏదో చెప్పబోతుంటే . . " నేను స్టూడెంటును ఆంటీ . . , ఇప్పుడే నిక్కరేసుకుని . . స్కూలుకు బయలుదేరుతున్నా ఆంటీ . . . " , అని అనేసరికి . . ధబ్మని సీటునుండి కిందపడిపోయిన శబ్దంలా ఏదో శబ్దంతో ఫోన్ కట్ అయిపోయింది . పీఢా విరగడయ్యింది అనుకుని నా సీట్లో కూర్చున్నా . పద సిగరెట్ అని . . మా డాటాబేస్ వాడు నన్ను లాక్కుపోటానికి నా దగ్గరకొచ్చాడు . . నాకెలాగూ సిగరెట్ అలవాటు లేదు . . ఆ వదిలే ప్రొగపీల్చటం తప్ప . . , సరేపద . . అది పీల్చితే అయినా ఈ టెన్సన్లు కాస్త తగ్గుతాయేమోనని . . వాడితో కిందకు వెళ్ళాను . . . ఈ రోజంత ఇలావుందేంటబ్బా అని అలోచించగా . . ఇవన్నీ ఆ చెట్నీకి సైడెఫెక్టులేలా అనిపించాయి . . వెంటనే ఈవిషయాలన్నీ మా ఆవిడకు చెప్పాలని ఫోనుచేసాను . అన్ని కుశల ప్రశ్నలు వేసాకా . . , ఇవాలా ఇలా జరిగింది . . అదిలా అయ్యింది . ఇదిలా ఏడ్చింది . . ఇవన్నీ చెట్నీసైడెఫెక్టుల్లాగా అనిపిస్తున్నాయి . . అని మొదలుపెట్టాను . అప్పటిదాకా కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న మా చంటాడు . . డీటియస్ . . డాల్బీ స్టీరియో మింగేసినట్టు ఏడవటం మొదలుపెట్టాడు . . వీడేడుస్తున్నాడు నాకేమీ వినిపించటంలేదు . . మళ్ళీచేయండి అనగానే ఫోన్ కట్ చేసేసా . . మళ్ళీ ఒక పావుగంటయ్యాకా చేస్తే మళ్ళీ అదే గొడవ . . ఐదునిమిషాలు కేరింతలు కొట్టాడు చెట్నీ మాటెత్తగానే డాల్బీ ఏఫేక్ట్ . . ఈ సారి వాడి నోటిదగ్గర ఫోన్ పెట్టిందేమో . . అమ్మో . . వీడిసౌండుకన్నా నా ప్రాజెక్ట్ గొడవలే బెస్ట్ అని ఫోన్ పెట్టేసి . . మళ్ళీ ఫోన్చేస్తే ఒట్టు . ఇంటికొచ్చాకా . . , చంటాడు పడుకున్న సమయం చూసుకుని . . మొత్తం జరిగిందంతా చెప్పాను . . , చెట్నీలేని బతుకు . . దుర్భరం . . అన్యాయం , అక్రమం . . ఆవేశం ఆయాసం . . అని నా గోడు వినిపించి ఆయాసపడ్డాను . సరే సరే . . పాయింట్ నోటెడ్ . . రేపట్నుండి చెట్నీ మర్చిపోకండా చేస్తా అని . . హామీ ఇచ్చి కరపత్రం పై సంతకం చేసింది మా ఆవిడ . తరువాతరోజు పొద్దున్నే యధావిధిగా ఆఫీసుకు రడీ అవుతున్నాను . టీ . వీ పెట్టి చూస్తూ మళ్ళీ ఇడ్లీప్లేటందుకున్నాను . . . అదే ప్లేట్ . . అవే ఇడ్లీలు . . కానీ నేనుకున్న చెట్నీకాకుండా . . మళ్ళీ అల్లంచెట్నీవుంది . ఇదేంటిది . . అని మళ్ళీ క్లాస్ మొదలుపెట్టాను . . ఇంతచెప్పినా నువ్వు మారలేదు . . మర్చిపోయావ్ . . అది ఇదీ . . ఆట్ . . ఊట్ . . అల్లంచెట్నీ అని చెడమడా తిట్లు అందుకున్నా . . , తిట్టి తిట్టి . . ఆవేశపడి . . . చెమటలు తుడుచుకున్నాను . ఒక ఐదు నిముషాలు నిశ్శబ్దం . . ఆవేశపడకండి . . , ఈ మంచినీళ్ళు తాగండి . . అని మంచినీళ్ళ గ్లాసు చేతికిచ్చి . . ఇదిగో చెట్నీ ! ! . . . చేసాను . . , మీరేమంటారో అని అల్లంచెట్నీవేసా అంతే . . అని . . ప్లేట్లో వడ్డించింది . ప్రక్కనే దివాన్ కాట్ పై . . ఆన్ యువర్ ఆర్మ్స్ అనగానే . . పరుగెత్తటానికి రెడీగా వున్న అథ్లెట్ లాగా . . మోకాళ్ళపై నిలబడి . . హిహీహీ . . . . అని కేరింతలుకొట్టి వెక్కిరించినట్టు నవ్వాడు మా చంటాడు .
ఇలాంటివి అనుభవం అయినప్పుడు కొన్ని కొన్ని ఎప్పటికీ అలా ఊహల్లోనే నిలిపేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదూ ! ఒక అమరావతి అనే ఏముంది లేండి ప్రతి చోటా అలానే ఉంటుంది . మేము ఎప్పుడో పది పన్నేండ్ల క్రితం వెళ్ళాం అమరావతి అప్పుడు పర్లేదు మరి !
వుదాహరణకి ఒకటి వస్తే , ' బ్రహమమొక్కటే ' అనీ , రెండు వస్తే ' వద్దురా ఇద్దరు ' అనీ , మూడు ని ' త్రిమూర్త్యాత్మకం ' అనీ , ఇలా 16 ని ' టీనేజిలో అత్యంత తియ్యనైన స్వీట్ . . . ' అనీ , 33 ని ' రెండు మూడంకెలు ' అనీ , 69 ని అన్యోన్యదాంపత్యం అనీ , 96 ని యెడమొగం , పెడమొగం అనీ వ్యాఖ్యానాలతో సాగుతుంది - - జనాల నవ్వుల మధ్య !
పోస్టు పోస్టుకి చాలా మెరుగౌతున్నారు . అద్బుతంగా వ్రాసారు . నేను ముందే అన్నట్టు మీ శైలి బావుంది : )
మృతిచెందింది . స్థానికుల కథనం ప్రకారం గత కొన్నేళ్ల క్రితం మండలకేంద్రంలో పవన్ ఫర్నీచర్ షాపు నడుపుతున్నాడు . సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఉండగా ఆమె కుమారుడు గమనించి స్థానికులకు సమాచారం అందించాడు . దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతిచెందింది . మృతిచెందిన సమయంలో భర్త ఖమ్మం వెళ్లాడని వారు తెలుపుతున్నారు . దీనిపై పూర్తి సమాచారం అందాల్సివుంది . . . .
ఈ సినిమా కథ విషయానికొస్తే రాజయ్య ఒక వసుధైకకుటుంబానికి పెద్దదిక్కు . ఆయన అయిదుగురు కుమారులు సత్యనారాయణ , చలపతి , రామచంద్రయ్య , మోహనరావు , శ్రీనివాస్ , వీరి భార్యలు , వారి సంతానంతో ఇల్లంతా సందడిగా ఉంటుంది . రాజయ్య పెద్ద కుమారులిద్దరూ విదేశాలలో ఉంటున్న తండ్రి కోరికపై స్వంత ఊరికి తిరిగి వచ్చి పిత్రార్జితాన్ని కాపాడటం , అనేకమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఊర్లో వారందరికీ తలలో నాలుకలా మెలుగుతుంటారు . సత్యనారాయణ కుమార్తె శారద . సాయిని ప్రేమిస్తుంది . వీరి ప్రేమను అంగీకరించని సత్యనారాయణ , చలపతి సాయిని అవమానించడంతో సాయి శారద వారిని విడిచి దూరంగా హైదరాబాద్లో నివసిస్తుంటారు .
తెలంగాణా ఉద్యమానికి కారణం వెనకబాటుతనం కాదని తెలంగాణా వాదులు ఒప్పుకొని ఇప్పుడు ఆత్మగౌరవం కోసం అంటున్నారు . కానీ ఇది ఆత్మ గౌరవం కోసం కూడా కాడు . దీనికి రూట్ కాజ్ ఆంధ్రులంటే కొందరు తెలంగాణా వారికి ఉన్న అసూయా ద్వేషాలలో ఉంటే , దానికి ఆజ్యం పోసింది రాజకీయ నాయకుల అధికార కాంక్ష . ఒక ఆంధ్ర వాడిగా నాకనిపించేది ఏమిటంటే , " తెలంగాణా అర్జెంట్ గా ఇవ్వాల్సిందే . కానీ హైదరాబాద్ లేకుండా " తెలంగాణా అత్మ గౌరవానికీ హైదరాబాద్ కీ ఏమిటి సంబంధం ? తెలంగాణా సంస్కృతి వేరు , హైదరాబాద్ సంస్కృతి వేరు , హైదరాబాద్ లో ఉన్న నిజాం తెహ్జీబ్ వేరు . తెలంగాణా భాష వేరు , హైదరాబాద్ భాష వేరు . తెలంగాణా పల్లెలలో ఉండే రాములు కీ హైద్రాబాద్ లో ఉండే మియ మొహిఉద్దీన్ కీ సంబంధం ఎక్కడ ? తెలంగాణా ప్రజలు ఆత్మ గౌరవం కోసం పొరాడే వారైతే . . హైదరాబాద్ వారికీ ఇజ్జత్ ఉంటుంది . కాబట్టీ వెంటనే హైదరాబాద్ లో రిఫరెండం పెట్టి ప్రత్యేక హైదరాబాద్ ఏర్పాటు చెయ్యాలి . ఆంధ్ర ప్రదేష్ రాష్ట్రం నుంచీ జనాలందరూ హైదరాబాద్ కి వలస వచ్చి అక్కడి స్వచ్చమైన నిజాం సంస్కృతి ని నాశనం చేశారు . . . . ఇక పై ఇది చెల్లదు . . ప్రత్యేక హైదరాబాద్ కావాలి .
" ఎవరైతే హజ్ దినాలలో ఎలాంటి చెడు పనీ చేయకుండా , భార్యతో కలవకుండా హజ్ పూర్తిచేసారో , అటువంటి వారు అప్పుడే తన తల్లి నుండి జన్మించిన శిశువు మాదిరి ( పాపరహితంగా ) స్వచ్ఛంగా మరలుతారు . " బుఖారీ హదీథు గ్రంథం .
కెసిఆర్కి మంత్రి పదవి ఇవ్వలేదని తెరాస పార్టీ పెట్టాడని విమర్శిస్తారు కానీ గతంలో మన ప్రాంతానికే చెందిన కాకాని వెంకటరత్నం ఒకసారి మంత్రిగా పని చేసి రెండవసారి మంత్రి పదవి రాలేదని జై ఆంధ్ర ఉద్యమం నడిపిన విషయం మర్చిపోతారు . జై ఆంధ్ర ఉద్యమంలో యువకులు ఆత్మహత్యలు చేసుకోలేదు కానీ పోలీస్ కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు .
వ్యాపారంలో ఎప్పటికప్పుడు సరికొత్త విధానాలు అనుసరించినట్లే జ్యొతిస్యంలో జనాన్ని దో చు కోడానికి వ్యూహాలు పన్నుతుంటారు . 2009 జూలై ఆగస్ట్ లో మూడు గ్రహణాలు వస్తున్నయి కనుక పెద్ద ఉపద్రవం రానున్నదని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారు పుస్తకమే రాసారు . దీనిపై పత్రికలు , టి . వి లు విపరీతంగా గాధలు ప్రచారం చేస్తున్నయి . మూడో ప్రపంచ యుద్దం రావచ్చు అనేటంతవరకు వెళ్ళారు . లోగడ అలాగె వచ్చినట్లు కథలు అల్లారు . ప్రభుత్వం చేతులు ముడుచుకొని వున్నది . అందులోనే నమ్మకస్తులు వున్నారు గనుక ఇలా జరుగుతున్నది . చట్టాన్ని ప్రయోగించి అబద్దాలు , మోసాలు క్రింద శిక్షలు అమలు పరిస్తే , జ్యోతిష్యం పేరిట జరుగుతున్న నేరాలకు కొంత అడ్డుకట్ట పదుతుంది .
: ఈ మధ్య తెలుగు బ్లాగులు కుప్పలు తెప్పలు గా వచ్చేస్తున్నాయ్ . ఇదొక మంచి పరిణామం . ఏదో ఒకటి బరుకుతూనే వున్నారు . వార్తలు చదివడం తక్కువయిపోయి బ్లాగులు పట్టుకుని వేలాడే వాళ్ళెంత మందో . నా మటుకు నేనయితే మొన్నా మధ్య ఆఫీసులో కోడ్ రాస్తూ Clob datatype తో variable ఎలా డిక్లేర్ చేశానంటే clob_data బదులు blog_data అని . కంపైల్ చేస్తే ఇంకే ముంది ? స్క్రీన్ నిండా అక్షింతలే . అలా బ్లాగులు చదివి అలసిపోయి వ్యాఖ్యలు రాయడానికి సమయం లేకుండా పోతున్న వాళ్ళ కోసం రాసింది ఇది . చెప్పాలనుకున్నది inscript లోనో RTS లోనో టైపు చేసి రాసే బాధ తప్పించుకోడానికి కొన్ని మార్గాలు అన్వెషించా . అన్నింటికి పుట అక్షరాలు కనిపెడితే ఎలా వుంటుంది అనే " మంచి దుర్మార్గపు " ఆలోచన వచ్చింది . ( దుర్మార్గులలో కూడా మంచాళ్ళుంటారని అందరూ సహృదయత అర్థం చేసుకుంటారు కదూ ) . ఈ పుట అక్షరాలనే SMS లో వాడుతారు కదా . కొంచెం తిలకించండి . వీలయితే మీరూ కలపండి .
" వెళ్ళి తీసుకురావాలంటే మనకి మాత్రం కాదా ఖర్చు ? రానూ పోనూ వంద మైళ్ళంటే టాంకు మూడోవొంతు ఖాళీ అవుతుంది . ఎంత లేదన్నా పదిహేను డాలర్లు . "
గీతాగణేశన్ భరతనాట్యంలో అందెవేసిన చేయి . జయప్రద రామమూర్తి చెయ్యితిరిగిన వేణువాద్య కళాకారిణి . ఈ ఇద్దరు యువ కళాకారిణులు తారనాకలో ఉత్తరా సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను నెలకొల్పి ఔత్సాహికులకి ఈ రెండు కళలలోనూ చక్కని శిక్షణ ఇస్తున్నారు . తాము తమ గురువుల వద్ద నేర్చిన ఈ విద్యలకి తమ శిష్యులే " ఉత్తరా " ధికారులు అన్న ఆలోచనతో ఈ సంస్థని నిర్వహిస్తున్నారు . హైదరాబాదు పరిసర ప్రాంతాలలో వివిధ పండుగల సందర్భాల్లోనూ ఇతరత్రంగానూ వీరి విద్యార్ధి బృందాలు ప్రదర్శనలిచ్చి ప్రశంసలు చూరగొనడం పరిపాటిగా జరుగుతోంది . రెండేళ్ళ క్రితం శ్రీలంక ప్రభుత్వంచే ఆహూతులై తమ బృందంతో ఆ దేశాన్ని పర్యటించి అనేక ప్రదర్శనలిచ్చారు . ఐతే ఇవన్నీ ఒక ఎత్తు , ఆగస్టునెలలో వీరు జరిపే తమ సంస్థ వార్షికోత్సవం ఒక ఎత్తు . సభలు జరపటమే వృత్తిగా చేసేవాళ్ళు కూడా అందుకోలేని పనితనంతో జరుగుతుంది వీళ్ళ కర్యక్రమం . ఎక్కడా ఆలస్యం కానీ కాలహరణం కానీ ఉండవు . అనవసరమైన సోదితో ప్రేక్షకుల్ని బాదటం ఉండదు . ప్రదర్శనలు చక్కని కళాత్మక , సాంకేతిక విలువలతో ఆకట్టుకుంటాయి . పిల్లనగ్రోవి బృంద గానం , భరతనాట్య నాటక ప్రదర్శన తమకి తామే గొప్ప ఆకర్షణలు కాగా , ఈ యువగురువులు తమ ఇద్దరి కళలను కలబోసి రూపొందించిన వేణు - నాట్య సల్లాపము అద్భుతంగా ఉంటుంది - ఈ వార్షిక ఉత్సవాల్లో ఈ అంశం ఒక ప్రత్యేక ఆకర్షణ . అంతే కాక ఈ సందర్భంగా వీళ్ళు చేసే మంచి పని ఇంకొకటుంది . ప్రతి ఏడూ ఒక విద్వన్మణికి సన్మానం చెయ్యడం . చిన్నా చితకా సంస్థలు కొన్ని , అప్పటికే పద్మభూషణ్ లాంటి బిరుదులు పొంది ప్రపంచ ప్రఖ్యాతి పొందిన కళాకారుల్ని పిలిచి వాళ్ళకి తాము కూడా ఒక శాలువాకప్పి ఒక బిరుదిచ్చి - కేవలం ఆ ప్రముఖ వ్యక్తితో ఫొటోలుదిగే అవకాశం అన్నట్టు చేస్తాయి . ఉత్తరా వారి పద్ధతి దీనికి పూర్తిగా భిన్నం - తమ కళల్లో ఎంతో నిష్ణాతులై కూడా స్థానికంగా పట్టుదలతో , నిశ్శబ్దంగా పనిచేస్తూ భావితరాలకి మన సాంప్రదాయ కళలని నేర్పుతున్న గురువుల్ని గుర్తించి సన్మానిస్తారు . ఉత్తరా వారి ఎనిమిదవ వార్షికోత్సవం రాబోయే శుక్రవారం ( ఆగస్టు 24 ) సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో జరుగుతోంది ఆసక్తి కలవారందరూ ఆహ్వానితులే .
' అంటరాని వసంతం ' పుస్తకరూపంలో కూడ రావడానికికన్నా ముందు - అంటే ఏడాది క్రితమే రాయవలసిన వాణ్ణి , ' అరుణతార ' లో సీరియల్ ముగియగానే రాయవలసిన వాణ్ణి , ఏడాది పట్టింది . పూర్తిగా చదవండి »
ఈ సారి గేలకే ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలంటాను కానీ అందులో ఓ చిన్న ట్విస్టు వుంది . ఆడ గే కి ఆ అవకాశం ఇవ్వాలి . అనగా ఓ లెస్బియను లేదా మహిళా బై సెక్సువల్ కి ఆ అవకాశం ఇస్తే చూడముచ్చటగా వుంటుందనేది నా అభిప్రాయం .
ఆ శెట్టిగారి కథేమిటి అంటారా ? వెనకటికి " ఇవాళ పొద్దున్నే లక్ష రూపాయల నష్టం " అన్నాడట . అదెలా ? అనడిగితే , " నేను కొన్న భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్టుకి నిన్న తీసిన డ్రా లో లక్ష రూపాయల బంపర్ ప్రైజు తగల్లేదు . మరి రావలసిన సొమ్ము రాకపోవడం నష్టమే కదా ? " అన్నాట్ట .
రష్యా నుండి భారత దేశానికి సహాయం చేయటానికి వస్తున్న సైంటిస్టులకు రక్షణగా వెళ్ళిన షాడోను విమానంలోనే శత్రువులు చుట్టుముడితే , తప్పించుకోవటానికి సముద్రంలోకి దూకి ఆ తరువాత ఫెర్రి ఫలాలు ఆరగించి కిల్ మాంజారా అడవిలో భేరి తెగకు పట్టుబడతాడు . అక్కడ షాడో వివిధ ప్రమాదాలను ఎలా ఎదుర్కుంటాడు , భేరి తెగతో ఎలా ప్రవర్తిస్తాడు ? సైంటిస్టులను ఎలా రక్షిస్తాడు ? ఈ రోమాంచితమైన షాడో స్ప [ … ]
43 అడ్డం : ఆ కోపధారి ఒక్కటిచ్చుకుంటే ఇచ్చుకున్నాడుగానీ ఆనందంతో " జలకాలాటలలో , కలకలపాటలలో ఏమి హాయిలే హలా " అని పాడాలనిపిస్తోంది . ఎంతైనా ఆయనా జగదేకవీరుడే కదా ?
@ మందాకిని గారు : తెలుసండి . ఈ వారాంతం వీలు కుదిరితే వెళ్ళాలి . ఈ ఆధునిక ప్రక్రియల గురించి అయితే మాత్రం తెలీదు . ఏమైనా మీ సూచనకు నెనర్లు .
అయ్యబాబోయ్ . . బాబోయ్ . . తవరు మన పస్సిమ గోదరోల్లేనేటి . . సానా బాగా రాసారండి . ఇంతకీ ఈ తాతారావుగారు ఇప్పుడున్నారండి . ఆబెంజి ఏవయిందంటారూ .
ఉత్పలమాల . ఆరగ రాని కామ్య బడబానల కీలలు పెల్లు రేగ దు ర్వార మదోద్ధతింగని దురాగ్రహ దంభ వచో నికృష్ట క ర్మారతి దోగుచుందురు నిరంతర దుర్వ్రత నిష్టనుందు రీ క్రూర మహోగ్ర కర్మఠులు కూళ మదాన్విత దుష్టమానవుల్ . ౯
ఈ విశ్వం 11 దిశలలో వ్యాప్తి చెంది ఉందన్నది కూడా ఆఖరి మాట కాదు ; ఒక సిద్ధాంతం మాత్రమే . ఈ విశ్వానికి 26 కొలతలు ఉన్నాయని మరొక సిద్ధాంతం ఉంది . విశ్వానికి " ఇన్ని " కొలతలు ఉన్నాయని నిర్ధిష్టంగా చెప్పలేమని మరో సిద్ధాంతం ఉంది . టూకీగా చెప్పాలంటే మనకి ఈ విషయం పరిపూర్ణంగా అవగాహన కాలేదని ఒప్పుకోవాలి . M - సిద్దాంతం ప్రకారం 11 కొలతలు ఉన్నాయి . ఈ సిద్ధాంతంలోకి ఈ 11 కొలతలు ఎలా వచ్చేయో చెప్పాలంటే అది తేలిగ్గా తెమిలే పని కాదు .
newyork లో . . ఒక బ్యాంకు కి వెళ్లి . . $ 5000 డాలర్స్ loan అడిగాడు అంట . . ఇండియా కి వెళ్లి బిజినెస్ స్టార్ట్ చెయ్యాలి అనుకుంటున్నా అని , బ్యాంకు వాళ్లకి surity కింద తన ఫెర్రారి కార్ ఇచ్చి . . loan తీసుకు వెళ్తాడు అంట ఆ ఇండియన్ , $ 5000 డాలర్స్ కి అంత కాస్ట్లీ కార్ ఆ అనుకుంటున్నారా . . : ) : P
నిలోఫర్ ఆసుపత్రిలో నిత్యం చేరే రోగుల సంఖ్య సుమారు రెండు వందల వరకుంటుంది . ఐదువందల పడకలకే అనుమతి కలిగిన ఇక్కడ , ఎల్లప్పుడూ , రెట్టింపు సంఖ్యలో - వేయి మంది దాకా ఇన్ - పేషంట్లు వుంటారు . ఇంత మందికి చేయాల్సిన వైద్య సపర్యలకు అందుబాటులో వున్న నర్సుల సంఖ్య అత్యంత స్వల్పం . వైద్య విద్యను అభ్యసించి బయట కాలిడే ముందు ప్రతి మెడికో చేసిన " హిప్పోక్రాటిక్ ప్రమాణం " కు కట్టుబడి పని చేసేందుకు , నిలోఫర్ లో పని చేస్తున్న ఏ ఒక్క డాక్టరుకు అవకాశం లేని రీతిలో ఆసుపత్రి భౌతిక - నైతిక నిబంధనలున్నాయక్కడ . నూటికి ఏబై శాతం అవకాశంతో బ్రతికే అవకాశం వున్న శిశువులను కాపాడే చర్యలు తీసుకోవాలా ? లేక నూటికి తొంభై శాతం వున్న వారి వ్యవహారం చూడాలా ? అన్న మీమాంసలో పడిపోతారిక్కడి వైద్యులు . అత్యవసర వైద్య సేవలకు అవశ్యం కావాల్సిన వెంటిలేటర్లు , మోనిటర్లు , ఇన్ ఫ్యూజన్ పంపులు , ఎమర్జెన్సీ మందులు అసలు లేకపోవడమో , వున్నా అవసరానికి చాలినంత మోతాదులో లభ్యం కాకపోవడమో ఇక్కడి ఆనవాయితీ . అత్యవసర వైద్య పరీక్షలైన బ్లడ్ గాస్ అనాలసిస్ , ఎలెక్ట్రొలైట్స్ , లివర్ ఫంక్షనింగ్ పరీక్షల లాంటి వాటికి సదుపాయం లేదు . వైద్య పరంగా ప్రామాణిక చికిత్సా విధానం అవలంభించడానికి వనరులు లేవు . ఫలితం ఎలా వుంటుందోనని ఆలోచించకుండా , ఎలాగైనా శిశువుల ప్రాణాలను కాపాడాలన్న పట్టుదలతో , గత్యంతరం లేని పరిస్థితుల్లో , ఇక్కడ పనిచేసే వైద్యులు , ప్రత్యామ్నాయ నివారణ విధానాలను అవలంబిస్తున్నారు . అతి చిన్న ఆసుపత్రిలో కూడా ఇటీవల కాలంలో లభ్యమయ్యే డిజిటల్ ఎక్స్ - రే సదుపాయానికి నిలోఫర్ నోచుకోలిదింకా . అందుబాటులో వున్న అత్యంత ఆధునిక అల్ట్రా సౌండు సిటీ స్కాన్ యంత్రాన్ని ఉపయోగించేందుకు సరైన సంఖ్యలో రేడియాలజీ డాక్టర్లు కాని , సాంకేతిక నిపుణులు కాని లేరు . ప్లేట్ లెట్స్ , ఇమ్యునోగ్లోబులిన్ , అల్బుమిన్ , యాంటీ బయోటిక్ ఏ నాడూ సమకూర్చలేదిక్కడ . సరైన యాజమాన్య నియంత్రణా పద్ధతులు లేకుండా రోగులపై డ్రగ్స్ పరీక్షలు నిర్వహించే కార్యక్రమం యదేఛ్చగా కొనసాగుతోంది . వీరి వాక్సిన్లు ఉపయోగ పడుతున్నాయా ? రోగులకు ప్రాణాంతకంగా మారుతున్నాయా అని పర్యవేక్షణ జరిపేవారే లేరు . వీటికి తోడు సహజంగా చోటు చేసుకున్న పౌష్టికాహార లోపం , యాంటీ నేటల్ పరీక్షలు జరపక పోవడం లాంటివి కూడా శిశు మరణాలకు , చిన్న పిల్లల మరణాలకు దోహద పడుతున్నాయి .
సరోజకు పెళ్లి కాదేమో అన్న ఆలోచనే ఆవిడకు ఆక్రోశం తెప్పించేసింది . " అయ్యో భగవంతుడా ! నన్నెందుకు తీసుకుపోలేదు , ఇటువంటి రాక్షసిని నా కడుపులోనే పుట్టేటట్లు చేసావా , నన్నెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు . " అంటూ తల గోడకు వేసి కొట్టుకోవడం మొదలుపెట్టింది .
కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో చాలామంది ఒరియా వాళ్ళు ఉన్నారు . చాలా వరకూ బాంబే వెళ్తున్నారు . హారీ సీట్ పక్క ఓ పాతికేళ్ళ కుర్రాడు సెల్ ఫోన్ లో మాట్లాడుతున్నాడు . ఒక కాల్ అయిన వెంటనే ఇంకొక కాల్ వస్తోంది . సుబ్బారావు ' టీ సీ ' తో చెప్పి సీట్ మార్పించుకొని వచ్చాడు . ఆ కుర్రాడికి మళ్ళీ కాల్ వచ్చింది . " కొడితే కొట్టలిరా సిక్సు కొట్టాలి " , అని మొబైల్ కాలర్ ట్యూన్ ని పాడింది .
అనగా అనగా . . . . . మౌల్వీ నసీరుద్దీన్ ఓసారి ఏదో పని ఉండి వీధిలో నడుచుకొంటూ పోతుండగా ఓ ధనికుడు తారసపడ్డాడు . అతడు చాలా ఖరీదైన దుస్తులు వేసుకొని ఉన్నాడు . కాని అతడి ముఖంలో ఏదో దిగులు , విచారం ! నసీరుద్దీన్ అతణ్ణి తేరిపారా చూశాడు . కుతూహలంగా తోచింది . ఆగి పలకరించాడు . " ఈ పట్టణానికి కొత్తలా ఉన్నారు ? ఎక్కడి నుండి వచ్చారు ? ఎందుకలా దిగులుగా ఉన్నారు ? " అడిగాడు నసీరుద్దీన్ . ధనికుడు భారంగా ఓ నిట్టూర్పు విడిచాడు . " ప్రక్క నున్న పల్లె నుండి వచ్చాను " అన్నాడు . నసీరుద్దీన్ కొనసాగించమన్నట్లుగా చూశాడు . ధనికుడు " నాకు పది తరాలు కూర్చొని తిన్నా తరగనంత సంపద ఉంది . కాని ఆనందం మాత్రం లేదు . నేనెప్పడూ సంతోషంగా గడపలేదు " అన్నాడు విచారంగా . " అదేం ? ఆరోగ్యం లేదా ? " అడిగాడు నసీరుద్దీన్ . " నాకేం . పిడిరాయిలా ఉన్నాను " . " మరి సంతానం లేదా ? " " రత్నాల్లాంటి బిడ్డలు నలుగురున్నారు " కించిత్తు గర్వంగా చెప్పాడు ఆ ధనికుడు . " వాళ్ళుత్త బడుద్దాయిలా ? " అనుమానంగా అడిగాడు నసీరుద్దీన్ . " చాలా బుద్ధిమంతులు . నే గీచిన గీత దాటరు . చక్కగా వ్వాపారం చేసి భారీగా లాభాలు గడిస్తున్నారు ? " " మరేమిటి మీ సమస్య ? ఎందుకు విచారం ? " మరింత ఆరాగా అడిగాడు నసీరుద్దీన్ . " నాకన్నీ ఉన్నాయి , ఆనందం తప్ప . ఈ పట్టణం గురించి అందరూ చెప్పగా విన్నాను . అందుకే చూడటానికి వచ్చాను . ఇక్కడైనా నాక్కొంచెం సంతోషం దొరుకుతుందేమోనని ఆశ . అదీ తీరేటట్లుగా కనబడటం లేదు . " నిర్వేదంగా చెప్పి నీరసంగా ముందుకు కదిలిపోయాడు ధనికుడు . సాలోచనగా అటువైపే చూస్తూ నిలబడ్డాడు నసీరుద్దీన్ . ఆ ధనికుడికి అన్నీ ఉన్నాయి . మరి ఆనందం ఎందుకు లేదు . తళుక్కున బుర్రవెలిగింది నసీరుద్దీన్ కి . వెనుక నుండి పరిగేట్టుకుంటూ వెళ్ళి , ఒక్క ఉదుటున ధనికుడి చేతిలోంచి డబ్బు సంచీ లాక్కుని , ఇంకా వేగంగా పరుగెట్టి సందు మలుపులో దాగుండిపోయాడు . " అయ్యో ! అయ్యో . నాడబ్బు . నాడబ్బు " ఘొల్లుమన్నాడు ధనికుడు . అతడి ఒళ్ళంతా చెమటలు పట్టాయి . కంగారూ , దుఃఖం , హడావుడీ , వత్తిడీ ముప్పరిగొన్నాయితణ్ణి , తేరుకొని గట్టిగా అరిచాడు . " నాడబ్బు సంచీ లాక్కొని పారిపోతున్నాడు . దొంగా ! పట్టుకోండి " భయంతో కీచుమంది ధనికుడి గొంతు . వీధంతా హడావుడిగా ఉంది . ఎవరి పరుగులో వారున్నారు . ఎవ్వరూ అతడి గోల పట్టించుకోలేదు . ధనికుడికేం చేయాలో పాలుపోలేదు . చాటుగా నసీరుద్దీన్ అతణ్ణి అనుసరిస్తూ , పరిశీలిస్తూనే ఉన్నాడు . ధనికుడికి ఆకలి వేసింది . నీరసంగా ఉంది . అలిసిపోయాడు . ఎక్కడైనా బస చేద్దామన్నా , తిండి తిందామన్నా చేతిలో డబ్బులేదు . దాదాపు ఏడుపొచ్చేసింది అతడికి . " ఈ ఉళ్ళో తెలిసిన వాళ్ళు కూడా లేరు . నేరకపోయి వచ్చాను . ఆనందం లేకపోతే పోయింది . ఇప్పడు తిండీ తిప్పలూ లేవు , నిద్రానిప్పులూ లేవూ . వెనక్కి వెళ్ళెందుకు దారి ఖర్చులు కూడాలేవు . ఏం చేయాలిరా బాబూ " అని గొణుక్కుంటూ రోడ్డుప్రక్కన చెట్టు క్రింద కూలబడ్డాడు . అతణ్ణీ అనుసరిస్తున్న నసీరుద్దీన్ చెట్టు చాటు నుండి అతడు ముందు పడేలాగా డబ్బు సంచీ విసిరేసాడు . నీరసంగా తూగుతున్న ధనికుడి ముందు ఖణేల్ మంటూ నాణాల సంచి పడింది . తనదే . అచ్చంగా తనదే . ఒక్క గెంతులో పైకి లేచాడు ధనికుడు . డబ్బు సంచి మీదకి ఒక్క దూకు దూకాడు . చేతిలోకి తీసికొని అనందంతో కెవ్వున కేక పెట్టాడు . కుప్పిగంతులు వేశాడు . " ఓ హోహో ! దొరికింది . నాడబ్బు దొరికింది " సంతోషంగా అరిచాడు . చిరునవ్వుతో ఎదురుగా నిలబడ్డాడు నసీరుద్దీన్ . ఒక్కక్షణం అయోమయంగా చూశాడు ధనికుడు . మరుక్షణం నసీరుద్దీన్ ని గుర్తుపట్టాడు . నవ్వుతూ చెప్పాడు నసీరుద్దీన్ " ఆనందించడానికి ఇదీ ఒక మార్గమే . " ఇదీ కథ ! మరో కమ్మని కథ కోసం వేచి చూడండి .
@ జాపత్రి = జాతి పత్రి , జాపత్తిరి , జాతి కోశము , కోశి
ఇలా మానవులను పరాత్పరుడితో కాలంతో అనుభందం చేసారు . ఒక్క భారతీయ పరంపరలో తప్పితే , ప్రపంచ ఇతిహాశంలో మరే పరంపరలో ఇంత పరీవ్యాప్తమైన భారీ కాల మనాలను ప్రస్తావించిన వైనాలు లేవు .
రాజస్థాన్లో ఒక బిచ్చగాడు చనిపోయాడు . ఆ వార్త మన దేశపు ఆంగ్ల దినపత్రికలతోపాటు ఇతర దేశాల దినపత్రికలలో కూడా వచ్చింది . రోజూ వందలాది మంది బిచ్చగాళ్లు చచ్చిపోతూనే ఉంటారు . వాళ్లకు లేని ప్రత్యేకత ఈ బిచ్చగాడికి ఏముందీ అంటే , ఉంది . చనిపోయిన ఆ బిచ్చగాడి దగ్గర దాదాపు రెండు లక్షల రూపాయలు ఉన్నాయి . ఏ రోజుకా రోజు చిల్లర నాణేలను , చిన్న నోట్లను ఇచ్చి ఐదు వందలు , వేయి రూపాయల నోట్లను అతడు తీసుకొనేవాడని చుట్టుపక్కల దుకాణాల వాళ్లు అధికారులకూ , మీడియాకూ చెప్పారు . ఇకనేం ఇదో పెద్ద వార్త అయి కూర్చుంది . అంతర్జాతీయ వార్తా సంస్థలు కూడా కలానికి పని పెట్టేశాయి . ఇక మన రాష్ట్రంలో కూడా ఇటువంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది . ఖమ్మంలో ఒక బిచ్చగత్తె వద్ద అరవై ఒక్క వేల రూపాయలు ఉన్నాయి . ఓ అర్ధరాత్రి వేళ ఆమె కేకలు వేస్తూండటంతో పోలీసులు ఆమె దగ్గరకు వెళ్లారు . ద్విచక్ర వాహనదారుడు తన బస్తాను తీసుకు పారిపోతున్నాడని , అతడిని పట్టుకోవాలని ఆమె కోరింది . పోలీసులు ఎలాగైతేనేం ఆ బస్తాను పట్టుకు వచ్చారు . ఆ బస్తాలో నాణేలు , పది రూపాయల నోట్లు , వంద రూపాయల నోట్లు ఉన్నాయి . మొత్తం లెక్క వేస్తే 61 వేల రూపాయలు ! ఇక ఈ వార్త కూడా పేపర్లకు ఎక్కింది . ఇదేదో ఆలోచించవలసిన విషయమే మరి ! రోడ్డు పక్కన అడుక్కునే ఒకానొక బిచ్చగాడి దగ్గర రెండు లక్షల రూపాయలు ఉన్నాయి . మరొక బిచ్చగత్తె దగ్గర 61 వేల రూపాయలు ఉన్నాయి . బిచ్చగాళ్ల దగ్గర అంతంత డబ్బు ఉందంటే మన దేశంలో మంచితనం ఇంకా బతికే ఉందనే అనిపిస్తోంది . దయాదాక్షిణ్యాలు మన వాళ్లలో ఉండబట్టే కదా అంతంత డబ్బును దానం చేసింది ? అలా అనీ అనుకొనేందుకు లేదంటారు కొందరు . అడ్డదిడ్డంగా డబ్బు సంపాదించేసి , ఆనక పాపభీతితో దానధర్మాలు చేస్తున్నారని వీళ్ల వాదన . సరే ఈ విషయం పక్కన పెట్టి కాసేపు ఆ బిచ్చగాళ్ల గురించే ఆలోచిద్దాం . అయినా అంతంత డబ్బు వెంట ఉంచుకొని ఎందుకు తిరుగుతున్నారు ? ఆ డబ్బుకి భద్రత ఎలా ? బ్యాంకుల్లో ఎందుకు దాచుకోరు ? బహుశా వాళ్లకు పాస్పోర్టులు , డ్రైవింగ్ లైసెన్సులు , పాన్ కార్డులు ఉండవు కనుక పొదుపు ఖాతా తెరిచేందుకు బ్యాంకులు అంగీకరించి ఉండవు . భద్రమైన ఇల్లూ ఉండదు కనుక ఉన్న కాస్త డబ్బునూ వెంటపెట్టుకొనే తిరగాలి . . మరేం చేయాలి ? అంత డబ్బు సంపాదించిన తర్వాత కూడా వాళ్లు ఇంకా ఎందుకు అడుక్కొంటూనే జీవిస్తున్నారు ? రోడ్ల మీద ఎండకు ఎండుతూ , వానకు తడుస్తూ వచ్చిపోయే వాళ్లని దేబిరిస్తూ , హీనంగా , నీచంగా అడుక్కుంటూ ఎందుకు బతకవలసి వచ్చింది ? సంపాదించిన ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఏ చిన్నపాటి దుకాణమో పెట్టుకోవచ్చు కదా ? సమాజంలో గౌరవప్రదంగా జీవించవచ్చు కదా ? ఎందుకలా చేయకుండా ఇంకా అడుక్కొంటూనే బతుకు బండిని లాగిస్తున్నారు ? ఇక ఆ పని తప్ప వేరింకేమీ చేయలేమనే మానసిక పరిస్థితిలో వాళ్లు ఉండి ఉంటారా ? ఆ జీవితానికే అలవాటు పడిపోయి ఉంటారా ? ఎవరూ అడుక్కోవాలని ఆశ పడరు . అది మంచి లాభదాయకమైన వృత్తి అని భావించి దానిలోకి దిగరు . అది ఒక అనివార్యమైన , నిస్సహాయమైన పరిస్థితిలో క్రమక్రమంగా ఊబిలోకి దిగబడటం లాంటిదే . ఒకసారి దిగిన తర్వాత దానిలో నుంచి బయటపడలేరు . తామున్న పరిస్థితుల్లోనే కొనసాగటం , వాటికే అలవాటు పడటం , రాజీ పడటం మానవ నైజం కనుక - ఆ తర్వాత కూడా యాచక వృత్తిలోనే కొనసాగుతారు . అంతేనా ? ఏమో ! సరే , తొలుత ఏ ఆధారమూ లేదు కనుక అడుక్కోవటం మొదలుపెట్టారే అనుకొందాం . కాస్త డబ్బు కూడబెట్టిన తర్వాత గౌరవ ప్రదమైన వృత్తిలోకి మారిపోవచ్చు కదా ? ఆత్మగౌరవంతో బతకవచ్చు కదా ? ఊరికే కష్టపడకుండా వస్తూ వుంటే పని చేసి బతకాల్సిన అవసరం ఏమిటనేది సాధారణంగా చర్చల్లో వచ్చే కామెంట్ ! అంతేనా ? దారిద్య్ర రేఖకు దిగువన బతికే జనం కోసం ఇచ్చే రెండు రూపాయల బియ్యం కోసం డాబా ఇంటి పెద్దాయన తెల్లరేషన్ కార్డు తీసుకోవటం లాంటిదేనా ఇది కూడా ? దారిద్య్రం అంటే మానసికమైనదేనా ? పేదలకిచ్చే రాయితీల క్యూలో సంపన్నులుంటే , వారిని పొమ్మనకండి . వారి మానసిక స్థాయి ఇంకా దారిద్య్ర రేఖకు దిగువనే ఉందని ఓ సామాజిక వేత్త అన్నట్లు గుర్తు . మన దేశంలో బిక్షగాళ్లు లేని ఊరు ఉంటుందా ? దేవాలయాల ముందు , రైళ్లలో , ఇంకా అనేకానేక బహిరంగ ప్రదేశాల్లో ఎవరో ఒకరు బిక్షం కోసం దీనంగా చేతులు మన ముందుకు సాచే దృశ్యం కనపడకుండా ఉంటుందా ? రైలులో ప్రయాణిస్తూ ఉంటాం . కొత్త చీర కట్టుకొని , ముఖాన బాసికంతో పెళ్లికూతురు వేషంలో ఉన్న యువతిని తీసుకొని ' రేపు పెళ్లి బాబూ , తోచినంత దానం చేయండి ' అంటూ ఒకరిద్దరు ఆడవాళ్లు తిరుగుతూ ఉండటం సాధారణ దృశ్యమే . కోతి పిల్లను భుజాన ఎక్కించుకొని అడుక్కొనే పిల్లల సంఖ్యా ఎక్కువే . అప్పుడే పుట్టిన రోజుల బిడ్డను చంకన వేసుకొని ఆడవాళ్లు అడుక్కోవటమూ దయనీయ దృశ్యమే . . తన కోసం , తనపై ఆధారపడిన వారి కోసం బిక్షం ఎత్తటం , అంగవైకల్యాన్నో , గాయాలనో చూపి బిచ్చం అడగటం , జంతువులనో , పిల్లలనో చూపి బిచ్చం అడగటం - పద్ధతి ఏదైనా పరిస్థితి మాత్రం దైన్యమే . . కానీ ఈశా న్య భారతంలో ఒకప్పుడు బిచ్చగాళ్లే ఉండేవాళ్లు కాదుట . ఈశాన్య భారతదేశ పట్టణాలు , పల్లెల్లో ఎక్కడా అడుక్కొనే వ్యక్తే ఉండేవారు కాదంటే ఆశ్చర్యకరమైన వార్తే . నాగాలాండ్ , మణిపూర్ , అరుణాచల్ప్రదేశ్ , మిజోరం , మేఘాలయ , సిక్కిం ప్రాంతాలలో బిక్షగాళఉల ఉండేవారు కాదు . అలాగే పంజాబ్లో కూడా బిక్షగాళ్లు తక్కువ . కానీ ఇపుడిపుడే ఈ పరిస్థితుల్లో కూడా మార్పులు వస్తున్నాయి . బిక్షగాళ్లకు సంబంధించి కూడా మన దేశంలో ఎన్నో చట్టాలు ఉన్నాయి తెలుసా ? చాలా చట్టాల మాదిరిగానే ఇవి కూడా అమలుకు నోచుకోవు . అవి అలా ఉంటాయి . ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ , 1977 మన రాష్ట్రానికి సంబంధించిన చట్టం .
కంప్యూటర్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయిన ఈ యుగంలో , ఆ పెనగలుపు నుండి ఎక్కడి సినిమాలనైను ఎక్కడివారైనా దించుకుని చూసుకోవచ్చు . మన సంస్కృతి , వారి సంస్క్కృతి అన్న అడ్డుగోడలింకేమీ లేవు . నాసిరకం సినిమాలను , సంగీతాన్ని మనదేశంలో చెల్లుబాటు చెయ్యవచ్చు , పిచ్చివాళ్ళవలే కేరింతలు కొట్టే వీర ఫేనులు ఉన్నారు . కానీ ఇదే సరుకుని మిగతా దేశంవాళ్ళ విమర్శలనుండి వేర్పెట్టలేము . ఇది యూట్యూబు యుగం . ఎవ్వడైనా వీడియోలు పెట్టవచ్చు , మరింకెవ్వడైనా వాటిని దిలోడించుకోవచ్చు . ఎలాంటి కామెంట్లైనా పబ్లిగ్గా రాసుకోవచ్చు .
చాలా బాగా గుర్తు చేశారు శ్రీ శ్రీ గారిని . ! " కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృధ్ధులు " - - ఎప్పుడైనా బద్దకంగా కనిపిస్తే మా నాన్నగారు ఎప్పుడూ ఈ మాటే చెప్పేవాళ్ళు .
ఆహ్లదకర వాతావరణం , ప్రకృతి సౌందర్యం హార్సిలీహిల్స్ ప్రత్యేకతలు . ఇక్కడికి వేళ్ళే కొండ దారి . . వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది . రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు , కొండ చుట్టూ అడవులు , కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి .
CBS యొక్క మొదటి టెలివిజన్ ప్రసారాలు ప్రయోగాత్మకంగా ఉన్నాయి , తరచుగా రోజుకి గంటసేపు మాత్రం ఉండి న్యూయార్క్ నగరంలోపల మరియు చుట్టుప్రక్కల పరిమితమైన ప్రాంతాలలో ప్రసారం అయ్యేది ( స్టేషన్ W2XAB ఛానల్ 2 , తరువాత దీనిని WCBW పిలవబడి చివరగా WCBS - TV అనబడింది ) . ప్రత్యర్థి RCAకు ధీటుగా , CBS హైట్రోన్ లేబరేటరీస్ను 1939లో కొనుగోలు చేసింది , మరియు వెనువెంటనే సెట్ నిర్మాణం మరియు కలర్ ప్రసారంలోకి కదిలింది . పోటీపరమైన హక్కులు మరియు విధానాలు ఉన్నప్పటికీ , RCA FCC యొక్క సాంకేతిక ప్రమాణాలలో ముందు నిలిచింది , మరియు CBS నుండి ప్రాముఖ్యతను తన వైపుకు తిప్పుకుంది , డుమోంట్ మరియు ఇతరులు టెలివిజన్ను సామాన్య ప్రజానీకానికి 1939 న్యూ యార్క్ వరల్డ్స్ ఫెయిర్ వద్ద పరిచయం చేయడంతో ఈ విధంగా జరిగింది . FCC వాణిజ్యపరమైన టెలివిజన్ స్టేషన్లకు అనుమతులను జూలై 1 , 1941న ఇవ్వడం ఆరంభించింది ; మౌదటి అనుమతి RCA మరియు NBC యొక్క WNBT ( ఇప్పటి WNBC ) కు వెళ్ళింది ; రెండవ అనుమతి , అదే రోజున WCBW , ( ప్రస్తుతపు WCBS ) కు జారీ చేయబడింది . CBS - హైట్రోన్ ఒక ప్రాక్టికల్ కలర్ విధానాన్ని 1941లో అందించారు , కానీ ఇది RCA చేత ఏర్పరచబడిన బ్లాక్ - అండ్ - వైట్ ప్రమాణాలతో పోటీ పడలేక పోయింది . ఆ సమయంలో , మరియు కొంత అనిశ్చిత తరువాత , FCC CBS యొక్క సాంకేతికతను తిరస్కరిస్తూ RCAను సమర్థించింది .
అవి గుట్టైన గుండె గుడికి వెన్నెల వాకిళ్ళు . ముగ్దుడనై ఆ వెన్నెల వాకిటి ముందు పరచితి నా ఆశల రంగవల్లిక . వేచితి నేను పున్నమి రాకకై ! Continue reading →
అబ్బా ఈ సినిమా చాలా ఇష్టమండి మాల గారు . ఇందులో సావిత్రి సూర్యాకాంతం పిల్లలు పెళుసుగా సమాధానం ఇచ్చినపుడు ఏం మీ అమ్మనుకున్నావా > నాలుగు వేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది . . మాదీ ఉమ్మడికుటుంభమే . . తరుచూ పిన్నులు , పెద్దమ్మ అల్లరి చేసినపుడు అలానే అనేవారు . . . అలాగే ఎవరు సంపాదించినా సంపాదించకపోయినా ఉమ్మట్లో నడిచిపోతుంది . . ఒక మాట అనుకున్నా మళ్ళీ కలిసిపోతారు . . చాలా సహజం గా తీసారు ఈ సినిమా
నేను వినలేదు గనక బాలమురళీ " వాగ్గేయకారితనాన్ని " ఒప్పలేదు . . ఏ కళకి ఆ కళ విలక్షణమైనది . దేని విశిష్టత దానిది . బాలమురళీ కర్నాటక సంగీతానికి అమరిన ఒక ఆభరణం . కానీ తెలుగు " వాగ్గేయకారితనం " ఆయనలో లేదు . ఈ రెండూ వేరు వేరు . ఒకదాన్లో గొప్ప అయినంత మాత్రన అంతే సమానంగా మిగతా కళల్లో కావాలని ఎక్కడాలేదు .
యిక మరియొక గల్పవృక్షమునో , గామధేనువునో వ్రాయ సంకల్పించితిని నా యాంతర్యములో . మరల గలసికొందుము .
అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం . దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు . ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి . అప్పుడే ఆ బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు . దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు .
అప్పటికే బోసన్న లేచి నా పర్సులో డబ్బులేమైనాయని చిందులు వేస్తున్నాడు .
ఇప్పటి వరకు భద్రిరాజు వారు తెలుగులోను , ఇంగ్లిషులోను ప్రచురించినవి 25 గ్రంథాలూ , నూటికి పైగా పరిశోధన వ్యాసాలు ఉన్నాయి . వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఇంగ్లిష్ పుస్తకాలు :
కరమరుదగు కీర్తి " గురించిన చాటువు బాగా ప్రసిద్ధమైనదే ! ) . ఇక్కడ రాయలవారు పాండ్యరాజు కీర్తిని హంసతో పోలుస్తున్నారు . హంసతో పోల్చడంలో ఉన్న మరొక ఔచిత్యం , అది దశదిశలా ఎగురుతుంది ( వ్యాపిస్తుంది ) . అలాగే హంస శ్రేష్ఠతకి కూడా సూచకం . ఇంతవరకూ చెప్పి ఊరుకుంటే అతను కృష్ణదేవరాయలే అవ్వడు ! ఆ కీర్తి అనే హంసకి రెండు రెక్కలూ దానం , త్యాగమునట . అంటే నిరంతర దాన త్యాగల వల్లనే ఆయన కీర్తి హంస ఎగురుతోందన్నమాట . దానమంటే నీరు ధారపోసి అడిగినవారికి ఇచ్చేది . త్యాగమంటే అదేమీ లేకుండా తన దగ్గరున్న వస్తువుని ఇచ్చివేయడం . అంచేత దానమనే ఒక రెక్క ఎప్పుడూ తడుస్తూనే ఉందన్న మాట . మామూలుగా పక్షులు తడి రెక్కలతో ఎగరలేవు . అయితే హంస మాత్రం రెండు రెక్కలూ తడిసినా ఎగరగలదు . ఇక్కడ తడుస్తున్నది ఒక రెక్కనే కదా . అంచేత కీర్తి అనే ఆ హంస ఎగరడంలో ఆశ్చర్యమేమీ లేదు అని సమర్థించాడు . ఒక ఊహని రాయలవారు ఎంత సమగ్రంగా ఆలోచిస్తారో అన్న దానికి ఇదొక చక్కని ఉదాహరణ .
ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకోడానికి భారతదేశం బడా కార్పొరేట్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి . ప్రపంచంలో అమె రికా ఆధిపత్యం తగ్గడం , బహుళజాతి కంపెనీ లనేకం దివాళా తీయడం , విదేశాల్లో వారి పెట్టుబడుల పురోగమనం మందగించడం తది తర అంశాలను భారత పెట్టుబడిదారీ వర్గం తమకనుకూలంగా మలుచుకున్నది . భారతీయ కార్పొరేట్లు ఆఫ్రికా , ఆసియా ఆఖరుకి అనేక యూరప్ దేశాల్లో కూడా కంపెనీలు పెట్టి , గ్లోబల్ కంపెనీలుగా తయారయ్యాయి . దీనికి బదులుగా మన ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ పెట్టుబడులు స్వేచ్ఛగా ప్రవేశించడానికి అనుమతినిచ్చారు . ఉదాహరణకు , అమెరికా , అస్ట్రేలియా లాంటి దేశాల్లో ఊరూపేరూ లేని విశ్వవిద్యాలయాల ( ట్రైవ్యాలీ లాంటి బోగస్ వర్శిటీలు ) బ్రాంచీలను మన దేశంలో ఏర్పాటు చేయడానికి అనుమతు లివ్వజూస్తున్నారు . ఇది హాస్యాస్పదమైన నిర్ణయ మని నోబెల్ బహుమతి గ్రహీత వెంకటేశన్ రామకృష్ణన్ విమర్శించారు . ఇప్పటికే ఉన్నత విద్యకు దూరమవుతున్న పేదవర్గాలు దీనితో మరింతగా వేరుపడిపోతారు .
రామ , రామా ! ఎవరిని పడితే వారిని స్వర్గీయ ఎన్ . టి . రామారావుగారితో పోలుస్తుంటే ఆయన అభిమానులకి మనసు చివుక్కుమంటుంది . అలా పోల్చేవారి అమాయకత్వానికి జాలేస్తుంది కూడా ! ఎందుకంటే ఏడాదికో రామారావుగారు పుట్టే ఏర్పాటు భగవంతుడు చేసి ఉండలేదు గనుక . రామారావుగారి పనుల్లో ఒకటి - రెండు చేసినంత మాత్రాన ఎవరూ ఆయనతో సరిసాటి కాజాలరు . బతికున్న రోజుల్లో ఆయనకి ఎదురులేదు . చనిపోయాక కూడా అంతే ! ఆయన సూర్యోదయానికి ముందే లేచి యోగా చేసేవారు . అలా చేసేవారు ఆంధ్రాలో చాలామంది ఉన్నారు . కానీ వారంతా రామారావులై పోరు . రామారావుగారు చాలా డబ్బు సంపాదించారు . కానీ అలా డబ్బు సంపాదించిన ప్రతివాడూ రామారావై పోడు . ఆయన రాజకీయాల్లో ఉన్నారు . కానీ అంతమాత్రాన ప్రతి రాజకీయ నాయకుడూ మరో రామారావై కూర్చోడు . రాజకీయాల్లోకి వస్తే తనమీద ఆదాయప్పన్ను దాడులు జఱుగుతాయనో , తనని ఇందిరమ్మ మూసేస్తుందనో రామారావుగారేమీ భయపడలేదు . పైపెచ్చు రాష్ట్రాల్ని ఆవిడ బిచ్చగాళ్ళలా చూస్తున్నందుకు నిరసనగా ఆవిడ అధ్యక్షతన జరిగిన జాతీయ అభివృద్ధి మండలి సమావేశాల్లోంచి మొహమాటం లేకుండా వాకౌట్ చేశారు . ఇతరులకీ , రామారావుగారికీ మధ్య ఉన్న తేడాని ఒక్క ముక్కలో తేల్చవచ్చు . పాపం ! ఇతరులకి అభిమానులు మాత్రమే ఉన్నారు . కానీ రామారావు గారికి ఏకంగా భక్తశిఖామణులే ఉన్నారు . ఈ రాష్ట్రంలో గత నలభయ్యేళ్ళుగా నిర్మించిన అనేక వైష్ణవాలయాలకి వెళ్ళి చూడండి . ఆ దేవుడి ముఖం ఎవరిని పోలి ఉన్నట్లు శిల్పులు చెక్కారో గమనించండి . మీకే బోధపడుతుంది . రామారావుగారి అసలు విశిష్టత డబ్బు సంపాదించడంలోను లేదు , ఎనిమిదేళ్ళ పాటు రాష్ట్రాన్ని పరిపాలించడంలోను లేదు . ఆయన విలక్షణత్వం ఉన్నది - ఎంత యెత్తుకు ఎదిగినా మూలాల్ని మర్చిపోని సనాతనత్వంలో ! ఎంత సంపాదించినా అంతరాంతరాల్లో నిలబెట్టుకున్న బోళాతనంలో ! తాను నమ్మినదాని కోసం ముందూ వెనకా చూడకుండా ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధపడే ఆత్మవిశ్వాసంలో ! ప్రజలకి నచ్చేలా ఒకపక్క ఆధునిక రంగురంగుల ప్రపంచంలో తిరుగుతూనే మఱొకపక్క సాంస్కృతిక ప్రపంచపు మనిషిగా మిగిలిపోవడంలో ! ఇప్పటి ముఖ్యమంత్రిని చూస్తే తెలుస్తుంది , రామారావుగారు ఆ రోజుల్లో తనకున్న పలుకుబడినీ , అధికారాన్నీ పెద్దగా వినియోగించుకోలేదని ! ఆయన పట్ల తెలుగు ప్రజలకున్న అభిమానానికి కులం లేదు , మతం లేదు , ప్రాంతం లేదు , సైద్ధాంతిక భేదాలసలే లేవు . తొట్టతొలి ప్రయత్నంలోనే రెండొందల రెండు స్థానాల్ని కైవసం చేసుకున్న ఆయన రికార్డుని ఇంతవరకూ ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు . తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నప్పుడు తాను కింగ్ నని గానీ కింగ్ మేకర్ నని గానీ రామారావుగారు డబ్బా కొట్టుకోలేదు . " మీరు రాజకీయాలకి కొత్త గదా ! ముప్ఫయ్యేళ్ళ నుంచి పాతుకుపోయిన కాంగ్రెస్ ని కదిలించగలరా ? " అని అడిగినప్పుడు రామారావుగారు తడుముకోకుండా " అధికారంలోకి రాలేకపోతే బాధ్యతాయుత ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం " అని తెలియజేశారు . కానీ అనుకోకుండా విజయం సాధించారు . బి . జె . పి . తో కలిస్తే మేము పొత్తుకు రామని ఈనాడు ఎఱ్ఱపార్టీలు నాయుడుగారికి తెగేసి చెబుతున్నాయి . రామారావుగారి హయాములో మాత్రం అవి కిక్కురుమనకుండా ఆయన చిటికెన వేలు పట్టుకుని నడిచాయి , ఆయనకి బి . జె . పి . తో బహిరంగ పొత్తు ఉన్నప్పటికీ ! ఎందుకంటే , ఆయన్ని బట్టి సిద్ధాంతాలు , అంతేగాని సిద్ధాంతాల్ని బట్టి ఆయన ఉండేవాడు కాడు . గత ఎనిమిదేళ్ళుగా ప్రత్యేక తెలంగాణ కోసం నిలదీత ( demand ) కొనసాగుతోంది . రామారావుగారు ప్రత్యేక రాష్ట్ర వాదనలకి ఆజన్మాంతం పూర్తివ్యతిరేకి . " తల్లా ? పెళ్ళామా ? " సినిమాలో వేర్పాటువాదాలకి వ్యతిరేకంగా " తెలుగుజాతి మనది , నిండుగ వెలుగు జాతి మనది . . " అనే పాట కూడా చొప్పించారు . ఆ సంగతి అందఱికీ తెలుసు , ప్రస్తుత తెలంగాణ వాదులతో సహా ! ఈ ఎనిమిదేళ్ళలో ఆంధ్రనాయకులపై తెలంగాణవాదులు ఎన్నో విమర్శల్ని సంధించారు , ఒక్క రామారావుగారి మీద తప్ప ! ప్రత్యేక తెలంగాణ వాదాల్ని రాజీ లేకుండా వ్యతిరేకిస్తూనే తెలంగాణ ప్రజల అభిమానానికి పాత్రుడైన అరుదైన మూర్తిమత్త్వం ( image ) ఆయనది . వీర తెలంగాణవాది అయిన కేసీయార్ తన కొడుక్కి రామారావుగారి పేరు పెట్టుకున్నాడంటేనే విషయం అర్థం కావాలి . ఆయనే ఇతరుల్ని నడిపించేవాడు అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లోను ఇతరులు తనని నడిపించడానికి ఒప్పుకునేవాడు కాడు . దాన్ని నిరంకుశత్వంగా అభివర్ణించినవాళ్లున్నారు . కానీ ప్రజల చేత నడిపించబడేవాళ్ళు నాయక స్థానానికి పనికిరారు . తన రాజకీయ జీవితంలో రామారావుగారు తప్పిదాలు చెయ్యలేదని కాదు . చేశారు కానీ ఎక్కువభాగం రాజకీయ అనుభవ రాహిత్యం వల్ల జఱిగినవి . కొన్ని తెలిసి చేసినవి కూడా ఉన్నాయి . అందుమూలంగా రాష్ట్రంలో చాలామందికి దెబ్బ తగిలిన మాట కూడా నిజమే . ఆయన ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ పక్షవాతానికి గుఱై మంచం పట్టిన రోజుల్లో ( క్రీ . శ . ౧౯౯౧ - ౯౪ ) వాటి గుఱించి తీవ్ర పశ్చాత్తాపం చెందారు . చనిపోవడానికి సుమారొక ఏడాది ముందు మళ్ళీ అధికారంలోకి వచ్చారు . అప్పుడు తన పూర్వతప్పిదాల్ని సవరించుకోవడానికి ప్రయత్నించారు . కానీ తన తుదివిడత - పదవీకాలాన్ని పూర్తిగా అనుభవించక పోవడం వల్ల ఆ ప్రయత్నం సఫలం కాలేదు . ఆయన తప్పిదాలకి లభించిన ప్రచారం ఆయన పశ్చాత్తాపానికి లభించలేదు . కానీ మనిషనేవాడికి క్షమాగుణం అనేది ఉండాలి . చనిపోయే ముందు తన పొఱపాటు అభిప్రాయాల్ని సవరించుకొన్న రామారావుగారి గుఱించి చెడుగా తలంచడం సంస్కారం కాదు . రామారావుగారు మనసులో ఉన్నదే మాట్లాడేవారు . రాజకీయాల్లో ఇతరులు ప్రణాళికాబద్ధంగా అవలంబించే కృత్రిమత్వం ఆయనకి చేతనయ్యేది కాదు . ఆయన అమెరికా వెళ్లివచ్చాక " అక్కడి రోడ్లు మన బెడ్రూముల్లా ఉంటాయి . వాటి మీద పాలు ఒలికినా ఎత్తుకొని తాగొచ్చు . అంత శుభ్రంగా ఉంటాయి . మన దేశం కూడా అలా ఎప్పుడవుతుందో ! " అని ఆవేదన వ్యక్తం చేశారు . " నువ్వు ముఖ్యమంత్రివై ఉండీ బాగు చెయ్యకుండా అలా ఎప్పుడవుతుందో అని వాపోతావేంటి ? " అని అప్పట్లో చాలామంది అవహేళన చేశారు . అలాగే డెబ్భైరెండేళ్ళ పండువయసులో చివఱిసారి అధికారంలోకి వచ్చారు . అప్పుడు తెలుగుదేశం కూటమి సాధించిన శాసనసభా స్థానాల సంఖ్య రెండొందల ఇఱవై కంటే ఎక్కువ . ఆ రోజుల్లో ' ప్రజలవద్దకు పాలన ' అని ఒక పథకం ప్రవేశపెట్టారు . అంటే , ఒక్కొక్కసారికి ఒక్కొక్క జిల్లా చొప్పున మంత్రులతో సహా స్థానికంగా అందుబాటులో ఉండేవారు . అందులోభాగంగా తన మంత్రివర్గ ( Cabinet ) సభ్యులతో కలిసి బస్సులో విశాఖపట్నం వెళుతూ దారిలో ఒక టీకొట్టు దగ్గఱ ఆగి టీ తాగారు . టీకొట్టు యజమానికి డబ్బులివ్వబోతే " మీ దగ్గఱ కూడా డబ్బులు తీసుకుంటామా అన్నగారూ ? " అన్నాడతను . ఆ మాటకి రామారావుగారి కళ్లు చెమర్చాయి . ఆయన తరువాత మీడియాతో మాట్లాడుతూ , " కొడుకులకి కోట్లాది రూపాయల ఆస్తులు పంచుతాం . ఎవరు గుర్తుపెట్టుకుంటారు ? నన్ను చూస్తే చాలు , జన్మ ధన్యమైందనుకునేవారు ఉన్నారు ! ఎన్ని కోట్లు ఇస్తే ఈ అభిమానం లభిస్తుంది ? " అన్నారు . డబ్బులు దండుకుని సీట్లు కేటాయించి , డబ్బులు పంచి , సారాయి పోసి ఎన్నికల్లో నిలబడాలనుకునేవారికి మింగుడు పడని మాటలివి . రామారావుగారు పదమూడేళ్ళ పాటు రాజకీయాల్లో తిరిగినా , బహు ముసలివాడయినా ఎందుకో ప్రజల్లో ఆయన గ్లామర్ తగ్గింది కాదు . ఎన్నికల ప్రచారమప్పుడు రామారావుగారికెవరూ ఉపన్యాసాలు రాసిచ్చేవారు కారు . అక్కడికక్కడే ఆశువుగా మాట్లాడేవారు . ముఖ్యమంత్రి హోదాలో టీవీల్లాంటి వాటిల్లో ప్రసంగించినప్పుడు మాత్రమే రాసిన ఉపన్యాసాలుండేవి . స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో భారీగా వ్యవస్థాగత మార్పులకి శ్రీకారం చుట్టినవారెవరైనా ఉంటే , వారిలో మొదటివారు కేరళకి చెందిన నంబూద్రిపాద్ గారు కాగా , రెండోవారు ఎన్ . టి . రామారావుగారు . మండలాల దగ్గర్నుంచి అత్యాధునిక గ్రేహౌండ్స్ దళాల దాకా రామారావుగారి మానసపుత్రికలెన్నో ! అడుగడుగునా సి . ఐ . ఏ . ఏజంట్లతో నిండిపోయిన ఈనాటి రాజకీయరంగాన్ని , రామారావుగారి వంటి దేశాభిమానిని పక్కపక్కనే పోల్చి చూసినప్పుడు చాలా బాధనిపిస్తుంది . ఘటనల్ని పోలిన ఘటనలు జఱుగుతాయేమో గానీ పూర్తిగా మనిషిని పోలిన మనుషులెక్కడా ఉండరు .
హలో శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ అసలు గుస గుస అంటే నే ఎవరికి వినపడకపోవడం కదా : D కాపోతే మీరన్నట్టు విమానం మోత మోగొద్దు అనుకుంటే మాత్రం ఏదో సామెత లో చెప్పినట్టు " ఏంట్రా గోల అని అడిగితె ఏముంది కొండమీద కోమటి వాళ్ళు " రహస్యం " చెప్పుకుంటున్నారు " అన్నట్టవుతాది ఏమంటారు ? ఉష
జ : " ట్రిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చేసి తయారు చేసిన ఆయుధ సామాగ్రి పాడవకుండా చూసుకోడానికే బిలియన్లకొద్దీ డాలర్లు ఖర్చు చెయ్యవలసి వస్తోంది ! పైగా ఫలానా ఆయుధం ఇన్నివేల మందిని చంపగలదు . . . . . . ఫలానా ఆయుధం ఇన్నివేల కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న వాటినన్నింటినీ నాశనం చెయ్యగలదు అని చెప్పుకోడమే తప్ప , అవి నిరూపించబడడం , వాటికన్న గొప్పవి తయారు చెయ్యగలం అని నిరూపించుకోవడం ఎలా ? అందుకే . . . . . ఓ సారి వాడి చూస్తే పోలా ! " అనిపించినప్పుడల్లా . . . . . ఏదో ఒక దేశం మీద యుద్ధం చేస్తూ వుంటాడు అమెరికావాడు !
మేష రాశి : ఇంటి సౌఖ్యం , ఖర్చులు అధికం , బంధువుల కలయిక , ఉద్యోగ అవకాశం ఉండవచ్చు . గురువారం మంచి అదృష్టం ఉన్నది . కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి . శ్రీసూక్తం చదవండి .
భద్రాద్రి ఆలయ చరిత్ర ఒకసారి స్మరించుకుందాము . భద్ర మహర్షి తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు వైకుంఠ రాముడిగా మహర్షి తలపై పాదాలు మోపాడు . ఆ భద్రగిరి క్షేత్రమే గోదావరి ఒడ్డున ఉన్న భద్రాచలం . 17వ శతాబ్దంలో శ్రీ రాముడి భక్తురాలైన పోకల దమ్మక్కకు కలలోశ్రీ రాముడు కనిపించి భద్రగిరిపై తాను వెలిసానని , తనను పూజించి ముక్తి పొందమని చెప్పాడు . ఆ మరునాడు దమ్మక్క భద్రగిరిపై వెతుకగా ఒక పుట్టలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి విగ్రహాలు ఉన్నాయని తెలుసికొని ఆ పుట్టపై కొన్ని వందల కుండల గోదావరి నీటిని పోయగా స్వామి వారి విగ్రహాలు బయల్పడ్డాయి . తరువాతి కాలంలో అంటే 1674వ సంవత్సరంలో కంచర్ల గోపన్న ఆలయాన్ని నిర్మించాడు . ఆయనే భక్త రామదాసుగా సుప్రసిద్దుడు . స్వామివారి దర్శనము తరువాత పర్ణశాలకు బయలుదేరాము . అక్కడ ఆలయంలో దర్శనము చేసుకొని ప్రక్కనే ఉన్నా పర్ణశాల నమూనాను తిలకించాము . అప్పటికే చీకటి పడటంతో సీతమ్మవారి నార చీరల ప్రదేశముకు వెళ్ళలేక పోయాము . ఇక ఆరోజు రాత్రి భద్రాచలంలోనే బస చేసి ఆదివారము రోజు పాపికొండల యాత్రకు బయలుదేరాము .
తేటగీతి . బ్రహ్మలోకమ్ము మొదలు స్వర్గమ్ము వరకు సకలముల్ పుట్టి మఱల నాశమ్ములగును ; దివ్యమౌ నా పథంబు నొందిన నరుండు , తిరిగి పుట్టుకఁ జావులఁ దెలియఁ బోడు . ౧౫
లారీ వెనుకున్న రెండక్షరాలు చూసి బ్లాగుల్లో కధానాయకుని పేరు సమీర్ , హీరోయిన్ పేరు శృతి , బ్లాగు పేరు ఇంద్రధనుస్సు లా పుంఖాను పుంఖాలుగా ఉండేసరికి ఏ బ్లాగుకొచ్చి ఏ కధ చదువుతున్నాడో తెలియక కన్ఫ్యూజన్ కెరటాల్లో కలిసిపోయి నట్టు నిచ్చేష్ఠుడై అక్కడే కాసేపు ఉండిపోయాడు . ఆ లారీ వెనుక ఉన్న రెండక్షరాలు చెరపకురా చెడేవు . .
రవి . . మీ మొదటి పాయింటు . . మీ తీరుకున్నంత సేపు ఖండించండి , ఏం పర్లేదు : ) మీ మిగతా మూడు పాయింట్లకి ఈ టపాలో నా పిలుపుకీ ఏవ్హీ సంబంధం లేదు . కథల పోటీలు ఆపింది ఎవరికో భయపడీ కాదు , బద్ధకం మూలంగానూ కాదు ( మిగతా వాళ్ళంతా కష్టపడి రాస్తుంటే నా బద్ధకానికొచ్చిన ఢోకా ఏం లేదు ) . ఒక్కొక్క పోటీకీ వచ్చిన పదిహేను ఇరవయ్యేసి కథలు చదివేందుకు తీరిక దొరక్క అలా వాయిదాలు పడి , ఆ రాసిన వాళ్ళు ఖాయిలా పడి . . దీన్ని మళ్ళీ కొనసాగిస్తాను ఎప్పుడో . రాయలవారి వేషం నేనైతే ఇప్పటికి పక్కన పెట్టేసినట్టే . ఆ వేషం వేసేందుకు నాకంటే బోలెడు సమర్ధులు ఇప్పుడు బ్లాగ్లోకంలో తగినంత మండి ఉన్నారు . పొద్దు వారు పూనుకుంటే నా ప్రమేయం లేకుండానే భువన విజయం జరిపించవచ్చు . దీపాల రిఫరెన్సు ఏంటో అర్ధం కాలేదు .
పట్టణాలు మాత్రమే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంటే పల్లెల్లో ఏమీలేక , గ్రామీణులు పట్టణాలకు వలసలు మొదలుపెట్టారు . దానితో గ్రామీణులకు , అందునా స్త్రీలకు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు , లఘు , చిన్న తరహా పరిశ్రమలు స్ధాపించడానికి , స్వయం సమృద్ధి సాధించడానికి ప్రత్యేకంగా ' నాబార్డు ' ఋణాలను అందిస్తుంది . వ్యవసాయం , వ్యవసాయాధార పరిశ్రమల స్ధాపనకు ఋణాలు , పధకాలు అమలు చేయడం , గ్రామీణాభివృద్ధి ' నాబార్డ్ ' ధ్యేయాలుగా ముందుకు సాగుతోంది .
ఒకచోట బ్రహ్మచారులకి విద్య నేర్పుతున్న ఒక గురువుని బ్రహ్మ తేజస్సుతో ఉన్నతన్ని చూసి దగ్గరికి వెళ్ళా . ఆయన నన్ను పిలిచి కులగోత్రాలు విని " పూజ్యులు వచ్చారు గనక ఈ రోజు మీకు సెలవు " అని విద్యార్థుల్ని పంపేసి నాతో అదీ ఇదీ మాట్లాడుతూ ఉండగా ఒక బ్రహ్మచారి ఓ పుస్తకం పట్టుకుని హడావుడిగా వచ్చాడక్కడికి . " ఏమిరా ఇంత ఆలస్యం ఐంది ? " అని గురువు అతన్ని అడిగితే , " చాలా పెద్ద కారణమే ఉంది . మీరు ఇంకా విన్నట్టు లేదు . మీరు పంపితే నేను వెళ్ళేసరికి శాలీనుడు వాళ్ళ పూలతోటలో ఒక లతాగృహంలో ఉన్నాడు . సుగాత్రి అతని పాదాలు ఒత్తుతోంది . అతను నన్ను చూసి " మీ గురువు గారు పుస్తకం కోసం పంపారా ? అదుగో ఆ కొమ్మ మీద పెట్టాను . తీసుకెళ్దువులే కొంచెం సేపు కూర్చో " అని ఒక మావిడి చెట్టు నీడన కూర్చోబెట్టాడు . అప్పుడతను ఆ సుగాత్రి వీపున చెయ్యేసి , " అమృతం తాగావో లేక ఏదైనా సిద్ధరసం దొరికిందో గాని రోజురోజుకీ నీ వయసు తగ్గుతున్నట్టుందే ! ఏమిటి విశేషం ? " అనడిగాడు . ఆమె దానికి చిరునవ్వు నవ్వుతూ , " అలాటిదేమో నాకు తెలీదు . మీ తరగని ప్రేమ వల్లనేమో ! " అన్నది . దానికతను కూడా నవ్వుతూ , " అసలు విషయం నే చెప్తా , విను " అంటూ ఆమె చెవులో ఏదో చెప్తే , దానికామె విచిత్రంగా అతని వైపు చూసి " మరి నేను ఇంకొకటి కోరితే తీరుస్తానన్నదే ఆ దేవి ! ఆ విషయం ఏం చేస్తుందో ! " అని అతని చెవులో తనూ ఏదో చెప్పింది .
తెల్లవాడికి వాస్తవికత అంటే బ్యాంకులు , అంగళ్లు , నియాన్ లైట్లు , ట్రాఫిక్ తో నిండి వున్న వీధులు ; ఎటు చూస్తే అటు పోలీసులు , ఒళ్లమ్ముకునేవాళ్లు , దిగులు మొహాల మనుషులు , అందరూ గడియారం ప్రకారం పనిచెయ్యడానికి తొందర పడుతూ వుండడం . కాని అదంతా అవాస్తవం . నిజమైన వాస్తవికత వీటన్నిటి అడుగున వుంటుంది . దాన్ని కనుక్కోవడానికి పెయూట్ తాత సహాయపడతాడు . - క్రౌ డాగ్ మొత్తం చదవండి »
రాజేంద్రగారు , అవును దువ్వూరి రామిరెడ్డిగారు కూడా పారసీ నుంచి నేరుగా రుబాయతులని అనువదించారు , " పానశాల " అన్న పేరుతో . అది స్వేచ్ఛానువాదం , అంటే ప్రతి రుబాయెతునీ అనువదించ లేదు . వాటి సారాన్ని మాత్రం గ్రహించి వాటిని అందమైన పద్యాల్లో మనకందించారు . దీనివల్ల మూలంలోని పునరుక్తి కొంతవరకూ ఇందులో ఉండదు . వాటిని AMdhrabhAratilO చదువుకోవచ్చు . నరసింహ గారు , పద్యాలు బావున్నాయి .
ఇలాగె చాలా మంది నన్ను చూసి శాంతమూర్తి అనుకుంటారు . అదేమి వింతొ కోపం మానవ స్వభావం . దానికి ఎవరు అతీతులు కాదు . ఎంత సాధు పుంగవులు అయినా కోపాన్ని అదుపులో పెట్టుకోగలరు మాత్రమే కానీ పూర్తిగా త్యజించలేరు . ఎంతొ కొంత పరిమాణంలో అది అందరిలోను వుంటుంది . మనం ఎంతగా అదుపులో పెట్టుకుందామనుకున్నా , మన మనసు పొరలులో తొక్కివేయబడ్డ కోపం హద్దులు తెంపుకుని బయటకి ఎప్పుడో అప్పుడు వస్తుంది . దానిని నియంత్రించుకునే అదుపు మనకి వుండాలి . ఎక్కువగా శాంతంగా వుండే వారు , అంటే కోపం తెచ్చుకోవలసిన పరిస్థితులలో కూడా శాంతం ప్రదర్శించేవారు , తమ ఆరొగ్యాలని తామే పాడు చేసుకుంటారు . ఏదొ ఒక రూపంలో ఆ కోపాన్ని బయట పెట్టాలి . ఒక పాజిటివ్ ఎనర్జీగా దానిని ఉపయొగించగలిగితే చాలా మంచిది . బహుశా వయసుతో కూడా ఆ నియంత్రణ వస్తుంది కామోసు . ప్రయత్నం తో ఎవరైనా సాధించవచ్చు అనుకుంటాను .
ఇతను ఎప్పుడు జన్మించాడో అప్పుడే విచిత్రంగా ఇతనికి యౌవనం ప్రాప్తించింది . యౌవనం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే స్వభావుడనే సిద్ధుడు వచ్చి ఇతనికి ఒక మణిని , అమ్ముల్ని , వింటిని ఇచ్చాడు . ఈ రెంటిలో ఏది ముందో ఏది వెనకో ఎవరికీ తెలీదు . ఆ సిద్ధుడే ఇతనికి కళాపూర్ణుడనే నామకరణం చేశాడు . ఇతని సద్యోయవ్వనాన్ని గురించి విన్న సత్వదాత్ముడు " ఇతనెవరో మహాపురుషుడు ; ఇతని తల్లిని నేను కామించి పాపం చేశాను ; ఏమిచ్చి ఐనా సరే దీన్ని వాళ్ళు మరిచేట్టు చెయ్యాల " నుకుని తన రాజ్యాన్ని ఇతనికి ఇచ్చి తను మంత్రిగా వుండి సేవిస్తున్నాడు . " అని చెప్పిందా బాలిక .
మీరు చెప్పిన అన్ని లక్షణాలూ దక్షిణాసియాలోని ( పాకిస్తాన్తో సహా ) అన్ని దేశాలలోనూ ఉన్నాయని నాకనిపిస్తోంది . ఇకమీరు ఉటంకించిన 1 , 4 బిందువులు యూరోప్ అమెరికాలలో మనకన్నా మెండుగా ఉన్నాయి . కాబట్టి ఆ కొన్నిలక్షణాలూ భారతదేశాన్ని విలక్షణమైన " మన దేశం " గా మార్చడం అనుకోవడానికి గర్వంగా , తృప్తిగా అనిపించినా " పూర్ణ సత్యం " కాకపోవచ్చు . మీరు లక్షణాలతోపాటే అవలక్షణాలనుకూడా చెప్పిమరీ దేశభక్తిని పెంచుకోమన్నారు కాబట్టి నా సందేహం తీరకుండా ఇంకా గట్టిపడింది . నేనూ నా బ్లాగులో ఒక టపా రాసేశాను చదివి మీ అభిప్రాయాన్ని తెలుగలరు .
60 వసంతాల పైబడిన మేరువు మన భారతి . విశ్వసుందరులనీ , బహు సంపన్నులనీ ఒకరిద్దరు దేశీయుల మొహాలు చూబెడితే , వారి జపం చేస్తూ దశాబ్దాలు కాలక్షేపం చేయగల నిరర్థక వారసులను మోస్తున్నది మన భూమి .
" మానవత్వం ఏ కాస్త ఉన్న మనిషైనా దేవుడే . ఇంకో ప్రాణికి ఉపయోగపడే ఏ ప్రాణైనా దేవుడే . మనుష్యులకు ఉపయోగపడే వస్తువులు కూడా దేవుళ్ళే మరి ( దేవుడు చేసిన దేవుళ్ళు అనాలేమో వీటిని … హీహీ ) "
విశ్వనాథ సత్యనారాయణగారి వ్యంగ్య నవల " విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు " రచయిత విష్ణుశర్మకి ఇంగ్లీషు పాఠం చెబుతూ " రాముడు రావణుని చంపెను " అనడానికి ఇంగ్లీషులో " Rama killed Ravana " అని చెబుతాడు . వివరిస్తున్నట్టుగా " killed అనేది భూత కాలిక క్రియ " అన్నాడు . దానికి విష్ణుశర్మ " అది సరేనయ్యా చంపటాన్ని మధ్య పెట్టావేమి ? " అన్నాడు . రచయిత అదంతే అన్నాడు . విష్ణుశర్మ నవ్వి , " ఎవడు చంపబడాలో వాడు తప్పించుకు పోతాడు సుమా ! " అన్నాడు . ఆయన చమత్కారం రచయితకి వెంటనే అర్ధం కాకపోతే పక్కనే ఉండి ఇదంతా చోద్యం చూస్తున్న తిక్కన్న గారు ఇలా వ్యాఖ్యానించాడు . ( ఈ కింద ఉటంకించిన వాక్యాలు కథలోనించి యథాతథంగా ) " అబ్బాయి ! ఇది చమత్కారం కాదు , భాష . భాష అంటే , భావాలని అక్కడ ఉన్నటువంటి శబ్దాలూ వాక్యాల ద్వారా మనం తెలుసుకోవటం . మనుష్యుని యొక్క బుద్ధి ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటుంది . ఇది మనో లక్షణం . ఆ మనస్సు యొక్క నడకకు అనుకూలంగా భాషని నిర్మించుకోవాలి , వాక్య విన్యాసం అట్లా వుండాలి . చంపెను అనటంతోటే ఎవణ్ణో ఇదివరకే తెలియాలి . తరువాత తెలియటమనేది మనస్సులో ఉన్న పరమ సూక్ష్మాంశమునకు బరువైన విషయం . ఇంతవరకు మేము చదివింది ఏమీ లేదు . ఈ అక్షరాలు నేర్చుకుని , పది మాటలు దగ్గరకు వచ్చి , ఒక్క వాక్యం కాడికి వచ్చేటప్పటికి ఈ భాష ఇంత ఘోరంగా వున్నది . ఈ భాషని ఈ దేశంలో , ఈ బంగారం వంటి దేశంలో , సంస్కృతంలో నుంచి పుట్టిన తెలుగుభాష చదువుకున్న దేశంలో పసిపిల్ల లందరి బుద్ధుల మీదా అందరి మనస్సుల మీద వందల ఏండ్లుగా మీరు రుద్దుతున్నారు . వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మనస్సులలో ఉన్న పరమ సూక్ష్మమైన పరమ సుకుమారమైన మనోవృత్తి ఎంత బరువవుతున్నదో మీకు తెలియటంలేదు . అందుకనే కాబోలు మీరందరూ ఇంత తెలివిగలవాళ్ళుగా ఉన్నారు . "
సినిమా యెత్తుగడలో భాగంగా , శం . శా . " క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ " కోసం , ఆయన ప్రఖ్యాతినీ , ఆయన వైదుష్యాన్నీ , ఆయనకి ఆ రాగమంటే వుండే ఇష్టాన్నీ , జనం నీరజనాలు పట్టడాన్నీ చూపించవలసిన " టైటిల్ సాంగ్ " ని , జమీందారు కుర్చీలాగడానికీ , మం . భా . ని రేప్ చెయ్యడానికీ . . . . ఇలా వుపయోగించుకోవడం యేమి బాగుంది ?
చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూ ! ఎప్పుడో 1902లో పుట్టి , ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు ? ! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది ? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా " తోలు మందం " అనే శీర్షికతో ( ఈ కవిత నా కొత్త సంపుటి " వూరి చివర " లో వుంది ) కవిత రాసినప్పటి నించీ లాంగ్స్టన్ హ్యూ కవిత్వం రోజూ కొంత కొంత చదువుతున్నా . వొకే సారి అతన్ని అంతా చదవడం కష్టం . వొక్కో సారి వొక కవితలోని వొకే వొక్క పంక్తి చదివి పుస్తకం పక్కన పెట్టి , ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం . ఇలా చదువుతూ చదువుతూ కొన్ని నెలలు గడిచి , ఈ పొద్దు చూస్తే ఫిబ్రవరి వొకటి : అతని పుట్టిన రోజు . ఎవరికి కావాలి కవి పుట్టిన రోజు ? ! ఒక తెల్ల దేశంలో నల్ల పుటక పుట్టిన వాడి పుట్టిన రోజు అసలే అక్కరలేదు . నల్ల నేత నాయకుడయినా సరే , ఆ కవి ఈ తెల్ల దేశానికి పరాయీ వాడే ! కాని , కొన్ని పుట్టిన రోజులు చరిత్రకి కావాలి . కొన్ని పుట్టిన రోజులు చరిత్ర వేగాన్ని పెంచుతాయి . హ్యూ అలా నల్ల చరిత్ర గతిని మార్చాడు . అతను కవి మాత్రమే కాదు , నల్ల జనం మౌఖిక కథల్ని వెలుగులోకి తెచ్చాడు . కవిత్వమే రాసినా , అన్ని పనులూ కవిత్వం వల్ల కావు అనుకున్నప్పుడు గొప్ప వచనం రాశాడు . హ్యూ గురించి చాలా రాయాలి . ముఖ్యంగా ఇవాళ్టి దళిత చైతన్య స్రవంతిలో అతని స్మరణ చాలా అవసరం . హ్యూ కవితల నించి కొన్ని మెరుపులు : నీగ్రో భాషలో నది నదులు ఎప్పటినించో తెలుసు నాకు : అవి ఈ లోకం కన్నా అతి పురాతనం ఈ లోకపు మానవ నదులలో పారిన మనిషి నెత్తుటి ప్రవాహం కన్నా పురాతనం ఆ నదుల కన్నా లోతెక్కిన ఆత్మ నాది . ఇంకా తెల్లారని పొద్దుట యూఫ్రేటస్ లో స్నానమాడా కాంగో దగ్గిర వొక చిన్ని గూడు కట్టుకున్నా సాయంత్రానికి అది నాకు జోల పాడింది . నైలు వైపు దృష్టి సారించా పిరమిడ్ల ఎత్తు ఆకాసమంత అయ్యింది . న్యూ ఆర్లీన్స్కి లింకన్ వెళ్ళిన వేళ మిస్సిసిపితొ కలిసి వో పాట అందుకున్నా . ఆ సాయంత్రం దాని మురికి వొడి నిండా బంగారపు రాసులు చూశా . ఎప్పటివో ఆ చీకటి నదులన్నీ తెలుసు నాకు . వాటి మల్లెనే లోతెక్కింది నా ఆత్మ . నా వాళ్ళు భలే అందంగా వుంది రాత్రి నా వాళ్ళ ముఖాల్లాగా . భలే అందంగా వున్నాయి చుక్కలు నా వాళ్ళ కళ్ళలాగా . వారెవ్వా , సూర్యుడు కూడా భలే బావున్నాడు నా వాళ్ళ ఆత్మల్లాగా . ఆత్మ హత్య చీటీ ప్రశాంతమయిన అతి చల్లని నదీ వదనం అడిగింది వొక ముద్దు కోసం ! కలల కాపరి ఆ కలలన్నీ ఇలా పట్రా , నా స్వాప్నికుడా ! నీ గుండె సంగీతాలన్నీ ఇలా పట్రా కాస్త . వాటన్నీటినీ వొక నీలి మేఘ వస్త్రంలో చుట్టెస్తా , ఈ లోకపు కర్కశ హస్తాలకి చిక్కకుండా . *
కనులు తిరిగి క్రింద పడిపోతున్న అనుభూతి కలిగేసరికి చేతుల్ని క్రింది ఆనించి పడిపోకుండా తమాయించుకున్నది .
తన గుణము తనకు నుండఁగ నెనయంగా నొరుని గుణము నెంచును మదిలో తన గుణముఁ దాను దెలియక పనరి యొరుని ననెడు వాఁడు భ్రష్టుడు వేమా ! అని తన మదిఁ గపటము గలిగిన తన వలనే కపట ముండు తగ జీవులకున్ తన మది కపటము విడిచినఁ దన కెప్పుడు కపటి లేఁడు ధరలో వేమా !
మళ్ళీ మా మామగారు , సంచీ తీసుకొని చింతకాయల కోసం బయలు దేరారు . ముందుగా నారాయణగూడా మార్కెట్ కి . అక్కడ ఇంకా రాలేదు .
నేనేం కాకమ్మ కబుర్లు చెప్పట్లేదు . . కొన్నాళ్లు ఖమ్మం , వరంగల్ , డోర్నకల్ , నల్గొండ ప్రాంతాల్లో తిరిగాను . అక్కడ జీవన విధానం , జనాల మనోభావాలు , అలవాట్లు అన్నీ తెలుసు . . కొత్తగూడెం పక్కనే వున్న భద్రాచలం వచ్చీసరికి మరల ప్రజల తీరు , అధికారులు , నాయకుల పనితీరు వేరు . హైదరాబాద్ కూడాఎన్నోసార్లు వస్తున్నాను . చుట్టాలు రామగుండం , బెల్లం పల్లి లో వున్నారు ( వాళ్ళ అభిప్రాయాలు తెలుసు ) . . మీరు నలుపుఅన్నా , కులగజ్జి అన్నా , చేతులు ఎత్తేసారు అన్నా పెద్ద బాధ లేదు . . తొంభై శాతం ప్రజల్లో లేనిది బలవంతంగా మీడియా సాక్షిగా నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల దృష్ట్యా ఆడుతున్న ఈ నాటకాల్ని మీరు కూడా ఈ పాటికే గ్రహించే వుంటారు ( కానీ గ్రహించనట్టు వుంటే మేమేం చెయ్యలేం ) . . . నాయకులు , వుద్యమ నేతలు ఈ తెలంగాణా పేరు చెప్పుకుని కోట్లు సంపాదించుకుంటే , సామాన్య ప్రజలు , విద్యార్ధులు ఎంతో విలువైన ప్రాణాల్ని , టైమ్ ని వృధా చేసుకుంటున్నారు . అది గ్రహిన్తే చాలు . .
డుం డుం డుం అని మోగింది పెళ్ళి బాజా కం కం కం అని పిలిచింది సందడంతా సై సై సై అని గాలి వేసింది కొంటె ఈల రై రై రై అని దూసుకొచ్చింది చిలిపి గోల ఇక చాల్లే ! ఇన్నాళ్ళ ఒంటరితనం పందిరేసి కలపాలి జన్మ బంధనం ముద్దుగా ఉంది ఈ ముద్దమందారం కొత్తగా నేర్పాలి కాస్త శృంగారం
వాషింగ్టన్ , మార్చి 26 : లిబియా అధ్యక్షుడు గడాఫీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సైనిక బలగాలపై గత కొన్ని రోజులుగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు బాంబుల వర్షం కురిపిస్తూ తీవ్రంగా దెబ్బతీశాయి . అయినప్పటికీ గడాఫీ అనుకూల సైనిక దళాల వైఖరిలో మార్పు రాలేదని , ఇప్పటికీ ఆ దళాలు అమాయక లిబియా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు . సంకీర్ణ దళాల దాడుల్లో గడాఫీ బలగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా సంయుక్త దళాల డైరెక్టర్ వైస్ అడ్మిరల్ బిల్ గార్ట్నే నిన్న ఇక్కడ విలేఖరులకు చెప్పారు . గడాఫీ అనుకూల సైన్యానికి చెందిన వైమానిక దళం తీవ్రంగా దెబ్బతిందని , అది ఇప్పుడు దాడులు చేసే పరిస్థితిలో లేదని ఆయన వివరించారు . అయితే భూతలం నుంచి ఆకాశంలోకి క్షిపణులను ప్రయోగించగలిగే సామర్థ్యం , వ్యూహాలను గడాఫీ అనుకూల దళాలు ఇప్పటికీ కలిగి ఉన్నాయని ఆయన తెలిపారు . ఇదే అంశం ఇప్పటికీ సంకీర్ణ దళాలకు ప్రమాదకరంగా ఉందన్నారు . ' గడాఫీ యుద్ధ విమానాలు ఎగిరే పరిస్థితిలో లేవు . ఆయన యుద్ధ నౌకలు రేవుల్లోనే ఉన్నాయి . ఆయన మందుగుండు సామగ్రి గిడ్డంగులు ధ్వంసమయ్యాయి . కమ్యూనికేషన్ టవర్లు నేలకూలాయి ' అని గార్ట్నే చెప్పారు . గత 24 గంటల్లో లిబియా రాజధాని ట్రిపోలి , దాని పరిసర ప్రాంతాల్లో గడాఫీ సైనిక బలగాల శక్తిని తీవ్రంగా దెబ్బతీసినట్లు ఆయన తెలిపారు . లిబియా తూర్పు ప్రాంత నగరమైన బెంఘాజీ ఇతర నగరాలతో పోలిస్తే ప్రశాంతంగా ఉందని , ఆ నగరం తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉందని గార్ట్నే చెప్పారు . అయితే అజ్దాబియా నగరంపై పట్టుకోసం పోరాటం సాగుతోందని తెలిపారు . అజ్దాబియా నగరం చుట్టూ ఉన్న గడాఫీ అనుకూల సైన్యాలపై సంకీర్ణ బలగాల దాడులు కొంతవరకు ఫలితమిస్తున్నాయని చెప్పారు . అయితే ఇప్పటికీ అక్కడ గడాఫీ అనుకూల సైన్యాలు బలంగా ఉన్నాయని తెలిపారు . మిసురాటా , జింటాన్ నగరాల్లో తిరుగుబాటు దళాలు , అమాయక ప్రజలపై గడాఫీ సైన్యాలు దాడులు చేస్తున్నాయని వివరించారు . ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్నాం గడాఫీని గద్దె దించిన అనంతరం లిబియాలో పరిస్థితిపై ప్రతిపక్షంతో కలిసి పనిచేస్తున్నామని అమెరికా ప్రకటించింది . గడాఫీ తర్వాత లిబియా ఎలా ఉండాలనేదానిపై లిబియా ప్రతిపక్షంతో కలిసి వివిధ ప్రత్యామ్నాయాలు అనే్వషిస్తున్నామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి జాయ్ కార్నే నిన్న విలేఖరులకు తెలిపారు . లిబియా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేదిగా , వారి సమస్యలను పరిష్కరించేదిగా ప్రభుత్వం ఉంటుందని , ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తుందని తాము విశ్వసిస్తున్నట్లు కార్నే పేర్కొన్నారు . తిరుగుబాటుదారులకు ఆయుధాలు ? లిబియాపై అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులు ప్రారంభించి వారం రోజులైంది . కాని , ఇప్పటికీ అధ్యక్షుడు గడాఫీని గద్దె దించలేకపోయాయి . దీంతో గడాఫీ అనుకూల సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్న తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసే అంశాన్ని సంకీర్ణ దళాలు పరిశీలిస్తున్నాయని శనివారం ఒక మీడియా కథనం వెలువడింది . అమెరికా , యూరప్ అధికారులను ఉటంకిస్తూ ' ద వాషింగ్టన్ పోస్ట్ ' ఈ కథనం ప్రచురించింది . తిరుగుబాటుదారులకు శిక్షణ ఇచ్చి , ఆయుధాలు సరఫరా చేసే అంశాన్ని ఫ్రాన్స్ గట్టిగా సమర్థించింది . లిబియాలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి ఐక్యరాజ్య సమితి తీర్మానం అనుమతిచ్చినందున . . తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేయడానికి వీలవుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనాయంత్రాంగం విశ్వసిస్తోందని ఆ కథనం తెలిపింది . తిరుగుబాటుదారులకు ఆయుధాలు సరఫరా చేసే అవకాశం ఉందని ఒబామా అధికార ప్రతినిధి జాయ్ కార్నే చెప్పారు . ( చిత్రం ) తూర్పు లిబియాలోని అజ్దాబియా పట్టణాన్ని శనివారం గడాఫీ అనుకూల సైన్యం నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత తమ వశమైన ఒక యుద్ధ ట్యాంకుపై నిలబడి ఆనందం వ్యక్తం చేస్తున్న తిరుగుబాటుదారులు .
తెలంగాణ ప్రజలు తమకు తెలంగాణ కావలసిందేనంటూ తమ అభిప్రాయం స్పష్టంగా చెప్పారు . వివిధ వేదికల మీద ఇన్నాళ్ళుగా చెబుతూ వచ్చిందే ఇప్పుడు అది ఓటేసి - ఒట్టేసి - మరీ చెప్పారు . దాదాపుగా అందరూ ఊహించిన ఫలితమే ఇది . ఎన్నికలు పూర్తిగా తెలంగాణ వాదం ప్రాతిపదికగానే జరిగాయి . ప్రజలు తెలంగాణ కావాలని బలంగా కోరుకుంటున్నారనేది సర్వవిదితం . కాబట్టి , మొత్తమన్ని స్థానాల్లోనూ తెరాస , బీజేపీలే గెలుస్తాయని అనుకున్నదే . అయితే ఈ స్థాయిలో గెలుస్తారని , మెజారిటీలు ఇంత ఎక్కువగా ఉంటాయనీ , మిగతా పార్టీలను ఇలా ఊడ్చవతల పారేస్తారనీ ఊహించలేదు . ఆ విధంగా ఈ ఎన్నికల ఫలితాలు కొంత ఆశ్చర్యం కలిగించేవే !
సికింద్రాబాద్ , జనవరి 18 : ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం నుంచి సోమవారం తెలంగాణ స్టూడెంట్స్ జాయింట్ యాక్షన్ కమిటీ మహా పాదయాత్రలు ప్రారంభం అయ్యాయి . మధ్యాహ్నమే ప్రారంభం కావాల్సిన పాదయాత్రలు పిజి విద్యార్థులు ఓయు వైస్ చాన్స్లర్ గెస్ట్హౌజ్ ముందు పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన ఫలితంగా సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రారంభం అయ్యాయి . పిజి సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని , తాము కూడా పాదయాత్రల్లో పాల్గొంటామని పలువురు పిజి విద్యార్థులు పట్టుబట్టడంతో పాదయాత్రలను ప్రారంభించడంలో జేఏసి నాయకులకు నాలుగు గంటల ఆలస్యం జరిగింది . తెలంగాణకు చెందిన అన్ని వర్శిటీల నుంచి జేఏసి నాయకులు , వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థి సంఘ నాయకులు ఆర్ట్స్ కళాశాలకు తరలివచ్చారు . ఇక్కడి నుంచి రెండు బృందాలుగా ఏర్పడిన విద్యార్థులు రెండు మార్గాల్లో పాదయాత్రలను ప్రారంభించారు . ఒక బృందం హైదరాబాద్ , రంగారెడ్డి మీదుగా మహబూబ్నగర్కు , మరో బృందం రంగారెడ్డి మీదుగా నిజామాబాద్ జిల్లాకు తరలి వెళ్లేందుకు పాదయాత్రగా బయలుదేరింది . రెండు బృందాల్లో సుమారు 250 మంది వరకు విద్యార్థులు ఉండడం గమనార్హం . వీరికి సంబంధించిన దుస్తులు , ఇతర వస్తువులను తీసుకు వెళ్లేందుకు ఒక్కో బృందం వెంట నాలుగైదు వాహనాలు అనుసరించాయి . పాదయాత్రకు బయలుదేరిన విద్యార్థి బృందాలకు సంఘీభావం ప్రకటించేందుకు అత్యధిక సంఖ్యలో మహిళలు , వివిధ కళాశాలల విద్యార్థులు , న్యాయవాదులు , వివిధ పార్టీలకు చెందిన నాయకులు , ముస్లిం ఫోరం ప్రతినిధులు ఆర్ట్స్ కళాశాల ప్రాంగణానికి తరలివచ్చారు . వివిధ సంఘాలు , సంస్థలకు చెందిన మహిళలు , గృహిణులు పాదయాత్రకు సిద్ధమైన విద్యార్థులకు నుదుట తిలకం దిద్ది , మంగళహారతులతో ఆశీర్వదించారు . రాజకీయ సంక్షోభం సృష్టించడమే ధ్యేయం రాజకీయ సంక్షోభం సృష్టించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించుకోవడమే తమ లక్ష్యమని పాదయాత్రకు తరలివెళ్లిన టిఎస్జేఏసి ప్రతినిధులు స్పష్టం చేశారు . రాజకీయ సంక్షోభం సృష్టించడమే ప్రస్తుతం తమ ముందున్న కర్తవ్యంగా వారు పేర్కొన్నారు . లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే పరిస్థితులు లేవన్నారు . చర్చలు , ఏకాభిప్రాయం వంటి కేంద్ర ప్రభుత్వ చర్యలు కాలయాపనకు మినహా మరెందుకూ పనికిరావన్నారు . రాజకీయ నాయకులను స్వచ్ఛందంగా రాజీనామాలు సమర్పించి ఉద్యమాల్లో భాగస్వాములను చేయడం కోసం మహా పాదయాత్రల ద్వారా ప్రజలను జాగృతం చేస్తామన్నారు . మహా పాదయాత్రకు సంబంధించిన డిమాండ్లను టిఎస్జేఏసి ప్రకటించింది . అందులో పార్లమెంట్లో బిల్లును వెంటనే ప్రవేశపెట్టాలని , తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి ఆమోదింపజేసుకుని ఉద్యమంలో భాగస్వాములు కావాలని డిమాండ్ చేశారు . తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు పది లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించి , కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని కోరారు . అదేవిధంగా తెలంగాణలోని విద్యార్థులు , ఉద్యమకారులపై పెట్టిన కేసులను ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని వారు చెప్పారు . ఇందుకు సంబంధించిన కరపత్రాలు , తెలంగాణ అన్యాయానికి గురైన ఆడియో , వీడియో సిడిలను ప్రచారం నిమిత్తం విద్యార్థి సంఘ ప్రతినిధులు తమ వెంట తీసుకువెళ్లారు . అన్ని విధాలా సహకరిస్తాం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సాధనగా మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టిన తెలంగాణ విద్యార్థులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పలువురు ప్రజాప్రతినిధులు , రాజకీయ పార్టీల నాయకులు , మహిళా సంఘాల ప్రతినిధులు ప్రకటించారు . ప్రజాకవి గద్దర్ , జేఏసిలో కాంగ్రెస్ నాయకుడు రాంరెడ్డి దామోదర్రెడ్డి , టిఆర్ఎస్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి , కర్నె ప్రభాకర్ , మోతె శోభన్రెడ్డి , తెలంగాణ మహిళా నాయకురాలు శ్రీలతాయాదవ్ , తెలంగాణ మాదిగ మహాజన మహిళా సమాఖ్య ప్రతినిధులు , ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ , తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నాయకులు అల్లం నారాయణ , పిట్టల శ్రీశైలం , పాశం యాదగిరి తెలంగాణ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు , ముస్లిం మైనారిటీ ఫోరం ప్రతినిధులు ఆర్ట్స్ కళాశాలకు తరలివచ్చి మహా పాదయాత్రలకు తమ మద్దతు ప్రకటించారు .
ఆచరణ శుద్ధి లేని ఆటోపబ్లాగది ఏల భావశుద్ధి లేని పోస్టుయది ఏల చీర్ శుద్ధి లేని స్పామువాగుడేల బ్లాగదాభి రామ బ్లాగర విహారి మరిన్ని బ్లాగదాభి రామ పద్యాలకు ' బ్లాగదాభి రామ ' లేబులు నొక్కండి ఆత్మ శుద్ధి లేని ఆచారమది ఏల భాండ శుద్ధి లేని పాకమది ఏల చిత్త శుద్ధి లేని శివ పూజలేలర విశ్వదాభి రామ వినుర వేమ
ఇంతకు ముందు పద్యం విషయంలో అనుకున్నవి ఇప్పుడు ఇంకా స్పష్టంగా కన్పిస్తాయి . రెండు , మూడు పాదాల్లో పదాలు విరచటానికి తేలికైనవి . అందుకే ఆ పాదాలు కూడ బాగా వచ్చాయి . ఒకటి , నాలుగు కష్టం . ఆ రెంటిలోనూ నాలుగోది మరీ కష్టం . ఆ పాదాలు చూస్తే తెలుస్తుంది అవి తయారుచేసేప్పుడు అవధాని మనఃస్థితి ఏమిటో ! ఇది ఏ అంగదుడో రావణుడికి చేస్తున్న హితబోధ అనుకుంటే ఒకటి , నాలుగు పాదాలు దారి తెలియకుండా వెళ్ళినట్టు , రెండు , మూడు హాయిగా వచ్చినట్టు కన్పిస్తాయి . రెండూ మూడూ బాగా రావటానికి కూడ ముఖ్య కారణం అవి రెండు filler lines కావటమే ! రాముడి పొగడ్త తప్ప వాటిలో ఏమీ లేదు . రాముణ్ణి పొగడ్డం అనేది ఇదివరకు వందల మంది కొట్టిన పిండి కదా , కళ్ళు మూసుకుని పాడెయ్యొచ్చు !
మొన్న తస్లీమా తమకు వ్యతిరేకంగా రాసిందని ఆమె మీద భౌతికంగా మజ్లిస్ రౌడీలు ప్రెస్ క్లబ్ సాక్షిగా దాడికి పాల్పడితే ఇప్పుడు " ధాకరే " ను విలన్ అన్నందుకు " అవుట్లుక్ " మీద శివసైనికుల మూక దాడి చేసింది . వీళ్ళు చేసే పనులన్నీ విలన్ పనులే కానీ ఆ మాట అంటే మాత్రం కోపం . థాకరే విలనో కాదో అతను లేదా అతని అనుచర మూక చేసే పనులే చెబుతున్నాయి . మళ్ళీ అదే మాట ఒక పత్రిక చెబితే అంత వులికిపాటు ఎందుకు ? హిందువుల రక్షకులుగా అవతారం ఎత్తిన ఈ దుర్మదాందులే ఒకప్పుడు మదరాసీలను బొంబాయి నుండీ తరమడానికి హింసాకాండ లేపిన వారు . అయితే మతం లేదంటే స్థానికత్వం అనే అడ్డుగోడలు సృష్టించి , కలహాల నెగళ్ళు రాజేసి ఒళ్ళు వెచ్చజేసుకొనే రక్త పిపాసులు ఈ పుండాకోర్లు . ప్రజాస్వామ్యాన్ని , ప్రజా సామాన్యాన్ని తమ ఆయుధాలుగా మలచుకొన్న ఆధునిక రాక్షసులు . వీళ్ళకు చరమ గీతం పాడాలంటే విష్ణువు శతావతారాలెత్తాలేమొ !
శ్రీ . నా . బా . మౌనశంఖం రచించినది 1943 చివరలో ! నేను తొలిసారి అతని ముఖతా విన్నది 1944 ఏప్రిల్ , మే నెలల్లో . అందుకు సాక్ష్యం నా డైరీలో ఉంది . ఎందువల్లనో శ్రీ . నా . బా . రుధిరజ్యోతిని నవోదయ పబ్లిషర్స్ ప్రథమ ముద్రణగా వేసిన 1972లో కాని , 1976 నాటి ద్వితీయముద్రణలో గాని , ఈ మౌనశంఖం రచించబడిన తేదీ ఇవ్వబడలేదు . అది సరికొత్త కవితారీతిని , ఒక అంతర్జాతీయ అభివ్యక్తి పథాన్నీ సాధించింది . అతను అతినవ్యకవితలు 1933 నుంచీ రాస్తూనే వున్నట్లు మనకు సాక్ష్యాధారాలు లభిస్తున్నాయి . రుధిరజ్యోతిలో 41 కవితలు సంకలితమయ్యాయి ! మరికొన్ని కవితలు కాలగర్భంలో కలిసిపోయాయి ! అతనికి రాత అలవాటు లేదు ! దస్తూరీ మరీ పసిపిల్లవాని రాతలా కొంకర్లు పోతుండేది ! అందువల్ల ప్రతి కవితా ధారణలోనే బ్రతికేది ! ఈ కారణం వల్లనే మరో పదికవితలు అదృశ్యమై పోయాయని చాసో వంటి సన్నిహితులు జ్ఞాపకం చేసుకునే వారు .
Download XML • Download text